అన్వేషించండి

Chitrakoot Temple: చారిత్రక ఆలయంలో విగ్రహాల చోరీ - పీడకలలు రావడంతో దొంగల ముఠా ఏం చేసిందంటే !

Thieves Return Stolen Ldols: ఏ విశ్వాసాలు, భయాలు లేకుండా తమకు కావాల్సింది చోరీ చేయాలని అనుకుంటే మాత్రం దొంగల్ని ఆపడం ఎవరి వల్ల కాదు. కానీ పీడకలల భయంతో యూపీలోని దొంగల ముఠా విగ్రహాలు తిరిగొచ్చేసింది.

తప్పు చేస్తే కళ్లు పోతాయి. దేవుడు అన్నీ చూస్తుంటాడని పెద్దలు చెబుతారు. అయితే ఏ విశ్వాసాలు, భయాలు లేకుండా తమకు కావాల్సింది చోరీ చేయాలని అనుకుంటే మాత్రం దొంగల్ని ఆపడం ఎవరి వల్ల కాదు. కానీ పోలీసులు ఎంట్రీతో రోజులోనో, వారానికో, నెలకో ఏదో ఓ సమయంలో దొంగలు దొరికిపోతుంటారు. ఓ దొంగల బృందం దేవుడిపై భయం కలగడంతో తాము చోరీ చేసిన వస్తువులను తిరిగిచ్చేసింది. ఇలా కూడా జరుగుతుందా అనుకుంటున్నారా. ఇది నిజం. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. 

అసలేం జరిగిందంటే.. 
చిత్రకూట్‌ జిల్లా తరౌన్హాలోని పురాతన బాలాజీ ఆలయంలో ఓ దొంగల ముఠా 16 దేవతల విగ్రహాలను మే 9వ తేదీన చోరీ చేసింది. దేవుళ్ల విగ్రహాలు చోరీ అయ్యాయనని మహంత్ రామబలక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాజీవ్ కుమార్ సింగ్ తెలిపారు. ఎంతో చరిత్ర కలిగిన శ్రీవారి ఆలయంలో విగ్రహాలు చోరీ చేశాక, ఆ దొంగల ముఠాను పీడకలలు వెంటాడాయి. రోజూ భయంకరమైన కలలు రావడంతో భాయాందోళనకు గురైన దొంగల టీమ్ ఎలాగైనా విగ్రహాలను వదిలించుకోవాలని భావించింది. 

ఎత్తుకెళ్లింది 16, తిరిగిచ్చింది 14..
పీడకలలు వెంటాడటంతో తకు కీడు జరుగుతుందని దొంగలు ఆందోళన చెందారు. ఇకలాభం లేదనుకుని తాము చోరీ చేసిన 16 విగ్రహాలలో తమ వద్ద మిగిలి ఉన్న 14 విగ్రహాలను ఆలయ పూజారి మహంత్ రామ్‌బలక్ ఇంటి వద్ద వదిలేసి వెళ్లిపోయారు. పోలీసులు దర్యాప్తు చేస్తుండగా దేవుళ్ల విగ్రహాలు పూజారి ఇంటి ఆవరణలో ప్రత్యక్షమయ్యాయి. దేవతల విగ్రహాలు తిరిగిచ్చేయడానికి కారణాలను దొంగల ముఠా ఓ లేఖలో రాసినట్లు ఆయన గుర్తించారు. విగ్రహాలు చోరీ చేసిన తరువాత తమను పీడ కలలు వెంటాడుతున్నాయని, దేవుడిపై భయంతోనే వాటిని తిరిగివచ్చేస్తున్నట్లు లేఖలో తెలిపింది దొంగల ముఠా.

ఔరంగజేబు కట్టించిన ఆలయం..
మొగల్ సుల్తాను ఔరంగజేబు ఈ చారిత్రక ఆలయాన్ని కట్టించాడు. దాదాపు 350 ఏళ్ల చరిత్ర కలిగిన బాలాజీ ఆలయాని ఔరంగజేబు కట్టించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. తన జీవితకాలంలో ఎన్నో హిందూ ఆలయాలను ధ్వంసం చేయడం, కొల్లగొట్టడం లాంటి చర్యలకు పాల్పడిన మొగల్ చక్రవర్తి ఔరంగజేబు.. ఈ ఆలయాన్ని నిర్మించడం విశేషమని చెప్పవచ్చు. శ్రీవారి ఆలయం కోసం నిధులు సైతం సమకూర్చుతూ ఆలయ బాగోగులు చూసుకున్నాడు. సరిగ్గా అదే ఆలయంలో 16 విగ్రహాలను ఓ దొంగల ముఠా చోరీ చేసింది. పీడ కలలు వెంటాడటంతో విగ్రహాలను తిరిగిచ్చేయడంతో పాటు ఓ లేఖలో అందుకు గల కారణాలను దొంగలు తెలపడంతో ఈ ఈ ఘటన దేశ వ్యాప్తంగా వైరల్‌గా మారింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Good news for Telangana government employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Andhra IAS Transfers: ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
Hatao Lungi Bajao Pungi: ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
Kishan Reddy: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయహోదా సాధ్యం కాదు - ఉపాధి హామీ పథకం బలోపేతం - కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయహోదా సాధ్యం కాదు - ఉపాధి హామీ పథకం బలోపేతం - కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

వీడియోలు

Ind vs NZ First ODI Highlights | మొదటి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం | ABP Desam
Virat Kohli 71st PoTM Award | తన తల్లితో అనుబంధాన్ని, సచిన్ పై ప్రేమను మరో సారి చాటిన కోహ్లీ | ABP Desam
Virat Kohli Reached Second Place | సంగక్కరను దాటేసి...సచిన్ తర్వాతి స్థానంలో విరాట్ | ABP Desam
Pawan kalyan induction into Kenjutsu | జపాన్ కత్తిసాము కళలోకి పవన్ కళ్యాణ్ కు అధికారిక ప్రవేశం | ABP Desam
MI vs DC WPL 2026 Highlights | ముంబై ఘన విజయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Good news for Telangana government employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Andhra IAS Transfers: ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
Hatao Lungi Bajao Pungi: ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
Kishan Reddy: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయహోదా సాధ్యం కాదు - ఉపాధి హామీ పథకం బలోపేతం - కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయహోదా సాధ్యం కాదు - ఉపాధి హామీ పథకం బలోపేతం - కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
AP CM Chandrababu: పుష్కరాలలోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి, 25 శాతం విదేశీ పెట్టుబడులు ఏపీకే: సీఎం చంద్రబాబు
పుష్కరాలలోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి, 25 శాతం విదేశీ పెట్టుబడులు ఏపీకే: సీఎం చంద్రబాబు
Guntur Latest News:గుంటూరు జిల్లాలోని రావిపాడు గ్రామ ఆరోగ్య కేంద్రంలో కాలం చెల్లిన మందులు- ఎమ్మెల్యే ఆగ్రహం
గుంటూరు జిల్లాలోని రావిపాడు గ్రామ ఆరోగ్య కేంద్రంలో కాలం చెల్లిన మందులు- ఎమ్మెల్యే ఆగ్రహం
Rapido Driver Selling Ganja: హైదరాబాద్‌లో గంజాయి దందా.. బంజారాహిల్స్‌లో ర్యాపిడో డ్రైవర్ అరెస్ట్, మరోచోట సైతం గంజాయి సీజ్
హైదరాబాద్‌లో గంజాయి దందా.. బంజారాహిల్స్‌లో ర్యాపిడో డ్రైవర్ అరెస్ట్, మరోచోట సైతం గంజాయి సీజ్
Mana Shankara Varaprasad Garu : 'మన శంకరవరప్రసాద్ గారు' థియేటర్లో విషాదం - మూవీ చూస్తూ కుప్పకూలిన అభిమాని
'మన శంకరవరప్రసాద్ గారు' థియేటర్లో విషాదం - మూవీ చూస్తూ కుప్పకూలిన అభిమాని
Embed widget