అన్వేషించండి

Secunderabad News : కెమిస్ట్రీ ల్యాబ్ లో విషవాయువులు లీక్, 25 మంది విద్యార్థులకు అస్వస్థత!

Secunderabad News : సికింద్రాబాద్ కస్తూర్బా కాలేజీలో విషవాయువులు లీకై 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

Secunderabad News : సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్ పల్లి కస్తూర్బా కళాశాలలో 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విషవాయువు లీకై విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.  కళాశాల ప్రయోగశాలలో విషవాయువులు లీకై ప్రమాదం చోటుచేసుకుంది. అస్వస్థతకు గురైన విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. విద్యార్థులను గాంధీ హాస్పిటల్ తో పాటు స్థానిక ప్రైవేట్ హాస్పిటల్స్ కు తరలించారు. తమ పిల్లల పరిస్థితిని తెలుసుకోడానికి పెద్ద ఎత్తున హాస్పిటల్ కు చేరుకుంటున్నారు తల్లిదండ్రులు. 

కెమిస్ట్రీ ల్యాబ్ లో గ్యాస్ లీక్ 

సికింద్రాబాద్‌లోని వెస్ట్ మారేడ్‌పల్లి కస్తూర్బా కాలేజీలోని సైన్స్‌ ల్యాబ్‌లో విషవాయువులు లీక్ అయ్యాయి.  ఈ ఘటనలో 25 మంది విద్యార్థులకు పైగా అస్వస్థతకు గురవ్వడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. వెస్ట్ మారేడ్‌ప‌ల్లి లోని క‌స్తూర్బా కాలేజీలో ఇంట‌ర్ బ్లాక్‌లోని కెమిస్ట్రీ ల్యాబ్‌లో విద్యార్థినులు ప్రాక్టిక‌ల్స్ చేస్తున్నారు. ఆ సమయంలో ల్యాబ్ లో విషవాయువులు లీక్ అవ్వడంతో విద్యార్థినులు తీవ్ర అస్వస్థత‌కు గురయ్యారు. దీంతో 14 మంది విద్యార్థినులు స్పృహ కోల్పోయినట్లు తెలుస్తోంది. దీంతో కాలేజీ యాజ‌మాన్యం అప్రమ‌త్తమై బాధిత విద్యార్థినుల‌ను హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. పోలీసులు కళాశాలకు చేరుకొని ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థినుల ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉందని వైద్యులు తెలిపారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. 

వికటిస్తున్న మధ్యాహ్న భోజనం 

ప్రభుత్వ పాఠశాల్లో మధ్యాహ్న భోజనాల నిర్వహణ తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పాఠశాలల్లో భోజనాలు చేస్తున్న విద్యార్థులు తరచూ అస్వస్థతకు గురౌతున్నారు. తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో అధికారులు నిర్వహణ లోపాలపై దృష్టిపెట్టాలని కోరుతున్నారు. తాజాగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మధ్యాహ్న భోజనం వికటించింది. వారం రోజులుగా 10 పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వికటించి వందకు పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. జిల్లా వ్యాప్తంగా రెండు వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలున్నాయి. రెండు లక్షల మందికి పైగా చిన్నారులకు నిత్యం మధ్యాహ్న భోజనం వండుతున్నారు. అయితే పాఠశాలల్లో భోజన నిర్వహణ లోపాల కారణంగా విద్యార్థులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురవుతున్నారు.  

నాణ్యత లేని బియ్యం 

నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం భవానీపేట, గాంధారి, నాగిరెడ్డి పేట మండలం చీనూరు, నవీపేట, బిర్కూరు మండలాల్లోని పలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వికటించిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ పాఠశాలల్లో 50 మందికి పైగా విద్యార్థులు వాంతులు , విరేచనాలతో దవాఖానా పాలయ్యారు. స్కూల్‌లో మధ్యాహ్న భోజనం వికటిస్తూ విద్యార్థులు ఆసుపత్రుల పాలుకావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మధ్యాహ్న భోజనానికి సన్న బియ్యం సరఫరా చేయాలని కోరుతున్నారు. నాణ్యత లేని బియ్యం, నిర్వహణ లోపాల కారణంగా తరచూ సమస్యలు వస్తున్నాయంటున్నారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వహకులకు పెరిగిన ధరల ప్రకారం డబ్బులు చెల్లించకపోడంతో తక్కువ ధరల్లో లభించే కూరగాయలు, నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని ఫలితంగా నాణ్యత లేని బియ్యం, ఇతర సామాగ్రితో వండుతున్న భోజనం వికటించి విద్యార్థులు తరచూ అస్వస్థతకు గురవుతున్నట్లు తెలుస్తోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Food Safety: హైదరాబాద్‌లో కల్తీ మాఫియా గుట్టు రట్టు: కుళ్లిన గుడ్లు, విషపూరిత పేస్ట్.. షాకింగ్ వివరాలు!
హైదరాబాద్‌లో కల్తీ మాఫియా గుట్టు రట్టు: కుళ్లిన గుడ్లు, విషపూరిత పేస్ట్.. షాకింగ్ వివరాలు!
Markapuram Road Accident: మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం! టిప్పర్‌, ప్రైవేట్ బస్‌ ఢీకొని 13 మంది సజీవదహనం !
మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం! టిప్పర్‌, ప్రైవేట్ బస్‌ ఢీకొని 13 మంది సజీవదహనం !
Vijayawada Terror Links Case: విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
Yadadri Crime News: భార్యపై కోపంతో పండులో ఎలుకల మందు కలిపి కుమార్తె హత్య, ఆపై తండ్రి ఆత్మహత్యాయత్నం
భార్యపై కోపంతో పండులో ఎలుకల మందు కలిపి కుమార్తె హత్య, ఆపై తండ్రి ఆత్మహత్యాయత్నం

వీడియోలు

Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Shane Warne 460 Crores Profil from RR | షేన్ వార్న్ కుటుంబానికి 460 కోట్ల లాభం | ABP Desam
Aryaman Birla IPL Player to RCB Owner | ఆర్సీబీ కొత్త బాస్ ఆర్యమన్ బిర్లా ఎమోషనల్ జర్నీ | ABP Desam
Ganguly Comments on Dhoni Retirement | ధోనీ రిటైర్మెంట్‌పై గంగూలీ వ్యాఖ్యలు | ABP Desam
Ben Duckett Out of IPL 2026 | ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Petrol Crisis: హైదరాబాద్‌లో రోజుకు 100 ట్యాంకర్ల పెట్రోల్ ఖాళీ! ABP దేశంతో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  
హైదరాబాద్‌లో రోజుకు 100 ట్యాంకర్ల పెట్రోల్ ఖాళీ! ABP దేశంతో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Trump Warns Iran: ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం- త్వరగా నిర్ణయం తీసుకోకపోతే అంతమే!
ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం- త్వరగా నిర్ణయం తీసుకోకపోతే అంతమే!
Iran Navy Chief Killed : హార్మూజ్ జలసంధి కింగ్ పిన్ అంతం - ఇరాన్ నావికాదళాధిపతి మృతి - ఇక నౌకలకు అడ్డే లేదు!
హార్మూజ్ జలసంధి కింగ్ పిన్ అంతం - ఇరాన్ నావికాదళాధిపతి మృతి - ఇక నౌకలకు అడ్డే లేదు!
Hyderabad No petrol: నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
Bandi Sanjay Song: బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?
బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?
Metformin: డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్ -మెట్‌ఫార్మిన్ గురించి సంచలన విషయాలు కనిపెట్టిన సైంటిస్టులు
డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్ -మెట్‌ఫార్మిన్ గురించి సంచలన విషయాలు కనిపెట్టిన సైంటిస్టులు
Telangana News: ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
Embed widget