Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్!
Lucknow Crime News: లక్నోలోని గోమతి నగర్లో ఎస్బీఐ ఉద్యోగి తన భార్యను చంపేశాడు. తర్వాత తన సోదరిని హత్య చేసిన సూసైడ్ సుకున్నాడు. కుటుంబ కలహాలనే కారణమని తెలుస్తోంది.

- లక్నోలో బ్యాంకు వద్ద భర్త భార్యను కాల్చిచంపి పరారయ్యాడు.
- అనంతరం మానస్ తన సోదరిని చంపి, తుపాకీతో ఆత్మహత్య చేసుకున్నాడు.
- భార్యాభర్తల వివాదాలు, విడాకులు, అనుమానమే ఈ ఘోరానికి కారణం.
- నిందితుడు వాట్సాప్ స్టేటస్లో నేరాన్ని అంగీకరించాడు, దర్యాప్తు కొనసాగుతోంది.
Lucknow Crime News: ఉత్తర్ప్రదేశ్ లక్నోలోని గోమతి నగర్ గురువారం పట్టపగలు ఒక ఘోరమైన ఘటన జరిగింది. ఒక ప్రైవేటు బ్యాంకులో ఉన్నతాధికారిగా పని చేస్తున్న తన భార్యను బ్యాంకు ఎదుటే కాల్చి చంపిన భర్త, ఆపై కొద్ది నిమిషాల్లోనే తన సోదరిని హతమార్చి, తాను తుపాకీతో కాల్చుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ అత్యంత సంచలనాత్మక డబుల్ మర్డర్, ఆత్మహత్య ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
ఎస్బీఐలో పని చేస్తున్న 38 ఏళ్ల మానస్ వాజ్పేయి, గోమతి నగర్లోని ఐసీసీఈ బ్యాంక్ వెలుపల తన భార్య దివ్య మిశ్రాపై గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలపాలైన దివ్యను స్థానిక లోహియా ఆసుపత్రికి తరలించగా , ఆమె అప్పటికే మరణిమచినట్టు వైద్యులు ప్రకటించారు. దాడి అనంతరం తన నివాసానికి పారిపోయిన మానస్, అక్కడ మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న తన 28 ఏళ్ల సోదరి శివ వాజ్పేయిని కాల్చి చంపి, ఆపై తాను కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ప్రాథమిక సమాచారం మేరకు, భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా సాగుతున్న వివాదాలు, విడాకుల పిటిషన్, అనుమానమే ఈ ఘోరానికి మూలకారణమని పోలీసులు వెల్లడించారు.
ఐసీఐసీఐ బ్యాంకు ఎదుట ఏం జరిగింది?
ఈ దారుణ హత్య లక్నోలోని వివేక్ ఖండ్ ప్రాంతంలో గల ఐసీఐసీఐ బ్యాంక్ శాఖ ముందు జరిగింది. దివ్య మిశ్రా ఈ ఐసీఐసీఐ బ్యాంక్ రిలేషన్షిప్ మేనేజర్గా విధులు నిర్వహిస్తోంది. ఘటన జరిగిన రోజు ఆమె ఒక క్లయింట్ సమావేశాన్ని ముగించుకొని బ్యాంకుకు తిరిగి వచ్చిన వెంటనే ఈ ఘటన జరిగింది. లక్నో అడిషనల్ డీసీపీ అమోల్ ముర్కుట్ తెలిపిన వివరాల ప్రకారం, " దివ్య క్లయింట్ మీటింగ్ ముగించుకొని బ్యాంక్కు చేరుకోగానే ఆమె భర్త మానస్ ఆమెను బయటకు పిలిచి మాట్లాడాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వీరిద్ధరూ బ్యాంకు వెలుపల కొన్ని నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. ఆ సంభాషణ జరిగిన కొద్దిసేపటికే తీవ్ర ఆగ్రహాన్ని గురైన మానస్, తన వద్ద ఉన్న తుపాకీతో దివ్యపై కాల్పులు జరిపి ఘటన స్థలం నుంచి పరారయ్యాడు. కాల్పుల శబ్ధంతో ఒక్కసారిగా బ్యాంక్ పరిసర ప్రాంతాలు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తీవ్ర రక్తస్రావంతో పడిపోయిన దివ్యను వెంటనే సమీపంలోని రామ్మనోహర్ లోహియా ఆసుప్రతికి తరలించారు. అయితే ఆమె ఆసుపత్రికి చేరుకునే సరికి మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు.
ఇంటికి చేరుకుని హనుమాన్ చాలీసా ప్లే చేసిన నిందితుడు
బ్యాంకు వద్ద భార్యను కాల్చి చంపిన అనంతరం మానస్ వాజ్పేయి నేరుగా తన ఇంటికి చేరుకున్నాడు. మానస్ ఇంటి సమీపంలోని ఒక దుకాణదారుడు తెలిపిన వివరాల ప్రకారం, గురువారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో మానస్ చాలా హడావుడిగా ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ సమయంలో అతను విపరీతంగా చెమటలు కక్కుతూ తీవ్ర ఆందోళనతో కనిపించాడు.. ఇంటి లోపలికి వెళ్లిన అతను ఎక్కువ సౌండ్ పెట్టుకొని హనుమాన్ చాలీసా ప్లే చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి అతని నివాసం నుంచి తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయి. పక్కింటి వారు అతని వాట్సాప్ స్టేటస్ చూసి ఆందోళన చెంది లోపలికి వెళ్లి చూడగా మానస్ తన గదిలో శవమై పడి ఉన్నాడు. లోపల మానస్ మృతదేహంతోపాటు అతని సోది శివ వాజ్పేయి కూడా మరణించి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.
సోదరిని ఎందుకు హత్య చేసినట్టు?
మానస్ తన భార్యనే కాకుండా తనతోపాటు ఒకే ఇంట్లో నివసిస్తున్న 28 ఏళ్ల సోదరి శివ వాజ్పేయిని కూడా ఎందుకు చంపాల్సి వచ్చిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శివ వాజ్పేయి గత కొంతకాలంగా తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యలో బాధపడుతోంది. భార్యను చంపిన తర్వాత తానూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న మానస్, తాను లేకపోతే మానసి రోగి అయిన తన సోదిరిని చూసుకునే వారు ఎవరూ ఉండరనే భావనతోనే కాల్చి చంపినట్టు తెలుస్తోంది. ఈ ఘోరానికి పాల్పడటానికి ముందు అతను రాసినట్టు భావిస్తున్నట్టు వాట్సాప్ స్టేటస్ కూడా ఈ విషయాన్ని బలపరుస్తోంది.
ఇంతకీ స్టేటస్లో ఏం ఉంది?
ఈ దారుణానికి ఒడిగట్టడానికి కొద్ది నిమిషాల ముందే మానస్ వాజ్పేయి తన మొబైల్ ఫోన్లో షాకింగ్ వాట్సాప్ స్టేటస్ పోస్టు చేశాడు. ఆ స్టేట్ చదివిన వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. అందులో అతను ఇలా రాశాడు." ఈ రోజు నన్ను మోసం చేసిన నా భార్యను చంపేశాను. ఇప్పుడు నేను సూసైడ్ చేసుకోవాలి. నా సోదిరిని, ఆమె సోదరి ప్రజ్ఞను, ప్రతి ఒక్కర్నీ చంపేయాలి' ఈ వివాదంలో దివ్య సోదరి ప్రజ్ఞ మిశ్రా పేరును కూడా మానస్ తన వాట్సాప్ స్టేటస్లో ప్రస్తావించాడు. ఈ వాట్సాప్ స్టేటస్ చూసిన పక్కింటి వారు పోలీసులకు, బంధువులకు సమాచారం అందేశారు.
భార్యాభర్తల మధ్య వివాదం
పోలీసుల సమాచారం ప్రకారం మానస్, దివ్యల వివాహ బంధంలో గత కొంతకాలంగా తీవ్ర విభేదాలు ఉన్నట్టు వెల్లడైంది. వీరికి 12 ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే ఏడాది కాలంగా వీరిద్దరూ ఒకరినొకరు దూరంగా విడివిడిగా ఉంటున్నారు. విడాకుల కోసం దివ్య కోర్టులో పిటిషన్ వేసింది. అయితే మానస్ తన భార్య దివ్యకు వేసే రిలేషన్స్ ఉన్నాయని ఆమె తనను మోసం చేసిందని ఆరోపించేవాడని తెలుస్తోంది. ఈ అనుమానం పెరిగి హింసకు దారి తీసింది.
సోషల్ మీడియాలో దివ్య సోదరి ప్రజ్ఞ మెసేజ్
దివ్యపై కాల్పులు జరిగిన వెంటనే ఆమె సోదరి ప్రజ్ఞా మిశ్రా సోషల్ మీడియాలో భావోద్వేగమైన పోస్టు పెట్టింది. " నా సోదరిపై ఎవరో కాల్పులు జరిపారని నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది. ఆమెను లోహియా ఆసుపత్రికి తరలించారు. దయచేసి అందరూ ప్రార్థించండి" అంటూ మె ఎక్స్ వేదికగా వేడుకుంది.
ఆయుధాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
ఈ ఘోర ఉదంతం జరిగిన వెంటనే లక్నో పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. డీసీపీ డాక్టర్ దీక్షా శర్మ మీడియాతో మాట్లాడుతూ...' ఐసీఐసీఐ బ్యాంక్ వెలుపల మహిళను భర్త కాల్చి చంపినట్టు సమాచారం అందింది. మేము అక్కడకు చేరుకునే లోపు మరో ప్రాంతంలో ఒక వ్యక్తి తన సోదిరిని చంపి తాను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని వార్త వచ్చింది. దర్యాప్తు చేయగా, ఈ రెండు ఘటనలకు పాల్పడింది ఒక్కడేనని తేలింది. ఆ వ్యక్తినే మానస్ వాజ్పేయిగా గుర్తించాం. అతని ఫోన్లో సమాచారం ఆధారంగా వివరాలు తెలిశాయి. అతని ఇంటి నుంచి పోలీసులు మూడు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు' అని వివరించారు. పోలీసులు ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న ఆయుధాల మూలాలను విచారిస్తున్నారు. లైసెన్స్ లేని ఆయుధాలు మానస్ వద్దకు ఎలా వచ్చాయనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది.
ట్రెండింగ్ వార్తలు





















