అన్వేషించండి

Khammam: కానిస్టేబుల్ దంపతుల పాడుపని! ఏకంగా కోటిన్నర దోచేసిన భార్యాభర్తలు

Khammam: ఖమ్మం జిల్లాలో ఉద్యోగాలిపిస్తామని రూ.1.88 కోట్లు వసూళ్లు చేసిన కానిస్టేబుల్‌ దంపతుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.. ఇందుకు సంబందించి ఖమ్మం వన్‌టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

ఆమె ఓ కానిస్టేబుల్‌ భార్య.. విలాసవంతమైన జీవితం కోసం అడ్డదారులను వెతికింది.. ఇంకేం రైల్వేలో గెజిటెడ్‌ ఉద్యోగిగా తనకు తాను నకిలీ పత్రాలు సృష్టించుకుంది.. సమీప బందువులను టార్గెట్‌గా చేసుకుంది.. ఆమె కానిస్టేబుల్‌ భార్య కావడంతో ఉద్యోగం కోసం వెతుకుతున్న వారు సులువుగా నమ్మేశారు.. ఎంచక్కా రూ.1.88 కోట్లు వారి వద్ద నుంచి వసూళ్లు చేశారు.. చాలా రోజుల వరకు ఉద్యోగాలు రాకపోవడంతో అనుమానం వచ్చిన బాదితులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం కాస్తా బయట పడి కానిస్టేబుల్‌ దంపతులు కాస్తా కటకటాలపాలయ్యారు..

ఖమ్మం జిల్లాలో ఉద్యోగాలిపిస్తామని రూ.1.88 కోట్లు వసూళ్లు చేసిన కానిస్టేబుల్‌ దంపతుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.. ఇందుకు సంబంధించి ఖమ్మం వన్‌టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

ఖమ్మం నగరంలోని సుగ్గలవారి తోట ప్రాంతానికి చెందిన ముద్దం శ్రీశాంత, దాసరి సరిత అనే దంపతులు నివాసముంటున్నారు. సులువుగా డబ్బులు సంపాదించాలని ఆలోచనలో ఉన్న వీరివురు ఓ పథకం పన్నారు. ఇదే అదనుగా దాసరి సరిత తనకు తాను రైల్వేలో గెజిటెడ్‌ ఉద్యోగం చేస్తున్నానంటూ ఫేక్‌ ఐడెంటీ కార్డు సృష్టించుకుంది. ప్రెండ్స్, బందువులను టార్గెట్‌ చేసి వారికి రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించారు. శ్రీశాంత పోలీస్‌ కానిస్టేబుల్‌ కావడంతో వీళ్లు కాస్తా సులువుగానే నమ్మేశారు. ఇంకేం సుమారు 12 మంది బాధితుల నుంచి రూ.1.88 కోట్లు వసూళ్లు చేశారు.

అయితే ఉద్యోగాల కోసం డబ్బులు కట్టిన వీళ్లు ఎంతకు ఉద్యోగాలు రాకపోవడంతో తమ వారికి రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని సుమారు రూ.36 లక్షల  రూపాయలు తీసుకొని మోసం చేసిందని ఖమ్మం నగరంలోని చెరువు బజారుకు చెందిన పాలవెల్లి తులసి మరియు డౌలే సునీత పోలీస్‌ కమిషనర్‌ విష్ణు యస్‌. వారియర్‌ గారిని కలసి ఫిర్యాదు చేశారు. పోలీస్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు వన్‌టౌన్‌ సీఐ దాసరి సరిత, ముద్దం శ్రీశాంతలపై కేసు నమోదు చేసి ధర్యాప్తు చేశారు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. 

వసూళ్లు చేసిన సొమ్ములతో విలాసవంతమైన జీవితం..
నిరుద్యోగుల నుంచి వసూళ్లు చేసిన డబ్బులతో ఈ కానిస్టేబుల్‌ దంపతులు విలాసవంతమైన జీవితం గడిపారని పోలీసులు తెలిపారు. స్థిర, చరాస్తులు కొనుగోలు చేశారని పేర్కొన్నారు. అయితే బాదితులు ఫిర్యాదుతో వీరి అసలు రంగు బయటపడింది. వీరు కొనుగోలు చేసిన ఆస్తులను గుర్తించామని, రికవరీ చేసినట్లు సీఐ తెలిపారు. ఇద్దరిని అరెస్ట్‌ చేసి కోర్టుకు తరలించారు. కానిస్టేబుల్‌పై శాకపరంగా చర్యలు తీసుకోనున్నట్లు సీఐ వివరించారు. నిరుద్యోగులను టార్గెట్‌ చేస్తూ వారి వద్ద నంంచి రూ.1.88 కోట్లు వసూళ్లు చేసిన సంఘటన ఇప్పుడు ఖమ్మం జిల్లాలో సంచలనంగా మారింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Khammam Crime News: భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
Anakapalli Crime News: అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
Kamareddy crime News: కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
Vijayawada Firing Case: విజయవాడలో హైడ్రామా; పోలీసులపైనే కాల్పులకు దుండగుడి యత్నం- ట్రిగ్గర్‌ లాక్ అవ్వడంతో తప్పిన ముప్పు!
విజయవాడలో హైడ్రామా; పోలీసులపైనే కాల్పులకు దుండగుడి యత్నం- ట్రిగ్గర్‌ లాక్ అవ్వడంతో తప్పిన ముప్పు!

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Jana Nayagan : జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
Stock Market 9 March: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
Trisha Krishnan : త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్
త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్
Tamil Nadu Assembly Elections 2026: తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
Embed widget