అన్వేషించండి

Grand Father Murder: ఆస్తి కోసం తాతని చంపిన మనవళ్లు, అమ్మమ్మకీ గాయాలు!

Grand Father Murder: తాత, అమ్మమ్మల ఆస్తి మీద కన్నేసిన అన్నాతమ్ముళ్లు.. లోను వస్తుందంటూ సంతంకం పెట్టించుకొని భూమిని కాజేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే తాత ప్రాణాలు తీశారు. అమ్మమ్మ కూడా తీవ్రంగా గాయపడింది.

Grand Father Murder: అక్రమంగా ఆస్తిని పొందడానికి సొంత తాత, అమ్మమ్మ లపై దాడి చేసి చివరికి వృద్దుల మృతికి కారణమైన ఇద్దరు దుర్మార్గులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను సుల్తానా బాద్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ సారంగపాణి వెల్లడించారు. సుల్తానాబాద్ గడిమహల్ కి చెందిన సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయి లింగయ్య(76) రిటైర్మెంట్ తర్వాత వచ్చిన డబ్బుతో పెద్దపల్లి సమీపంలోని పెద్ద బొంకూర్ వద్ద రెండు ఎకరాల 18 గుంటల స్థలాన్ని కొన్నాడు. లింగయ్య- ఒదెమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు... రాజమ్మ, వరలక్ష్మి ఉండగా వారిద్దరికీ చెరో ఎకరం రాసిచ్చాడు. 

లోను వస్తుందంటూ సంతకాలు పెట్టించుకొని.. భూమి లాక్కున్నారు!

తరువాత 18 గుంటలలో పది గుంటల భూమిని రాజమ్మ కూతురు అనిత పేరు మీద మిగిలిన ఎనిమిది గుంటల తన పేరుని పెట్టుకున్నాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న రాజమ్మ కొడుకులు సంతోష్, రవి ఆ ఆస్తి మొత్తం తమకే దక్కాలని కుట్ర పన్నారు. పది నెలల కిందట తాము బ్యాంకు లోన్ తీసుకుంటున్నామని దాని కోసం సాక్షిగా తాత లింగయ్య సంతకం పెడితే రుణం మంజూరు అవుతుందని అన్నారు. దీంతో వారి మాటలు నమ్మి లింగయ్య సంతకాలు పెట్టాడు .ఆ బాండ్ పేపర్ పై లింగయ్య తన మొత్తం భూమిని 14 లక్షల 70 వేల రూపాయలకు అమ్మి నట్టుగా  ఇద్దరు కలిసి డాక్యుమెంట్ సొంతంగా క్రియేట్ చేశారు. ఇక అప్పటి నుండి తాతకి, అమ్మమ్మకి బెదిరింపులు మొదలయ్యాయి. 

పిన్నిని పొలం వైపు కూడా రానివ్వకుండా బెదిరింపులు..!

భూమి మొత్తం తమదేనని చిన్నమ్మ వరలక్ష్మి, చెల్లెలు అనిత కూడా ఆ పొలం వైపు రాకుండా వారిని బెదిరిస్తూ పలుమార్లు దాడి చేశారు. దీంతో ఈ విషయం కుల పెద్దల సమక్షంలో పంచాయతీల వరకు వెళ్ళింది. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో సంతోష్, రవి ఇద్దరిపై పెద్దపల్లి సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదు అయ్యాయి. 15 రోజుల కిందట వరలక్ష్మి తన భూమిలో పొలం వేయగా తిరిగి దాన్ని చెడగొట్టారు. ఈసారి పంట వేస్తే ఏకంగా చంపేస్తామని బెదిరించారు. ఇక ఈ సమస్య ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుందని దీనికి చివరి పరిష్కారంగా తాతని, అమ్మమ్మని చంపేస్తే తమకు అడ్డు ఉండదని క్రూరమైన ఆలోచన చేశారు ఇద్దరు క్రిమినల్ మనవళ్ళు. 

తాత, అమ్మమ్మలపై మనవళ్ల దాడి...!

దీంతో ఈ నెల 27 వ తారీఖున సుల్తానాబాద్ లోని లింగయ్య ఇంటికి వచ్చి తాత అమ్మమ్మలతో తీవ్రంగా గొడవ పడ్డారు. అనంతరం కర్రతో వారిద్దరిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ వారిద్దరినీ కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చగా ట్రీట్మెంట్ తీసుకుంటూ తాత లింగయ్య చనిపోయాడు. ఇక అమ్మమ్మ ఓదెమ్మ ఇప్పటికీ చికిత్స పొందుతోంది. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులకు నిందితులు ఇద్దరూ తేలికగానే చిక్కారు. వారి దగ్గర నుండి ఒక ద్విచక్ర వాహనం, దాడికి ఉపయోగించిన కర్రను స్వాధీనం చేసుకున్నారు. 

కలికాలంలో బంధాలు అనుబంధాలకు చోటు లేదని... ఆస్తిలో మెజారిటీ వాటా ఇచ్చినప్పటికీ సొంత మనవల్ల చేతిలోనే మోసపోయి, హత్య గావించబడ్డ లింగయ్య సంఘటన అందరినీ విషాదంలో ముంచెత్తింది. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ ఇంద్రసేనా రెడ్డి, ఎస్సై ఉపేంద్ర రావు, అశోక్ రెడ్డి,  ఏఎస్ఐ తిరుపతి, కానిస్టేబుల్స్ గణేష్, మల్లేశం, నవీన్, తిరుపతిలను ఏసీపీ సారంగపాణి అభినందించారు.

టాప్ హెడ్ లైన్స్

Adilabad Crime News: క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
Arunachalam Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
Jogi Ramesh Latest News:వైసీపీ లీడర్‌, మాజీ మంత్రి జోగి రమేష్‌పై కోడలు పెట్టిన కేసు ఏంటీ? ఏ సెక్షన్ ఏం చెబుతుంది?
వైసీపీ లీడర్‌, మాజీ మంత్రి జోగి రమేష్‌పై కోడలు పెట్టిన కేసు ఏంటీ? ఏ సెక్షన్ ఏం చెబుతుంది?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Joint Stiffness : కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
Vandemataram 150 Years: వందేమాతరానికి  
వందేమాతరానికి  "అక్షరాంజలి".. 150 ఏళ్ల గీతానికి జీవం పోస్తున్న బాలిక 
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Embed widget