అన్వేషించండి

Students Drown : ఈత సరదా ప్రాణం తీసింది, తెలుగు రాష్ట్రాల్లో ఐదుగురు చిన్నారులు మృతి!

Students Drown : హైదరాబాద్ గచ్చిబౌలిలో విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు.

Students Drown  : హైదరాబాద్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. గచ్చిబౌలి టెలికాం నగర్ కు చెందిన ముగ్గురు పిల్లలు మధ్యాహ్నం ఈతకని వెళ్లి నానక్ రాంగూడ పటేల్ కుంటలో మునిగిపోయారు. మృతి చెందిన చిన్నారుల వయసు దాదాపు 12 సంవత్సరాలలోపు ఉంటుందని పోలీసులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన చిన్నారులు షాభాజ్ (15) దీపక్ (12) పవన్ (13) గా పోలీసులు గుర్తించారు.  

ఈత రాకపోవడంతో 

గచ్చిబౌలి టెలికాంనగర్‌లోని ఓ స్కూల్ లో చదువుకుంటున్న తొమ్మిది మంది విద్యార్థులు నానక్‌రామ్‌గూడ గోల్ఫ్‌ కోర్స్‌ సమీపంలోని చెరువులో ఈతకు దిగారు. వారిలో ముగ్గురు చెరువు లోతు గమనించకుండా దిగడంతో నీటిలో మునిగిపోయారు. ఈ ప్రమాదాన్ని గమనించిన తోటి విద్యార్థులు అటుగా వెళ్లేవారిని సాయం కోరడంతో వారు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే విద్యార్థులు మృత్యువాత పడ్డారు. స్థానికులు డయల్‌ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం తర్వాత విద్యార్థుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. దీంతో గచ్చిబౌలి టెలికాంనగర్ విషాదఛాయలు అలముకున్నాయి. ఈతరాకపోవడంతో విద్యార్థులు మునిగిపోయారని తోటి విద్యార్థులు అంటున్నారు. లోతు తెలియని గుంతల్లో పోలీసులు హెచ్చరిస్తున్నారు. సెలవు రోజుల్లో విద్యార్థులు చెరువులు, లోతైన గుంతల వైపు రాకుండా తల్లిదండ్రులు పర్యవేక్షించాలని సూచించారు.  

వన సమారాధనకు వెళ్లి తిరిగిరాని లోకాలకు 

ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు విషాదం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా మడిపల్లి పాఠశాల విద్యార్థులు పెనుగంచిప్రోలు వన సమారాధనకు వచ్చారు. టీచర్ల పర్యవేక్షణ లేకపోవడంతో ఇద్దరు విద్యార్థులు మునేటిలో ఈతకు దిగి ఊబిలోకి చిక్కుకొని మృతి చెందారు.  మృతులు శీలం నర్సిరెడ్డి(13), నీలం జస్వంత్(10)గా గుర్తించారు. జాలర్ల సహాయంతో మృతదేహాలను బయటికి తీశారు.  

భీమిలి బీచ్ లో విషాదం 

విశాఖ జిల్లా భీమిలి బీచ్ లో ఈతకు దిగిన సాయి(20), వేముల సూర్యవంశీ (19) అనే ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతయ్యారు. వీరద్దరూ తగరపువలస అనిల్‌ నీరుకొండ కళాశాలలో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్నారు. విశాఖలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన వీరిద్దరితో స్నేహితులతో కలిసి శుక్రవారం కళాశాలకు వెళ్లకుండా సరదాగా గడిపేందుకు భీమిలి బీచ్‌కు వెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఏడుగురు సముద్రంలో ఈతకు దిగారు. వీరిలో సాయి, వంశీ, మణికంఠ కొద్దిగా ముందుకు వెళ్లగా అలల ఉద్ధృతికి సాయి, వంశీ కొట్టుకుపోయారు. మరో విద్యార్థి త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. విద్యార్థుల గల్లంతు సమచారం అందుకున్న సీఐ లక్ష్మణమూర్తి తన సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మత్స్యకారులు బోట్లు, ఐఎన్‌ఎస్‌ కళింగ నావికాదళ మెరైన్‌ కమాండోలు స్పీడ్‌ బోట్లతో, ఇండియన్‌ కోస్టు గార్డుకు చెందిన రెండు హెలికాప్టర్లు గల్లంతైన విద్యార్థుల కోసం సాయంత్రం వరకు గాలించారు. అయినా వారి ఆచూకీ లభించలేదు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget