అన్వేషించండి

Nizamabad News: రోజు రోజుకీ పెరిగిపోతున్న లక్కీ డ్రా మోసాలు, అమాయకులే వాళ్ల టార్గెట్

అమాయకుల గాలెం. అర చేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. కార్లు, బైక్ లు, టీవీలు, గృహోపకరణాల ఆశ చూపుతున్నారు. నెల నెల డబ్బులు వసూల్ చేస్తున్నారు. చివరికి టోకరా వేసి ఉడాయిస్తున్నారు.

నిజామాబాద్ జిల్లాలో లక్కీ డ్రా మోసాలు పెరిగిపోతున్నాయ్. అమాయకుల వీక్ నెస్ అసరా చేసుకుని కోట్ల రూపాయలు వసూల్ చేస్తూ ఉడాయిస్తున్నారు. పెట్టుబడి లేకుండా ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు ముఠాగా ఏర్పడి లక్కీ డ్రా స్కీంల పేరిట దోచేస్తున్నారు. ఆకర్షణీయమైన బహుమతులంటూ ఆశ చూపిస్తున్నారు. మొదట్లో ఒకరిద్దరికి బహుమతులు ఇస్తారు. ఆశ పడిన మిగతా వారు డబ్బులు నెలనెలా కడతారు. మొత్తం డబ్బులు వసూలు అయ్యాక ఎలాంటి బహుమతులు ఇవ్వకుండా ఊడాయిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఇది ఓ బిజినెస్ గా మారిపోయింది.

కార్లు, బైక్లు, రిఫ్రీజ‌్‌రేటర్లు, టీవీలు, గృహోపకరణాలు ఇస్తామంటూ సామాన్యులను టార్గెట్ చేస్తున్నారు. బహుమతుల పేరుతో ఊరిస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి నెల నెల రూ.1500 నుంచి రూ. 2000 వరకు వసూలు చేస్తారు. మొదట డ్రా తీసి ఒక్కరికో ఇద్దరికో బహుమతులు ఇస్తారు. తర్వాత చిన్నా చితకా బహుమతులు పంచిపెడతారు. చివరి వరకు ఎలాంటి బహుమతులు రాని వారికి వారు కట్టిన డబ్బుకంటే కొంత అదనంగా చెల్లిస్తామని చెబుతారు.

దాదాపు 2 నుంచి 3 వేల మంది వరకు ఒక్కో డ్రా స్కీంలో సభ్యులను చేర్పిస్తారు. ఇలా చివరి వరకూ దాదాపు 4 నుంచి 6 కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తారు. డబ్బు మొత్తం వసూలు కాగానే బిచాణా ఎత్తేస్తారు. ఇలా రోజుకో లక్కీ డ్రా స్కీంల మోసాలు నిజామాబాద్‌లో వెలుగు చూస్తూనే ఉన్నాయి.

ఏబీపీ దేశం వద్ద బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఓ లక్కీ డ్రా స్కీంలో 3 వేల మంది మోసపోయారు. ఈ విషయాన్ని ప్రజావాణిలో గత నెల 10న కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. బాధితులంతా లబోదిబోమని మొత్తుకున్నా ఇంతవరకూ వారికి ఎలాంటి న్యాయం జరగలేదు. 

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 10 నుంచి 15 లక్కీ డ్రా స్కీంలు నిర్వహిస్తున్నారని సమాచారం. ఈ స్కీంలను గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు. ఇలాంటి స్కీంలకు ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ స్కీంల నిర్వాహకులకు పరోక్షంగా పోలీసులు కూడా సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయ్.

బాధితులు కొంత మంది తమ గోడు వెళ్లబోసుకుంటే తప్ప ఈ దందా గుట్టు బయటికి రావట్లేదు. గత నెల 10న దాదాపు 100 మంది కలెక్టరేట్ కు వచ్చి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. చిన్న చిన్న పనులు చేసుకునే వారే ఎక్కువగా ఈ స్కీంలకు ఆకర్షితులవుతున్నారు. రోజు వారి కూలీలు కొంత డబ్బును పోగు చేసుకుని లక్కీ డ్రా స్కీంలకు కడితే చివరికి వారు ఉడాయిస్తున్నారు. దీంతో వారంతా కన్నీరు మున్నీరవుతున్నారు.

నిజామాబాద్ జిల్లా ఎడపల్లిలో మరో లక్కీ డ్రాం స్కీం బాగోతం బయటపడింది. గతంలో మోసపోయిన బోధన్ కు చెందిన ఓ వ్యక్తి  ఎడపల్లిలో ఈ దందా కొనసాగుతున్న విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వ్యక్తిపై లక్కీ డ్రా నిర్వహకులు దాడి చేశారు. గాయపడిన సదరు వ్యక్తి పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేశారు. దీనిపై ఆరా తీసిన పోలీసులు శ్రీసాయి గ్రూప్ నిర్వాహకులపై కేసు నమోదు చేశామని, వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తామని తెలిపారు. కానీ పోలీసులు మాత్రం ముందస్తుగా ఈ లక్కీ డ్రాం స్కీంపైన దృష్టి సారించటం లేదన్న ఆరోపణలు వస్తున్నాయ్. పోలీసులు సహకరించటం వల్లే వీరు ఇలా మోసాలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. ఇకనైనా వీరి ఆట కట్టించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు బాధితులు. 

టాప్ హెడ్ లైన్స్

Adilabad Bangladesh Illegal Burglar Gang Arrest: దేశంలోకి అక్రమంగా చొరబడటమే కాకుండా దోపిడీలు కూడా చేస్తున్నారు - బంగ్లా గ్యాంగ్ ను అరెస్టు చేసిన ఆదిలాబాద్ పోలీసులు
దేశంలోకి అక్రమంగా చొరబడటమే కాకుండా దోపిడీలు కూడా చేస్తున్నారు - బంగ్లా గ్యాంగ్ ను అరెస్టు చేసిన ఆదిలాబాద్ పోలీసులు
Krishna Crime: కృష్ణాజిల్లా ఎక్సైజ్ కానిస్టేబుల్ వేధింపులు- ఉయ్యూరులో దంపతుల ఆత్మహత్యాయత్నం
కృష్ణాజిల్లా ఎక్సైజ్ కానిస్టేబుల్ వేధింపులు- ఉయ్యూరులో దంపతుల ఆత్మహత్యాయత్నం
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
SaiKrishna Custodial Death: గాదె సాయికృష్ణ డెత్ కేసు.. నిందితుడు సురేష్ ఆచూకీ కోసం సిట్ ప్రకటన
విజయవాడ గాదె సాయికృష్ణ డెత్ కేసు.. నిందితుడు సురేష్ ఆచూకీ కోసం సిట్ ప్రకటన

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
Auqib Nabi Selection: జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
Eesha Rebba : గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
CWG India Analysis: గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
Embed widget