Army Jobs: ఇండియన్ ఆర్మీలో ఇంజినీరింగ్, ఆపై ఉద్యోగం!
ఇంటర్ అర్హతతోపాటు జేఈఈ మెయిన్స్ 2022 ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇండియన్ ఆర్మీ 2023 జనవరిలో ప్రారంభం కానున్న 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (టీఈఎస్-48) కోర్సు కోసం అవివాహితులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్ అర్హతతోపాటు జేఈఈ మెయిన్స్ 2022 ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు ఐదేళ్ల శిక్షణ అనంతరం ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు పర్మనెంట్ కమిషన్లో ఆఫీసర్లుగా నియమిస్తారు.
వివరాలు..
* 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్
మొత్తం ఖాళీల సంఖ్య: 90.
Also Read: DRDO Recruitment: డీఆర్డీఓ -సెప్టంలో 1901 ఖాళీలు, అర్హతలివే!
అర్హత: 60 శాతం మార్కులతో ఇంటర్ (ఎంపీసీ) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. జేఈఈ మెయిన్స్ 2022 ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 16.5 - 19.5 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు 02.07.2003 నుంచి 01.07.2006 మధ్య జన్మించిన వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
Also Read: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, మరో 2910 పోస్టులకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఎంపిక విధానం: విద్యార్హతలో ప్రతిభ, ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ ఆధారంగా. ఎంపికైనవారికి 5 సంవత్సరాల శిక్షణ కాలం ఉంటుంది. అనంతరం ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు పర్మనెంట్ కమిషన్లో ఆఫీసర్లుగా నియమిస్తారు. దిగ్విజయంగా తుది పరీక్షలు పూర్తిచేసుకున్న అభ్యర్థులకు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ డిగ్రీ ప్రదానం చేస్తారు.
శిక్షణ ఇలా..
➥ మిలిటరీ ట్రైనింగ్: కోర్సులో చేరినవాళ్లకి అయిదేళ్లపాటు శిక్షణ ఉంటుంది. తొలి ఏడాది ఆఫీసర్ ట్రెయినింగ్ అకాడమీ - గయలో బేసిక్ మిలిటరీ శిక్షణ నిర్వహిస్తారు.
➥ టెక్నికల్ ట్రైనింగ్: బేసిక్ మిలిటరీ శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు టెక్నికల్ ట్రెయినింగ్ నాలుగేళ్ల పాటు ఉంటుంది. ఇందులో ఫేజ్-1 కింద ప్రీ-కమిషన్ శిక్షణ మూడేళ్లపాటు ఇస్తారు. ఫేజ్-2లో భాగంగా ఏడాదిపాటు పోస్ట్ కమిషన్ ట్రెయింగ్ ఉంటుంది.
➥ ఫేజ్-1, ఫేజ్-2 శిక్షణలు సీఎంఈ పుణె (లేదా) ఎంసీటీఈ/ఎంఎస్ఈఎంఈ సికింద్రాబాద్లో నిర్వహిస్తారు. ఎంపికైనవారు ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సులు చదువుతారు.
Also Read: BSF Jobs: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో 323 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు; అర్హతలివే!
వేతనం ఇలా..
మూడేళ్ల శిక్షణ అనంతరం అభ్యర్థులకు నెలకు రూ.56,100 చొప్పున స్టైపెండ్ చెల్లిస్తారు. నాలుగేళ్ల శిక్షణ అనంతరం పూర్తి వేతనం అమలవుతుంది. విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్న వారికి దిల్లీలోని జేఎన్యూ ఇంజినీరింగ్ డిగ్రీని ప్రదానం చేస్తుంది. వీరిని తదనంతరం లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు.
ముఖ్యమైన తేదీలు..
* ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.08.2019
* ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 21.09.2019
Also Read:
SSC Stenographer Exam: ఇంటర్ అర్హతతో 'స్టెనోగ్రాఫర్' ఉద్యోగాలు, వెంటనే దరఖాస్తు చేసుకోండి!
SSC Stenographer Exam: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) స్టెనోగ్రాఫర్ ఎగ్జామినేషన్ - 2022 ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాల్లో స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-సి, గ్రేడ్-డి) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్ విద్యార్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. టైపింగ్ తెలిసి ఉండాలి. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడతారు.
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...
Before You Go
PBKS vs GT Highlights : వరుసగా ఐదో మ్యాచ్ లోనూ ఆఖరి ఓవర్ లోనే ఫలితం | IPL 2023 | ABP Desam
ట్రెండింగ్ వార్తలు





















