By: ABP Desam | Updated at : 02 Apr 2022 09:47 AM (IST)
చోరీ కేసు వివరాలు అందిస్తున్న రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్
దాదాపు 43 కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తిని పట్టుకున్న పోలీసులు.. అతని చెప్పే విషయాలు చూసి షాక్ తిన్నారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లక గాంధీనగర్కు చెందిన ముచ్చు అంబేద్కర్ అలియాస్ రాజు, అలియాస్ కందుల రాజేంద్రప్రసాద్ ఎలక్ట్రీషియన్గా చిన్న చిన్న పనులు చేస్తూ జీవించేవాడు. అతని ఖర్చులకు సరిపడా జీతం రాకపోయేసరికి దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు. అందులోనూ ప్రత్యేక స్టైల్ ఏర్పరుచుకున్నాడు.
1989లో చోరీలు మొదలు పెట్టాడు ఈ వ్యక్తి. కర్ణాటకలో చోరంగేట్రం చేసి... క్రమంగా హైదరాబాద్ వచ్చేశాడు. 1991లో లాలా గూడ పోలీసులు ఇతన్ని అరెస్టు చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా తన పంథా మార్చుకోలేదు.
జైలు నుంచి వచ్చిన తర్వాత 21 ప్రాంతాల్లో చోరీలు చేశాడు. ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో 21కేసులు రిజిస్ట్రర్ అయ్యాయి. మళ్లీ అరెస్టు అయ్యాడు. అప్పుడు కూడా తన బుద్ది మార్చుకోలేదు.
The @Vanasthaliprmps police apprehended one old #notorious & professional #HouseBurglar & #recovered 230 tolas of gold ornaments, 10.2 kgs of silver ornaments & net cash of Rs.15,300 all worth Rs.1,30,18,000 from his possession & #detected 43 cases (16 grave & 27 non-grave). pic.twitter.com/rEhnmMqmiU
— Rachakonda Police (@RachakondaCop) April 2, 2022
రెండోసారి అరెస్టు అయి విడుదలైన తర్వాత హైదరాబాద్ శివారు ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని చోరీలు చేశాడు. విజయవాడ హైవేకు ఆనుకొని ఉన్న వనస్థలిపురంలో దొంగతనాలు చేయడం ఈజీగా తప్పించుకుంటూ వచ్చాడు. ఇక్కడే ఎక్కువ దొంగతనాలు చేశాడు.
ఇతనిపై ఇప్పటి వరకు 43 కేసులు నమోదు అయ్యాయి. ఇలా చోరీలు చేస్తూనే గుంటూరులో మూడంతస్తుల భవన్ కట్టినట్టు పోలీసులు గుర్తించారు. చోరీ చేసిన బంగారం, వెండి ఆభరణాలు విక్రయించకుండా ఇంట్లోనే దాచుకున్నాడు. అమ్మితే దొరికిపోతానని ఇలా చేసేవాడు.
దొంగతనాలు ఎందుకు, ఎలా చేస్తున్నావని పోలీసులు ప్రశ్నిస్తే చాలా విచిత్రమైన సమాధానం చెప్పాడు. దొంగతనం ఎక్కడ చేయాలో ముందురోజు కల వస్తుందని.. ఆ తర్వాత రోజు అక్కడే చోరీ చేస్తానని చెప్పాడు. దేవుడే ఇది చేపిస్తున్నాడని చెప్పుకొచ్చాడు.
నిందితుడి నుంచి పోలీసులు కోటీ 30లక్షలు విలువైన బంగారం, పది కిలోల వెండి ఆభరణాలు, 18 వేల నగదు స్వాధీనం చేసుకున్నాడు.
The @Vanasthaliprmps police apprehended one old #notorious & professional #HouseBurglar & #recovered 230 tolas of gold ornaments, 10.2 kgs of silver ornaments & net cash of Rs.15,300/- all worth Rs.1,30,18,000 from his possession & #detected 43 cases (16 grave & 27 non-grave). pic.twitter.com/u4HdPEziXF
— Rachakonda Police (@RachakondaCop) April 1, 2022
Hyderabad Honour Killing Case: మార్వాడీ అబ్బాయి, యాదవ్ అమ్మాయి లవ్ మ్యారేజీ, అంతలోనే పరువు హత్యపై పోలీసులు ఏమన్నారంటే !
Honour Killing: హైదరాబాద్లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం
Secretariat Employee Suicide: విశాఖలో సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య - లక్ష్యం IAS, చేసేది వేరే జాబ్ అని జీవితంపై విరక్తితో !
AP Courier Offices: బెజవాడ డ్రగ్స్ ఎఫెక్ట్ - ఏపీలో కొరియర్ ఆఫీస్లపై పోలీసుల నిఘా
Goa News: గోవా బీచ్లో దారుణం- బ్రేకప్ చెప్పిందని యువతిని కత్తితో పొడిచి, బాడీని పొదల్లో పారేశాడు!
Rajiv Gandhi Death Anniversary : రాజీవ్ గాంధీ హత్యతో వైజాగ్ కు సంబంధం, ఆఖరి నిముషంలో విమానం రెడీ!
Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం, రాగల మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు
Horoscope Today 21st May 2022: ఈ రాశి ఉద్యోగులు టెన్షన్లో ఉంటారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!