అన్వేషించండి

Nellore News : మద్యం మత్తులో పెద్దగా కేకలు, వద్దన్నందుకు ఇంటి ఓనర్ ను హత్య చేసిన వ్యక్తి

Nellore News : నెల్లూరు జిల్లాలో ఓనర్ పై దాడి చేసి హత్యచేశాడో వ్యక్తి. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి యజమానిపై దాడి చేసిన హత్యచేశాడు.

Nellore News : నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఇంటి ఓనర్ ను హత్య చేశాడో వ్యక్తి. ఇంట్లో అద్దెకు ఉంటున్న రాజశేఖర్ అనే వ్యక్తి ఓబులేసును హత్య చేశాడు. రాజశేఖర్ మద్యం సేవించి ఇంటికి వచ్చి పెద్దగా కేకలు వేయడంతో అలా ఎందుకు అరుస్తున్నావని ఇంటి ఓనర్ ప్రశ్నించాడు. దీంతో రాజశేఖర్ అతనితో ఘర్షణకు దిగి దాడి చేసి హత్యకు పాల్పడ్డాడు. ఐదు నెలల క్రితం ఓబులేసు ఇంట్లో రాజశేఖర్ అద్దెకు దిగినట్లు తెలుస్తోంది. రాజశేఖర్ వేధింపులు తాళలేక అతడి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. మద్యానికి బానిసైన రాజశేఖర్ రోజు తాగి పెద్దగా అరుస్తుండడంతో ఇంటి యజమాని ఓబులేసు అడిగినందుకు అతడిపై దాడిచేసి అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న కుటుంబ సభ్యులు, ఒకరు  మృతి

ఆస్తి పంపకాలలో తేడా రావడంతో సొంత అన్నదమ్ములు ఇటుకలు, కర్రలతో దాడి చేసుకున్న సంఘటన హైదరాబాద్ మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ దాడిలో అబ్దుల్లా అనే వ్యక్తి సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శమ్మ కాలనీలో నివాసం ఉంటున్న మసూద్ అనే వ్యక్తికి  అబ్దుల్లా, మహమ్మద్, ముణిర్, జహూర్, ఫసి, మోహిన్ అనే ఆరుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కొంతకాలంగా తండ్రి కుమారుల మధ్య ఆస్తి పంపకాల వివాదాలు కొనసాగుతున్నడంతో మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఇది ఇలా ఉండగా గురువారం రోజు తిరిగి ఆస్తి పంపకాల విషయమై తండ్రికి కుమారులకు వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఒకరిపై ఒకరు కర్రలు ఇటుకలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ ప్రమాదంలో జహుర్, అబ్దుల్లాకు తీవ్ర గాయాలయ్యాయి. గొడవ జరుగుతుందన్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లే వరకు పోలీసుల ముందే ఒకరిపై ఒకరు విచక్షణ రహితంగా దాడి చేసుకున్నారు. వీరిలో తీవ్ర గాయాల పాలైన అబ్దుల్లా మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మైలర్ దేవ్ పల్లి పోలీసులు అబ్దుల్లా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

 పోలీసుల భయంతో పారిపోతూ గుండెపోటుతో వ్యక్తి మృతి
 
ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని పెద్ద చెరువు సమీపంలో పేకాట శిబిరం నుంచి పరుగులు తీస్తున్న చికెన్ వ్యాపారి షేక్ అబ్బాస్(37) గుండెపోటుతో మృతి చెందాడు.  గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పట్టణ పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసులను చూసి పేకాటరాయుళ్లు పరుగులు తీశారు. షేక్ అబ్బాస్ కుడా వారితోపాటు పరుగెడుతూ గుండెపోటు వచ్చి అక్కడికక్కడే కూలిపోయాడు. అతడిని పోలీసులు జీపులో నూజివీడు ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.  ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 
విషయం తెలుసుకున్న మృతుడి బంధువులు గురువారం రాత్రి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసులు దాడి చేయడంతోనే  అబ్బాస్ మృతి చెందినట్లు బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

 

టాప్ హెడ్ లైన్స్

Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Uday Krishna Reddy Arrest: పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
BCCI Coaching Sack: టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
Embed widget