అన్వేషించండి

Kakinada Road Accident: లారీని ఢీకొన్న బొలెరో - ముగ్గురు మృతి, తొమ్మిది మందికి గాయాలు

Kakinada Road Accident: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బొలెరో వాహనం లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. తొమ్మిది మంది గాయపడ్డారు. 

Kakinada Road Accident: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు. ఇంకా తొమ్మిది మంది గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

లారీని ఢీకొన్న బొలెరో 
కాకినాడ జిల్లా తుని మండలం వెలమ కొత్తూరు జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఓ బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మరో 9 మంది కూడా గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే విషయం గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన ఓ వ్యక్తిని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందతూ చనిపోయిన మరిద్దరి మృతదేహాలను కూడా పోస్టు మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అయితే విశాఖ నుంచి కోరుకొండ మండలం శ్రీరంగం పట్నం వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. 

మృతులు, క్షతగాత్రులంతా శ్రీరంగ పట్నం వాసులుగా పోలీసులు గుర్తించారు. వీరంతా కళాకారులని... ఒకే బృందానికి చెందిన వాళ్లని తెలిపారు. అయితే వీరు విశాఖ మార్కాపురం వద్ద నిన్న రాత్రి నాటకం ప్రదర్శించారు. నాటక ప్రదర్శన అనంతరం సొంత గ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.  

మూడ్రోజుల క్రితమే మేడ్చల్ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తూప్రాన్ నుంచి నగరానికి బైక్ పై వెళ్తున్న ఓ జంటకు ఓ వ్యక్తి అనుకోకుండా అడ్డుగా వచ్చాడు. అతడిని తప్పించబోయిన బైకర్ డివైడర్ ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు కింద పడిపోయారు. వీరితో పాటే రోడ్డు దాటేందుకు ప్రయత్నించిన మరో వ్యక్తి కూడా పడిపోయారు. అయితే వెనుక నుండి వస్తున్న లారీ వారిని గమనించకుండా.. వారి పైనుంచి దూసుకెళ్లింది. దీంతో ఈ ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఓ మహిళ, డివైడర్ దాటి వచ్చిన ఓ వ్యక్తి, బైకర్ ఉన్నాడు. అయితే విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

వర్షాకాలం కావడం ఆపై డివైడర్ పై చెట్లు పెరగడంతో రోడ్డు దాటుతున్న వ్యక్తిని గమనించలేకపోయాడు బైకర్. అతడిని తప్పించబోయే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతన్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

 Also Read: Software Engineer Dies: పెళ్ళైన 24 గంటల్లోనే వరుడు మృతి, శోభనం గదిలో చనిపోయిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

Also Read: సంచలనం సృష్టిస్తున్న రాధిక లేఖ- కావాలనే మావోయిస్టు పార్టీలో చేరినట్టు వివరణ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Cyber Fraud:మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
Fire Cracker Lorry Catches Fire: హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
Hyderabad Latest News: సమోసాలు కనిపిస్తే ఆగిపోయే వారి కోసమే ఈ న్యూస్! ఆ టేస్ట్ రెసిపీ గుట్టు రట్టు చేసిన పోలీసులు!
సమోసాలు కనిపిస్తే ఆగిపోయే వారి కోసమే ఈ న్యూస్! ఆ టేస్ట్ రెసిపీ గుట్టు రట్టు చేసిన పోలీసులు!

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Embed widget