అన్వేషించండి

Nellore Crime News: దళిత యువకుడిపై వైసీపీ ఎంపీటీసీ దాడి, ఎందుకంటే?

Nellore Crime News: పెట్రోల్ బంక్ లో పని చేస్తున్న ఓ దళిత యువకుడిపై వైసీపీ ఎంపీటీసీ దాడి చేశాడు. పెట్రోల్ పోయమంటే సర్వర్ పని చేయడం లేదని చెప్పిన కారణంగా చితకబాదాడు. 

Nellore Crime News: నెల్లూరు జిల్లా దగదర్తి మండలం ఉలవపాళ్ల పెట్రోల్ బంక్ లో పని చేస్తున్న ఓ దళిత యువకుడిపై వైసీపీ ఎంపీటీసీ విచక్షణారహితంగా దాడి చేశారు. బొడిగుడిపాడు వైసీపీ ఎంపీటీసీ మహేష్ నాయుడుకు పెట్రోల్ కోసమని వచ్చారు. అయితే అప్పటికే సర్వర్ పని చేయని కారణంగా అందులో పనిచేసే దళిత యువకుడు తేజ పెట్రోల్ పోయలేమని చెప్పాడు. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన మహేష్ నాయుడు .. తేజపై అత్యంత దారుణంగా అనుచరులతో కలిసి దాడి చేశారు. ఎంత బతిమాలినా వినకుండా ఇష్టమొచ్చినట్లుగా కొట్టారు. 

ఈ ఘటనపై పలువురు నెటిజెన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక సేవ చేయాల్సిన ఓ వ్యక్తి ఇలా దళిత వ్యక్తిపై దాడి చేయడం దారుణం అంటున్నారు. కేవలం దళిత వ్యక్తి అన్న కారణంగానే ఇలా కొట్టాడంటూ మరికొంత మంది కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వైరట్ నెట్టింట వైరల్ గా మారింది. 

నెలరోజుల క్రితం వైసీపీ దాడిలో గాయపడ్డ నలుగురు వ్యక్తులు..

ఏలూరు జిల్లాలో వైసీపీ వర్గీయులు టీడీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పీఏ సహా మరో ముగ్గురు టీడీపీ నేతలు గాయపడ్డారు. జిల్లాలోని పెదవేగి మండలం కొప్పాక సమీపంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

అసలేం జరిగిందంటే..?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తిని కలిసేందుకు శివబాబు మరికొంత మందితో కలిసి జీపులో పెదకడిమి గ్రామంలోని రాజా తోటకు వెళ్తుండగా అలుగులగూడెం వెంతెన వద్ద వైసీపీ వర్గీయులు వీరి వాహనాన్ని ఆపారు. ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్నిస్తూనే, కర్రలు, రాడ్డులతో దాడికి దిగారు. ఈ ఘటనలో శివబాబు, మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. విషయం గుర్తించిన స్థానికులు వీరిని చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శివబాబు తలకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే కొప్పాక సమీపంలోని పోలవరం కుడి కాలువ వద్ద వైసీపీకి చెందిన కొందరు జేసీబీలతో మట్టి తవ్విస్తున్నారని, అదే సమయంలో తాము అటుగా వెళ్లడంతో వారిని అడ్డుకునేందుకు వెళ్తున్నామనుకొని తమపై దాడి చేశారని శివబాబు తెలిపారు. తమపై దాడి చేసిన వారిలో వైసీపీకి చెందిన కొప్పాక రంగారావు, పచ్చిపులుసు శివ, మరికొంత మంది ఉన్నారని ఆరోపించారు. 

దాడి జరిగిందని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ భార్య రాధ బాధితులను పరామర్శించారు. అయితే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులు చికిత్స పొందుతున్న సమయంలోనే.. వీరిపై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రంగారావు, శివ మరికొందరు వైద్యం కోసం ఇక్కడే చేరారు. ఈ క్రమంలో రెండు వర్గాల వారు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడడంతో ఆస్పత్రి ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Female cop kills father: పేరుకే పోలీసు - కానీ తండ్రినే చంపిన హంతకురాలు - ఈమెకు ఏ శిక్ష కరెక్ట్ ?
పేరుకే పోలీసు - కానీ తండ్రినే చంపిన హంతకురాలు - ఈమెకు ఏ శిక్ష కరెక్ట్ ?
GST scam busted: ఫేక్ కంపెనీలతో రూ.217 కోట్ల జీఎస్టీ స్కాం - ముఠా పట్టివేత - తెర వెనుక బడా వ్యక్తులు?
ఫేక్ కంపెనీలతో రూ.217 కోట్ల జీఎస్టీ స్కాం - ముఠా పట్టివేత - తెర వెనుక బడా వ్యక్తులు?
Allahabad High Court: వివాహితుడు మరో మహిళతో సహజీవనం చేయడం నేరంకాదు! అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు!
వివాహితుడు మరో మహిళతో సహజీవనం చేయడం నేరంకాదు! అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు!
Instagram Love Tragedy: ఇన్‌స్టా లవ్ విషాదాంతం.. భర్తను వదిలి ప్రియుడితో పెళ్లి! కాలువలో దూకి ఇద్దరూ ఆత్మహత్య
ఇన్‌స్టా లవ్ విషాదాంతం.. భర్తను వదిలి ప్రియుడితో పెళ్లి! కాలువలో దూకి ఇద్దరూ ఆత్మహత్య

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Candidate List: టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
Airports in AP and Telangana: ఉడాన్‌ 2.0తో తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు
తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు!
Summer Special Trains: సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
IPL 2026: అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
Samuthirakani: క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐలు, మిడిల్ క్లాస్ కష్టాలే మెయిన్ పాయింట్... సముద్రఖని ఏం చెప్పారంటే?
క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐలు, మిడిల్ క్లాస్ కష్టాలే మెయిన్ పాయింట్... సముద్రఖని ఏం చెప్పారంటే?
Food Poisoning: శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
Embed widget