అన్వేషించండి

Nellore Murders: హోటల్ ఓనర్ దంపతుల దారుణ హత్య, ఇంట్లోనే గొంతుకోసి మరీ - బంగారం అంతా అక్కడే కానీ

నెల్లూరు నగరంలో జంట హత్యలు కలకలం రేపాయి. స్థానికంగా హోటల్ నిర్వహించే వాసిరెడ్డి కృష్ణారావు, అతని భార్య సునీత తెల్లవారే సరికి రక్తపు మడుగులో పడి మృతి చెందారు.

నెల్లూరు నగరంలో జంట హత్యలు కలకలం రేపాయి. స్థానికంగా హోటల్ నిర్వహించే వాసిరెడ్డి కృష్ణారావు, అతని భార్య సునీత తెల్లవారే సరికి రక్తపు మడుగులో పడి మృతి చెందారు. ఇంట్లో బంగారం అక్కడే ఉంది. కేవలం నగదు పోయిందని ఆయన కుమారుడు పోలీసులకు తెలిపాడు. 25 సంవత్సరాల క్రితం వీరు నెల్లూరు నగరానికి వచ్చి స్థిరపడ్డారని తెలుస్తోంది. నెల్లూరు నగరంలోని అశోక్ నగర్ లో సొంత ఇంటిలో వీరు నివసిస్తున్నారు. కరెంట్ ఆఫీస్ సెంటర్ లో శ్రీరామా క్యాంటీన్ నడుపుతుంటారు. హత్య జరిగిన ప్రదేశంలో కత్తి, కర్రను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు విచారణ మొదలు పెట్టారు. 

దొంగలు చేసిన పనేనా..?
అది మరీ నిర్మానుష్య ప్రాంతం కాదు, అలాగని ఎప్పుడూ జనసంచారం ఉండే రద్దీ ఏరియా కూడా కాదు. పడారుపల్లి అశోక్ నగర్ లో భార్యా భర్తలు మాత్రమే ఉంటున్నారు. ఉదయాన్నే హోటల్ కి వచ్చే భార్యా భర్తలు, ఎంతకీ రాకపోయే సరికి హోటల్ లో పనిచేసేవారు ఫోన్ చేశారు. ఫోన్ తీయకపోవడంతో అనుమానం వచ్చింది. ఇంతలో పాలు పోసే మహిళ ఇంటికి రాగా.. గేటు దగ్గరే కృష్ణారావు విగతజీవిగా పడి ఉన్నాడు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆయన్ను చూసి భయపడిపోయిన కృష్ణారావు సోదరుడు సుధాకర్ రావుకి సమాచారమిచ్చారు. సుధాకర్ రావు పోలీసులకు ఫోన్ చేయడంతో.. నెల్లూరు ఫిఫ్త్ టౌన్ సీఐ నరసింహారావు బృందం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుంది.

ఇంటి బయట కృష్ణారావు విగత జీవిగా ఉన్నాడు. ఇంటి లోపలికి వెళ్లి చూడగా అక్కడ బెడ్ రూమ్ లో ఆయన భార్య సునీత చనిపోయి ఉంది. వెంటనే కృష్ణారావు పెద్ద కుమారుడు సాయిచంద్, చిన్న కుమారుడు గోపీచంద్ కి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. సాయిచంద్ విశాఖపట్నంలో పోస్టల్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్నారు. గోపీచంద్ నెల్లూరులోనే ఉంటున్నారు. గోపీచంద్, అతని భార్య ఇద్దరూ అశోక్ నగర్ వచ్చారు. ఇంటిలో నగదు పోయిందని కొడుకు గోపీచంద్ చెబుతున్నాడు. క్యాంటీన్ లో వచ్చే డైలీ కలెక్షన్ ఇంటికి తెచ్చి పెడుతుంటారని, ఆ నగదు కనిపించడంలేదని చెబుతున్నాడు కొడుకు గోపీచంద్.

అయితే ఇంట్లో ఉన్న బంగారు నగలు మాత్రం అక్కడే ఉన్నాయి. ఒకవేళ దుండగులు అన్ని రూమ్ లు వెతకలేదా, అలోగా కృష్ణారావు రావడంతో బయటకొచ్చారా అనేది విచారణలో తేలుతుందని చెబుతున్నారు పోలీసులు. ప్రస్తుతానికి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. 

కృష్ణా జిల్లా నుంచి వచ్చి..
కృష్ణాజిల్లా వత్సవాయి మండలం, ఇందుగుపల్లి గ్రామం నుంచి కృష్ణారావు కుటుంబం పాతికేళ్ల క్రితం నెల్లూరుకు వలస వచ్చింది. అప్పటినుంచి ఇప్పటి వరకు ఇక్కడే ఉంటున్నారు. సొంత ఇల్లు కట్టుకున్నారు, ఇక్కడే వ్యాపారం బాగుండటంతో స్థిరపడిపోయారు. తీరా ఇద్దరూ ఇక్కడే హత్యకు గురికావడం విశేషం. 

టాప్ హెడ్ లైన్స్

Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం

వీడియోలు

Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Embed widget