అన్వేషించండి

8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ

Salary Hike for central govt employees | కొత్త సంవత్సరం 2026 ప్రారంభమైంది. 1.19 కోట్ల కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు 8వ వేతన సంఘం సిఫార్సుల కోసం ఆశగా ఎదరుచూస్తున్నారు.

8th pay commission: కొత్త సంవత్సరం 2026 లోకి అడుగుపెట్టాక తమ జీతం ఎప్పుడు పెరుగుతుందా అని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆలోచిస్తున్నారు. దేశంలోని సుమారు 1.19 కోట్ల మంది కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు 8వ వేతన సంఘం ప్రకటన కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రతి కేంద్ర ఉద్యోగి 8వ వేతన సంఘం నిర్ణయాల అమలుతో తమ జీతాల పెంపుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 

చాలా నెలలుగా ఎదురుచూస్తున్నప్పటికీ, 8వ వేతన సంఘంపై 2026లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో 8వ వేతన సంఘం ఎప్పటి నుంచి అమలులోకి వస్తుంది అనే అంశంపై సందిగ్ధత నెలకొంది. గత ట్రెండ్‌ను పరిశీలిస్తే, కమిషన్ ఏర్పాటు తర్వాత కొత్త వేతన సంఘం అమలులోకి రావడానికి కొంత సమయం పడుతుంది. కొత్త వేతన సంఘం సిఫార్సులు ఈ ఏడాది అమలులోకి రావచ్చని అంచనాలు ఉన్నాయి. 

కమిషన్ సిఫార్సులు ఎప్పటిలోగా అమలు కావచ్చు?

గత ఏడాది జరిగిన ప్రక్రియను పరిశీలిస్తే, నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జనవరి 15, 2025న 8వ వేతన సంఘం ఏర్పాటును ప్రకటించింది. అయితే, ఆ తర్వాత ప్రక్రియ చాలా కాలం ముందుకు సాగలేదు. సుమారు 10 నెలల తర్వాత అక్టోబర్ 28న అధికారిక గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో 8వ వేతన సంఘానికి తన నివేదికను సమర్పించడానికి 18 నెలల గడువు ఇచ్చారు. 

అక్టోబర్ 2025 నుండి 18 నెలల సమయాన్ని చూసుకుంటే, నిర్ణీత గడువు జూలై 2027కి అవుతుంది. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే.. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు పెరిగిన జీతం ప్రయోజనాలు 2027లో అమలు కావొచ్చు. లేదా కేంద్రం నిర్ణయంలో జాప్యం జరిగితే 2028 ప్రారంభంలో కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనాలు లభిస్తాయి. 

ఈ ఆలస్యానికి కారణం ఏమిటి?

8వ వేతన సంఘానికి తన నివేదికను సిద్ధం చేయడానికి 18 నెలల సమయం ఇచ్చారు. మరోవైపు కమిషన్ ఏర్పాటులో జాప్యం సైతం ఓ కారణం. ఆ నివేదిక వచ్చిన తర్వాత సిఫార్సులపై పరిశీలన, కేంద్ర క్యాబినెట్ ఆమోదానికి దాదాపు 6 నెలల టైం పడుతుంది. ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు 2 సంవత్సరాలు కావొచ్చు. ఈ కారణంగానే కొత్త జీతం, పింఛన్ ప్రయోజనాలు 2027 చివరిలో లేదా 2028 ప్రారంభంలో అమలు కానున్నాయి. గత రెండేళ్లనుంచి దీనిపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

Also Read: Snow Removal Jobs : మంచు తొలగిస్తే లక్షల్లో జీతం.. ఉద్యోగం, సౌకర్యాల గురించిన పూర్తి వివరాలివే

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
Advertisement

వీడియోలు

Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Dasoju Shravan: సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
Embed widget