అన్వేషించండి

ఆరు కోట్లు దోచుకెళ్లారు- వంద రూపాయలు పేటీఎం చేసి దొరికేశారు!

దిల్లీలో జరిగిన చోరీ కేసులో నిందితులను పేటీఎం ట్రాన్సాక్షన్ పట్టించింది. పోలీసుల నిందితుల నుంచి దొంగలించిన సొమ్మంతా స్వాధీనం చేసుకున్నారు. 

కొందరు దొంగలు ఎంతో చాక చక్యంగా దొంగతనం చేస్తారు. పక్కా ప్లానింగ్ రూపొందిస్తారు. పకడ్బందీ వ్యూహంతో చోరీకి పాల్పడతారు. కానీ వారు చేసే చిన్న పొరపాటు, విడిచి పెట్టే చిన్న క్లూ వారిని పట్టిస్తుంది. నేర్పుగా దొంగతనం చేశామని సంతోషంగా ఉండగా.. హ్యాండ్సప్  అంటూ పోలీసులు దిగిపోతారు. అచ్చం అలాంటి ఘటనే జరిగింది రాజస్థాన్ లో జరిగింది. దిల్లీ పోలీసులు ముగ్గురు దొంగలను పట్టుకున్నారు. వారి నుంచి సుమారు రూ.6 కోట్ల విలువైన బంగారు, వెండి, వజ్రాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. 

అసలేం జరిగింది..?

అది దిల్లీ. ఇద్దరు వ్యక్తులు ఓ జ్యూవెలరీలో పని చేస్తుంటారు. వారి పనిలో భాగంగా.. బంగారు నగలు, వెండి నగలు, వజ్రాలు ఉన్న పార్శిల్ పట్టుకుని వెళ్తున్నారు. ఉదయం 4 గంటల సమయంలో డీబీజీ రోడ్డు వైపునకు వెళ్తున్నారు. మిలీనియం హోటల్ వద్దకు రాగానే వారికి ఓ ఇద్దరు వ్యక్తులు కనిపించారు. అందులో ఒక వ్యక్తి పోలీసులు యూనిఫాం వేసుకున్నాడు. నగల పార్శిల్ పట్టుకుని వెళ్తున్న ఆ ఇద్దరిని వారు ఆపారు. వారితో మాట్లాడుతుండగానే మరో ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చారు. మాట్లాడుతున్న సమయంలోనే ఒక్కసారిగా యూనిఫాం వేసుకున్న వ్యక్తి, తనతోపాటు వారి కళ్లల్లో కారం చల్లారు. వారి చేతిలో ఉన్న పార్శిల్ బ్యాగును ఇవ్వాలని లేకపోతే చంపేస్తామని బెదిరించారు. వారి భయపడి నగలు ఉన్న పార్శిల్ బ్యాగును వారికి ఇచ్చారు. వెంటనే ఆ నలుగురు దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. 

700 సీసీటీవీ కెమెరాలతో అన్వేషణ..!

దొంగతనం గురించి పోలీసులకు ఫిర్యాదు అందింది. వెంటనే పలు బృందాలు ఏర్పాటు చేసి దొంగల గురించి వెతకడం ప్రారంభించారు. లూటీకి సంబంధించిన దృశ్యాలు దగ్గర్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు పోలీసులు. రోజులు గడుస్తున్నాయి. కానీ దొంగలకు సంబంధించి ఎలాంటి క్లూ దొరకలేదు. అప్పటికే 7 రోజులు అయ్యాయి. దాదాపు 700 సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు పోలీసులు. ఒక ఫుటేజీలో నిందితులను గుర్తించారు పోలీసులు. వారు ఒక క్యాబ్ దగ్గర కాసేపు ఉన్నట్లు గమనించారు. ఆ క్యాబ్ డ్రైవర్‌ను పట్టుకుని ప్రశ్నించారు. వాళ్లు టీ తాగడం కోసం తనకు పేటీఎం ద్వారా రూ. 100 పంపించారని.. వారికి తను రూ. 100 నగదు ఇచ్చానని ఆ క్యాబ్ డ్రైవర్ పోలీసులు చెప్పాడు. 

పట్టించిన పేటీఎం లావాదేవీ..!

పేటీఎం నుంచి నిందితులు పంపించిన ట్రాన్సాక్షన్ ను విశ్లేషించడం ప్రారంభించారు పోలీసులు. అది ఏ బ్యాంకు ఖాతాకు లింక్ అయి ఉందో తెలుసుకున్నారు. ఆ బ్యాంకు ఖాతా తీసుకునే సమయంలో ఇచ్చిన అడ్రస్, ఫోన్ నంబరు, ఆ ఖాతాతో లింకు అయిన ఉన్న ఆధార్ కార్డు వివరాలు సేకరించారు. వారంత రాజస్థాన్ కు చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు అక్కడికి వెళ్లిన నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి 6,270 గ్రాముల బంగారం, మూడు కిలోల వెండి, 500 గ్రాముల గోల్డ్ డిపాజిట్లు, 106 ముడి వజ్రాలు స్వాధీనం చేసుకున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
Adilabad Crime News: క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Blood Pressure Tablets : బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
Tollywood Stars Injured: జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
Tammineni Sitaram Forgery Case: తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
Karur Stampede Victims Jobs Case : సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
Jr NTR Shoulder Injury : ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Bonda Uma Issue: బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
Vallabhaneni Vamsi To Meet CM Chandrababu: చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
Embed widget