అన్వేషించండి

Nizamabad News : నిజామాబాద్ జిల్లాలో దారుణం, ప్రేమించలేదని యువతి గొంతు కోసిన యువకుడు

Nizamabad News : ప్రేమ పేరుతో వేధిస్తున్న ఓ యువకుడు యువతి గొంతుకోసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం ఈ దారుణం చోటుచేసుకుంది.

Nizamabad News : నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. తనను ప్రేమించడంలేదని ఓ యువతిపై కత్తితో దాడి చేశాడు దగ్గరి బంధువు. ప్రేమించడం లేదని యువతి గొంతు కోసిన ఘటన శనివారం వెలుగుచూసింది. నిజామాబాద్ జిల్లా మొపాల్ మండలం భాడ్సి చిన్నాపూర్ గ్రామంలో ఈ దారుణం జరిగింది. చిన్నపూర్ కు చెందిన యువతికి మాక్లూర్ మండలం మాణిక్ బండారుకు చెందిన సుంకరి సంజయ్ కుమార్ దూరపు బంధువు. సంజయ్ తనను ప్రేమించాలని యువతిని కొంతకాలంగా వేధిస్తున్నాడు. శుక్రవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో యువతి ఇంటికి వచ్చిన సంజయ్ ఆమెతో గొడవపడి గొంతు కోశాడు. యువతి రోడ్డుపై అరుపులు, కేకలు వేయడంతో సంజయ్ పారిపోయాడు. వెంటనే స్పందించిన స్థానికులు యువతిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువతి బంధువుల ఫిర్యాదుతో పోలీసులు సంజయ్ ను అరెస్టు చేశారు. యువతికి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. 

కత్తులు, పారతలో దాడి 

 శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలోని అంతరకుడ్డ గ్రామంలో రాత్రి ఉద్రిక్తత నెలకొంది. తొలుత టీడీపీ వర్గీయులపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. టీడీపీకి చెందిన పలువురు వ్యక్తులు గొర్రెల శాలలో ఉండగా.. కత్తులు, పారలతో వచ్చిన వైసీపీ వర్గీయులు దాడి చేశారు. విషయం గ్రహించిన తెదేపా కార్యకర్తలు కూడా ఎదురు దాడికి దిగారు. ఒకరినొకరు ఇష్టం వచ్చినట్లుగా కొట్టుకున్నారు. ఘటన జరుగతున్న ప్రాంతమంతా రక్తమోడుతున్న పట్టించుకోకుండా ప్రణాల మీదకు తెచ్చుకున్నారు. ఈ ఘటనలో మొత్తం ఏరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

రణరంగంగా మారిన గొర్రెల శాల..

పోలీసు లు, గ్రామస్థుల వివరాల మేరకు.. అంతరకుడ్డ గ్రామంలో టీడీపీకి చెందిన వంకల కృష్ణమూర్తి, ఆయన కుమారులు వంకల లక్ష్మణ రావు, వంకల గోపి తమకు చెందిన గొర్రెల శాలలో జీవాలను కట్టేస్తుండగా వైసీపీకి చెందిన దుబ్బ శ్రావణ్, దుబ్బ ధర్మారావు, దుబ్బ శరత్, పీత అప్పయ్య, పీత లక్ష్మణ రావు కత్తులు, పారలు తీసుకుని వచ్చి దాడులు చేశారు. అనంతరం టీడీపీ కార్యకర్తలు కూడా ప్రతిదాడి చేశారు. దీంతో టీడీపీకి చెందిన లక్ష్మణరావు ఎడమ చేయి విరిగిపోయింది. గోపి, కృష్ణమూర్తికు తీవ్ర గాయాలయ్యాయి. వైసీపీకి చెందిన దుబ్బకు, పీత అప్పయ్య, దుబ్బ శ్రావణ్, దుబ్బ శరత్ తల, చేతిపై గాయాలయ్యాయి. విపరీతమైన శబ్దాలు రావడంతో స్థానిక ప్రజలంతా వారి గొడవను ఆపారు. అయితే ఈ ఘటనలో గాయపడ్డ వారందరినీ వెంటనే పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. టీడీపీకి చెందిన లక్ష్మణరావు, గోపి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో శ్రీకాకుళం తరలించారు. పాతకక్షలతో తమ కుటుంబాన్ని అంతమొందించేందుకే వైసీపీ వర్గీయులు కత్తులు, పారలతో దాడి చేశారని టీడీపీ వర్గీయులు చెబుతున్నారు. కాగా వీరిరువురి మధ్య నాలుగు నెలల క్రితం గొర్రెల మంద వ్యవహారంలో ఘర్షణ జరిగింది. 

తమ గొర్రెల మందలో కలసిపోతు న్నాయంటూ ఇరు వర్గాలు తగాదా పడ్డారు. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. అంతటితో ఆగకుండా తరచుగా గొడవలు పడుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ వర్హీయులు పథకం ప్రకారం దాడి చేశారు. తెదేపా వర్గీయులు కూడా ప్రతిదాడి చేయడంతో అందరూ గాయపడ్డారు. ఏఢుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి మరీ ఆందోళన కరంగా ఉంది.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Srikakulam Stampede News:
"తిరుమలపై అలిగి కట్టిన ప్రైవేటు గుడి" కాశీబుగ్గ ఆలయంపై దేవాదాయశాఖ వివరణ
Visakhapatanam Crime News: నా మీద జాలి లేదా పట్టించుకోవా! శృతిమించిన లెక్చరర్‌ చాటింగ్- విశాఖ డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య కేసులో కొత్త కోణం
నా మీద జాలి లేదా పట్టించుకోవా! శృతిమించిన లెక్చరర్‌ చాటింగ్- విశాఖ డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య కేసులో కొత్త కోణం
Jubilee Hills by-election: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో ప్రచార హోరు- మాటల తూటాలతో బస్తీలను చుట్టేస్తున్న ముఖ్యులు
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో ప్రచార హోరు- మాటల తూటాలతో బస్తీలను చుట్టేస్తున్న ముఖ్యులు
Konaseema Crime News: కోనసీమలో బాలికలపై స్కూల్ పీఈటీ దారుణం; జనసేనకు లింక్ ఏంటి? షాకింగ్ నిజాలు!
కోనసీమలో బాలికలపై స్కూల్ పీఈటీ దారుణం; జనసేనకు లింక్ ఏంటి? షాకింగ్ నిజాలు!
Advertisement

వీడియోలు

Aus vs Ind 2nd T20 Match Highlights | ఆసీస్ తో రెండో టీ20 లో ఓడిన టీమిండియా | ABP Desam
వేస్ట్ కెప్టెన్ పీకేయాలి అన్నారు.. అవసరమైన చోట అదరగొట్టేసింది..!
ఏసయ్యే నన్ను నడిపించాడు.. విక్టరీ తర్వాత కన్నీళ్లతో జెమీమా
ఫైటింగ్ సెంచరీతో ఫైనల్ బెర్త్ తెచ్చింది..  పిచ్ మీద పడి చిన్నపిల్లలా ఏడ్చింది
పనికిరాదని పక్కన కూర్చోబెట్టారు.. పోరాడి ఫైనల్‌కి తీసుకెళ్ళింది
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Srikakulam Stampede News:
"తిరుమలపై అలిగి కట్టిన ప్రైవేటు గుడి" కాశీబుగ్గ ఆలయంపై దేవాదాయశాఖ వివరణ
Visakhapatanam Crime News: నా మీద జాలి లేదా పట్టించుకోవా! శృతిమించిన లెక్చరర్‌ చాటింగ్- విశాఖ డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య కేసులో కొత్త కోణం
నా మీద జాలి లేదా పట్టించుకోవా! శృతిమించిన లెక్చరర్‌ చాటింగ్- విశాఖ డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య కేసులో కొత్త కోణం
Jubilee Hills by-election: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో ప్రచార హోరు- మాటల తూటాలతో బస్తీలను చుట్టేస్తున్న ముఖ్యులు
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో ప్రచార హోరు- మాటల తూటాలతో బస్తీలను చుట్టేస్తున్న ముఖ్యులు
Konaseema Crime News: కోనసీమలో బాలికలపై స్కూల్ పీఈటీ దారుణం; జనసేనకు లింక్ ఏంటి? షాకింగ్ నిజాలు!
కోనసీమలో బాలికలపై స్కూల్ పీఈటీ దారుణం; జనసేనకు లింక్ ఏంటి? షాకింగ్ నిజాలు!
Amalapuram Crime News:వశిష్ట గోదావరిలో డెడ్‌బాడీ- మృతుడి చేతిపై డైరెక్టర్ సుకుమార్ టాటూ!
వశిష్ట గోదావరిలో డెడ్‌బాడీ- మృతుడి చేతిపై డైరెక్టర్ సుకుమార్ టాటూ!
విస్కీ vs స్కాచ్: రెండింటి మధ్య తేడా తెలుసా? | స్కాచ్ విస్కీ ప్రత్యేకత, తయారీ విధానం, నియమాలు
స్కాచ్ విస్కీకి, మామూలు విస్కీకి మధ్య తేడాలు తెలుసా? స్కాచ్ ఎందుకు అంత ప్రత్యేకమైనది?
Itlu Me Yedhava Trailer : ఎదవను లవ్ చేసిన అమ్మాయి - టైటిల్ మాత్రమే కాదు... 'ఇట్లు మీ ఎదవ' ట్రైలర్ కూడా డిఫరెంటే...
ఎదవను లవ్ చేసిన అమ్మాయి - టైటిల్ మాత్రమే కాదు... 'ఇట్లు మీ ఎదవ' ట్రైలర్ కూడా డిఫరెంటే...
Ajith Kumar : 'విజయ్'ది మాత్రమే తప్పు కాదు - కరూర్ తొక్కిసలాట ఘటనపై తమిళ స్టార్ అజిత్ రియాక్షన్
'విజయ్'ది మాత్రమే తప్పు కాదు - కరూర్ తొక్కిసలాట ఘటనపై తమిళ స్టార్ అజిత్ రియాక్షన్
Embed widget