అన్వేషించండి

Tirumala: టీటీడీలో టిక్కెట్ల మోసం - ఇంటి దొంగతో పాటు, మరో ఐదు మంది దళారులు అరెస్టు

TTD Tickets: భక్తుల దర్శనం కోరికను తెలుసుకుని కొందరు దళారీలు వారి ఆలయంపైనే వ్యాపారాన్ని చేస్తున్నారు. దర్శనం పేరుతో భక్తులను మోసం చేసి అధిక వసూళ్లకు పాల్పడుతున్నారు

Tirumala: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుని దర్శనం అంటేనే భక్తులు పరితపించి పోతారు. ప్రతినిత్యం వేల సంఖ్యలో స్వామి వారి సన్నిధికి చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనానికి ఉన్న డిమాండ్ అంత ఇంత కాదు. స్వామి వారిని దగ్గరగా దర్శనం చేసుకోవడానికి ఒక్క వీఐపీ బ్రేక్ దర్శనానికి మాత్రమే ఉంది. అందుకే ఈ బ్రేక్ దర్శనానికి ఇంత డిమాండ్ ఉంటుంది. భక్తుల దర్శనం కోరికను తెలుసుకుని కొందరు దళారీలు వారి ఆలయంపైనే వ్యాపారాన్ని చేస్తున్నారు. దర్శనం పేరుతో భక్తులను మోసం చేసి అధిక వసూళ్లకు పాల్పడుతున్నారు మరికొందరు దళారులు. తాజాగా బ్లాక్ లో శ్రీవారి దర్శనం టికెట్లు విక్రయిస్తున్న ఇంటి దొంగ గుట్టును తిరుమల పోలీసులు రట్టు చేశారు. భక్తులు టీటీడీ విజిలెన్స్ కు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగుచూసింది. విచారణ నిమిత్తం కేసును టీటీడీ విజిలెన్స్ తిరుమల పోలీసులకు అప్పగించింది.

టీటీడీ ఉద్యోగి టికెట్ల దందా.. 
టీటీడీలో సూపరింటెండెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న మల్లికార్జున్ కొంతకాలం నుంచి శ్రీవారి దర్శన టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము గడిస్తున్నాడు. అయితే తిరుమల శ్రీవారి దర్శనంకు టిక్కెట్లు దొరకని భక్తులని టార్గెట్ గా చేసుకుని మల్లికార్జున్ తన కార్యాకలాపాలను సాగించేవాడు. ఈ క్రమంలో భక్తులు మల్లికార్జున్ పై టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వీరి‌ ఫిర్యాదు మేరకు టీటీడీలో సూపరింటెండెంట్ గా ఉన్న మల్లికార్జున్ పై టీటీడీ విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. రెండు రోజుల కిందట ఓ భక్తుడికి శ్రీవారి‌ దర్శన టోకెన్లు అధిక ధరలకు విక్రయించడంతో టీటీడీ విజిలెన్స్ అధికారులు‌ మల్లికార్జున్ పై కేసు నమోదు చేశారు. 

మల్లికార్జున్ ప్రస్తుతం విశాఖపట్నంలోని హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రాజెక్టు విశాఖపట్నం ఏరియాకు క్లస్టర్ సూపరింటెండెంట్ గా పనిచేస్తూ ఉన్నారు. మల్లికార్జున్‌కు విజయవాడకు చెందిన నోముల వెంకట మురళి కృష్ణ, తడికమల గణేశ్ వెంకట సుబ్బారావు, ఉప్పల వంశీ కృష్ణలు తెలిసిన ప్రజా ప్రతినిధుల యొక్క సిఫార్సు లెటర్స్ లను తీసుకొని మల్లికార్జునకు ఇచ్చేవారు. ఆ సిఫార్సు లేఖలను మల్లికార్జున హైదరబాద్ కి చెందిన కంటసాని విజయకుమారి, ఆమె కుమార్తె నవ్యశ్రీలు కలిసి యాత్రికులను సేకరించి యాత్రికులకు సుపథం, బ్రేక్ దర్శనం, కళ్యాణోత్సవం, వసతులు కల్పించి యాత్రికుల వద్ద నుండి 500 రూపాయల విలువ వి.ఐ.పి బ్రేక్ టికెట్ ఒక వ్యక్తికి నుంచి 3000 రూపాయల చొప్పున 6 మందికిగానూ 18000 రూపాయలు వసూలు చేశారు. 

భక్తులకు టికెట్లతో అధిక వసూళ్లు 
300 రూపాయల విలువ గల సుపథం టికెట్‌పై ఒక వ్యక్తి నుంచి 2000 రూపాయల చొప్పున 6 మంది వద్ద నుంచి 12,000 రూపాయలు టికెట్ ధర కంటే అధికంగా డబ్బులను తీసుకొని అమాయకులైన యాత్రికులను మోసం చేశారు. ఇప్పటివరకు 721 వివిధ రకాల సేవ టిక్కెట్లు, 25 రూములను అధిక ధరకు విక్రయించినట్లు  టీటీడీ విజిలెన్స్ వారు ఇచ్చిన ఫిర్యాదుపై తిరుమల టూ టౌన్ పోలీసు క్రైమ్ నెంబర్ 127/2022 u/s 420 r/w 34 ఐపిసీ సెక్షన్‌ కింద నిందితులపై కేసు నమోదు చేశారు. టీటీడీ సూపరింటెండెంట్ మల్లికార్జున్ తో పాటుగా, మరో ఐదు మందిని అదుపులోకి తీసుకుని రిమాండ్ తరలించారు. భక్తులు ఎటువంటి దళారులను నమ్మి వారికి ఎక్కువ మొత్తంలో డబ్బు ఇచ్చి మోస పోకూడదని పోలీసుకు విజ్ఞప్తి చేస్తున్నారు. టీటీడీ అధికారిక వెబ్ సైట్‌లో టికెట్లు విడుదల చేసిన సమయంలో ఆన్ లైన్, ఆఫ్ లైన్ రూపంలో టికెట్లు కొనుగోలు చేయాలని పోలీసులు, అధికారులు సూచించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Khammam Crime News: భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
Anakapalli Crime News: అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
Kamareddy crime News: కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
Vijayawada Firing Case: విజయవాడలో హైడ్రామా; పోలీసులపైనే కాల్పులకు దుండగుడి యత్నం- ట్రిగ్గర్‌ లాక్ అవ్వడంతో తప్పిన ముప్పు!
విజయవాడలో హైడ్రామా; పోలీసులపైనే కాల్పులకు దుండగుడి యత్నం- ట్రిగ్గర్‌ లాక్ అవ్వడంతో తప్పిన ముప్పు!

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
గూగుల్‌ నోట్ బుక్‌ ఎల్‌ఎమ్‌లో అద్భుతమైన ఫీచర‌-గంటల పని నిమిషాల్లోనే పూర్తి!
గూగుల్‌ నోట్ బుక్‌ ఎల్‌ఎమ్‌లో అద్భుతమైన ఫీచర‌-గంటల పని నిమిషాల్లోనే పూర్తి!
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Jana Nayagan : జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
Stock Market 9 March: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
Embed widget