అన్వేషించండి

Peddapalli News: ఏడాదిన్నర కొడుకును బావిలో పడేసిన తండ్రి, వెంటనే ఆత్మహత్యాయత్నం!

Peddapalle News: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి కుమారుడిని చంపి తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాబు చనిపోగా.. ప్రస్తుతం తండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

Peddapalle News: నాన్నతోపాటు బండిపై షికారుకు వెళ్లడమంటే ఇష్టం లేని బుజ్జాయిలు ఎవరు ఉంటారు. అలాగే ఓ తండ్రి ఏడాదిన్నర వయసున్న బాబును బండిపైకి తీసుకోగానే కేరింతలు కొడుతూ మురిసిపోయాడు. బాగా తిప్పి చివరకు పొలంలోకి తీసుకెళ్లాడు. అప్పటి వరకు చేతులతో ఎత్తుకొని గుండెలకు హత్తుకున్న ఆ తండ్రి.. అక్కడే ఉన్న బావిలో బాబును తోసేశాడు. వెంటనే తాను కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఇలా చేసుకున్నట్లు తెలుస్తోంది. 

అసలేం జరిగిందంటే..?

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం రాములపల్లికి చెందిన 30 ఏళ్ల కల్వల తిరుపతి రెడ్డికి మానసతో పెళ్లయింది. వీరిద్దరికీ 17 నెలల వయసున్న కుమారుడు దేవాన్ష్ కూడా ఉన్నాడు. కొన్నేళ్లుగా తిరుపతి రెడ్డికి సోదరుడు రత్నాకర్ రెడ్డికి భూ వివాదాలు ఉన్నాయి. ఈక్రమంలోనే చాలా సార్లు ఆయన బంధువులు తిరుపతిరెడ్డిని, అతడి కుమారుడిని చంపేస్తామని బెదిరించారు. దీంతో బాగా భయపడిపోయిన తిరుపతి రెడ్డి భార్యా, కుమారుడితో కలిసి ఏడాది కాలంగా సుల్తానాబాద్ లో నివాసం ఉంటున్నాడు. అయితే శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతం ఉండడంతో సొంత గ్రామానికి వచ్చారు. అమ్మా, నాన్నలను కలిసి వారితోనే పండుగను జరుపుకున్నారు. అనంతరం ఇంటికి వెళ్లిపోయారు. భార్యను అక్కడే దింపి... బాబును తీసుకొని మరోసారి గ్రామానికి బయలు దేరాడు తిరుపతి రెడ్డి. నేరుగా పొలం వద్దకు వెళ్లి చిన్నారిని బావిలో తోసేశాడు. ఆపై వెంటు తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఎంతకీ ఇంటికి రాకపోవడంతో మామకు ఫోన్ చేసిన మానస

అయితే రాములపల్లికి వెళ్లిన భర్త, కుమారుడు రాత్రి అవుతున్నా రాలేదు. భర్తకు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో భయపడిపోయిన భార్య మానస.. తన మామ సంజీవ రెడ్డికి ఫోన్ చేసింది. భర్త, కుమారుడి గురించి వాకబు చేయగా.. అక్కడకు రాలేదని అతడు చెప్పాడు. మానస అక్కడికే వచ్చారనగా.. వెంటనే ఆయన పొలం వద్దకు వెళ్లి చూశాడు. అయితే అప్పటికే తిరుపతి రెడ్డి బావి వద్ద అపస్మారక స్థితిలో కనిపించాడు. పక్కన బాబు లేకపోవడంతో భయపడిపోయిన సంజీవ రెడ్డి అంతా వెతికాడు. అయినా జాడ లేదు. దీంతో ఓసారి బావిలోకి తొంగి చూడగా.. బాలుడి చెప్పులు కనిపించాయి. వెంటనే సంజీవ రెడ్డి గ్రామస్థులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో అంతా పరుగుపరుగున పొలం వద్దకు చేరుకున్నారు.

భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు

అనంతరం పోలీసులకు విషయం చెప్పగా.. వారు కూడా హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. బావిలోంచి బాలుడిని బయటకు తీశారు. తిరుపతి రెడ్డిని మొదట సుల్తానాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రి, అక్కడి నుంచి కరీంనగర్ లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. తిరుపతి రెడ్డి భార్య మానస ఫిర్యాదు మేరకు రాత్నాకర్ రెడ్డి, అతడి మామ సత్తిరెడ్డి, బావ మరిది లక్ష్మణ్ లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. 

టాప్ హెడ్ లైన్స్

Adilabad Crime News: క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
Arunachalam Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
Jogi Ramesh Latest News:వైసీపీ లీడర్‌, మాజీ మంత్రి జోగి రమేష్‌పై కోడలు పెట్టిన కేసు ఏంటీ? ఏ సెక్షన్ ఏం చెబుతుంది?
వైసీపీ లీడర్‌, మాజీ మంత్రి జోగి రమేష్‌పై కోడలు పెట్టిన కేసు ఏంటీ? ఏ సెక్షన్ ఏం చెబుతుంది?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Embed widget