అన్వేషించండి

Raghav Chadha: మిగిలిపోయిన డేటా బ్యాంకులో డబ్బులా ట్రాన్స్‌ఫర్‌ చేసుకునే వీలుండాలి! రాజ్యసభలో రాఘవ్‌ చద్దా కీలక ప్రతిపాదనలు 

Raghav Chadha: డేటాను వినియోగదారుడి డిజిటల్‌ ఆస్తిగా భావించాలని రాఘవ్ చద్దా ఒక వినూత్న ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రాఘవ్ చద్దా వినియోగదారులు కొన్న డేటా వృథాపై రాజ్యసభలో ప్రస్తావించారు.
  • రోజువారీ డేటా మిగిలిపోతే, అది రద్దు కాకుండా మరుసటి రోజుకు కలపాలి.
  • మిగిలిన డేటా విలువను తదుపరి రీఛార్జ్‌లో సర్దుబాటు చేయాలని కోరారు.
  • స్నేహితులకు, కుటుంబ సభ్యులకు డేటాను బదిలీ చేసుకునే అవకాశం కల్పించాలి.

Raghav Chadha: నేటి ఆధునిక యుగంలో మనిషికి గాలి, నీరు ఎంత అవసరమో, ఇంటర్నెట్ కూడా అంతే అవసరం. అయితే వినియోగదారులు డబ్బులు చెల్లించి కొనుగోలు చేసిన మొబైల్‌ డేటా, నిర్ణీత గడువులోగా వాడకపోతే వృథాగా పోతుంది. దీనిపై రాజ్యసభలో చర్చ జరిగింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్‌ చద్దా ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతూ టెలికాం కంపెనీల ప్రస్తుత విధానాల్లో మార్పులు రావాలని డిమాండ్ చేశారు. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా ఆయన పలు కీలక సంస్కరణలను ప్రతిపాదించారు. 

డబ్బు కడుతున్నాం కానీ డేటా మాయమవుతోంది!

ప్రస్తుతం టెలికాం రంగంలో ఉన్న అతి పెద్ద లోపాన్ని రాఘవ్ చద్దా సభ దృష్టికి తీసుకొచ్చారు. వినియోగదారులు ప్రతిరోజూ నిర్దిష్ట డేటా పరిమితి కోసం ముందుగానే డబ్బులు చెల్లిస్తున్నారు. ఉదాహరణకు ఒక వినియోగదారు రోజుకు 2జీబీ డేటా ప్లాన్ తీసుకుంటే,, అందులో కేవలం 1.5 జీడీ మాత్రమే వాడితే, మిగిలిన 0.5జీ డేటా అర్థరాత్రి దాటగానే ఎక్స్‌పైర్ అయిపోతుంది. వినియోగదారుడు ఇప్పటికే ఆ జేటా కోసం డబ్బు చెల్లించాడు. అలాంటప్పుడు అది వృథా కావడం లేదా వెనక్కి తీసుకోవడం బాగా లేదు అని చద్దా స్పష్టం చేశారు. 

ఇది ఏదో అనుకోకుండా జరుగుతున్న పొరపాటు కాదని, టెలికాం కంపెనీలు కావాలనే అనుసరిస్తున్న వ్యూహాత్మక విధానమని ఆయన మండిపడ్డారు. దీని వల్ల వినియోగదారులు తాము పూర్తిగా వాడుకోలేని సామర్థ్యం కోసం పదే పదే డబ్బులు చెల్లించాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

రాఘవ్ చద్దా ప్రతిపాదించిన మూడు కీలక సంస్కరణలు 

టెలికాం వినియోగదారుల హక్కులను కాపాడేందుకు రాఘవ చద్దా ప్రధానంగా మూడు ప్రతిపాదనలు తీసుకొచ్చారు. 

డేటా క్వారీ- ఫార్వర్డ్‌ విధానం: ప్రస్తుత పద్ధతిలో మిగిలిపోయిన డేటా మరుసటి రోజుకు కలవదు. అలా కాకుండా ఒక రోజు మిగిలిపోయన డేటాను మరుసటి రోజు కోటాకు జోడించలా అన్ని టెలికాం సంస్థలు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దీని వల్ల వినియోగదారులు తాము కొనుగోలు చేసిన ప్రతి డేటాను సద్వినియోగం చేసుకోనే వీలు ఉంటుంది. 

తదుపరి రీఛార్జ్‌లో సర్దుబాటు :  కొంతమంది వినియోగదారులు నిరంతరం తమ డేటా పూర్తిగా వాడలేపోతుంటారు. అటువంటి వారి విషంలో, నెల చివరన మిగిలిపోయిన డేటాను లెక్కించి, దాని విలువను బట్టి తదుపరి నెల రీఛార్జ్ మొత్తం తగ్గింపు ఇవ్వాలని చద్దా ప్రతిపాదించారు. ఇది వినియోగదారుల ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని అన్నారు. 

డేటా బదిలీ అవకాశం: డేటాను వినియోగదారుడి డిజిటల్‌ ఆస్తిగా భావించాలని రాఘవ్ చద్దా ఒక వినూత్న ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. మనం బ్యాంకు నుంచి డబ్బులను ఇతరులకు పంపినట్టుగానే మన దగ్గర మిగిలిపోయిన డేటాను స్నేహితులకు, లేదా బంధువులకు బదిలీ చేసుకునే వెసులుబాటు ఉండాలని కోరారు. 

డిజిట్ ఇండియా దిశగా మరో అడుగు 

భారత్‌ డిజిటల్ ఇండియా దిశగా వేగంగా అడుగులు వేస్తున్న టైంలో డిజిటల్‌ సేవలు అందరికీ అందుబాటులో ఉండాలని అదే సమయంలో అవి పారదర్శకంగా ఉండాలని చద్దా పేర్కొన్నారు. మీరు ఒక వస్తువు కోసం డబ్బు చెల్లిస్తే అది మీ ఆస్తి అవుతుంది. అది వాడినా వాడకపోయినా మీకే చెందాలి. డేటా విషయంలో కూడా ఇదే సూత్రం వర్తించాలి అన్నారు. 

కేవలం డేటా మాయమైపోవడం వల్ల టెలికాం కంపెనీలు కోట్లాది రూపాయల లాభాలను గడిస్తున్నాయని, ఇది వినియోగదారులను వంచించడమేనని అన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకొని, వినియోగదారులకు అనుకూలమైన టెలికాం విధానాలను రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సభలో పేర్కొన్నారు. 

Frequently Asked Questions

వినియోగదారులు డబ్బులు చెల్లించిన మొబైల్ డేటా ఎందుకు వృధా అవుతుంది?

ప్రస్తుతం టెలికాం కంపెనీల విధానాల ప్రకారం, రోజువారీ డేటా పరిమితిని ఉపయోగించకపోతే, అర్థరాత్రి దాటిన తర్వాత ఆ డేటా ఎక్స్‌పైర్ అయిపోతుంది. వినియోగదారులు ఇప్పటికే ఆ డేటా కోసం డబ్బు చెల్లించినప్పటికీ, అది వృధా అవుతుంది.

రాఘవ్ చద్దా ప్రతిపాదించిన ముఖ్యమైన సంస్కరణలు ఏమిటి?

మిగిలిపోయిన డేటాను మరుసటి రోజుకు బదిలీ చేయడం (డేటా క్వారీ- ఫార్వర్డ్), మిగిలిపోయిన డేటా విలువను తదుపరి రీఛార్జ్‌లో సర్దుబాటు చేయడం, మరియు డేటాను స్నేహితులు లేదా బంధువులకు బదిలీ చేసుకునే అవకాశం కల్పించడం ఆయన ప్రతిపాదనలలో ఉన్నాయి.

డేటా బదిలీ అవకాశం వినియోగదారులకు ఎలా సహాయపడుతుంది?

డేటాను వినియోగదారుడి డిజిటల్ ఆస్తిగా పరిగణించి, బ్యాంకు లావాదేవీల మాదిరిగా స్నేహితులకు లేదా బంధువులకు బదిలీ చేసుకునే అవకాశం కల్పిస్తే, వినియోగదారులు తమ డేటాను సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు.

డేటా వృధా అవ్వడం వల్ల టెలికాం కంపెనీలకు ఎలా లాభం చేకూరుతుంది?

వినియోగదారులు పూర్తిగా ఉపయోగించుకోలేని డేటా కోసం పదేపదే డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. దీనివల్ల టెలికాం కంపెనీలు అధిక లాభాలను ఆర్జిస్తున్నాయి, ఇది వినియోగదారులను వంచించడమే అవుతుంది.

టాప్ హెడ్ లైన్స్

Air India New CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
MP Jhabua Man Builds Underground House: తల్లిదండ్రుల ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటే అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయారు - నిజంగా అండర్ గ్రౌండ్‌కే !
తల్లిదండ్రుల ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటే అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయారు - నిజంగా అండర్ గ్రౌండ్‌కే !

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget