అన్వేషించండి

Mahabubnagar Accident: స్కూటీని వెనక నుంచి ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు - ఇంజినీరింగ్ విద్యార్థి మృతి

Mahabub Nagar Accident: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో వెనక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు.. స్కూటీని ఢీకొట్టిన ఘటనలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. మరో విద్యార్థి స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. 

Mahabub Nagar Accident: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. మంగళవారం ఉదయం స్కూటీపై కళాశాలకు బయలు దేరిన ఇద్దరు విద్యార్థుల వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ విద్యార్థి అక్కడికక్కడే చనిపోగా మరో విద్యార్థి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. 

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం కౌకుంట్ల గ్రామానికి చెందిన 21 ఏళ్ల అరవింద్.. జిల్లా కేంద్రంలోనే నివాసం ఉంటూ సమీపంలో ఉన్న జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో సీఎస్సీ బ్రాంచ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. అయితే అతను ప్రతిరోజూ తన స్కూటీపై కళాశాలకు వెళ్లి వస్తుంటాడు. ఈ క్రమంలోనే తన స్నేహితుడు సలీంతో కలిసి మంగళవారం ఉదయం కళాశాలకు బయలు దేరాడు. అయితే పాలమూరు విశ్వవిద్యాలయం వద్దకు చేరుకోగానే.. నారాయణపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు స్కూటీని వెనక నుండి బలంగా ఢీ కొట్టింది. ఈ సంఘటనలో అరవింద్ అక్కడికక్కడే మరణించగా.. సలీం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అయితే విషయం గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు మృతుడు అరవింద్ మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సలీంను కూడా చికిత్స నిమిత్తం అదే ఆసుపత్రిలో చేర్చారు. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ట్రాఫిక్ ఎస్ఐనే ఢీకొట్టిన యువకులు - మద్యం మత్తులోనే

ఫుల్లుగా మద్యం సేవించారు. ఆపై ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యంలో ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు చేస్తూ కనిపించారు. దీంతో ఎక్కడ తమను పట్టుకుంటారోనన్న భయంతో పోలీసులను ఢీకొట్టి మరీ పారిపోయారు. అయితే ఈ ఘటన ఎప్పుడు, ఎలా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ మెక్ డోనాల్డ్స్ సమీపంలో ఎస్ఐ గౌనిగాని నరేష్ తన సిబ్బందితో కలిసి అర్ధరాత్రి 2 గంటలకు వాహన తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో ఫుల్లుగా తాగి ఇద్దరు వ్యక్తులు రాయల్ ఎన్ ఫీల్డ్ బైకుపై వస్తూ కనిపించారు. అయితే వారి మీద అనుమానం రావడంతో పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. మద్యం మత్తులో ఉన్న సదరు యువకులు పోలీసులకు పట్టుబడతామనే భయంతో బైక్ వేగం పెంచారు. ఎదురుగా వస్తున్న ఎస్ఐ నరేష్ ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఎస్ఐ తీవ్రంగా గాయపడ్డాడు. విషయం గుర్తించిన సిబ్బంది వెంటనే అతడిని హైదర్ గూడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం ఆ తర్వాత నాంపల్లి కేర్ ఆసుపత్రికి తరలించారు. మోకాలి కాలి నుంచి పాదం వరకు ఉన్న ప్రధాన ఎముక విరగడంతో సర్జరీ చేసిన వైద్యులు స్టీల్ రాడ్డును అమర్చారు. 

అయితే ఎస్ఐని ఢీకొట్టి పరారైన నిందితులను పోలీసులు వెంబడించి మరీ పట్టుకున్నారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించగా.. ఇద్దరికీ 190 కంటే ఎక్కువ మోతాదులో ఆల్కాహాల్ సేవించినట్లు నిర్ధారణ అయింది నిందితులు రాంనగర్ రామాలయ ప్రాంతానికి చెందిన చంద్ర శేఖర్, న్యూ నల్లకుంటకు చెందిన యశ్వంత్ గా గుర్తించిన పోలీసులు శనివారం ఉదయం వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Flipkart Mobile Offers: ప్రీమియం స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ - గూగుల్ ఫోన్లు, ఐఫోన్లపై ఎంత తగ్గిందంటే?
ప్రీమియం స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ - గూగుల్ ఫోన్లు, ఐఫోన్లపై ఎంత తగ్గిందంటే?
Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Toyota Innova Hycross: ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Embed widget