అన్వేషించండి

Nellore Murders: హోటల్ ఓనర్ దంపతుల దారుణ హత్య, ఇంట్లోనే గొంతుకోసి మరీ - బంగారం అంతా అక్కడే కానీ

నెల్లూరు నగరంలో జంట హత్యలు కలకలం రేపాయి. స్థానికంగా హోటల్ నిర్వహించే వాసిరెడ్డి కృష్ణారావు, అతని భార్య సునీత తెల్లవారే సరికి రక్తపు మడుగులో పడి మృతి చెందారు.

నెల్లూరు నగరంలో జంట హత్యలు కలకలం రేపాయి. స్థానికంగా హోటల్ నిర్వహించే వాసిరెడ్డి కృష్ణారావు, అతని భార్య సునీత తెల్లవారే సరికి రక్తపు మడుగులో పడి మృతి చెందారు. ఇంట్లో బంగారం అక్కడే ఉంది. కేవలం నగదు పోయిందని ఆయన కుమారుడు పోలీసులకు తెలిపాడు. 25 సంవత్సరాల క్రితం వీరు నెల్లూరు నగరానికి వచ్చి స్థిరపడ్డారని తెలుస్తోంది. నెల్లూరు నగరంలోని అశోక్ నగర్ లో సొంత ఇంటిలో వీరు నివసిస్తున్నారు. కరెంట్ ఆఫీస్ సెంటర్ లో శ్రీరామా క్యాంటీన్ నడుపుతుంటారు. హత్య జరిగిన ప్రదేశంలో కత్తి, కర్రను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు విచారణ మొదలు పెట్టారు. 

దొంగలు చేసిన పనేనా..?
అది మరీ నిర్మానుష్య ప్రాంతం కాదు, అలాగని ఎప్పుడూ జనసంచారం ఉండే రద్దీ ఏరియా కూడా కాదు. పడారుపల్లి అశోక్ నగర్ లో భార్యా భర్తలు మాత్రమే ఉంటున్నారు. ఉదయాన్నే హోటల్ కి వచ్చే భార్యా భర్తలు, ఎంతకీ రాకపోయే సరికి హోటల్ లో పనిచేసేవారు ఫోన్ చేశారు. ఫోన్ తీయకపోవడంతో అనుమానం వచ్చింది. ఇంతలో పాలు పోసే మహిళ ఇంటికి రాగా.. గేటు దగ్గరే కృష్ణారావు విగతజీవిగా పడి ఉన్నాడు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆయన్ను చూసి భయపడిపోయిన కృష్ణారావు సోదరుడు సుధాకర్ రావుకి సమాచారమిచ్చారు. సుధాకర్ రావు పోలీసులకు ఫోన్ చేయడంతో.. నెల్లూరు ఫిఫ్త్ టౌన్ సీఐ నరసింహారావు బృందం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుంది.

ఇంటి బయట కృష్ణారావు విగత జీవిగా ఉన్నాడు. ఇంటి లోపలికి వెళ్లి చూడగా అక్కడ బెడ్ రూమ్ లో ఆయన భార్య సునీత చనిపోయి ఉంది. వెంటనే కృష్ణారావు పెద్ద కుమారుడు సాయిచంద్, చిన్న కుమారుడు గోపీచంద్ కి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. సాయిచంద్ విశాఖపట్నంలో పోస్టల్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్నారు. గోపీచంద్ నెల్లూరులోనే ఉంటున్నారు. గోపీచంద్, అతని భార్య ఇద్దరూ అశోక్ నగర్ వచ్చారు. ఇంటిలో నగదు పోయిందని కొడుకు గోపీచంద్ చెబుతున్నాడు. క్యాంటీన్ లో వచ్చే డైలీ కలెక్షన్ ఇంటికి తెచ్చి పెడుతుంటారని, ఆ నగదు కనిపించడంలేదని చెబుతున్నాడు కొడుకు గోపీచంద్.

అయితే ఇంట్లో ఉన్న బంగారు నగలు మాత్రం అక్కడే ఉన్నాయి. ఒకవేళ దుండగులు అన్ని రూమ్ లు వెతకలేదా, అలోగా కృష్ణారావు రావడంతో బయటకొచ్చారా అనేది విచారణలో తేలుతుందని చెబుతున్నారు పోలీసులు. ప్రస్తుతానికి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. 

కృష్ణా జిల్లా నుంచి వచ్చి..
కృష్ణాజిల్లా వత్సవాయి మండలం, ఇందుగుపల్లి గ్రామం నుంచి కృష్ణారావు కుటుంబం పాతికేళ్ల క్రితం నెల్లూరుకు వలస వచ్చింది. అప్పటినుంచి ఇప్పటి వరకు ఇక్కడే ఉంటున్నారు. సొంత ఇల్లు కట్టుకున్నారు, ఇక్కడే వ్యాపారం బాగుండటంతో స్థిరపడిపోయారు. తీరా ఇద్దరూ ఇక్కడే హత్యకు గురికావడం విశేషం. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Husband plans to murder his wife: రోడ్డు ప్రమాదం స్కెచ్‌తో భార్యను చంపేశాడు - కానీ బస్సు డాష్ క్యామ్ పట్టించేసింది!
రోడ్డు ప్రమాదం స్కెచ్‌తో భార్యను చంపేశాడు - కానీ బస్సు డాష్ క్యామ్ పట్టించేసింది!
Khammam Crime News: భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
Anakapalli Crime News: అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
Kamareddy crime News: కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
గూగుల్‌ నోట్ బుక్‌ ఎల్‌ఎమ్‌లో అద్భుతమైన ఫీచర‌-గంటల పని నిమిషాల్లోనే పూర్తి!
గూగుల్‌ నోట్ బుక్‌ ఎల్‌ఎమ్‌లో అద్భుతమైన ఫీచర‌-గంటల పని నిమిషాల్లోనే పూర్తి!
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Jana Nayagan : జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
Stock Market 9 March: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
Embed widget