అన్వేషించండి

Nellore News : మద్యం మత్తులో పెద్దగా కేకలు, వద్దన్నందుకు ఇంటి ఓనర్ ను హత్య చేసిన వ్యక్తి

Nellore News : నెల్లూరు జిల్లాలో ఓనర్ పై దాడి చేసి హత్యచేశాడో వ్యక్తి. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి యజమానిపై దాడి చేసిన హత్యచేశాడు.

Nellore News : నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఇంటి ఓనర్ ను హత్య చేశాడో వ్యక్తి. ఇంట్లో అద్దెకు ఉంటున్న రాజశేఖర్ అనే వ్యక్తి ఓబులేసును హత్య చేశాడు. రాజశేఖర్ మద్యం సేవించి ఇంటికి వచ్చి పెద్దగా కేకలు వేయడంతో అలా ఎందుకు అరుస్తున్నావని ఇంటి ఓనర్ ప్రశ్నించాడు. దీంతో రాజశేఖర్ అతనితో ఘర్షణకు దిగి దాడి చేసి హత్యకు పాల్పడ్డాడు. ఐదు నెలల క్రితం ఓబులేసు ఇంట్లో రాజశేఖర్ అద్దెకు దిగినట్లు తెలుస్తోంది. రాజశేఖర్ వేధింపులు తాళలేక అతడి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. మద్యానికి బానిసైన రాజశేఖర్ రోజు తాగి పెద్దగా అరుస్తుండడంతో ఇంటి యజమాని ఓబులేసు అడిగినందుకు అతడిపై దాడిచేసి అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న కుటుంబ సభ్యులు, ఒకరు  మృతి

ఆస్తి పంపకాలలో తేడా రావడంతో సొంత అన్నదమ్ములు ఇటుకలు, కర్రలతో దాడి చేసుకున్న సంఘటన హైదరాబాద్ మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ దాడిలో అబ్దుల్లా అనే వ్యక్తి సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శమ్మ కాలనీలో నివాసం ఉంటున్న మసూద్ అనే వ్యక్తికి  అబ్దుల్లా, మహమ్మద్, ముణిర్, జహూర్, ఫసి, మోహిన్ అనే ఆరుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కొంతకాలంగా తండ్రి కుమారుల మధ్య ఆస్తి పంపకాల వివాదాలు కొనసాగుతున్నడంతో మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఇది ఇలా ఉండగా గురువారం రోజు తిరిగి ఆస్తి పంపకాల విషయమై తండ్రికి కుమారులకు వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఒకరిపై ఒకరు కర్రలు ఇటుకలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ ప్రమాదంలో జహుర్, అబ్దుల్లాకు తీవ్ర గాయాలయ్యాయి. గొడవ జరుగుతుందన్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లే వరకు పోలీసుల ముందే ఒకరిపై ఒకరు విచక్షణ రహితంగా దాడి చేసుకున్నారు. వీరిలో తీవ్ర గాయాల పాలైన అబ్దుల్లా మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మైలర్ దేవ్ పల్లి పోలీసులు అబ్దుల్లా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

 పోలీసుల భయంతో పారిపోతూ గుండెపోటుతో వ్యక్తి మృతి
 
ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని పెద్ద చెరువు సమీపంలో పేకాట శిబిరం నుంచి పరుగులు తీస్తున్న చికెన్ వ్యాపారి షేక్ అబ్బాస్(37) గుండెపోటుతో మృతి చెందాడు.  గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పట్టణ పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసులను చూసి పేకాటరాయుళ్లు పరుగులు తీశారు. షేక్ అబ్బాస్ కుడా వారితోపాటు పరుగెడుతూ గుండెపోటు వచ్చి అక్కడికక్కడే కూలిపోయాడు. అతడిని పోలీసులు జీపులో నూజివీడు ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.  ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 
విషయం తెలుసుకున్న మృతుడి బంధువులు గురువారం రాత్రి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసులు దాడి చేయడంతోనే  అబ్బాస్ మృతి చెందినట్లు బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Medchal Crime News: ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
Guntur Railway Station: గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
DGCA Committee Report: ఇండిగో విమానాలు ఎందుకు రద్దు అయ్యాయి? ప్రభుత్వానికి చేరిన DGCA కమిటీ నివేదిక!
ఇండిగో విమానాలు ఎందుకు రద్దు అయ్యాయి? ప్రభుత్వానికి చేరిన DGCA కమిటీ నివేదిక!
శాంసంగ్‌ ఫోల్డ్‌బుల్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌- లక్షరూపాయల ఫోన్‌పై 65000 తగ్గింపు
శాంసంగ్‌ ఫోల్డ్‌బుల్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌- లక్షరూపాయల ఫోన్‌పై 65000 తగ్గింపు

వీడియోలు

Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam
World Cup 2026 Squad BCCI Selectors | బీసీసీఐపై మాజీ కెప్టెన్ ఫైర్
Trolls on Gambhir about Rohit Form | గంభీర్ ను టార్గెట్ చేసిన హిట్ మ్యాన్ ఫ్యాన్స్
Ashwin about Shubman Gill T20 Career | మాజీ ప్లేయర్ అశ్విన్ సంచలన కామెంట్స్
India vs Sri Lanka 3rd T20 | నేడు భారత్‌, శ్రీలంక మూడో టీ20

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Medchal Crime News: ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
Guntur Railway Station: గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
DGCA Committee Report: ఇండిగో విమానాలు ఎందుకు రద్దు అయ్యాయి? ప్రభుత్వానికి చేరిన DGCA కమిటీ నివేదిక!
ఇండిగో విమానాలు ఎందుకు రద్దు అయ్యాయి? ప్రభుత్వానికి చేరిన DGCA కమిటీ నివేదిక!
శాంసంగ్‌ ఫోల్డ్‌బుల్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌- లక్షరూపాయల ఫోన్‌పై 65000 తగ్గింపు
శాంసంగ్‌ ఫోల్డ్‌బుల్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌- లక్షరూపాయల ఫోన్‌పై 65000 తగ్గింపు
Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై భారత్‌ ఆందోళన- హిందువులపై దాడులు ఆపాలని డిమాండ్
బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై భారత్‌ ఆందోళన- హిందువులపై దాడులు ఆపాలని డిమాండ్
Mowgli 2025 OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'మోగ్లీ' - న్యూ ఇయర్ సర్ప్రైజ్... నెల రోజుల్లోపే కొత్త మూవీ స్ట్రీమింగ్
ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'మోగ్లీ' - న్యూ ఇయర్ సర్ప్రైజ్... నెల రోజుల్లోపే కొత్త మూవీ స్ట్రీమింగ్
Vizag Ganja Lady Don: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
Bajaj Pulsar: భారీ మార్పులతో పల్సర్ 150 భారత్‌లో రీలాంచ్! చేసిన మార్పులేంటో చూడండి!
భారీ మార్పులతో పల్సర్ 150 భారత్‌లో రీలాంచ్! చేసిన మార్పులేంటో చూడండి!
Embed widget