అన్వేషించండి

YS Viveka Murder: వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్, సీబీఐ అధికారులపై పోలీసులకు ఫిర్యాదు

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో విచారణకు హాజరైన ఉదయ్ కుమార్ రెడ్డి సీబీఐ అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీబీఐ అధికారులు తనపై ఒత్తిడి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

మాజీ మంత్రి వివేకా హత్య(YS Viveka Murder) కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సీబీఐ విచారణ వేగవంతం చేస్తుంటే, అనుమానితులు ఒక్కొక్కరిగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సీబీఐ(CBI) అధికారులు ఒత్తిడి చేస్తున్నారని రివర్స్ లో సీబీఐ అధికారులపై ఫిర్యాదులు చేస్తున్నారు.  తాజాగా వివేకా హత్య కేసు అనుమానితుడు ఉదయ్ కుమార్ రెడ్డి కడప అదనపు ఎస్పీ(Kadapa Additional SP) మహేష్ కుమార్ ను కలిసి సీబీఐ అధికారులపై ఫిర్యాదు చేశారు. సీబీఐ అధికారులు తనను వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. వివేకా హత్య కేసులో తనకు తెలిసిన విషయాలు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తాము చెప్పినట్లు వినాలని సీబీఐ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. సీబీఐ అధికారులు తనను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నారని ఫిర్యాదులో ఉదయ్ కుమార్ రెడ్డి(Uday Kumar Reddy) పోలీసలకు ఫిర్యాదు చేశారు. 

YS Viveka Murder: వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్, సీబీఐ అధికారులపై పోలీసులకు ఫిర్యాదు

మళ్లీ విచారణ మొదలు 

తెలుగు రాష్ట్రాల్లో సంచలమైన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ(Cbi enquiry) మళ్లీ ప్రారంభమైంది. కడప జిల్లా పులివెందుల(Pulivendula) ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో విచారణ కొనసాగిస్తుంది. సీబీఐ తాజాగా మరో ముగ్గురు అనుమానితులను విచారించింది. గతంలో కడప జిల్లా సాక్షి బ్యూరోగా పని చేసి, ఇప్పుడు నెల్లూరు బ్యూరోగా పనిచేస్తున్న బాలకృష్ణారెడ్డిని సీబీఐ అధికారులు విచారణ చేశారు. వివేకా హత్య జరిగిన రోజున గుండెపోటుతో చనిపోయారని బాలకృష్ణారెడ్డికి శివశంకర్ ఫోన్ చేసి చెప్పారు. వివేకా హత్య కేసులో శివశంకర్ రెడ్డి(Shiva Shankar Reddy) ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ విషయంపై బాలకృష్ణారెడ్డిని సీబీఐ అధికారులు పలుమార్లు ప్రశ్నించారు. పులివెందులకు చెందిన యూసీఐల్(UCIL) ఉద్యోగి ఉదయ్ కూమార్ రెడ్డిని కూడా సీబీఐ విచారణ చేసింది. వివేకా మృతదేహానికి ఉదయ్ కుమార్ రెడ్డి తండ్రి ప్రకాశ్ రెడ్డి కుట్లు వేశారని సీబీఐ అభియోగం నమోదు చేసింది. ఇప్పటికే ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు చాలాసార్లు ప్రశ్నించారు. పులివెందులలోని ఈసీ గంగిరెడ్డి(EC Gangi Reddy) ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యుడు మధుసూదన్ రెడ్డి కూడా సీబీఐ విచారణ చేసింది. 

ఛార్జిషీట్ లో కీలక అంశాలు 

వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్‌ కీలక అంశాలను పేర్కొంది. సెటిల్‌మెంట్‌ల్లో విభేదాల కారణంగానే వైఎస్‌ వివేకా హత్య జరిగినట్లు వెల్లడించింది. గత ఏడాది అక్టోబరు 26న పులివెందుల కోర్టులో సీబీఐ ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఈ ఛార్జిషీట్ తాజాగా వెలుగుచూసింది. ఎర్ర గంగిరెడ్డి(Erra Gangi Reddy), సునీల్ యాదవ్(Sunil Yadav), ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి(Dastagiri) పేర్లను ఈ ఛార్జిషీట్ లో ప్రధానంగా పేర్కొంది. వివేకా హత్య జరిగిన రోజు ఆధారాలు మాయం చేసేందుకు కొంత మంది ప్రముఖులు కూడా ప్రయత్నించారని సీబీఐ తెలిపింది. ఎర్ర గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి సూచనలతో బెడ్ రూం, బాత్ రూంలను పని మనుషులు శుభ్రం చేశారని వెల్లడించింది. పోస్టుమార్టం నివేదిక ప్రకారం వివేకా శరీరంపై ఏడు చోట్ల బలమైన గాయాలు ఉన్నాయని తెలిపింది. బెంగళూరు(Bengalore)లోని 8 కోట్ల స్థలం సెటిల్‌మెంట్ విషయమై వివేకా, ఎర్ర గంగిరెడ్డికి మధ్య విబేధాలు ఉన్నాయని, వివేకాను హత్య చేస్తే శివశంకర్ రెడ్డి రూ.40 కోట్లు సుపారీ ఇస్తారని ఎర్రగంగిరెడ్డి చెప్పినట్లు పేర్కొంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Contestant Nomination Rules: అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
Weather Latest Update: తెలంగాణలో మళ్లీ చల్లటి కబురు! కానీ, వడగాలులు కూడా తప్పవు - ఐఎండీ
తెలంగాణలో మళ్లీ చల్లటి కబురు! కానీ, వడగాలులు కూడా తప్పవు - ఐఎండీ
Google Pixel 8a Colour: గూగుల్ పిక్సెల్ 8ఏ కలర్ ఆప్షన్లు లీక్ - ఈసారి నాలుగు కొత్త రంగుల్లో!
గూగుల్ పిక్సెల్ 8ఏ కలర్ ఆప్షన్లు లీక్ - ఈసారి నాలుగు కొత్త రంగుల్లో!
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

BJP Madhavi Latha Srirama Navami Sobhayatra: శోభాయాత్రలో పాల్గొని ఎంఐఎంపై మాధవీలత విమర్శలుRaja Singh Srirama Navami Sobhayatra: శోభాయాత్ర సందడి, యువకులను ఉద్దేశిస్తూ రాజాసింగ్ ప్రసంగంJake Fraser McGurk Batting Ganguly Reaction: ఆ ఒక్క సిక్స్ చూసి జేబుల్లో చేతులు పెట్టుకుని వెళ్లిపోయిన గంగూలీRishabh Pant Tristan Stubbs Bowling: స్టంప్ మైక్ దగ్గర నుంచి స్టబ్స్ తో హిందీలో మాట్లాడిన పంత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Contestant Nomination Rules: అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
Weather Latest Update: తెలంగాణలో మళ్లీ చల్లటి కబురు! కానీ, వడగాలులు కూడా తప్పవు - ఐఎండీ
తెలంగాణలో మళ్లీ చల్లటి కబురు! కానీ, వడగాలులు కూడా తప్పవు - ఐఎండీ
Google Pixel 8a Colour: గూగుల్ పిక్సెల్ 8ఏ కలర్ ఆప్షన్లు లీక్ - ఈసారి నాలుగు కొత్త రంగుల్లో!
గూగుల్ పిక్సెల్ 8ఏ కలర్ ఆప్షన్లు లీక్ - ఈసారి నాలుగు కొత్త రంగుల్లో!
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
Silence 2 Movie Review: ‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
DC vs GT Match Highlights: 'ఏం హాలత్ అయిపోయిందిరా భయ్.. ఈ బ్యాటింగ్ నేను చూడాలా' డగౌట్ లో గంగూలీ ఎక్స్ ప్రెషన్ చూడాల్సిందే..!
'ఏం హాలత్ అయిపోయిందిరా భయ్.. ఈ బ్యాటింగ్ నేను చూడాలా' డగౌట్ లో గంగూలీ ఎక్స్ ప్రెషన్ చూడాల్సిందే..!
Actor Raghubabu Car Incident: నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి - నల్లగొండలో ఘోర ప్రమాదం
నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి - నల్లగొండలో ఘోర ప్రమాదం
Social Problem in Congress : లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో లెక్క తప్పిన సామాజిక సమీకరణలు - కాంగ్రెస్ దిద్దుకోలేని తప్పు చేస్తోందా ?
లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో లెక్క తప్పిన సామాజిక సమీకరణలు - కాంగ్రెస్ దిద్దుకోలేని తప్పు చేస్తోందా ?
Embed widget