అన్వేషించండి

Rajasekhar: చచ్చిపోతా, మంట పెట్టేస్తారనుకున్నా - రాజ‌శేఖ‌ర్‌ భావోద్వేగం... జీవిత కన్నీరు

కరోనా ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంది. కరోనా చాలా మందిని చావు అంచుల వరకూ తీసుకువెళ్లి వచ్చింది. హీరో రాజ‌శేఖ‌ర్‌కు కూడా సీరియ‌స్ అయ్యింది. కరోనా బారిన పడినప్పటి పరిస్థితిని తాజాగా ఆయన వివరించారు.

సినిమా సెలబ్రెటీలైనా... సామాన్యులైనా... కరోనాకు ఒక్కటే. మహమ్మారి వైరస్ ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంది. చాలా మందిని చావు అంచుల వరకూ వెళ్లి బయటపడ్డారు. అందులో హీరో రాజశేఖర్ కూడా ఒకరు. ఆయ‌న‌తో పాటు కుటుంబ సభ్యులు సైతం కరోనా బారిన పడ్డారు. కుమార్తెలు శివాని, శివాత్మిక చాలా త్వరగా కరోనా నుంచి బయట పడ్డారు. రాజ‌శేఖ‌ర్‌కు మాత్రం సీరియస్ అయ్యింది. ఆయన చాలా రోజుల ఐసీయూలో ఉన్నారు. అప్పటి పరిస్థితి గురించి తాజాగా ఓ టాక్ షోలో వివరించారు.

'ఆలీతో సరదాగా' టాక్ షోకు రాజశేఖర్, జీవిత దంపతులు అతిథులుగా వచ్చారు. ఓ వారంలో 'శేఖర్' సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందనగా... రాజ‌శేఖ‌ర్‌కు కరోనా వచ్చింది. అప్పుడు ఆయన ఓ నెల ఐసీయూలో ఉన్నారని జీవిత వెల్లడించారు. "సీరియస్ అయ్యి... మనం చచ్చిపోతాం. రేపో, ఎల్లుండో మనల్ని మంట పెట్టేస్తారని అనుకున్నా" అని రాజశేఖర్ చెప్పారు. ఆయన మాటలకు కొనసాగింపుగా "(పరిస్థితి) అలాగే ఉండింది" అని జీవిత అన్నారు. చెబుతూ చెబుతూ కన్నీరు పెట్టుకున్నారు. 'ఆలీతో సరదాగా' టాక్ షోలో ఇద్దరూ భావోద్వేగానికి లోనయ్యారు.

హీరోలు, సినిమా సెలబ్రిటీలు తమకు ఉన్న ప్రాబ్లమ్స్ గురించి గతంలో ప‌బ్లిక్‌గా చెప్పేవారు కాదు. కానీ, ఇటీవల మార్పు వచ్చింది. తమ ప్రాబ్లమ్స్ ఏంటో చెబుతున్నారు. యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కూడా అలాగే చెప్పారు. 'మీరు డాక్టర్ చదివారు కదా! ఎందుకు యాక్టర్ అవ్వాలని వచ్చారు?' అని రాజ‌శేఖ‌ర్‌ను ఆలీ ప్ర‌శ్నించారు.  ''ఎప్పుడు ఎగ్జామ్స్ కోసం చదువుతానో... అప్పుడు యాక్టర్ అవ్వాలని ఎక్కువ అనిపించేది. తర్వాత నాకు నత్తి. దర్శకుడినో, నిర్మాతనో కలిసి నాకు అవకాశం ఇవ్వమని అడిగిన తర్వాత, నత్తి వల్ల తీసేస్తే... చాలా అసహ్యం అయిపోతుందేనని ఆలోచించాను" అని రాజశేఖర్ బదులు ఇచ్చారు. తన ప్రాబ్లమ్ గురించి ప‌బ్లిక్‌గా ఓపెన్ అయ్యారు. వారసుడి గురించి, అమ్మాయిల గురించి కూడా షోలో ఆయన మాట్లాడారు.

Also Read: ఏపీలో సినిమా వ్యాపారానికి మరో దెబ్బ... కొత్త సినిమాలకు కలెక్షన్లు రావడం కష్టమే!
Also Read: 'అతిథి దేవో భ‌వ‌' రివ్యూ: ప్రేక్ష‌కుల్ని అతిథుల్లా చూశారా? లేదా?
Also Read: ఏడిస్తే కష్టం పోతుందా? - దీప్తి సునయన లేటెస్ట్ పంచ్! బ్రేకప్ బాధ నుంచి బయటకొస్తోందా?
Also Read: మహేష్ నుంచి త‌మ‌న్‌కు... త‌మ‌న్ నుంచి ఎవ‌రికి? నెక్స్ట్ ఎవరు??
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. ప్రపంచంలో అరుదైన వ్యక్తిగా గుర్తింపు
పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. ప్రపంచంలో అరుదైన వ్యక్తిగా గుర్తింపు
Vemulawada Politics: మోసం చేసి గెలిచాడు, చెన్నమనేనికి ప్రభుత్వ బెనిఫిట్స్ ఆపేయాలి- ఆది శ్రీనివాస్
మోసం చేసి గెలిచాడు, చెన్నమనేనికి ప్రభుత్వ బెనిఫిట్స్ ఆపేయాలి- ఆది శ్రీనివాస్
CM Revanth Reddy: ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్ ప్రారంభించిన రేవంత్ రెడ్డి, తొలి రాష్ట్రంగా ఘనత 
ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్ ప్రారంభించిన రేవంత్ రెడ్డి, తొలి రాష్ట్రంగా ఘనత 
Gollapudi Panchayat: ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు, ఈ 24న మోదీ ప్రదానం- పవన్ కళ్యాణ్ వద్దే ఆ శాఖ
ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు, ఈ 24న మోదీ ప్రదానం- పవన్ కళ్యాణ్ వద్దే ఆ శాఖ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Virat Kohli PoTM IPL 2025 | ఒకే రోజు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లు తీసుకున్న రోహిత్ - విరాట్  | ABP DesaAyush Mhatre Batting | MI vs CSK IPL 2025 మ్యాచ్ ద్వారా పుట్టిన మరో కొత్త స్టార్ ఆయుష్ మాత్రేVirat Kohli vs Shreyas Iyer Controversy | IPL 2025 లో కొత్త శత్రువులుగా విరాట్, శ్రేయస్ అయ్యర్Rohit Sharma 76* vs CSK IPL 2025 | హిట్ మ్యాన్ ఫామ్ లోకి వస్తే ఎలా ఉంటుందో చూపించిన రోహిత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. ప్రపంచంలో అరుదైన వ్యక్తిగా గుర్తింపు
పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. ప్రపంచంలో అరుదైన వ్యక్తిగా గుర్తింపు
Vemulawada Politics: మోసం చేసి గెలిచాడు, చెన్నమనేనికి ప్రభుత్వ బెనిఫిట్స్ ఆపేయాలి- ఆది శ్రీనివాస్
మోసం చేసి గెలిచాడు, చెన్నమనేనికి ప్రభుత్వ బెనిఫిట్స్ ఆపేయాలి- ఆది శ్రీనివాస్
CM Revanth Reddy: ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్ ప్రారంభించిన రేవంత్ రెడ్డి, తొలి రాష్ట్రంగా ఘనత 
ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్ ప్రారంభించిన రేవంత్ రెడ్డి, తొలి రాష్ట్రంగా ఘనత 
Gollapudi Panchayat: ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు, ఈ 24న మోదీ ప్రదానం- పవన్ కళ్యాణ్ వద్దే ఆ శాఖ
ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు, ఈ 24న మోదీ ప్రదానం- పవన్ కళ్యాణ్ వద్దే ఆ శాఖ
BCCI Retainership: బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ లిస్ట్‌ విడుదల- అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు మళ్లీ కాంట్రాక్ట్
బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ లిస్ట్‌ విడుదల- అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు మళ్లీ కాంట్రాక్ట్
Yash: 'రామాయణ' షూటింగ్‌కు యశ్! - ఉజ్జయినీ మహాకాళేశ్వర్‌ను దర్శించిన కేజీఎఫ్ స్టార్
'రామాయణ' షూటింగ్‌కు యశ్! - ఉజ్జయినీ మహాకాళేశ్వర్‌ను దర్శించిన కేజీఎఫ్ స్టార్
JD Vance India Visit: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు కేంద్ర మంత్రి ఘన స్వాగతం- సాయంత్రం మోదీతో విందు, ఢిల్లీలో భద్రత పెంపు
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు కేంద్ర మంత్రి ఘన స్వాగతం- సాయంత్రం మోదీతో విందు, ఢిల్లీలో భద్రత పెంపు
MS Dhoni Animated Discussion: మిస్ట‌ర్ కూల్ కు కోపమొచ్చింది.. అంపైర్ తో సీరియ‌స్ గా చ‌ర్చించిన ధోనీ.. ముంబై చేతిలో ఓట‌మితో నిరాశ‌
మిస్ట‌ర్ కూల్ కు కోపమొచ్చింది.. అంపైర్ తో సీరియ‌స్ గా చ‌ర్చించిన ధోనీ.. ముంబై చేతిలో ఓట‌మితో నిరాశ‌
Embed widget