News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

భార్యకు కు.ని. ఆపరేషన్ అన్నాడు- పిల్లల్ని ఖూనీ చేశాడు

నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్న వారికి ఇద్దరు పిల్లలు. గత కొంత కాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న అతను పిల్లలిద్దరినీ నరికి చంపి ఆపై ఆత్మహత్యాయత్నం చేశాడు. 

FOLLOW US: 
Share:

మొదటి భార్య అనారోగ్యంతో చనిపోయింది. అప్పటికే వాళ్లిద్దరికీ కొడుకు ఉన్నాడు. ఆ బాలుడిని చూసుకోవడానికి మరో పెళ్లి చేసుకున్నాడతను. ఆమెకు కూడా ఓ పాప, బాబు పుట్టారు. ఇప్పుడు అతనికి ముగ్గురు పిల్లలు. ఈ కారణంగానే రెండో భార్యతో గొడవలు మొదలయ్యాయి. నిత్యం నింట్లో ఒకటే తగాదాలు.  

భర్తతో వచ్చిన మనస్పర్థల కారణంగా ఆ భార్య తనకు పుట్టిన పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. ఒంటరిగా ఉంటూనే జీవనం సాగిస్తోంది. ఇదే ఛాన్స్ అనున్నాడో ఏమో ఆ వ్యక్తి మూడో పెళ్లి చేసుకున్నాడు. ఆ మహిళకు కూడా ఇది రెండో పెళ్లి. వీళ్లిద్దరికి పాప, బాబు పుట్టారు. 

మూడో పెళ్లి చేసుకున్నప్పటికీ ఆ సంసారం కూడా సరిగా లేదు. వాళ్లిద్దరి మధ్య కూడా నిత్యం తగాదాలే. మూడో పెళ్లాంపై అనుమానంతో నిత్యం ఆమెను వేధించేవాడు. దీని కారణంగానే మూడో భార్యతోనూ మంచిగా ఉండలేకపోయాడా వ్యక్తి. అలా భార్యతో గొడవ కారణంగా ఆ కోపాన్ని పసిబిడ్డలపై చూపించాడు. ఇద్దరి చిన్నారుల గొంతు కోసి హత్య చేశాడు. ఆపై తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 

నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు గ్రామంలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఓంకార్‌ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన మహేశ్వరిని మూడో పెళ్లి చేసుకున్నాడు. ఓంకార్, మహేశ్వరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. బుధవారం రోజు నాగర్ కర్నూల్‌లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిస్తానని చెప్పి భార్యా, పిల్లలను ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లాడు. మార్గ మధ్యంలోనే దంపతులకు గొడవ జరిగింది. భార్యని చంపేస్తానని ఓంకార్ బెదిరించడంతో.. మహేశ్వరి బండి పైనుంచి దూకేసింది. అయితే ఆవేశంలో ఉన్న ఓంకార్ బండి ఆపకుండానే వెళ్లిపోయాడు. 

పిల్లల గొంతు కోసి.. ఆపై తానూ ఆత్మహత్యాయత్నం!

కోడేరు మండలం ఎత్తం గ్రామ శివారులోని గుట్ట వద్దకు వెళ్లాడు. ద్విచక్ర వాహనాన్ని సమీపంలోని పొలం వద్ద వదిలేసి పిల్లలను గుట్టపైకి తీసుకుపోయాడు. వెంట తెచ్చుకున్న కత్తితో పిల్లల గొంతు కోసి హత్య చేశాడు. ఆపై పిల్లలను అక్కడే వదిలేసి గుట్ట దిగుతూ.. తానూ గొంతు కోసుకున్నాడు. అలాగే నడుచుకుంటూ వచ్చి రోడ్డుపై పడిపోయాడు. 

బండి పైనుంచి దూకిన మహేశ్వరి పెద్ద కొత్తపల్లి ఠాణాలో పోలీసులను ఆశ్రయించింది. తన భర్త ఇద్దరు పిల్లలను చంపేస్తానని తీసుకెళ్లాడని వివరించింది. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఓంకార్ చరవాణి లొకేషన్ ఆధారంగా వాళ్లు ఎక్కడున్నది తెలుసుకున్నారు. అక్కడికి మహేశ్వరితో సహా వెళ్లగా.. రోడ్డుపై భర్త రక్తపు మడుగులో కనిపించాడు. అతడిని నాగర్ కర్నూల్ ఆస్పత్రికి అక్కడి నుంచి మహబూబ్ నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

గుండెలవిసేలా రోదిస్తున్న తల్లి..

గుట్టపైకి ఎక్కి చుడగా.. పిల్లల మృతదేహాలు కనిపించాయి. ఘటనా స్థలం వద్దే కత్తి కూడా దొరికింది. పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసిన మహేశ్వరి గుండెలవిసేలా రోదించింది. అది చూసిన ప్రతీ ఒక్కరూ కంటతడి పెట్టారు.

Published at : 18 Aug 2022 12:55 PM (IST) Tags: Childrens Murder Man Murdered His Two Children Man Suicide Attempt Nagar Kurnool Latest News Nagar Kurnool Crime News

ఇవి కూడా చూడండి

Medak News: అయ్యో దేవుడా, పండుగకు పిలిచి ప్రాణాలు తీశామే !

Medak News: అయ్యో దేవుడా, పండుగకు పిలిచి ప్రాణాలు తీశామే !

Vizag Murder: భార్యపై అనుమానం, స్నేహితుడి హత్య! మూడో అంతస్తు నుంచి తోసేసిన ఫ్రెండ్

Vizag Murder: భార్యపై అనుమానం, స్నేహితుడి హత్య! మూడో అంతస్తు నుంచి తోసేసిన ఫ్రెండ్

Etapaka Murder case: సుపారీ ఇచ్చి కన్నకొడుకుని చంపించిన తల్లిదండ్రులు - అసలు విషయం తెలిసి అంతా షాక్!

Etapaka Murder case: సుపారీ ఇచ్చి కన్నకొడుకుని చంపించిన తల్లిదండ్రులు - అసలు విషయం తెలిసి అంతా షాక్!

Chittoor Inter Student Death: ఇంటర్ విద్యార్థిని మృతి కేసు, తాజాగా బావిలో తల వెంట్రుకలు లభ్యం - ల్యాబ్ కు పంపిన పోలీసులు

Chittoor Inter Student Death: ఇంటర్ విద్యార్థిని మృతి కేసు, తాజాగా బావిలో తల వెంట్రుకలు లభ్యం - ల్యాబ్ కు పంపిన పోలీసులు

Accidents In Tirumala Ghat Road: తిరుమల ఘాట్‌లో ఒకే రోజు రెండు ప్రమాదాలు, 12 మందికి గాయాలు

Accidents In Tirumala Ghat Road: తిరుమల ఘాట్‌లో ఒకే రోజు రెండు ప్రమాదాలు, 12 మందికి గాయాలు

టాప్ స్టోరీస్

Asaduddin Owaisi: జైల్లో హ్యాపీగా చంద్రుడు! ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు, సీఎం జగన్‌పైనా సెటైర్లు

Asaduddin Owaisi: జైల్లో హ్యాపీగా చంద్రుడు! ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు, సీఎం జగన్‌పైనా సెటైర్లు

Chandrababu News: చంద్రబాబు పిటిషన్‌లపై విచారణ రేపటికి వాయిదా, సెలవులో ఏసీబీ కోర్టు జడ్జి

Chandrababu News: చంద్రబాబు పిటిషన్‌లపై విచారణ రేపటికి వాయిదా, సెలవులో ఏసీబీ కోర్టు జడ్జి

Asian Games 2023: రైతు బిడ్డ రజతం సాధించింది - సెయిలింగ్‌తో సిల్వర్ నెగ్గిన నేహా

Asian Games 2023: రైతు బిడ్డ రజతం సాధించింది - సెయిలింగ్‌తో సిల్వర్ నెగ్గిన నేహా

Telangana Cabinet: రెండు మూడు రోజుల్లో తెలంగాణ కేబినెట్ భేటీ, ప్రధాన అజెండాలు ఇవే!

Telangana Cabinet: రెండు మూడు రోజుల్లో తెలంగాణ కేబినెట్ భేటీ, ప్రధాన అజెండాలు ఇవే!