అన్వేషించండి

Morning Phone Habit : నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా? రోజంతా తలనొప్పి, అలసటకు అదే కారణం కావొచ్చు

Using Phone Right After Waking Up : నిద్ర లేవగానే ఫోన్ చూసే అలవాటు ఉందా? అయితే మీ రోజూవారీ అలసట, తలనొప్పి, ఏకాగ్రత లోపానికి కారణం ఇదే కావచ్చని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే..

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నిద్రలేవగానే ఫోన్ వాడకం మెదడుపై ఒత్తిడి పెంచి ఏకాగ్రత తగ్గిస్తుంది.
  • తలనొప్పి, అలసట, డోపమైన్ పెరుగుదల వంటి ఆరోగ్య సమస్యలు కలగవచ్చు.
  • ఫోన్ బ్లూ లైట్ సిర్కాడియన్ రిథమ్‌ను ప్రభావితం చేస్తుంది; జాగ్రత్తలు తీసుకోండి.
  • ఉదయాన్నే నీరు తాగి, వెలుతురులో నిలబడి, తేలికపాటి వ్యాయామం చేయండి.

Staying Away From Your Phone After Waking Up : ఉదయం నిద్రలేవగానే చాలా మంది చేసే మొదటి పని ఏంటంటే.. మొబైల్ ఫోన్ తీసుకుని వాట్సాప్ మెసేజ్‌లు, సోషల్ మీడియా, న్యూస్ లేదా ఇమెయిల్స్ చెక్ చేస్తారు. ఈ అలవాటు సాధారణంగా కనిపించినా.. ఇది రోజంతా మీ ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా తలనొప్పి, ఒత్తిడి, అలసట, ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

నిద్రలేవగానే ఫోన్ ఎందుకు చూడకూడదంటే..

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నిద్రలేవగానే మన మెదడు పూర్తిగా యాక్టివ్ మోడ్‌లోకి వెళ్లదు. ఆ సమయంలో మెదడు నెమ్మదిగా విశ్రాంతి స్థితి నుంచి మేల్కొనే ప్రక్రియలో ఉంటుంది. అలాంటి సమయంలో ఒక్కసారిగా ఫోన్‌లో నోటిఫికేషన్లు, మెసేజ్‌లు, సోషల్ మీడియా కంటెంట్ చూడడం వల్ల మెదడుపై ఒక్కసారిగా ఎక్కువ సమాచారం పడుతుంది. దీంతో నాడీ వ్యవస్థ ఎక్కువగా రియాక్ట్ అవుతుంది. 

Also Read : ఉదయాన్నే కనిపించే ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు.. గుండెపోటు హెచ్చరికలు కావచ్చు

డోపమైన్ లెవెల్స్ పెరిగితే..

ఉదయం లేవగానే ఫోన్ చూస్తే మెదడులో డోపమైన్ అనే రసాయనం ఒక్కసారిగా పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఫోన్‌ను పదేపదే చెక్ చేయాలనే అలవాటు పెరగడంతో పాటు, రోజంతా ఏకాగ్రత తగ్గే అవకాశం ఉంటుంది.

తలనొప్పి, అలసటకు ఇదే కారణమా?

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఫోన్‌ను ఉదయం ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల కొందరిలో తలనొప్పి, కళ్లపై ఒత్తిడి, మానసిక అలసట వంటి సమస్యలు కనిపించవచ్చు. అయితే ఇవి ప్రతి ఒక్కరిలో ఒకే విధంగా ఉండవు. స్క్రీన్‌ను ఎంతసేపు చూస్తున్నారు? నిద్ర ఎంత బాగా పట్టింది.. వంటి అంశాలపై కూడా ఇది ఆధారపడి ఉంటుంది.

Also Read : జీవితాన్ని మార్చేసే మార్నింగ్ రొటీన్.. ఉదయాన్నే కేవలం 30 నిమిషాలు కేటాయిస్తే చాలు!

బ్లూ లైట్ ప్రభావం 

మొబైల్ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ శరీరంలోని సిర్కాడియన్ రిథమ్​పై ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఉదయం లేవగానే ఎక్కువసేపు స్క్రీన్ చూస్తే మెదడు సహజంగా మేల్కొనే ప్రక్రియలో అంతరాయం కలగవచ్చని నిపుణులు చెబుతున్నారు.

మెటబాలిజంపై ప్రభావం

కొంతమంది నిపుణులు మొబైల్ నుంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ మెటబాలిజంపై ప్రభావం చూపవచ్చని అంటున్నారు. అయితే ఈ అంశంపై శాస్త్రీయమైన ఆధారాలు స్పష్టంగా లేవు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పరిశోధనల్లో దీనిపై ఏకాభిప్రాయం కూడా లేదు. 

Also Read : ఉదయాన్నే బ్రష్ చేసిన వెంటనే నీళ్లు తాగుతున్నారా? లేక ముందే తాగేస్తున్నారా? ఏది మంచిది?

ఉదయం లేవగానే ఏమి చేస్తే మంచిది?

నిద్రలేచిన వెంటనే ఫోన్ చూడకుండా కనీసం 20 నుంచి 30 నిమిషాలు గ్యాప్ తీసుకోండి. అలాగే ఒక గ్లాస్ నీరు తాగండి. కిటికీలు తెరిచి సహజమైన వెలుతురులో కొద్దిసేపు ఉండండి. 5 నుంచి 10 నిమిషాలు స్ట్రెచింగ్ లేదా తేలికపాటి వ్యాయామం చేస్తే మంచిది. అలాగే డీప్ బ్రీతింగ్ లేదా ధ్యానం చేయండి. ఫోన్ చూసే ముందు బ్రేక్​ఫాస్ట్​ కూడా పూర్తి చేస్తే మంచిదని చెప్తున్నారు నిపుణులు.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం దీనిని క్లిక్ చేయండి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kidney Health : కిడ్నీలను డీటాక్స్ చేసి ఆరోగ్యంగా ఉంచే డ్రింక్స్.. నీటి తర్వాత ఇవే బెస్ట్
కిడ్నీలను డీటాక్స్ చేసి ఆరోగ్యంగా ఉంచే డ్రింక్స్.. నీటి తర్వాత ఇవే బెస్ట్
Diabetes and Dengue : మధుమేహం(Type 2 Diabetes) ఉన్నవారికి డెంగ్యూ వస్తే ప్రమాదమా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి
మధుమేహం(Type 2 Diabetes) ఉన్నవారికి డెంగ్యూ వస్తే ప్రమాదమా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి
Joint Stiffness : కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Embed widget