అన్వేషించండి

Sattenapalli News :సత్తెనపల్లిలో విషాదం, డ్రైనేజి క్లీన్ చేసేందుకు దిగి ముగ్గురు మృతి!

Sattenapalli News : సత్తెనపల్లిలోని ఓ రెస్టారెంట్‍లో  డ్రైనేజిలోకి దిగిన ముగ్గురు వ్యక్తులు ఊపిరాడక చినిపోయారు. మృతుల్లో ఇద్దరు కార్మికులు కాగా మరొకరు బిల్డింగ్ యజమాని ఉన్నారు.

Sattenapalli News : డ్రైనేజీ సంపు ముగ్గురిని బలి తీసుకున్న విషాద సంఘటన అందరిని కలచి వేసింది. పనులు లేని కారణంగా పొట్టకూటి కోసం అలవాటు లేని పనికి వచ్చి ఇద్ధరు కార్మికులు.. భవన యజమాని కూడా ఈ డైనేజి  పనుల కారణంగా బలయ్యారు. దుర్భర పేదరికాన్ని అనుభవిస్తూ దొరికిన పనికి వెళ్ళి వచ్చిన కూలీ డబ్బులతో  కుటుబాన్ని   పోషిస్తున్న ఇద్దరు కార్మికులు మృత్యు వాత పడ్డారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

ముగ్గురు మృతి

పల్నాడు జిల్లా‌ సత్తెనపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పట్టణంలోని ఆర్టీసీ‌ బస్టాండు సమీపంలో ఉన్న వినాయక రెస్టారెంట్ లో‌‌ డ్రైనేజీ క్లీన్ చేస్తుండగా జరిగిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో జిల్లా ఒక్కసారి ఉలిక్కి పడింది. వినాయక రెస్టారెంట్ భవనం రోడ్డు మట్టానికి తక్కువగా ఉండటంతో మున్సిపల్ డ్రెనేజీ వ్యవస్థకు అను సంధానం కాలేదు. ఈ భవనంలో పైన ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ డ్రెనేజీ నీరు, రెస్టారెంట్ మురుగు నీరును భవనానికి దిగువ నున్న సంపులో  నిల్వ చేస్తారు. ప్రతి నాలుగు రోజులకు ఒకసారి మున్సిపల్ డ్రెనేజీకి మళ్ళించి క్లీన్ చేయిస్తారు. గత పది రోజుల నుంచి శుభ్రం చేయించక పోవడంతో ఒవర్ ఫ్లో అయి విపరీతమైన దుర్వాసన వస్తోంది. ఈ క్రమంలో రాత్రి భవన యజమాని కొండలు.. శుబ్రం చేయించేందుకు పని వారి‌ కోసం చూసాడు. వారు అధికంగా అడగటంతో వారిని కాదని గత కొన్ని రోజల నుంచి పనులు లేక ఇబ్బందులు పడుతున్న భవన కార్మికులను టార్గెట్ చేశాడు. ఇసుక లేక పోవడంతో పనులు లేక పస్తులు ఉంటున్న పరిస్థితి.  

పని రాదని చెబుతున్నా.. వెంట తీసుకెళ్లి!

ఈ నేపథ్యంలో రాత్రి భవన కార్మికులు అయిన అనీల్, బ్రహ్మం ఇంటికి వెళ్ళాడు భవన యజమాని... వారికి పని గురించి చెప్పడు. తమకు‌ డ్రైనేజీ పని తెలియదని వారు చెప్పారు. వెళ్ళి పోయిన భవన యజమాని కొండలు రెండు గంటల తర్వాత తిరిగి వచ్చి, నిద్రపోతున్న అనీల్, బ్రహ్మంను లేపి ఆశ పెట్టి తీసుకు ‌వెళ్ళాడని కుటుంబ సబ్యులు చెబుతున్నారు. పది అడుగల లోతు, 18 అడుగుల వెడల్పు ఉన్న డ్రైనేజీ సంపును శుభ్ర పరిచేందుకు వెళ్లారు. మొదటగా అనీల్ సంపులోకి దిగాడు. బయటకు రాక పోవడంతో బ్రహ్మం కూడా డ్రైనేజీ గోతిలోకి దిగాడు. వీరిద్దరూ శుభ్రం చేసేందకు వెళ్లి గంటలు గడిచిన బయటకు రాకపోవడంతో భవన యజమాని కొండలు విషయం తెలుసుకునేందుకు లోపలికి దిగాడు. కొద్ది సేపటి తర్వాత రెస్టారెంట్ సిబ్బంది అటుగా వచ్చి చూస్తే  బట్టలు శుభ్రం చేసే‌ సామానులు కనబడటంతో అనుమానంతో జగ్రత్తగా డ్రైనేజ్ గాలించగా ముగ్గురు గుంటలో‌ పడి పోయినట్లు గమనించారు. పోలీసులకు ఫోన్ చేశారు. అగ్నిమాపక సిబ్బంది సాయంతో డ్రైనేజ్ సంపులో ఉన్న ముగ్గురుని బయటకు తీసారు. అప్పటికే ముగ్గురు మృతి చెందారు.

ఊబిగా మారి చనిపోయారేమో..!

అయితే డ్రైనేజ్ అడుగున స్లాబ్ చేయించక పోవడంతో ఊబిగా మారి క్లీన్ చేస్తున్న సమయంలో అందులో ‌చిక్కుకొని చనిపోయారని కొందరు చెబుతున్నారు. మరి కొందకు డ్రైనేజ్ ఓపెన్ చేయగానే గ్యాస్ రిలీజ్ అయి వీరి ప్రాణాలు పోయాయని అంటున్నారు. మూడు మృత దేహాలను సత్తెనపల్లి ప్రభుత్వ‌ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే కానీ అసలు విషయం తెలియదు. చేతికి‌‌ అందివచ్చిన కొడుకులు మృతి చెందటంతో ఆ కార్మికుల‌ కుటుంబాలు తల్లడిల్లిపోతున్నారు. ప్రభుత్వం మృతి చెందిన కార్మిక కుటుబాలను ఆదుకోవాలని కార్మిక సంఘ నాయకులు కోరుతున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Cyber Fraud:మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
Fire Cracker Lorry Catches Fire: హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
Hyderabad Latest News: సమోసాలు కనిపిస్తే ఆగిపోయే వారి కోసమే ఈ న్యూస్! ఆ టేస్ట్ రెసిపీ గుట్టు రట్టు చేసిన పోలీసులు!
సమోసాలు కనిపిస్తే ఆగిపోయే వారి కోసమే ఈ న్యూస్! ఆ టేస్ట్ రెసిపీ గుట్టు రట్టు చేసిన పోలీసులు!
Pradip Guruji: మంచి పనులు చేయడానికి డబ్బుల్లేవని దొంగ నోట్లు ముద్రించాడట - ఈ గురూజీ మామూలోడు కాదు!
మంచి పనులు చేయడానికి డబ్బుల్లేవని దొంగ నోట్లు ముద్రించాడట - ఈ గురూజీ మామూలోడు కాదు!

వీడియోలు

Late Marriage Effect on Women | 40ఏళ్లు దాటినా పెళ్లంటే ఇష్టపడని మహిళలు, ఆరోగ్యంపై ఊహించని ప్రభావం
Harshit Rana Ruled Out IPL 2026 | హర్షిత్ దూరం, పతిరణ రాక ఆలస్యం. కష్టాల్లో కేకేఆర్ | ABP Desam
Laxman Sivaramakrishnan Commentary BCCI | కామెంటరీకి శివరామకృష్ణన్ గుడ్ బై | ABP Desam
SRH Players Injury IPL 2026 Jack Edwards | గాయంతో సన్‌రైజర్స్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం | ABP Desam
MS Dhoni Injured in CSK Practice Camp IPL 2026 | ధోనీ మోకాలి గాయం ? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mid Day Meals Scheme: గరికపాటి వ్యాఖ్యలు బాధాకరం, మధ్యాహ్న భోజనం పేద పిల్లల హక్కు: ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్
గరికపాటి వ్యాఖ్యలు బాధాకరం, మధ్యాహ్న భోజనం పేద పిల్లల హక్కు: ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్
LPG VS PNG: హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
Cyber Fraud:మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
EPFO ​​3.0: పీఎఫ్ విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
PF విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
Bhadrachalam Temple: 3 దశలలో భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధి.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
3 దశలలో భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధి.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Fast Printout: జిరాక్స్ షాప్ వద్ద క్యూ లైన్ ఉందా? QwikPrint మెషిన్ కనిపిస్తే ప్రింటౌట్ తీసుకోండి
జిరాక్స్ షాప్ వద్ద క్యూ లైన్ ఉందా? QwikPrint మెషిన్ కనిపిస్తే ప్రింటౌట్ తీసుకోండి
Andhra Praedesh News: ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
Embed widget