అన్వేషించండి

Secunderabad News : కెమిస్ట్రీ ల్యాబ్ లో విషవాయువులు లీక్, 25 మంది విద్యార్థులకు అస్వస్థత!

Secunderabad News : సికింద్రాబాద్ కస్తూర్బా కాలేజీలో విషవాయువులు లీకై 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

Secunderabad News : సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్ పల్లి కస్తూర్బా కళాశాలలో 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విషవాయువు లీకై విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.  కళాశాల ప్రయోగశాలలో విషవాయువులు లీకై ప్రమాదం చోటుచేసుకుంది. అస్వస్థతకు గురైన విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. విద్యార్థులను గాంధీ హాస్పిటల్ తో పాటు స్థానిక ప్రైవేట్ హాస్పిటల్స్ కు తరలించారు. తమ పిల్లల పరిస్థితిని తెలుసుకోడానికి పెద్ద ఎత్తున హాస్పిటల్ కు చేరుకుంటున్నారు తల్లిదండ్రులు. 

కెమిస్ట్రీ ల్యాబ్ లో గ్యాస్ లీక్ 

సికింద్రాబాద్‌లోని వెస్ట్ మారేడ్‌పల్లి కస్తూర్బా కాలేజీలోని సైన్స్‌ ల్యాబ్‌లో విషవాయువులు లీక్ అయ్యాయి.  ఈ ఘటనలో 25 మంది విద్యార్థులకు పైగా అస్వస్థతకు గురవ్వడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. వెస్ట్ మారేడ్‌ప‌ల్లి లోని క‌స్తూర్బా కాలేజీలో ఇంట‌ర్ బ్లాక్‌లోని కెమిస్ట్రీ ల్యాబ్‌లో విద్యార్థినులు ప్రాక్టిక‌ల్స్ చేస్తున్నారు. ఆ సమయంలో ల్యాబ్ లో విషవాయువులు లీక్ అవ్వడంతో విద్యార్థినులు తీవ్ర అస్వస్థత‌కు గురయ్యారు. దీంతో 14 మంది విద్యార్థినులు స్పృహ కోల్పోయినట్లు తెలుస్తోంది. దీంతో కాలేజీ యాజ‌మాన్యం అప్రమ‌త్తమై బాధిత విద్యార్థినుల‌ను హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. పోలీసులు కళాశాలకు చేరుకొని ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థినుల ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉందని వైద్యులు తెలిపారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. 

వికటిస్తున్న మధ్యాహ్న భోజనం 

ప్రభుత్వ పాఠశాల్లో మధ్యాహ్న భోజనాల నిర్వహణ తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పాఠశాలల్లో భోజనాలు చేస్తున్న విద్యార్థులు తరచూ అస్వస్థతకు గురౌతున్నారు. తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో అధికారులు నిర్వహణ లోపాలపై దృష్టిపెట్టాలని కోరుతున్నారు. తాజాగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మధ్యాహ్న భోజనం వికటించింది. వారం రోజులుగా 10 పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వికటించి వందకు పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. జిల్లా వ్యాప్తంగా రెండు వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలున్నాయి. రెండు లక్షల మందికి పైగా చిన్నారులకు నిత్యం మధ్యాహ్న భోజనం వండుతున్నారు. అయితే పాఠశాలల్లో భోజన నిర్వహణ లోపాల కారణంగా విద్యార్థులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురవుతున్నారు.  

నాణ్యత లేని బియ్యం 

నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం భవానీపేట, గాంధారి, నాగిరెడ్డి పేట మండలం చీనూరు, నవీపేట, బిర్కూరు మండలాల్లోని పలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వికటించిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ పాఠశాలల్లో 50 మందికి పైగా విద్యార్థులు వాంతులు , విరేచనాలతో దవాఖానా పాలయ్యారు. స్కూల్‌లో మధ్యాహ్న భోజనం వికటిస్తూ విద్యార్థులు ఆసుపత్రుల పాలుకావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మధ్యాహ్న భోజనానికి సన్న బియ్యం సరఫరా చేయాలని కోరుతున్నారు. నాణ్యత లేని బియ్యం, నిర్వహణ లోపాల కారణంగా తరచూ సమస్యలు వస్తున్నాయంటున్నారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వహకులకు పెరిగిన ధరల ప్రకారం డబ్బులు చెల్లించకపోడంతో తక్కువ ధరల్లో లభించే కూరగాయలు, నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని ఫలితంగా నాణ్యత లేని బియ్యం, ఇతర సామాగ్రితో వండుతున్న భోజనం వికటించి విద్యార్థులు తరచూ అస్వస్థతకు గురవుతున్నట్లు తెలుస్తోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
Tata Ernakulam Express Fire Accident: ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
Sarpanches Chalo Assembly: అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్
అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్
Bigg Boss Emmanuel : అలాంటి మహానటులు ఇంకా పుట్టలేదు - బిగ్ బాస్ ట్రోఫీ రాలేదనే అసంతృప్తి లేదు... ఇమ్మాన్యుయెల్ కామెంట్స్
అలాంటి మహానటులు ఇంకా పుట్టలేదు - బిగ్ బాస్ ట్రోఫీ రాలేదనే అసంతృప్తి లేదు... ఇమ్మాన్యుయెల్ కామెంట్స్

వీడియోలు

BCCI Clarity about Team India Test Coach | టెస్ట్ కోచ్ పై బీసీసీఐ క్లారిటీ
India Women Record in T20 | శ్రీలంకపై భారత్ విజయం
Rishabh Pant out Of India vs New Zealand | రిషబ్ పంత్ కు షాక్
Yashasvi Jaiswal about Rohit Sharma | జైస్వాల్‌ డెబ్యూపై రోహిత్ మాస్టర్ ప్లాన్
అసెంబ్లీకి కేసీఆర్? టీ-పాలిటిక్స్‌లో ఉత్కంఠ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
Tata Ernakulam Express Fire Accident: ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
Sarpanches Chalo Assembly: అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్
అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్
Bigg Boss Emmanuel : అలాంటి మహానటులు ఇంకా పుట్టలేదు - బిగ్ బాస్ ట్రోఫీ రాలేదనే అసంతృప్తి లేదు... ఇమ్మాన్యుయెల్ కామెంట్స్
అలాంటి మహానటులు ఇంకా పుట్టలేదు - బిగ్ బాస్ ట్రోఫీ రాలేదనే అసంతృప్తి లేదు... ఇమ్మాన్యుయెల్ కామెంట్స్
Apple iPhone Record Sales: ఈ ఏడాది భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన ఐఫోన్ ఇదే.. ఆండ్రాయిడ్ ఫోన్లను వెనక్కి నెట్టి మరీ
ఈ ఏడాది భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన ఐఫోన్ ఇదే.. ఆండ్రాయిడ్ ఫోన్లను వెనక్కి నెట్టి మరీ
Andhra PPP Politics: మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
The Raja Saab Pre Release Event : విలన్ల చెంప పగలగొట్టారు - 'ది రాజా సాబ్' ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై RGV రియాక్షన్
విలన్ల చెంప పగలగొట్టారు - 'ది రాజా సాబ్' ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై RGV రియాక్షన్
Sankranti 2026 Movies Telugu: హిట్ ఆల్బమ్ లేని సంక్రాంతి సినిమాలు, BGM హోరులో పాటలను పక్కన పెట్టేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు
హిట్ ఆల్బమ్ లేని సంక్రాంతి సినిమాలు, BGM హోరులో పాటలను పక్కన పెట్టేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు
Embed widget