అన్వేషించండి

Jagityal: సొంత తమ్ముడ్ని చంపించిన అక్క, లక్షకు సుపారీ - కారణం ఏంటంటే

Metpally Murder: సోదరితో సంబంధం నడిపిన ప్రియుడు లొంగిపోవడంతో 6 నెలల కిందట జరిగిన హత్య విషయం బయటపడింది. ప్రెస్ మీట్ పెట్టి డీఎస్పీ రవీందర్ రెడ్డి పూర్తి వివరాలు వెల్లడించారు.

Sister Murders Brother: తల్లి తర్వాత అంత బాధ్యత తీసుకోవాల్సిన ఓ సోదరి తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో సొంత తమ్ముణ్ని హత్య చేయించింది. జగిత్యాలలోని మెట్ పల్లి (Metpally News) పట్టణంలో ఆరు నెలల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఇప్పుడు సంచలనం రేపుతోంది. సోదరితో సంబంధం నడిపిన ప్రియుడు లొంగిపోవడంతో ఆరు నెలల కిందట జరిగిన హత్య విషయం బయటపడింది. స్థానిక పోలీస్ స్టేషన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్ఐ సుధాకర్ లతో కలిసి మెట్ పల్లి డీఎస్పీ రవీందర్ రెడ్డి పూర్తి వివరాలు వెల్లడించారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జగిత్యాలలోని మెట్ పల్లి (Jagityal News) పట్టణంలో గల కళా నగర్‌లో నివాసముంటున్న మొహమ్మద్ అబ్దుల్ సోహైల్ (19) గత సంవత్సరం సెప్టెంబర్ 4న ఇంటి నుంచి వెళ్లిపోయాడంటూ అప్పట్లో పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. అయితే, 6 నెలలకు ముందు సోహైల్ అక్క ఫాతిమా(21) తో సజ్జత్ అలీ అనే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో తన సోదరి ఫాతిమాను తీవ్రంగా హెచ్చరించాడు. అంతేకాకుండా తన స్నేహితుడైన ఓ మైనర్ బాలుడు కూడా ఆమెను బెదిరించాడు. అక్కాతమ్ముళ్ల మధ్య ఇక్కడే చెడింది. దీంతో తన తమ్ముణ్ని అడ్డు తొలగించుకోవాలని అనుకొన్న ఫాతిమా చంపితే లక్ష రూపాయలు ఇస్తానని.. తనను బెదిరించిన బాలుడితోనే ఒప్పందం చేసుకుంది. 

ఎలాగైనా సోహైల్‌ని అడ్డు తొలగించుకోవాలని భావించి పూర్తిస్థాయిలో ప్రణాళిక వేసింది. 2021 సెప్టెంబర్ 4న రాత్రి 8 గంటల ప్రాంతంలో సోహైల్ ని ఆ మైనర్ బాలుడు సమీపంలో ఉన్న ఎస్సారెస్పీ ప్రధాన కాలువ పక్కన ఉన్న దోబీ ఘాట్ వద్దకు తీసుకు వెళ్ళాడు. అక్కడ మరో స్నేహితుడు ఎండీ మహమ్మద్ (19) మైనర్ బాలుడు, సోహెల్ కలిసి పార్టీ చేసుకున్నారు. అనంతరం వారి మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో అంతా కలిసి సోహైల్‌పై బీర్ సీసాలతో దాడి చేశారు. 

అంతటితో ఆగకుండా ప్రాణం తీయడానికి దగ్గర్లో దొరికిన చీరతో మెడకు ఉరి బిగించారు. ఇక శవాన్ని దొరకకుండా చేయాలని ఎస్సారెస్పీ ప్రధాన కాలువలో పడేశారు. ఇన్నాళ్లు నేరం విషయంలో ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసులు కూడా కేసుని ఎలా పరిష్కరించాలో తెలియక తలలు పట్టుకున్నారు. అయితే సోదరితో సంబంధం నడిపిన సయ్యద్ సజ్జాద్ అలీ అలియాస్ షాబాద్ (25)  మరోకరి సహకారంతో వచ్చి పోలీసులకు లొంగిపోవడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. మిగతా నిందితులను కూడా అరెస్టు చేసి విచారించగా నేరాన్ని అంగీకరించారు. హత్య చేసిన నిందితులు ముందుకు వచ్చి లొంగిపోవడంతో కేసు వివరాలు బయటికి వచ్చాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Husband plans to murder his wife: రోడ్డు ప్రమాదం స్కెచ్‌తో భార్యను చంపేశాడు - కానీ బస్సు డాష్ క్యామ్ పట్టించేసింది!
రోడ్డు ప్రమాదం స్కెచ్‌తో భార్యను చంపేశాడు - కానీ బస్సు డాష్ క్యామ్ పట్టించేసింది!
Khammam Crime News: భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
Anakapalli Crime News: అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
Kamareddy crime News: కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
గూగుల్‌ నోట్ బుక్‌ ఎల్‌ఎమ్‌లో అద్భుతమైన ఫీచర‌-గంటల పని నిమిషాల్లోనే పూర్తి!
గూగుల్‌ నోట్ బుక్‌ ఎల్‌ఎమ్‌లో అద్భుతమైన ఫీచర‌-గంటల పని నిమిషాల్లోనే పూర్తి!
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Jana Nayagan : జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
Stock Market 9 March: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
Embed widget