అన్వేషించండి

Kurnool News: మూడు సార్లు విచారణ కోసం పిలిచిన ఎన్ఐఏ - మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

Kurnool News: ఎన్ఐఏ అధికారులు మూడు సార్లు విచారణకు పిలవగా.. మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.  

Kurnool News: కర్నూలు జిల్లాలో విషాధం చోటు చేసుకుంది. ఎన్ఐఏ అధికారులు మూడు సార్లు విచారణకు పిలిచారనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే విషయాన్ని ఆయన భార్య వెల్లడించింది. కర్నూలు జిల్లా కేంద్రంలోని గడ్డవీధిలో నివాసం ఉండే 42 ఏళ్ల షేక్ అబ్దుల్లా మంగళవారం రోజు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే ఈయనకు గతంలో నిషేధించిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ)తో సంబంధం ఉండేది. ఈక్రమంలోనే అబ్దుల్లాను జాతీయ దర్యాప్తు సంస్థ ఇప్పటికే రెండు సార్లు విచారణకు పిలిచింది. జులై 10వ తేదీ, 16వ తేదీలలో విచారణ కోసం పిలవగా.. అబ్దుల్లా వెళ్లారు.

సోమవారం రాత్రి హైదరాబాద్‌లో విచారణ నిమిత్తం అబ్దుల్లాకు ఎన్‌ఐఏ నుంచి మరోసారి కాల్ వచ్చింది. అతనికి ఫోన్ వచ్చిన తర్వాత చాలా బాధ పడ్డారని, తీవ్ర మనస్తాపానికి గురయ్యారని ఆయన భార్య చెప్పింది. ఈక్రమంలోనే తాను అతడిని ఓదార్చానని చెప్పింది. రాత్రి సమయం కావడంతో పడుకుంటానని వెళ్లిన అబ్దుల్లా.. తెల్లవారేసరికి ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఇంటి పైకప్పుకు ఉరివేసుకుని చనిపోయాడు. అబ్దుల్లా భార్య ఫిర్యాదు మేరకు కర్నూలు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంగళవారం ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి.

ఒకే చెట్టుకు ఉరి వేసుకొని ప్రేమికుల ఆత్మహత్య

తిరుపతి జిల్లాలో ఇలాంటి విషాద ఘటన వెలుగు చూసింది.  తిరుపతి- పీలేరు రహదారిలోని భాకరాపేట ఫారెస్ట్ చెక్ పోస్ట్ సమీపంలోనున్న అటవీ ప్రాంతంలో ప్రేమికులు బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులు చౌడేపల్లె జోగి కొత్త ఇండ్లు చెందిన యుగంధర్, రామసముద్రం మండలం చిట్టే వారి పల్లికి చెందిన బోడి కల్యాణిగా గుర్తించారు. ఎర్రవారిపాలెం ఇంచార్జ్ ఎస్ఐ వెంకటేశ్వర్లు వివరాల మేరకు.. చౌడేపల్లె జోగి కొత్త ఇండ్లు చెందిన యుగంధర్ (17), రామసముద్రం మండలం చిట్టే వారి పల్లికి చెందిన బోడి కల్యాణి (15) పుంగనూరులోని ఓ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నారు. ఈ క్రమంలో వారి పరిచయం ప్రేమగా మారింది. యుగంధర్, కల్యాణి వీరు కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలియడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. మైనర్లు కావడంతో తల్లిదండ్రులు వీరిని బుద్ధిగా చదువుకోవాలని నచ్చజెప్పారు. జీవితంలో స్థిరపడిన తరువాత పెళ్లిగురించి ఆలోచించవచ్చని హితవు పలికారు. 

తల్లిదండ్రుల మాటలను పట్టించుకోని యుగంధర్, కల్యాణి ఈ నెల 18 తేదీ రాత్రి 10.30 గంటలకు ఇంటి నుంచి వెళ్లిపోయారు. తిరుపతి- పీలేరు రహదారిలో భాకరాపేట ఫారెస్ట్ చెక్ పోస్ట్ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య (Lovers Suicide In Tirupati District) చేసుకున్నారు. ఆదివారం పశువుల మేతకు వెళ్లిన పశువుల కాపరి మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. హుటాహుటిన అక్కడి చేరుకున్న పోలీసులు మృతదేహాలను చెట్టు నుంచి కిందకు దించి పోస్ట్‌మార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. యువతి, యువకుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఇంచార్జ్ ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడిన ఇద్దరు మైనర్లు కావడం విశేషం. బాలిక మెడలో పసుపు కొమ్ము తాడు కనిపించింది. ఆత్మహత్యకు ముందు వీరిద్దరు పెళ్లి చేసుకున్నారని, కానీ తల్లిదండ్రులు వీరి దూరం చేస్తారేమోనన్న భయంతో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Firing Case: విజయవాడలో హైడ్రామా; పోలీసులపైనే కాల్పులకు దుండగుడి యత్నం- ట్రిగ్గర్‌ లాక్ అవ్వడంతో తప్పిన ముప్పు!
విజయవాడలో హైడ్రామా; పోలీసులపైనే కాల్పులకు దుండగుడి యత్నం- ట్రిగ్గర్‌ లాక్ అవ్వడంతో తప్పిన ముప్పు!
అస్సాంలో కూలిన సుఖోయ్ ఫైటర్ జెట్.. ఇద్దరు IAF పైలట్లు మృతి
అస్సాంలో కూలిన సుఖోయ్ ఫైటర్ జెట్.. ఇద్దరు IAF పైలట్లు మృతి
బాణసంచా పేలుడు ఘటనలో 21 మంది మృతి.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు
బాణసంచా పేలుడు ఘటనలో 21 మంది మృతి.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు
Honor Killing In AP: లవ్ మ్యారేజీ చేసుకున్న కొన్ని గంటలకే వరుడ్ని చంపిన వధువు సోదరులు, కోనసీమలో దారుణం
లవ్ మ్యారేజీ చేసుకున్న కొన్ని గంటలకే వరుడ్ని చంపిన వధువు సోదరులు, కోనసీమలో దారుణం

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Vijay Super Six: తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
Iran ship: భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
Secunderabad Railway Stations: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
Vijay Deverakonda: బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
Maoists surrender in Hyderabad: జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
Hyderabad to Kanyakumari Amrit Bharat Express : హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
Rapappa Song: అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
Raisina Dialogue Chandrababu: నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
Embed widget