అన్వేషించండి

Crime News: తెలంగాణలో దారుణాలు - కన్నతల్లినే చంపేసి కొడుకు ఆత్మహత్య, టీచర్‌ను హతమార్చిన బార్బర్

Telangana News: కొత్తగూడెం జిల్లాలో ఓ యువకుడు కన్నతల్లినే హతమార్చి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అటు, ఎస్ఆర్ నగర్‌లో ఓ బార్బర్ టీచర్‌ను కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు.

Son Killed His Mother In Kothagudem: తెలంగాణలో శనివారం దారుణాలు చోటు చేసుకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ యువకుడు కన్నతల్లినే దారుణంగా హతమార్చి.. అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అటు, హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్‌లో ఓ బార్బర్ టీచర్‌ను కత్తితో పొడిచి చంపేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాను లేకపోతే కన్నతల్లిని ఎవరూ చూసుకోరేమో అని ఓ యువకుడు కన్నతల్లినే దారుణంగా చంపేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లాలోని బూడిదగడ్డ ప్రాంతంలో శనివారం వెలుగుచూసింది. స్థానికంగా నివసిస్తోన్న తుల్జాకుమారి పాసి (55)కి కుమారుడు వినయ్ కుమార్ (27), కుమార్తె హారతి ఉన్నారు. భర్త పదేళ్ల క్రితం మరణించాడు. తుల్జాకుమారి కుమార్తె హారతి, ఆమె భర్త, ఇతర కుటుంబీకులతో కలిసి అదే ప్రాంతంలో నివసిస్తున్నారు. కొంతకాలం క్రితం తుల్జాకుమారికి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో మందులు వాడుతున్నారు. ఆమె కుమారుడు వినయ్ గతంలో అక్కడక్కడ పని చేసి తల్లికి సాయం చేసేవాడు. అయితే, గత రెండేళ్లుగా ఏ పనీ చేయకుండా ఉండగా.. అప్పటి నుంచి బంధువులే తుల్జాకుమారి, వినయ్ కుమార్‌ల పోషణకు సాయం చేస్తుండేవారు.

అమ్మ ఒంటరి అయిపోతుందని..

వినయ్ కుమార్ ఇటీవల అనారోగ్యానికి (హైడ్రోసెల్) గురయ్యాడు. అయితే, అలర్జీ వల్ల సర్జరీ కుదరదని కొద్ది రోజులు మెడిసిన్ వాడాలని వైద్యులు సూచించారు. కాగా, తరచూ తనకు అనారోగ్యంగా ఉందని.. బతకాలని లేదని స్నేహితులకు చెప్పేవాడు. ఇదే క్రమంలో మానసికంగా కుంగిపోయాడు. 'తనకేమైనా అయితే మా అమ్మ ఒంటరి అయిపోతుంది. నేను లేకపోతే మా అమ్మకు తోడు ఎవరు ఉంటారు.?' అంటూ తనలో తనే మాట్లాడుకునే వాడని స్నేహితులు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి తల్లి ఇంట్లో నిద్రిస్తుండగా.. ఇనుప రాడ్డుతో తలపై కొట్టి హతమార్చాడు. అనంతరం ఆమె మృతదేహం పక్కనే దూలానికి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుమార్తె ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరో ఘటన

అటు, ఇదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రేమ వ్యవహారానికి సంబంధించి ఇంటర్ విద్యార్థులు డిగ్రీ విద్యార్థిపై దాడి చేశారు. ఈ ఘటనలో బాధితుడు మృతి చెందాడు. పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న అల్లూరి విష్ణు (22)పై కొంతమంది ఇంటర్ విద్యార్థులు దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ విష్ణు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతన్ని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హాస్టల్‌లో టీచర్ హత్య

మరోవైపు, హైదరాబాద్ (Hyderabad) నగరంలోని ఎస్ఆర్ నగర్ (SR Nagar) పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ హాస్టల్‌లోని షేరింగ్ రూమ్‌లో స్థానికంగా ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పని చేసే వెంకటరమణతో పాటు స్థానికంగా హెయిర్ కటింగ్ షాపులో పని చేసే గణేష్ ఉండేవారు. అయితే, గణేష్ రోజూ రాత్రి మద్యం సేవించి వచ్చి నిద్రకు ఆటంకం కలిగిస్తున్నాడంటూ వెంకటరమణ మందలించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. దీంతో కోపం పెంచుకున్న గణేష్.. కటింగ్ షాపులో వాడే కత్తితో వెంకటరమణపై శనివారం విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీంతో వెంకటరమణ అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. ఈ విషయాన్ని తోటి యువకులు హాస్టల్ యాజమాన్యానికి తెలియజేశారు. వారి సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, సన్నిహితుల సమాచారం ప్రకారం ప్రేమ వ్యవహారం కూడా హత్యకు కారణమని చెబుతున్నారు. ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది. మృతుడు వెంకటరమణ కర్నూలు జిల్లా ఆలమూరుకు చెందినవాడుగా గుర్తించారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Firing Case: విజయవాడలో హైడ్రామా; పోలీసులపైనే కాల్పులకు దుండగుడి యత్నం- ట్రిగ్గర్‌ లాక్ అవ్వడంతో తప్పిన ముప్పు!
విజయవాడలో హైడ్రామా; పోలీసులపైనే కాల్పులకు దుండగుడి యత్నం- ట్రిగ్గర్‌ లాక్ అవ్వడంతో తప్పిన ముప్పు!
అస్సాంలో కూలిన సుఖోయ్ ఫైటర్ జెట్.. ఇద్దరు IAF పైలట్లు మృతి
అస్సాంలో కూలిన సుఖోయ్ ఫైటర్ జెట్.. ఇద్దరు IAF పైలట్లు మృతి
బాణసంచా పేలుడు ఘటనలో 21 మంది మృతి.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు
బాణసంచా పేలుడు ఘటనలో 21 మంది మృతి.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు
Honor Killing In AP: లవ్ మ్యారేజీ చేసుకున్న కొన్ని గంటలకే వరుడ్ని చంపిన వధువు సోదరులు, కోనసీమలో దారుణం
లవ్ మ్యారేజీ చేసుకున్న కొన్ని గంటలకే వరుడ్ని చంపిన వధువు సోదరులు, కోనసీమలో దారుణం

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Vijay Super Six: తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
Iran ship: భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
Secunderabad Railway Stations: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
Vijay Deverakonda: బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
Maoists surrender in Hyderabad: జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
Hyderabad to Kanyakumari Amrit Bharat Express : హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
Rapappa Song: అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
Raisina Dialogue Chandrababu: నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
Embed widget