అన్వేషించండి

Vizianagaram Crime: నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ లో జై భీమ్ తరహా ఘటన! మేజిస్ట్రియల్ విచారణకు కలెక్టర్ ఆదేశం

విజయనగరం జిల్లాలో పాత నేరస్థుడు లాకప్ లో చనిపోవడం కలకలం రేపుతోంది. పోలీసులు ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు. బంధువులు పోలీసుల దెబ్బలకు తట్టుకోలేక చనిపోయాడని ఆరోపిస్తున్నారు.

విజయనగరం జిల్లా నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ లో శుక్రవారం పాత నేరస్థుడు లాకప్ చనిపోవడం కలకలం రేపుతోంది. విచారణ కోసం అదుపులోకి తీసుకున్న పాత నేరస్తుడు లాకప్ లోనే ఉరి వేసుకుని మృతి చెందాడని పోలీసులు చెబుతున్నారు. మృతిలో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేసులో అనుమానాలు ఉండడంతో జిల్లా కలెక్టర్ సూర్యకుమారి మెజిస్ట్రియల్ విచారణ(Magisterial Enquiry) కు ఆదేశించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని గాజులరేగ శాంతినగర్ కు చెందిన సురేష్ అలియాస్ బేతా రాంబాబు(42) పాత నేరస్తుడు. ఇటీవల నెల్లిమర్లలోని ఉపాధి హామీ పథకం కార్యాలయంలో బ్యాటరీల దొంగతనం కేసులో రాంబాబును పోలీసులు విచారణ చేశారు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో గాజులరేగలోని శాంతినగర్ లో తన ఇంట్లో ఉన్న రాంబాబును మరోసారి అదుపులోకి తీసుకున్న నెల్లిమర్ల పోలీసులు.. రాత్రంతా విచారణ చేశారు. కాగా తెల్లవారుజామున 4 గంటల సమయంలో నెల్లిమర్ల పోలీస్ స్టేషన్(Nellimarla Police Station) లో రాంబాబు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని, జరిగిన విషయాన్ని పైస్థాయి పోలీసు అధికారులకు సమాచారం అందించామని నెల్లిమర్ల పోలీసులు చెబుతున్నారు. నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పోలీసు అధికారులు, ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతుడు రాంబాబు మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆసుపత్రి మార్చురీకి తరలించారు. 

Vizianagaram Crime: నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ లో జై భీమ్ తరహా ఘటన! మేజిస్ట్రియల్ విచారణకు కలెక్టర్ ఆదేశం

మేజిస్ట్రియల్ విచారణకు కలెక్టర్ ఆదేశం 

నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ లో లాకప్ లో వ్యక్తి మృతి చెందాడన్న వార్తలు గుప్పుమనడంతో జిల్లా కలెక్టర్ సూర్యకుమారి(Collector Surya kumari)స్పందించారు. లాకప్ లో వ్యక్తి మృతిపై అనేక అనుమానాలు ఉండడంతో మేజిస్ట్రియల్ విచారణ జరిపిస్తామని కలెక్టర్ వెల్లడించారు. విజయనగరం ఆర్డీవో భవానీ శంకర్ ను విచారణ అధికారిగా నియమించారు. దీంతో ఆర్డీవో భవానీ శంకర్ జిల్లా కేంద్ర ఆసుపత్రిలోని మార్చురీకి చేరుకొని చనిపోయిన రాంబాబు మృతదేహాన్ని పరిశీలించారు. మొత్తం ఘటనపై ఆర్డీవో భవాని శంకర్ మాట్లాడుతూ.. పోలీసులు తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారని, మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు, పోలీసు స్టేషన్ లో ఆ సమయంలో ఉన్న విచారణ అధికారులను పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని, అనంతరం వివరాలు వెల్లడిస్తామని అన్నారు.

పోలీసుల ప్రయత్నాలు!

రాంబాబుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పాత నేరస్థుడు రాంబాబు లాకప్ లో మృతి(LockUp Death) చెందడంతో పోలీసులు ఈ కేసు నుంచి బయట పడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాంబాబు భార్యను వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తెల్లవారు జామున తీసుకెళ్లి జరిగిన విషయాన్ని వివరించారు. లాకప్ డెత్ లో పోలీసులు తీవ్రంగా కొట్టడం వల్ల, థర్డ్ డిగ్రీ ఉపయోగించి రాంబాబును హింసించడం వల్ల చనిపోయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతుని భార్య సహాయంతో తమ పైకి కేసులు రాకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. తమ తండ్రిని రాత్రి 8 గంటల సమయంలో పోలీసులు వచ్చి పట్టుకెళ్లారని, తెల్లవారుజామున వచ్చి తమ తండ్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారని రాంబాబు కుమార్తె చెబుతుంది.  మొత్తం ఘటనపై ఆర్డీవో భవానీ శంకర్ విచారణలో ఏం తేలుతుందన్న దానిపై పోలీసులు, మృతుని కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు.

Also Read: వీరి వద్ద దొంగల తయారీ జరుగును, ఇంటికి తాళం వేసి ఉంటే ఇక అంతే.. కీలక వివరాలు చెప్పిన ఎస్పీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Waqf Bill:వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం, అర్థరాత్రి ఓటింగ్- అనుకూలంగా 226మంది ఓటు
వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం, అర్థరాత్రి ఓటింగ్- అనుకూలంగా 226మంది ఓటు
Amit Shah on Waqf properties: 2014 ఎన్నికలకు ముందు వక్ఫ్‌ బోర్డులకు భారీగా ఆస్తులను కాంగ్రెస్ ఇచ్చేసింది: లోక్‌సభలో అమిత్ షా సంచలన ఆరోపణలు
2014 ఎన్నికలకు ముందు వక్ఫ్‌ బోర్డులకు భారీగా ఆస్తులను కాంగ్రెస్ ఇచ్చేసింది: లోక్‌సభలో అమిత్ షా సంచలన ఆరోపణలు
Waqf Bill: ముస్లింల ఆస్తులను లాక్కోవడానికి ఉపయోగించే ఆయుధమే వక్ఫ్ సవరణ బిల్- కాంగ్రెస్ సహా ఇతర పక్షాల ఆగ్రహం
ముస్లింల ఆస్తులను లాక్కోవడానికి ఉపయోగించే ఆయుధమే వక్ఫ్ సవరణ బిల్- కాంగ్రెస్ సహా ఇతర పక్షాల ఆగ్రహం
HCU Land Dispute: కంచి గచ్చిబౌలి భూముల్లో పనులు నిలిపివేయాలి - తెలంగాణ హైకోర్టు ఆదేశం
కంచి గచ్చిబౌలి భూముల్లో పనులు నిలిపివేయాలి - తెలంగాణ హైకోర్టు ఆదేశం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Waqf (Amendment) Bill 2025 Passed in the Lok Sabha | పంతం నెగ్గించుకున్న NDA | ABP DesamRCB vs GT Match Highlights IPL 2025 | ఆర్సీబీపై 8వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ గ్రాండ్ విక్టరీ | ABP DesamSunita Williams Best Home Coming | నాసాలో చికిత్స తర్వాత ఇంటికి వచ్చిన సునీతా విలియమ్స్ | ABP DesamDigvesh Rathi Notebook Celebrations Priyansh Arya | ప్రియాంశ్ ఆర్య కొహ్లీలా రివేంజ్ తీర్చుకుంటాడా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Waqf Bill:వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం, అర్థరాత్రి ఓటింగ్- అనుకూలంగా 226మంది ఓటు
వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం, అర్థరాత్రి ఓటింగ్- అనుకూలంగా 226మంది ఓటు
Amit Shah on Waqf properties: 2014 ఎన్నికలకు ముందు వక్ఫ్‌ బోర్డులకు భారీగా ఆస్తులను కాంగ్రెస్ ఇచ్చేసింది: లోక్‌సభలో అమిత్ షా సంచలన ఆరోపణలు
2014 ఎన్నికలకు ముందు వక్ఫ్‌ బోర్డులకు భారీగా ఆస్తులను కాంగ్రెస్ ఇచ్చేసింది: లోక్‌సభలో అమిత్ షా సంచలన ఆరోపణలు
Waqf Bill: ముస్లింల ఆస్తులను లాక్కోవడానికి ఉపయోగించే ఆయుధమే వక్ఫ్ సవరణ బిల్- కాంగ్రెస్ సహా ఇతర పక్షాల ఆగ్రహం
ముస్లింల ఆస్తులను లాక్కోవడానికి ఉపయోగించే ఆయుధమే వక్ఫ్ సవరణ బిల్- కాంగ్రెస్ సహా ఇతర పక్షాల ఆగ్రహం
HCU Land Dispute: కంచి గచ్చిబౌలి భూముల్లో పనులు నిలిపివేయాలి - తెలంగాణ హైకోర్టు ఆదేశం
కంచి గచ్చిబౌలి భూముల్లో పనులు నిలిపివేయాలి - తెలంగాణ హైకోర్టు ఆదేశం
Tirumala News: టీటీడీలో వైట్ ఎలిఫెంట్స్‌ను తొలగించండి : చంద్రబాబు
టీటీడీలో వైట్ ఎలిఫెంట్స్‌ను తొలగించండి : చంద్రబాబు
pastor praveen kumar Case: విధ్వేషాలు వద్దు, దర్యాప్తుపై నమ్మకం ఉంచుదాం: ప్రవీణ్ భార్య అభ్యర్థన 
విధ్వేషాలు వద్దు, దర్యాప్తుపై నమ్మకం ఉంచుదాం: ప్రవీణ్ భార్య అభ్యర్థన 
Telangana High Court: కోర్టుకు వస్తారా? జైలుకు పంపమంటారా? రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం..!
కోర్టుకు వస్తారా? జైలుకు పంపమంటారా? రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం..!
IPL 2025 GT VS RCB Result Update: బ‌ట్ల‌ర్ అన్ బీటెన్ ఫిఫ్టీ.. రాణించిన సాయి సుద‌ర్శ‌న్, సిరాజ్.. జీటీకి రెండో విజ‌యం.. 8 వికెట్ల‌తో ఆర్సీబీకి ప‌రాభ‌వం..
బ‌ట్ల‌ర్ అన్ బీటెన్ ఫిఫ్టీ.. రాణించిన సాయి సుద‌ర్శ‌న్, సిరాజ్.. జీటీకి రెండో విజ‌యం.. 8 వికెట్ల‌తో ఆర్సీబీకి ప‌రాభ‌వం..
Embed widget