అన్వేషించండి

Peddapalli News: ఏడాదిన్నర కొడుకును బావిలో పడేసిన తండ్రి, వెంటనే ఆత్మహత్యాయత్నం!

Peddapalle News: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి కుమారుడిని చంపి తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాబు చనిపోగా.. ప్రస్తుతం తండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

Peddapalle News: నాన్నతోపాటు బండిపై షికారుకు వెళ్లడమంటే ఇష్టం లేని బుజ్జాయిలు ఎవరు ఉంటారు. అలాగే ఓ తండ్రి ఏడాదిన్నర వయసున్న బాబును బండిపైకి తీసుకోగానే కేరింతలు కొడుతూ మురిసిపోయాడు. బాగా తిప్పి చివరకు పొలంలోకి తీసుకెళ్లాడు. అప్పటి వరకు చేతులతో ఎత్తుకొని గుండెలకు హత్తుకున్న ఆ తండ్రి.. అక్కడే ఉన్న బావిలో బాబును తోసేశాడు. వెంటనే తాను కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఇలా చేసుకున్నట్లు తెలుస్తోంది. 

అసలేం జరిగిందంటే..?

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం రాములపల్లికి చెందిన 30 ఏళ్ల కల్వల తిరుపతి రెడ్డికి మానసతో పెళ్లయింది. వీరిద్దరికీ 17 నెలల వయసున్న కుమారుడు దేవాన్ష్ కూడా ఉన్నాడు. కొన్నేళ్లుగా తిరుపతి రెడ్డికి సోదరుడు రత్నాకర్ రెడ్డికి భూ వివాదాలు ఉన్నాయి. ఈక్రమంలోనే చాలా సార్లు ఆయన బంధువులు తిరుపతిరెడ్డిని, అతడి కుమారుడిని చంపేస్తామని బెదిరించారు. దీంతో బాగా భయపడిపోయిన తిరుపతి రెడ్డి భార్యా, కుమారుడితో కలిసి ఏడాది కాలంగా సుల్తానాబాద్ లో నివాసం ఉంటున్నాడు. అయితే శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతం ఉండడంతో సొంత గ్రామానికి వచ్చారు. అమ్మా, నాన్నలను కలిసి వారితోనే పండుగను జరుపుకున్నారు. అనంతరం ఇంటికి వెళ్లిపోయారు. భార్యను అక్కడే దింపి... బాబును తీసుకొని మరోసారి గ్రామానికి బయలు దేరాడు తిరుపతి రెడ్డి. నేరుగా పొలం వద్దకు వెళ్లి చిన్నారిని బావిలో తోసేశాడు. ఆపై వెంటు తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఎంతకీ ఇంటికి రాకపోవడంతో మామకు ఫోన్ చేసిన మానస

అయితే రాములపల్లికి వెళ్లిన భర్త, కుమారుడు రాత్రి అవుతున్నా రాలేదు. భర్తకు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో భయపడిపోయిన భార్య మానస.. తన మామ సంజీవ రెడ్డికి ఫోన్ చేసింది. భర్త, కుమారుడి గురించి వాకబు చేయగా.. అక్కడకు రాలేదని అతడు చెప్పాడు. మానస అక్కడికే వచ్చారనగా.. వెంటనే ఆయన పొలం వద్దకు వెళ్లి చూశాడు. అయితే అప్పటికే తిరుపతి రెడ్డి బావి వద్ద అపస్మారక స్థితిలో కనిపించాడు. పక్కన బాబు లేకపోవడంతో భయపడిపోయిన సంజీవ రెడ్డి అంతా వెతికాడు. అయినా జాడ లేదు. దీంతో ఓసారి బావిలోకి తొంగి చూడగా.. బాలుడి చెప్పులు కనిపించాయి. వెంటనే సంజీవ రెడ్డి గ్రామస్థులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో అంతా పరుగుపరుగున పొలం వద్దకు చేరుకున్నారు.

భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు

అనంతరం పోలీసులకు విషయం చెప్పగా.. వారు కూడా హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. బావిలోంచి బాలుడిని బయటకు తీశారు. తిరుపతి రెడ్డిని మొదట సుల్తానాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రి, అక్కడి నుంచి కరీంనగర్ లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. తిరుపతి రెడ్డి భార్య మానస ఫిర్యాదు మేరకు రాత్నాకర్ రెడ్డి, అతడి మామ సత్తిరెడ్డి, బావ మరిది లక్ష్మణ్ లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. 

టాప్ హెడ్ లైన్స్

Bengaluru Daycare Child Abuse: బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Nalgonda Road Accident: హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
Ongole Crime News: టూర్‌కు వెళ్లిన ఫ్యామిలీ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
ఒంగోలులో ఓ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
Instagram Reel: రీల్స్ పిచ్చి కొంపముంచింది! వజ్రాల నెక్లెస్ దొంగిలించి ఇన్‌స్టాగ్రామ్‌ రీల్ చేసిన పనిమనిషి.. ఏడాది తర్వాత సీన్ రివర్స్!
రీల్స్ పిచ్చి కొంపముంచింది! వజ్రాల నెక్లెస్ దొంగిలించి ఇన్‌స్టాగ్రామ్‌ రీల్ చేసిన పనిమనిషి.. ఏడాది తర్వాత సీన్ రివర్స్!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Tata Tiago EV on Discount: దేశంలో అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
Chicken Leg Roast : నోరూరించే చికెన్ లెగ్ రోస్ట్ రెసిపీ, ఈ మసాలాతో టేస్ట్ డబుల్.. అన్నం, రోటీతో అదిరిపోతుందంతే
నోరూరించే చికెన్ లెగ్ రోస్ట్ రెసిపీ, ఈ మసాలాతో టేస్ట్ డబుల్.. అన్నం, రోటీతో అదిరిపోతుందంతే
Embed widget