అన్వేషించండి

RTC Bus Accident: ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ- ఇద్దరు మృతి, మరో 15 మందికి గాయాలు

Annamayya District : అన్నమయ్య జిల్లా నందలూరులో కడప - చెన్నై జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొనడంతో.. లారీ డ్రైవర్, బస్సు కండక్టర్ అక్కడిక్కడే మృతి చెందారు.

RTC Bus Accident News:  అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొనడంతో లారీ డ్రైవర్, కండక్టర్ స్పాట్లోనే చనిపోయారు.  బస్సులోని మరో 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.  వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.  వివరాల్లోకి వెళితే.. అన్నమయ్య జిల్లా నందలూరు మండలం ఆల్విన్ ఫ్యాక్టరీ దగ్గర కడప- చెన్నై నేషనల్ హైవే పై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ మద్యం సేవించి అతివేగంతో ఆర్టీసీ బస్సును ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఆర్టీసీ కండక్టర్, లారీ డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయారు. 

కేబిన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్
కేబిన్‌లో ఇరుక్కుపోయిన లారీ డ్రైవర్‌ను బయటకు తీసేందుకు స్థానికులు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. ప్రమాదంలో బస్సులోని 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లో రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కొందరిని కడప రిమ్స్ కు, మరికొందరిని తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. లారీ డ్రైవర్ మద్యం తాగి ఉండడంతోపాటు, అధిక లోడుతో నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ రాజంపేట నియోజకవర్గ అధ్యక్షుడు యల్లటూరు శ్రీనివాసరాజు క్షతగాత్రులను పరామర్శించారు.  
 
ప్రమాదం పై స్పందించిన మంత్రి
కడప జిల్లా రాజంపేట రోడ్డు ప్రమాదం పై  రవాణా శాఖ మంత్రి వర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి పట్ల దిగ్భ్రాంతి  వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృత్యువాత పడ్డ కండక్టర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నందలూరు వద్ద ఆర్టీసీ బస్సు లారీ ఢీకొని ఇద్దరు మృతి చెందటం శోచనీయమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.  

ప్రభుత్వ ఆసుపత్రిలో రభస 
అన్నమయ్య జిల్లా  రాజంపేటలో ప్రభుత్వ ఆసుపత్రిలో రభస చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదానికి గురైన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆ సమయంలో సంబంధిత ఆర్తో డాక్టర్ లేకపోవడంతో క్షతగాత్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సూపరిడెంటెంట్ ను వివరణ కోరగా..  ఆర్తో డాక్టర్ అందుబాటులో లేడని సమాధానమివ్వడంతో క్షతగాత్రులు బంధువులు గొడవకు దిగారు.  సరైన వైద్యం ఇవ్వడం లేదని ఆరోపించారు.  పై అధికారులకు ఫిర్యాదు చేస్తామని క్షతగాత్రులు వారి బంధువులు హెచ్చరించారు.   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mysterious Boiling Water: అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
Revanth Reddy At WEF: దావోస్‌‌లో తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ పరిచయం చేయనున్న రేవంత్ రెడ్డి టీం
దావోస్‌‌లో తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ పరిచయం చేయనున్న రేవంత్ రెడ్డి టీం
Kodangal Narayanapet Lift Irrigation Scheme: కొడంగల్- నారాయణపేట ఎత్తిపోతల భూ సేకరణకు నిర్ణయం.. ఎకరాకు రూ.20 లక్షల పరిహారం!
కొడంగల్- నారాయణపేట ఎత్తిపోతల భూ సేకరణకు నిర్ణయం.. ఎకరాకు రూ.20 లక్షల పరిహారం!
Renu Desai : పాలిటిక్స్‌లోకి వెళ్లడం లేదు - కుక్కల కోసం పోరాడడం లేదు... రేణు దేశాయ్ రియాక్షన్
పాలిటిక్స్‌లోకి వెళ్లడం లేదు - కుక్కల కోసం పోరాడడం లేదు... రేణు దేశాయ్ రియాక్షన్

వీడియోలు

Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mysterious Boiling Water: అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
Revanth Reddy At WEF: దావోస్‌‌లో తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ పరిచయం చేయనున్న రేవంత్ రెడ్డి టీం
దావోస్‌‌లో తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ పరిచయం చేయనున్న రేవంత్ రెడ్డి టీం
Kodangal Narayanapet Lift Irrigation Scheme: కొడంగల్- నారాయణపేట ఎత్తిపోతల భూ సేకరణకు నిర్ణయం.. ఎకరాకు రూ.20 లక్షల పరిహారం!
కొడంగల్- నారాయణపేట ఎత్తిపోతల భూ సేకరణకు నిర్ణయం.. ఎకరాకు రూ.20 లక్షల పరిహారం!
Renu Desai : పాలిటిక్స్‌లోకి వెళ్లడం లేదు - కుక్కల కోసం పోరాడడం లేదు... రేణు దేశాయ్ రియాక్షన్
పాలిటిక్స్‌లోకి వెళ్లడం లేదు - కుక్కల కోసం పోరాడడం లేదు... రేణు దేశాయ్ రియాక్షన్
iphone 17e Price: పాత ఐఫోన్ ధరకే ఆపిల్ ఐఫోన్ 17e తో సంచలనం! సరికొత్త ప్రో మోడల్ ఫీచర్లు ఇవే
పాత ఐఫోన్ ధరకే ఆపిల్ ఐఫోన్ 17e తో సంచలనం! సరికొత్త ప్రో మోడల్ ఫీచర్లు ఇవే
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Nirmal Road Accident: బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్‌ జిల్లాలో ఘటన
బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్‌ జిల్లాలో ఘటన
వన్డేల్లో ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు ఎలా ఉందో చూశారా.. కలిసొచ్చిన మూడో స్థానం
వన్డేల్లో ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు ఎలా ఉందో చూశారా.. కలిసొచ్చిన మూడో స్థానం
Embed widget