అన్వేషించండి

Raghav Chadha: మిగిలిపోయిన డేటా బ్యాంకులో డబ్బులా ట్రాన్స్‌ఫర్‌ చేసుకునే వీలుండాలి! రాజ్యసభలో రాఘవ్‌ చద్దా కీలక ప్రతిపాదనలు 

Raghav Chadha: డేటాను వినియోగదారుడి డిజిటల్‌ ఆస్తిగా భావించాలని రాఘవ్ చద్దా ఒక వినూత్న ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Raghav Chadha: నేటి ఆధునిక యుగంలో మనిషికి గాలి, నీరు ఎంత అవసరమో, ఇంటర్నెట్ కూడా అంతే అవసరం. అయితే వినియోగదారులు డబ్బులు చెల్లించి కొనుగోలు చేసిన మొబైల్‌ డేటా, నిర్ణీత గడువులోగా వాడకపోతే వృథాగా పోతుంది. దీనిపై రాజ్యసభలో చర్చ జరిగింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్‌ చద్దా ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతూ టెలికాం కంపెనీల ప్రస్తుత విధానాల్లో మార్పులు రావాలని డిమాండ్ చేశారు. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా ఆయన పలు కీలక సంస్కరణలను ప్రతిపాదించారు. 

డబ్బు కడుతున్నాం కానీ డేటా మాయమవుతోంది!

ప్రస్తుతం టెలికాం రంగంలో ఉన్న అతి పెద్ద లోపాన్ని రాఘవ్ చద్దా సభ దృష్టికి తీసుకొచ్చారు. వినియోగదారులు ప్రతిరోజూ నిర్దిష్ట డేటా పరిమితి కోసం ముందుగానే డబ్బులు చెల్లిస్తున్నారు. ఉదాహరణకు ఒక వినియోగదారు రోజుకు 2జీబీ డేటా ప్లాన్ తీసుకుంటే,, అందులో కేవలం 1.5 జీడీ మాత్రమే వాడితే, మిగిలిన 0.5జీ డేటా అర్థరాత్రి దాటగానే ఎక్స్‌పైర్ అయిపోతుంది. వినియోగదారుడు ఇప్పటికే ఆ జేటా కోసం డబ్బు చెల్లించాడు. అలాంటప్పుడు అది వృథా కావడం లేదా వెనక్కి తీసుకోవడం బాగా లేదు అని చద్దా స్పష్టం చేశారు. 

ఇది ఏదో అనుకోకుండా జరుగుతున్న పొరపాటు కాదని, టెలికాం కంపెనీలు కావాలనే అనుసరిస్తున్న వ్యూహాత్మక విధానమని ఆయన మండిపడ్డారు. దీని వల్ల వినియోగదారులు తాము పూర్తిగా వాడుకోలేని సామర్థ్యం కోసం పదే పదే డబ్బులు చెల్లించాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

రాఘవ్ చద్దా ప్రతిపాదించిన మూడు కీలక సంస్కరణలు 

టెలికాం వినియోగదారుల హక్కులను కాపాడేందుకు రాఘవ చద్దా ప్రధానంగా మూడు ప్రతిపాదనలు తీసుకొచ్చారు. 

డేటా క్వారీ- ఫార్వర్డ్‌ విధానం: ప్రస్తుత పద్ధతిలో మిగిలిపోయిన డేటా మరుసటి రోజుకు కలవదు. అలా కాకుండా ఒక రోజు మిగిలిపోయన డేటాను మరుసటి రోజు కోటాకు జోడించలా అన్ని టెలికాం సంస్థలు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దీని వల్ల వినియోగదారులు తాము కొనుగోలు చేసిన ప్రతి డేటాను సద్వినియోగం చేసుకోనే వీలు ఉంటుంది. 

తదుపరి రీఛార్జ్‌లో సర్దుబాటు :  కొంతమంది వినియోగదారులు నిరంతరం తమ డేటా పూర్తిగా వాడలేపోతుంటారు. అటువంటి వారి విషంలో, నెల చివరన మిగిలిపోయిన డేటాను లెక్కించి, దాని విలువను బట్టి తదుపరి నెల రీఛార్జ్ మొత్తం తగ్గింపు ఇవ్వాలని చద్దా ప్రతిపాదించారు. ఇది వినియోగదారుల ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని అన్నారు. 

డేటా బదిలీ అవకాశం: డేటాను వినియోగదారుడి డిజిటల్‌ ఆస్తిగా భావించాలని రాఘవ్ చద్దా ఒక వినూత్న ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. మనం బ్యాంకు నుంచి డబ్బులను ఇతరులకు పంపినట్టుగానే మన దగ్గర మిగిలిపోయిన డేటాను స్నేహితులకు, లేదా బంధువులకు బదిలీ చేసుకునే వెసులుబాటు ఉండాలని కోరారు. 

డిజిట్ ఇండియా దిశగా మరో అడుగు 

భారత్‌ డిజిటల్ ఇండియా దిశగా వేగంగా అడుగులు వేస్తున్న టైంలో డిజిటల్‌ సేవలు అందరికీ అందుబాటులో ఉండాలని అదే సమయంలో అవి పారదర్శకంగా ఉండాలని చద్దా పేర్కొన్నారు. మీరు ఒక వస్తువు కోసం డబ్బు చెల్లిస్తే అది మీ ఆస్తి అవుతుంది. అది వాడినా వాడకపోయినా మీకే చెందాలి. డేటా విషయంలో కూడా ఇదే సూత్రం వర్తించాలి అన్నారు. 

కేవలం డేటా మాయమైపోవడం వల్ల టెలికాం కంపెనీలు కోట్లాది రూపాయల లాభాలను గడిస్తున్నాయని, ఇది వినియోగదారులను వంచించడమేనని అన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకొని, వినియోగదారులకు అనుకూలమైన టెలికాం విధానాలను రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సభలో పేర్కొన్నారు. 

Frequently Asked Questions

వినియోగదారులు డబ్బులు చెల్లించిన మొబైల్ డేటా ఎందుకు వృధా అవుతుంది?

ప్రస్తుతం టెలికాం కంపెనీల విధానాల ప్రకారం, రోజువారీ డేటా పరిమితిని ఉపయోగించకపోతే, అర్థరాత్రి దాటిన తర్వాత ఆ డేటా ఎక్స్‌పైర్ అయిపోతుంది. వినియోగదారులు ఇప్పటికే ఆ డేటా కోసం డబ్బు చెల్లించినప్పటికీ, అది వృధా అవుతుంది.

రాఘవ్ చద్దా ప్రతిపాదించిన ముఖ్యమైన సంస్కరణలు ఏమిటి?

మిగిలిపోయిన డేటాను మరుసటి రోజుకు బదిలీ చేయడం (డేటా క్వారీ- ఫార్వర్డ్), మిగిలిపోయిన డేటా విలువను తదుపరి రీఛార్జ్‌లో సర్దుబాటు చేయడం, మరియు డేటాను స్నేహితులు లేదా బంధువులకు బదిలీ చేసుకునే అవకాశం కల్పించడం ఆయన ప్రతిపాదనలలో ఉన్నాయి.

డేటా బదిలీ అవకాశం వినియోగదారులకు ఎలా సహాయపడుతుంది?

డేటాను వినియోగదారుడి డిజిటల్ ఆస్తిగా పరిగణించి, బ్యాంకు లావాదేవీల మాదిరిగా స్నేహితులకు లేదా బంధువులకు బదిలీ చేసుకునే అవకాశం కల్పిస్తే, వినియోగదారులు తమ డేటాను సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు.

డేటా వృధా అవ్వడం వల్ల టెలికాం కంపెనీలకు ఎలా లాభం చేకూరుతుంది?

వినియోగదారులు పూర్తిగా ఉపయోగించుకోలేని డేటా కోసం పదేపదే డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. దీనివల్ల టెలికాం కంపెనీలు అధిక లాభాలను ఆర్జిస్తున్నాయి, ఇది వినియోగదారులను వంచించడమే అవుతుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Raghav Chadha: మిగిలిపోయిన డేటా బ్యాంకులో డబ్బులా ట్రాన్స్‌ఫర్‌ చేసుకునే వీలుండాలి! రాజ్యసభలో రాఘవ్‌ చద్దా కీలక ప్రతిపాదనలు 
మిగిలిపోయిన డేటా బ్యాంకులో డబ్బులా ట్రాన్స్‌ఫర్‌ చేసుకునే వీలుండాలి! రాజ్యసభలో రాఘవ్‌ చద్దా కీలక ప్రతిపాదనలు 
Iran War Updates: ట్రంప్ గాలి తీసేసిన ఇరాన్ -చర్చలే జరగడం లేదని ప్రకటన - అమెరికా అధ్యక్షుడిది మైండ్ గేమేనా?
ట్రంప్ గాలి తీసేసిన ఇరాన్ -చర్చలే జరగడం లేదని ప్రకటన - అమెరికా అధ్యక్షుడిది మైండ్ గేమేనా?
Prime Minister Modi Parliament Speech: 41 దేశాల నుంచి ఇంధన దిగుమతలు - పెట్రోల్, గ్యాస్ కొరతే రాదు - ప్రధాని మోదీ హామీ
41 దేశాల నుంచి ఇంధన దిగుమతలు - పెట్రోల్, గ్యాస్ కొరతే రాదు - ప్రధాని మోదీ హామీ
Legend of Durga Bhabhi: విప్లవ వీరుల 'దుర్గా భాబీ'.. భగత్ సింగ్‌ను కాపాడిన వీరనారి దుర్గావతి గురించి తెలుసా..
విప్లవ వీరుల 'దుర్గా భాబీ'.. భగత్ సింగ్‌ను కాపాడిన వీరనారి దుర్గావతి గురించి తెలుసా..
Advertisement

వీడియోలు

MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam
Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
National Highways: జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
Strait of Hormuz: హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
Embed widget