అన్వేషించండి

Vizianagaram Crime: నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ లో జై భీమ్ తరహా ఘటన! మేజిస్ట్రియల్ విచారణకు కలెక్టర్ ఆదేశం

విజయనగరం జిల్లాలో పాత నేరస్థుడు లాకప్ లో చనిపోవడం కలకలం రేపుతోంది. పోలీసులు ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు. బంధువులు పోలీసుల దెబ్బలకు తట్టుకోలేక చనిపోయాడని ఆరోపిస్తున్నారు.

విజయనగరం జిల్లా నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ లో శుక్రవారం పాత నేరస్థుడు లాకప్ చనిపోవడం కలకలం రేపుతోంది. విచారణ కోసం అదుపులోకి తీసుకున్న పాత నేరస్తుడు లాకప్ లోనే ఉరి వేసుకుని మృతి చెందాడని పోలీసులు చెబుతున్నారు. మృతిలో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేసులో అనుమానాలు ఉండడంతో జిల్లా కలెక్టర్ సూర్యకుమారి మెజిస్ట్రియల్ విచారణ(Magisterial Enquiry) కు ఆదేశించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని గాజులరేగ శాంతినగర్ కు చెందిన సురేష్ అలియాస్ బేతా రాంబాబు(42) పాత నేరస్తుడు. ఇటీవల నెల్లిమర్లలోని ఉపాధి హామీ పథకం కార్యాలయంలో బ్యాటరీల దొంగతనం కేసులో రాంబాబును పోలీసులు విచారణ చేశారు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో గాజులరేగలోని శాంతినగర్ లో తన ఇంట్లో ఉన్న రాంబాబును మరోసారి అదుపులోకి తీసుకున్న నెల్లిమర్ల పోలీసులు.. రాత్రంతా విచారణ చేశారు. కాగా తెల్లవారుజామున 4 గంటల సమయంలో నెల్లిమర్ల పోలీస్ స్టేషన్(Nellimarla Police Station) లో రాంబాబు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని, జరిగిన విషయాన్ని పైస్థాయి పోలీసు అధికారులకు సమాచారం అందించామని నెల్లిమర్ల పోలీసులు చెబుతున్నారు. నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పోలీసు అధికారులు, ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతుడు రాంబాబు మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆసుపత్రి మార్చురీకి తరలించారు. 

Vizianagaram Crime: నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ లో జై భీమ్ తరహా ఘటన! మేజిస్ట్రియల్ విచారణకు కలెక్టర్ ఆదేశం

మేజిస్ట్రియల్ విచారణకు కలెక్టర్ ఆదేశం 

నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ లో లాకప్ లో వ్యక్తి మృతి చెందాడన్న వార్తలు గుప్పుమనడంతో జిల్లా కలెక్టర్ సూర్యకుమారి(Collector Surya kumari)స్పందించారు. లాకప్ లో వ్యక్తి మృతిపై అనేక అనుమానాలు ఉండడంతో మేజిస్ట్రియల్ విచారణ జరిపిస్తామని కలెక్టర్ వెల్లడించారు. విజయనగరం ఆర్డీవో భవానీ శంకర్ ను విచారణ అధికారిగా నియమించారు. దీంతో ఆర్డీవో భవానీ శంకర్ జిల్లా కేంద్ర ఆసుపత్రిలోని మార్చురీకి చేరుకొని చనిపోయిన రాంబాబు మృతదేహాన్ని పరిశీలించారు. మొత్తం ఘటనపై ఆర్డీవో భవాని శంకర్ మాట్లాడుతూ.. పోలీసులు తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారని, మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు, పోలీసు స్టేషన్ లో ఆ సమయంలో ఉన్న విచారణ అధికారులను పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని, అనంతరం వివరాలు వెల్లడిస్తామని అన్నారు.

పోలీసుల ప్రయత్నాలు!

రాంబాబుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పాత నేరస్థుడు రాంబాబు లాకప్ లో మృతి(LockUp Death) చెందడంతో పోలీసులు ఈ కేసు నుంచి బయట పడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాంబాబు భార్యను వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తెల్లవారు జామున తీసుకెళ్లి జరిగిన విషయాన్ని వివరించారు. లాకప్ డెత్ లో పోలీసులు తీవ్రంగా కొట్టడం వల్ల, థర్డ్ డిగ్రీ ఉపయోగించి రాంబాబును హింసించడం వల్ల చనిపోయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతుని భార్య సహాయంతో తమ పైకి కేసులు రాకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. తమ తండ్రిని రాత్రి 8 గంటల సమయంలో పోలీసులు వచ్చి పట్టుకెళ్లారని, తెల్లవారుజామున వచ్చి తమ తండ్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారని రాంబాబు కుమార్తె చెబుతుంది.  మొత్తం ఘటనపై ఆర్డీవో భవానీ శంకర్ విచారణలో ఏం తేలుతుందన్న దానిపై పోలీసులు, మృతుని కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు.

Also Read: వీరి వద్ద దొంగల తయారీ జరుగును, ఇంటికి తాళం వేసి ఉంటే ఇక అంతే.. కీలక వివరాలు చెప్పిన ఎస్పీ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd ODI: ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
AR Rahman Vs Kangana Ranaut: ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం

వీడియోలు

Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్
Vande Bharat Sleeper Train Started | పచ్చ జెండా ఊపి వందేభారత్ స్లీపర్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ | ABP Desam
WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!
Ashwin about India vs New Zealand | టీమ్ సెలక్షన్ పై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Manoj Tiwari about Rohit Sharma Captaincy | రోహిత్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd ODI: ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
AR Rahman Vs Kangana Ranaut: ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Rafale Fighter Jets: భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
Shefali Jariwala Death Reason: చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
IND vs NZ 3rd ODI: కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
CM Revanth Reddy: ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Embed widget