అన్వేషించండి

Secunderabad Fire Accident: సికింద్రాబాద్ అగ్నిప్రమాదం కేసులో షోరూం నిర్వాహకులు సహా నలుగురు అరెస్టు

సికింద్రాబాద్ రూబీ లాడ్జి, ఎలక్ట్రిక్‌ స్కూటర్ల షోరూంల నిర్వాహకులైన రాజేందర్ సింగ్, ఆయన కుమారుడు సునీత్ సింగ్, మేనేజర్ సుదర్శన్ నాయుడు, సూపర్‌వైజర్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.

Accused arrested in Secunderabad Fire Accident Case: సికింద్రాబాద్‌ రూబీ లాడ్జిలో జరిగిన అగ్ని ప్రమాదం కేసులో పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. రూబీ లాడ్జి, ఎలక్ట్రిక్‌ స్కూటర్ల షోరూంల నిర్వాహకులైన రాజేందర్ సింగ్, ఆయన కుమారుడు సునీత్ సింగ్, మేనేజర్ సుదర్శన్ నాయుడు, సూపర్‌వైజర్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం రాత్రి ప్రమాదం తర్వాత పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అయితే అగ్నిప్రమాదం జరిగిన తరువాత నుంచి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు నలుగురి అరెస్టు చేశారు.
విషయం తెలుసుకుని తండ్రీకొడుకులు పరార్..
సికింద్రాబాద్ లోని రూబీ ఎలక్ట్రికల్ బైక్ షో రూమ్ ను సోమవారం రాత్రి దాదాపు 9 గంటలకు మూసివేశారు నిర్వాహకులు రాజేందర్ సింగ్, ఆయన కుమారుడు సునీత్ సింగ్. దాదాపు 45 నిమిషాలకు లాడ్జి నుంచి వారికి ఫోన్ కాల్ వచ్చింది. అగ్నిప్రమాదం జరగిందని వెంటనే అక్కడికి రావాలని సమాచారం రావడంతో రూబీ లాడ్జ్, షోరూంకు వెళ్లినప్పటికీ.. ఆ ఘటనలో 8 మంది చనిపోయారని తెలుసుకుని తండ్రీ కొడుకులు పరారయ్యారు. 

అసలేం జరిగిందంటే.. 
రూబీ లాడ్జి ఐదు అంతస్తుల భవనంలో రన్ చేస్తుండగా.... మొదటి అంతస్తులో ఫైనాన్స్‌ సంస్థ, రిసెప్షన్‌ విభాగాలున్నాయి. అయితే వెహికిల్ పార్కింగ్‌కు కేటాయించిన సెల్లార్‌లో ఎలక్ట్రిక్ వాహనాల షోరూం నిర్వహిస్తున్నారు. ఇందులో షార్ట్ సర్క్యూట్ కావడంతో సోమవారం రాత్రి 9 గంటల తరువాత సెల్లార్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. కొన్ని క్షణాల్లో మంటలు బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. ఎలక్ట్రిక్ వాహనాలన్నీ కాలి బూడిదయ్యాయి. వాహనాల టైర్లు కాలటంతో భవనంలోని పై అంతస్తులో సైతం దట్టమైన పొగ వ్యాపించింది. పొగ ధాటికి తట్టుకోలేక ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా, పోలీసులు, స్థానికులు కొందర్ని ఆసుపత్రికి తరలించారు. ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
Also Read: Secunderabad: సికింద్రాబాద్ అగ్ని ప్రమాదంలో పొగ వల్లే 8 మంది మృతి, స్ప్రింకర్లు ఎందుకు పని చేయలేదంటే?

కేసు నమోదు చేసిన పోలీసులు
రూబీ ఎలక్ట్రిక్ షోరూం, లాడ్జి అగ్ని ప్రమాదం నుంచి బయటపడ్డ  మన్మోహన్‌ ఖన్నా అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోండా మార్కెట్‌ పోలీసులు నిందితులపై 304 పార్ట్‌ 3, 324 ఐపీసీ అండ్‌ సెక్షన్‌ 9 బి ఎక్స్‌ప్లోజివ్‌ యాక్ట్‌ 1884 ప్రకారం కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. 

పలు ఆస్పత్రుల్లో బాధితులకు చికిత్స
రూబీ ప్రమాద బాధితులు ఐసీయూలో నలుగురు ఉన్నారు. అగ్నిప్రమాద క్షతగాత్రులను వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మొత్తం 8 మంది మృతిచెందారు. కొంతమందికి గాంధీ, ఆపోలో, యశోద ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో యూపీకి చెందిన దీపకుమార్ యాదవ్.. కోల్‌కతా చెందిన ఉమేష్ కుమార్ ఆచార్య ఉన్నారు. ఆపోలోలో మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. ఈ నలుగురికి అంతర్గతంగా ఊపిరితిత్తుల్లో పొగ చేరినట్లు వైద్యులు చెబుతున్నారు. వేడి కారణంగా గాయాలు కావడంతో ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. స్వల్ప గాయాలతో గాంధీలో చేరిన ఇద్దరు కోలుకుని  నిన్న డిశ్చార్జి అయ్యారు.

ఫైర్ డిపార్ట్‌మెంట్‌ నివేదిక 
రూబీ లాడ్జి విషాద ఘటనపై తెలంగాణ ఫైర్ డిపార్ట్‌మెంట్‌ నివేదిక విడుదల చేసింది. మూడు పేజీల రిపోర్ట్‌లో కీలకమైన విషయాలు వెల్లడించారు అధికారులు. యజమాని నిర్లక్ష్యం కారణంగానే ప్రమాద తీవ్ర పెరిగిందన నివేదికలో స్పష్టం చేసింది. లిథియం బ్యాటరీల పేలుళ్ల వల్లే దట్టమైన పొగలు వ్యాపించాయని తేల్చింది తెలంగాణ ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌. పొగలు వల్ల భవనంలోకి వెళ్లలేకపోయామని ఫైర్ డిపార్ట్‌మెంట్‌ పేర్కొంది. భవనానికి సింగిల్‌ ఎంట్రీ, ఎగ్జిట్‌ మాత్రమే ఉన్నట్టు నివేదికలో వెల్లడించింది. లిఫ్ట్‌ పక్కన మెట్లు ఏర్పాటు చేయకూడదనే నిబంధన ఉన్నప్పటికీ యజమాని పట్టించుకోలేదని తెలిపింది.  Also Read: రూల్స్‌ ప్రకారం ఒక్కటీ లేదు- రూబీ లాడ్జి విషాదంపై ఫైర్‌డిపార్ట్‌మెంట్‌ సంచలన రిపోర్ట్

టాప్ హెడ్ లైన్స్

Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Indian Tourists Boat Capsize: వియత్నాంలో బోటు ప్రమాదం.. తెలుగు టూరిస్టులు సహా 15 మంది మృతి!
వియత్నాంలో బోటు ప్రమాదం.. తెలుగు టూరిస్టులు సహా 15 మంది మృతి!
Telangana Mass Killing: కొడుకు రింగ్ మింగేసినా చికిత్స చేయించని రాజ్‌కుమార్! డెత్‌స్పాట్‌లో ఉన్న 7 రాళ్ల కథేంటీ?
కొడుకు రింగ్ మింగేసినా చికిత్స చేయించని రాజ్‌కుమార్! డెత్‌స్పాట్‌లో ఉన్న 7 రాళ్ల కథేంటీ?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget