News
News
వీడియోలు ఆటలు
X

Rajamouli: పునీత్ రాజ్‌కుమార్ అలా కాదు... తాను మ‌ర‌ణించే వ‌ర‌కూ ఆ విష‌యం ఎవ్వ‌రికీ చెప్ప‌లేదు - రాజ‌మౌళి

దివంగ‌త కథానాయ‌కుడు పునీత్ రాజ్‌కుమార్‌కు రాజ‌మౌళి నివాళులు అర్పించారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల్ని ప‌రామ‌ర్శించి... పునీత్ గొప్ప‌ద‌నం గురించి మాట్లాడారు.

FOLLOW US: 
Share:

పునీత్ రాజ్ కుమార్ మన మధ్య లేరంటే ఇప్పటికీ నమ్మలేక పోతున్నానని ప్రముఖ దర్శకుడు రాజమౌళి అన్నారు. పునీత్ మరణం తనను ఎంతగానో కలచి వేసిందని ఆయన తెలిపారు. బెంగళూరు వెళ్లిన రాజమౌళి, పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. దివంగత కథానాయకుడి ఫొటోకి నివాళులు అర్పించారు. ఆయన మరణవార్త విని షాక్ అయ్యానని అన్నారు.
పునీత్ రాజ్ కుమార్ మరణించిన తర్వాతే ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి తెలిసిందని రాజమౌళి అన్నారు. సాధారణంగా మనం ఓ చిన్న సాయం చేసినా ప్రపంచానికి తెలియాలని అనుకుంటామని, కానీ పునీత్ తాను ఎంత మందికి సహాయం చేసినా... తాను చేసిన సాయం గురించి ఎవ్వరికీ పునీత్ చెప్పలేదని దర్శక ధీరుడు వ్యాఖ్యానించారు. నాలుగేళ్ల క్రితం బెంగళూరుకు వెళ్లినప్పుడు తొలిసారి పునీత్‌ను కలిశానని, అతనితో మాట్లాడుతుంటే ఓ స్టార్‌తో మాట్లాడుతున్న ఫీలింగ్ కలగలేదని రాజమౌళి తెలిపారు. పునీత్ చాలా సరదాగా ఉండే మనిషి అని అన్నారు. తనను కుటుంబ సభ్యుడిలా చూసుకున్నారని అప్పటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. నిజంగా రాజమౌళి చెప్పినట్టు... పునీత్ రాజ్ కుమార్ సేవా కార్యక్రమాల గురించి ఆయన మరణం తర్వాతే ఎక్కువ మందికి తెలిసింది. పునీత్ గొప్పదనం గురించి పలువురు చెబుతున్నారు.
Also Read: రౌద్రం రణం రుధిరం మాత్రమే కాదు... రాజమౌళి చెప్పాలనుకున్నది అంతకు మించి!
ఇక, రాజమౌళి సినిమాలకు వస్తే... 'బాహుబలి' తర్వాత ఆయన దర్శకత్వం వహించిన పాన్ ఇండియా సినిమా 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' జనవరి 7న విడుదల కానుంది. రీసెంట్‌గా సోల్ యాంథమ్ 'జనని' పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటకు స్పందన బావుంది. ఎమోషనల్ గా ఉందని అందరూ అంటున్నారు. 

Also Read: మహిళా నిర్మాతపై చీటింగ్ కేస్... కంప్లయింట్ చేసిన ప్రముఖ టాలీవుడ్ యాక్టర్?
Also Read: త్రివిక్ర‌మ్‌కు, ఏపీ మంత్రి పేర్ని ప్రస్తావించిన ట్వీట్‌కు సంబంధం లేదు
Also Read: కంగనా రనౌత్ పై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశాలు... వివాదాస్పద వ్యాఖ్యలపై దర్యాప్తు చేయాలని ఆర్డర్
Also Read: 456 మందితో రియల్ ‘స్క్విడ్ గేమ్’.. విజేతకు రూ.3.41 కోట్లు, ఓడినవాళ్లను ఏం చేశారంటే..
Also Read: ఒక్క రోజు ఆలస్యంగా 'మరక్కార్‌'... గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేసిన సురేష్ ప్రొడక్షన్స్!
Also Read: హీరోయిన్‌కు ఎదురైన సంఘటనల వల్లే 'అఖండ' ఎంట్రీ... బాలకృష్ణ సెట్‌లోకి నడిచి వస్తుంటే?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Published at : 27 Nov 2021 12:49 PM (IST) Tags: Rajamouli Puneeth Rajkumar

సంబంధిత కథనాలు

Karate Kalyani: నన్ను చంపేందుకు నా కార్ టైర్లు కోసేశారు, పెద్ద ప్రమాదం తప్పింది: కరాటే కళ్యాణి

Karate Kalyani: నన్ను చంపేందుకు నా కార్ టైర్లు కోసేశారు, పెద్ద ప్రమాదం తప్పింది: కరాటే కళ్యాణి

షారుక్‌‌తో నటించేందుకు ఆ పాక్ నటుడు రూ.1 మాత్రమే తీసుకున్నాడట!

షారుక్‌‌తో నటించేందుకు ఆ పాక్ నటుడు రూ.1 మాత్రమే తీసుకున్నాడట!

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Agent OTT release: 'ఏజెంట్' రీ-కట్ వెర్షన్ కూడా బాగోలేదా? ఓటీటీలో రిలీజ్ ఇప్పట్లో కష్టమేనా?

Agent OTT release: 'ఏజెంట్' రీ-కట్ వెర్షన్ కూడా బాగోలేదా? ఓటీటీలో రిలీజ్ ఇప్పట్లో కష్టమేనా?

Adipurush: సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు

Adipurush: సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు

టాప్ స్టోరీస్

KTR Mulugu Tour: ఈ 7న ములుగు జిల్లాలో కేటీఆర్‌ పర్యటన, కలెక్టరేట్ సహా పలు పనులకు శంకుస్థాపన

KTR Mulugu Tour: ఈ 7న ములుగు జిల్లాలో కేటీఆర్‌ పర్యటన, కలెక్టరేట్ సహా పలు పనులకు శంకుస్థాపన

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

క్యూట్ స్మైల్ తో కట్టిపడేస్తున్న లావణ్య త్రిపాఠి

క్యూట్ స్మైల్ తో కట్టిపడేస్తున్న లావణ్య త్రిపాఠి