అన్వేషించండి

Crime News: తెలంగాణలో దారుణాలు - కన్నతల్లినే చంపేసి కొడుకు ఆత్మహత్య, టీచర్‌ను హతమార్చిన బార్బర్

Telangana News: కొత్తగూడెం జిల్లాలో ఓ యువకుడు కన్నతల్లినే హతమార్చి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అటు, ఎస్ఆర్ నగర్‌లో ఓ బార్బర్ టీచర్‌ను కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు.

Son Killed His Mother In Kothagudem: తెలంగాణలో శనివారం దారుణాలు చోటు చేసుకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ యువకుడు కన్నతల్లినే దారుణంగా హతమార్చి.. అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అటు, హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్‌లో ఓ బార్బర్ టీచర్‌ను కత్తితో పొడిచి చంపేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాను లేకపోతే కన్నతల్లిని ఎవరూ చూసుకోరేమో అని ఓ యువకుడు కన్నతల్లినే దారుణంగా చంపేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లాలోని బూడిదగడ్డ ప్రాంతంలో శనివారం వెలుగుచూసింది. స్థానికంగా నివసిస్తోన్న తుల్జాకుమారి పాసి (55)కి కుమారుడు వినయ్ కుమార్ (27), కుమార్తె హారతి ఉన్నారు. భర్త పదేళ్ల క్రితం మరణించాడు. తుల్జాకుమారి కుమార్తె హారతి, ఆమె భర్త, ఇతర కుటుంబీకులతో కలిసి అదే ప్రాంతంలో నివసిస్తున్నారు. కొంతకాలం క్రితం తుల్జాకుమారికి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో మందులు వాడుతున్నారు. ఆమె కుమారుడు వినయ్ గతంలో అక్కడక్కడ పని చేసి తల్లికి సాయం చేసేవాడు. అయితే, గత రెండేళ్లుగా ఏ పనీ చేయకుండా ఉండగా.. అప్పటి నుంచి బంధువులే తుల్జాకుమారి, వినయ్ కుమార్‌ల పోషణకు సాయం చేస్తుండేవారు.

అమ్మ ఒంటరి అయిపోతుందని..

వినయ్ కుమార్ ఇటీవల అనారోగ్యానికి (హైడ్రోసెల్) గురయ్యాడు. అయితే, అలర్జీ వల్ల సర్జరీ కుదరదని కొద్ది రోజులు మెడిసిన్ వాడాలని వైద్యులు సూచించారు. కాగా, తరచూ తనకు అనారోగ్యంగా ఉందని.. బతకాలని లేదని స్నేహితులకు చెప్పేవాడు. ఇదే క్రమంలో మానసికంగా కుంగిపోయాడు. 'తనకేమైనా అయితే మా అమ్మ ఒంటరి అయిపోతుంది. నేను లేకపోతే మా అమ్మకు తోడు ఎవరు ఉంటారు.?' అంటూ తనలో తనే మాట్లాడుకునే వాడని స్నేహితులు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి తల్లి ఇంట్లో నిద్రిస్తుండగా.. ఇనుప రాడ్డుతో తలపై కొట్టి హతమార్చాడు. అనంతరం ఆమె మృతదేహం పక్కనే దూలానికి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుమార్తె ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరో ఘటన

అటు, ఇదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రేమ వ్యవహారానికి సంబంధించి ఇంటర్ విద్యార్థులు డిగ్రీ విద్యార్థిపై దాడి చేశారు. ఈ ఘటనలో బాధితుడు మృతి చెందాడు. పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న అల్లూరి విష్ణు (22)పై కొంతమంది ఇంటర్ విద్యార్థులు దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ విష్ణు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతన్ని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హాస్టల్‌లో టీచర్ హత్య

మరోవైపు, హైదరాబాద్ (Hyderabad) నగరంలోని ఎస్ఆర్ నగర్ (SR Nagar) పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ హాస్టల్‌లోని షేరింగ్ రూమ్‌లో స్థానికంగా ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పని చేసే వెంకటరమణతో పాటు స్థానికంగా హెయిర్ కటింగ్ షాపులో పని చేసే గణేష్ ఉండేవారు. అయితే, గణేష్ రోజూ రాత్రి మద్యం సేవించి వచ్చి నిద్రకు ఆటంకం కలిగిస్తున్నాడంటూ వెంకటరమణ మందలించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. దీంతో కోపం పెంచుకున్న గణేష్.. కటింగ్ షాపులో వాడే కత్తితో వెంకటరమణపై శనివారం విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీంతో వెంకటరమణ అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. ఈ విషయాన్ని తోటి యువకులు హాస్టల్ యాజమాన్యానికి తెలియజేశారు. వారి సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, సన్నిహితుల సమాచారం ప్రకారం ప్రేమ వ్యవహారం కూడా హత్యకు కారణమని చెబుతున్నారు. ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది. మృతుడు వెంకటరమణ కర్నూలు జిల్లా ఆలమూరుకు చెందినవాడుగా గుర్తించారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Female cop kills father: పేరుకే పోలీసు - కానీ తండ్రినే చంపిన హంతకురాలు - ఈమెకు ఏ శిక్ష కరెక్ట్ ?
పేరుకే పోలీసు - కానీ తండ్రినే చంపిన హంతకురాలు - ఈమెకు ఏ శిక్ష కరెక్ట్ ?
GST scam busted: ఫేక్ కంపెనీలతో రూ.217 కోట్ల జీఎస్టీ స్కాం - ముఠా పట్టివేత - తెర వెనుక బడా వ్యక్తులు?
ఫేక్ కంపెనీలతో రూ.217 కోట్ల జీఎస్టీ స్కాం - ముఠా పట్టివేత - తెర వెనుక బడా వ్యక్తులు?
Allahabad High Court: వివాహితుడు మరో మహిళతో సహజీవనం చేయడం నేరంకాదు! అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు!
వివాహితుడు మరో మహిళతో సహజీవనం చేయడం నేరంకాదు! అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు!
Instagram Love Tragedy: ఇన్‌స్టా లవ్ విషాదాంతం.. భర్తను వదిలి ప్రియుడితో పెళ్లి! కాలువలో దూకి ఇద్దరూ ఆత్మహత్య
ఇన్‌స్టా లవ్ విషాదాంతం.. భర్తను వదిలి ప్రియుడితో పెళ్లి! కాలువలో దూకి ఇద్దరూ ఆత్మహత్య

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Airports in AP and Telangana: ఉడాన్‌ 2.0తో తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు
తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు!
Summer Special Trains: సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
IPL 2026: అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
Food Poisoning: శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
War Crimes: ఇరాన్‌పై దాడి ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేరానికి పాల్పడ్డాయా? అందుకు శిక్ష తప్పదా ?
ఇరాన్‌పై దాడి ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేరానికి పాల్పడ్డాయా? అందుకు శిక్ష తప్పదా ?
Amaravati What Next: అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
Embed widget