అన్వేషించండి

Telangana News: ప్రైవేట్ బస్సులో రూ.3 కోట్ల నగల బ్యాగు చోరీ - బాధితుడే ప్లాన్ వేశాడా? పోలీసుల డౌట్!

Gold Theft In Private Bus : నాలుగు కిలోల బంగారంతో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు నుంచి బ్యాగును దొంగలు తస్కరించారు. ఈ ఘటన పలు అనుమానాలకు తావిస్తోంది.

Jewelery Bag Theft in Private Bus : ప్రైవేటు బస్సులో మూడు కోట్లు విలువజేసే నాలుగు కిలోల నగల బ్యాగును చోరీ చేసిన ఘటన తాజాగా చోటుచేసుకుంది. ఒక దాబా వద్ద భోజనానికి నిలిపిన ప్రైవేటు ట్రావెల్‌ బస్సులో అర్ధరాత్రి దొంగ లు భారీ చోరీకి పాల్పడ్డారు. ప్రయాణీకుల ముసుగులో బస్సులోకి ఎక్కి నాలుగు కిలోలు బంగారు ఆభరణాల బ్యాగును అపసంహరించుకుని పారిపోయారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ చోరీపై పోలీసుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం సత్వార్‌ వద్ద శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం ఇలా ఉన్నాయి. 

హైదరాబాద్‌ నుంచి ముంబయి వెళుతున్న ఆరెంజ్‌ ట్రావెల్స్‌ బస్సులో ముంబయికి చెందిన బంగారు నగల వ్యాపారి ఆశిష్‌ (32) మూడు కోట్లు విలువజేసే నాలుగు కిలోలు బంగారు ఆభరణాలు కలిగిన బ్యాగుతో బస్సులోకి ఎక్కాడు. బస్సులో అంతా ప్రయాణాన్ని సాఫీగా సాగిస్తున్నారు. జహీరాబాద్‌ మండలం సత్వార్‌ వద్ద కోకిహినూర్‌ దాబాలో ప్రయాణీకులు తింటారన్న ఉద్ధేశంతో డ్రైవర్‌ బస్సు నిలిపాడు. అందరూ తినేందుకు దాబా వైపు వెళ్లగా, ఆశిష్‌ కూడా సిగరెట్‌ కాల్చేందుకు బస్సు దిగాడు. కొద్దిసేపటి తరువాత బస్సు ఎక్కి చూసిన ఆశీష్‌కు నగలుతో కూడిన బ్యాగ్‌ కనిపించలేదు. దీంతో ఆందోళన చచెందిన ఆశీష్‌ దాబా నిర్వాహకుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన ప్రయాణీకులను ఆందోళనకు గురి చేసింది. 

క్షణాల్లోనే బ్యాగుతో పరారు

ఆశీష్‌ కిందకు దిగన వెంటనే ఇద్దరు దొంగలు ప్రయాణీకులు మాదిరిగా బస్సులోకి ఎక్కారు. రెండు నిమిషాల్లో ఆభరణాలు బ్యాగును భుజానికి వేసుకుని వెళ్లిపోయారు. ఇద్దరు దొంగల్లో ఒక వ్యక్తి ముందుగా బస్సు దిగి ఇరువైపులా చూసి సైగ చేయగా, మరొకరు బ్యాగు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దొంగలు బస్సులోకి ఎక్కడం సహా బ్యాగుతో వెళుతున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జహీరాబాద్‌ డీఎస్సీ రామోహన్‌రెడ్డి, సీఐ శివలింగం శనివారం ఉదయం దాబాబకు చేరుకుని ఘటనపై ఆరా తీశారు. నిందితులను గుర్తించేందుకు చిరాగ్‌పల్లి, జహీరీబాద్‌ పోలీసులు సీసీ పుటేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. 

ఆశిష్‌పైనే పోలీసుల అనుమానం

ట్రావెల్స్‌ బస్సు నుంచి మూడు కోట్ల విలువైన నాలుగు కేజీలు బంగారం ఆభరణాల బ్యాగు పోగొట్టుకున్న వ్యాపారి ఆశీష్‌ వ్యవహరశైలి పలు అనుమానాలకు కారణమైంది. ఫిర్యాదు చేయడంలో తడబాటుకు గురి కావడంతో పోలీసులకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దొంగలు దాడి చేసి రెండు కిలో ఆభరణాలు ఎత్తుకెళ్లారని ఒకసారి, బస్సు ననుంచి కిందకు దిగి దాబాకు వెళ్లిన సమయంలో నాలుగు కిలోల బంగారు ఆభరణాల బ్యాగు చోరీకి గురైందని మరోసారి బాధితుడు పేర్కొనడంతో పోలీసులకు అనుమానాలు వ్యక్తమయ్యాయి. నగలకు సంబంధించిన పూర్తి బిల్లులు కావాలని పోలీసులు కోరగా, సదరు వ్యాపారి హైదరాబాద్‌ వెళ్లాడని, ప్రస్తుతం తాత్కాళికంగా ఫిర్యాదు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. చోరీ జరిగిన కోహినూర్‌ దాబాలో 2019లో ఇదే తరహాలో ట్రావెల్స్‌ బసస్సులో ముంబయి వెళ్తున్న ఓ వ్యాపారి నుంచి రూ.1.50 కోట్ల నగదు అపహరణకు గురైంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mysterious Boiling Water: అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
Kodangal Narayanapet Lift Irrigation Scheme: కొడంగల్- నారాయణపేట ఎత్తిపోతల భూ సేకరణకు నిర్ణయం.. ఎకరాకు రూ.20 లక్షల పరిహారం!
కొడంగల్- నారాయణపేట ఎత్తిపోతల భూ సేకరణకు నిర్ణయం.. ఎకరాకు రూ.20 లక్షల పరిహారం!
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Renu Desai : పాలిటిక్స్‌లోకి వెళ్లడం లేదు - కుక్కల కోసం పోరాడడం లేదు... రేణు దేశాయ్ రియాక్షన్
పాలిటిక్స్‌లోకి వెళ్లడం లేదు - కుక్కల కోసం పోరాడడం లేదు... రేణు దేశాయ్ రియాక్షన్

వీడియోలు

Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mysterious Boiling Water: అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
Kodangal Narayanapet Lift Irrigation Scheme: కొడంగల్- నారాయణపేట ఎత్తిపోతల భూ సేకరణకు నిర్ణయం.. ఎకరాకు రూ.20 లక్షల పరిహారం!
కొడంగల్- నారాయణపేట ఎత్తిపోతల భూ సేకరణకు నిర్ణయం.. ఎకరాకు రూ.20 లక్షల పరిహారం!
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Renu Desai : పాలిటిక్స్‌లోకి వెళ్లడం లేదు - కుక్కల కోసం పోరాడడం లేదు... రేణు దేశాయ్ రియాక్షన్
పాలిటిక్స్‌లోకి వెళ్లడం లేదు - కుక్కల కోసం పోరాడడం లేదు... రేణు దేశాయ్ రియాక్షన్
Nirmal Road Accident: బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్‌ జిల్లాలో ఘటన
బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్‌ జిల్లాలో ఘటన
వన్డేల్లో ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు ఎలా ఉందో చూశారా.. కలిసొచ్చిన మూడో స్థానం
వన్డేల్లో ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు ఎలా ఉందో చూశారా.. కలిసొచ్చిన మూడో స్థానం
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
Embed widget