అన్వేషించండి

YS Viveka Murder: వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్, సీబీఐ అధికారులపై పోలీసులకు ఫిర్యాదు

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో విచారణకు హాజరైన ఉదయ్ కుమార్ రెడ్డి సీబీఐ అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీబీఐ అధికారులు తనపై ఒత్తిడి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

మాజీ మంత్రి వివేకా హత్య(YS Viveka Murder) కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సీబీఐ విచారణ వేగవంతం చేస్తుంటే, అనుమానితులు ఒక్కొక్కరిగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సీబీఐ(CBI) అధికారులు ఒత్తిడి చేస్తున్నారని రివర్స్ లో సీబీఐ అధికారులపై ఫిర్యాదులు చేస్తున్నారు.  తాజాగా వివేకా హత్య కేసు అనుమానితుడు ఉదయ్ కుమార్ రెడ్డి కడప అదనపు ఎస్పీ(Kadapa Additional SP) మహేష్ కుమార్ ను కలిసి సీబీఐ అధికారులపై ఫిర్యాదు చేశారు. సీబీఐ అధికారులు తనను వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. వివేకా హత్య కేసులో తనకు తెలిసిన విషయాలు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తాము చెప్పినట్లు వినాలని సీబీఐ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. సీబీఐ అధికారులు తనను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నారని ఫిర్యాదులో ఉదయ్ కుమార్ రెడ్డి(Uday Kumar Reddy) పోలీసలకు ఫిర్యాదు చేశారు. 

YS Viveka Murder: వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్, సీబీఐ అధికారులపై పోలీసులకు ఫిర్యాదు

మళ్లీ విచారణ మొదలు 

తెలుగు రాష్ట్రాల్లో సంచలమైన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ(Cbi enquiry) మళ్లీ ప్రారంభమైంది. కడప జిల్లా పులివెందుల(Pulivendula) ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో విచారణ కొనసాగిస్తుంది. సీబీఐ తాజాగా మరో ముగ్గురు అనుమానితులను విచారించింది. గతంలో కడప జిల్లా సాక్షి బ్యూరోగా పని చేసి, ఇప్పుడు నెల్లూరు బ్యూరోగా పనిచేస్తున్న బాలకృష్ణారెడ్డిని సీబీఐ అధికారులు విచారణ చేశారు. వివేకా హత్య జరిగిన రోజున గుండెపోటుతో చనిపోయారని బాలకృష్ణారెడ్డికి శివశంకర్ ఫోన్ చేసి చెప్పారు. వివేకా హత్య కేసులో శివశంకర్ రెడ్డి(Shiva Shankar Reddy) ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ విషయంపై బాలకృష్ణారెడ్డిని సీబీఐ అధికారులు పలుమార్లు ప్రశ్నించారు. పులివెందులకు చెందిన యూసీఐల్(UCIL) ఉద్యోగి ఉదయ్ కూమార్ రెడ్డిని కూడా సీబీఐ విచారణ చేసింది. వివేకా మృతదేహానికి ఉదయ్ కుమార్ రెడ్డి తండ్రి ప్రకాశ్ రెడ్డి కుట్లు వేశారని సీబీఐ అభియోగం నమోదు చేసింది. ఇప్పటికే ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు చాలాసార్లు ప్రశ్నించారు. పులివెందులలోని ఈసీ గంగిరెడ్డి(EC Gangi Reddy) ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యుడు మధుసూదన్ రెడ్డి కూడా సీబీఐ విచారణ చేసింది. 

ఛార్జిషీట్ లో కీలక అంశాలు 

వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్‌ కీలక అంశాలను పేర్కొంది. సెటిల్‌మెంట్‌ల్లో విభేదాల కారణంగానే వైఎస్‌ వివేకా హత్య జరిగినట్లు వెల్లడించింది. గత ఏడాది అక్టోబరు 26న పులివెందుల కోర్టులో సీబీఐ ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఈ ఛార్జిషీట్ తాజాగా వెలుగుచూసింది. ఎర్ర గంగిరెడ్డి(Erra Gangi Reddy), సునీల్ యాదవ్(Sunil Yadav), ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి(Dastagiri) పేర్లను ఈ ఛార్జిషీట్ లో ప్రధానంగా పేర్కొంది. వివేకా హత్య జరిగిన రోజు ఆధారాలు మాయం చేసేందుకు కొంత మంది ప్రముఖులు కూడా ప్రయత్నించారని సీబీఐ తెలిపింది. ఎర్ర గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి సూచనలతో బెడ్ రూం, బాత్ రూంలను పని మనుషులు శుభ్రం చేశారని వెల్లడించింది. పోస్టుమార్టం నివేదిక ప్రకారం వివేకా శరీరంపై ఏడు చోట్ల బలమైన గాయాలు ఉన్నాయని తెలిపింది. బెంగళూరు(Bengalore)లోని 8 కోట్ల స్థలం సెటిల్‌మెంట్ విషయమై వివేకా, ఎర్ర గంగిరెడ్డికి మధ్య విబేధాలు ఉన్నాయని, వివేకాను హత్య చేస్తే శివశంకర్ రెడ్డి రూ.40 కోట్లు సుపారీ ఇస్తారని ఎర్రగంగిరెడ్డి చెప్పినట్లు పేర్కొంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Jagan:లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
Tirumala News: తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
ISIS Terrorist Sajid Akram: జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan:లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
Tirumala News: తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
ISIS Terrorist Sajid Akram: జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
Dacoit Teaser : అడివి శేష్ 'డెకాయిట్' టీజర్ వచ్చేసింది - కింగ్ నాగార్జున ఫేమస్ సాంగ్ విత్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్
అడివి శేష్ 'డెకాయిట్' టీజర్ వచ్చేసింది - కింగ్ నాగార్జున ఫేమస్ సాంగ్ విత్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్
Reduction in CNG and PNG Price: ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
Nidhhi Agerwal : ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
India vs South Africa 4th T20: లక్నోలో భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దుపై దుమారం! బీసీసీఐపై మండిపడుతున్న అభిమానులు!
లక్నోలో భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దుపై దుమారం! బీసీసీఐపై మండిపడుతున్న అభిమానులు!
Embed widget