అన్వేషించండి

Mahabubnagar Accident: స్కూటీని వెనక నుంచి ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు - ఇంజినీరింగ్ విద్యార్థి మృతి

Mahabub Nagar Accident: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో వెనక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు.. స్కూటీని ఢీకొట్టిన ఘటనలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. మరో విద్యార్థి స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. 

Mahabub Nagar Accident: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. మంగళవారం ఉదయం స్కూటీపై కళాశాలకు బయలు దేరిన ఇద్దరు విద్యార్థుల వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ విద్యార్థి అక్కడికక్కడే చనిపోగా మరో విద్యార్థి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. 

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం కౌకుంట్ల గ్రామానికి చెందిన 21 ఏళ్ల అరవింద్.. జిల్లా కేంద్రంలోనే నివాసం ఉంటూ సమీపంలో ఉన్న జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో సీఎస్సీ బ్రాంచ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. అయితే అతను ప్రతిరోజూ తన స్కూటీపై కళాశాలకు వెళ్లి వస్తుంటాడు. ఈ క్రమంలోనే తన స్నేహితుడు సలీంతో కలిసి మంగళవారం ఉదయం కళాశాలకు బయలు దేరాడు. అయితే పాలమూరు విశ్వవిద్యాలయం వద్దకు చేరుకోగానే.. నారాయణపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు స్కూటీని వెనక నుండి బలంగా ఢీ కొట్టింది. ఈ సంఘటనలో అరవింద్ అక్కడికక్కడే మరణించగా.. సలీం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అయితే విషయం గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు మృతుడు అరవింద్ మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సలీంను కూడా చికిత్స నిమిత్తం అదే ఆసుపత్రిలో చేర్చారు. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ట్రాఫిక్ ఎస్ఐనే ఢీకొట్టిన యువకులు - మద్యం మత్తులోనే

ఫుల్లుగా మద్యం సేవించారు. ఆపై ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యంలో ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు చేస్తూ కనిపించారు. దీంతో ఎక్కడ తమను పట్టుకుంటారోనన్న భయంతో పోలీసులను ఢీకొట్టి మరీ పారిపోయారు. అయితే ఈ ఘటన ఎప్పుడు, ఎలా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ మెక్ డోనాల్డ్స్ సమీపంలో ఎస్ఐ గౌనిగాని నరేష్ తన సిబ్బందితో కలిసి అర్ధరాత్రి 2 గంటలకు వాహన తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో ఫుల్లుగా తాగి ఇద్దరు వ్యక్తులు రాయల్ ఎన్ ఫీల్డ్ బైకుపై వస్తూ కనిపించారు. అయితే వారి మీద అనుమానం రావడంతో పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. మద్యం మత్తులో ఉన్న సదరు యువకులు పోలీసులకు పట్టుబడతామనే భయంతో బైక్ వేగం పెంచారు. ఎదురుగా వస్తున్న ఎస్ఐ నరేష్ ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఎస్ఐ తీవ్రంగా గాయపడ్డాడు. విషయం గుర్తించిన సిబ్బంది వెంటనే అతడిని హైదర్ గూడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం ఆ తర్వాత నాంపల్లి కేర్ ఆసుపత్రికి తరలించారు. మోకాలి కాలి నుంచి పాదం వరకు ఉన్న ప్రధాన ఎముక విరగడంతో సర్జరీ చేసిన వైద్యులు స్టీల్ రాడ్డును అమర్చారు. 

అయితే ఎస్ఐని ఢీకొట్టి పరారైన నిందితులను పోలీసులు వెంబడించి మరీ పట్టుకున్నారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించగా.. ఇద్దరికీ 190 కంటే ఎక్కువ మోతాదులో ఆల్కాహాల్ సేవించినట్లు నిర్ధారణ అయింది నిందితులు రాంనగర్ రామాలయ ప్రాంతానికి చెందిన చంద్ర శేఖర్, న్యూ నల్లకుంటకు చెందిన యశ్వంత్ గా గుర్తించిన పోలీసులు శనివారం ఉదయం వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

టాప్ హెడ్ లైన్స్

Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Hyderabad Crime News: కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
Adulterated Spices: హైదరాబాద్‌లో భారీ కల్తీ దందా రట్టు - 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్!
హైదరాబాద్‌లో భారీ కల్తీ దందా రట్టు - 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly Monsoon Sessions: ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Embed widget