అన్వేషించండి

AP NGT : సీమ ప్రాజెక్టులో పనులేమీ జరగడం లేదని ఎన్జీటీకి కేంద్రం నివేదిక ! ఏపీ సర్కార్‌కు రిలీఫ్ !

సీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఎన్జీటీ ఆదేశాల ధిక్కరణకు పాల్పడినట్లుగా విమర్శలు ఎదుర్కొంటున్న ఏపీ ప్రభుత్వానికి కేంద్రం కాస్త రిలీఫ్ ఇచ్చిది. అక్కడ పనులేమీ జరగడం లేదని నివేదిక ఇచ్చింది.


కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకునే అధికారం నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్‌కు ఉందా లేదా అన్న అంశంపై తమ వాదనలు కూడా వినాలని ఏపీ ప్రభుత్వం ఎన్జీటీని కోరింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం అంశంపై ఎన్జీటీలో జరిగిన విచారణలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తన నివేదికను సమర్పించింది. గత రెండు వాయిదాల్లోనూ నివేదిక ఇవ్వకపోవడంతో ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విచారణలో నివేదిక సమర్పించినప్పటికీ అక్కడ పనులు జరిగాయో లేదో చెప్పడానికి మొహమాట పడింది. ఈ అంశంపై కృష్ణా నది యాజమాన్య బోర్డు ఇప్పటికే నివేదిక ఇచ్చిందని మాత్రం పేర్కొంది. అయితే ప్రస్తుతం పనులు జరగడం లేదని స్పష్టం చేసింది. 

Also Read : కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ఆశలు గల్లంతు


రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించిన కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన శాస్త్రవేత్త పసుపులేటి సురేష్ బాబు రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు స్థలం వద్ద ప్రస్తుతం ఎలాంటి పనులు జరగడం లేదని నివేదిక సమర్పించారు.  ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకువచ్చిన సామగ్రి అంతా ఆ ప్రాంతంలో నిల్వ ఉంచారని తెలిపారు. పర్యావరణ అనుమతులకు సవరణలు కోరుతూ రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు కు కూడా అనుమతులను వర్తింపచేయాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు సమర్పించిన ప్రాజెక్టు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని ఇంకా నిర్ణయం తీసుకోలేదని నివేదికలో తెలిపారు. 

Also Read : దేశంలో మూడో కూటమి ఏర్పాటుకు సన్నాహాలు


గతంలో  కృష్ణా బోర్డు కమిటీ రాయలసీమ ఎత్తిపోతలను సందర్శించి నివేదిక సమర్పించింది. డీపీఆర్‌కు అవసరమైన పనులకన్నా అధికంగా పనులు జరిగినట్లు కేఆర్‌ఎంబీ నివేదికలో నిర్ధారించింది. పంప్ హౌస్, అప్రోచ్ ఛానల్, ఫోర్ బే, డెలివరీ మెయిన్ ఛానల్, డెలివరీ సిస్టమ్, లింక్ కెనాల్ పనులు జరిగినట్లు నిర్ధారించినట్లు కేఆర్‌ఎంబీ పేర్కొంది.  ప్రాజెక్ట్‌లో ముఖ్యమైన పనులను పూర్తిచేసినట్లు కేఆర్‌ఎంబీ పేర్కొంది. ఫోటోలతో సహా సమగ్ర నివేదికను ఎన్జీటీకి సమర్పించింది. కేంద్ర పర్యావరణ శాఖ ప్రత్యేకంగా ఏమీ చెప్పకపోయినా కేఆర్ఎంబీ నివేదికనే ప్రస్తావించడంతో ఏపీ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే విషయమేనని అంచనా వేస్తున్నారు. 

Also Read : ఏపీలో కరెంట్ చార్జీలు ఎందుకు పెరిగాయి ?


గతంలో ఎన్జీటీ రాయలసీమ ఎత్తిపోతల పనులపై స్టే ఇచ్చింది. అయినా పనులు చేస్తున్నారని పిటిషన్లు దాఖలు కావడంతో  పరిశీలన చేయాలని ఆదేశించింది. తమ తీర్పును ఉల్లంఘించినట్లుగా తేలితే  సీఎస్‌ను జైలుకు పంపుతామని ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర పర్యావరణ శాఖ ఇచ్చిన నివేదికను పరిశీలించిన ఎన్జీటీ ధర్మాసనం అక్కడ డీపీఆర్ కోసమే పనులు జరిగినట్లుగా లేవని.. అంతకు మించి పనులు జరిగాయన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. గతంలో ధిక్కరణ చర్యలు తీసుకునే అధికారం ఎన్జీటీకి ఉందో లేదో చెప్పాలని పిటిషనర్లను కోరింది. ఇదే అంశంపై తాము కూడా వాదనలు వినిపిస్తామని ఏపీ ప్రభుత్వ తరపు లాయర్ కోరారు.  అన్ని తదుపరి విచారణలో పరిశీలిద్దామని ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ధర్మాసనం. 

ఆ వైసీపీ మాజీ ఎమ్మెల్యే చేసింది అగ్రిగోల్డ్ తరహా మోసమా..?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Manchu Lakshmi: ప్లీజ్‌ నాకు సాయం చేయండి -  మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్,  అసలేమైంది..
ప్లీజ్‌ నాకు సాయం చేయండి - మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్, అసలేమైంది..
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
Embed widget