అన్వేషించండి

Ramya Murder Case : బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో సంచలన తీర్పు, నిందితుడికి ఉరిశిక్ష విధించిన కోర్టు

Ramya Murder Case : గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడికి ఉరి శిక్ష విధించింది.

Ramya Murder Case : గుంటూరు బీటెక్ విద్యార్థి రమ్య హత్య కేసులో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడు శశికృష్ణకు ఉరిశిక్ష విధించింది. గుంటూరులోని గత ఏడాది ఆగస్టు 15న బీటెక్ విద్యార్థిని రమ్యను నిందితుడు శశికృష్ణ హత్య చేశాడు. ఈ కేసుల 28 మంది సాక్షులను ధర్మాసనం విచారించింది. నిందితుడికి హైకోర్టులో అఫీల్ చేసుకోవడానికి న్యాయమూర్తి అవకాశం ఇచ్చారు. గుంటూరు 4వ ప్రత్యేక  న్యాయమూర్తి రాంగోపాల్ ఈ కేసులో తీర్పు ఇచ్చారు. ఈ కేసుపై డిసెంబర్‌లో విచారణ ప్రారంభించింది కోర్టు. ఈనెల 26వ తేదీకి విచారణ పూర్తి అయింది.  

Ramya Murder Case : బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో సంచలన తీర్పు, నిందితుడికి ఉరిశిక్ష విధించిన కోర్టు

ఇవాళ ఏం జరిగింది?

శుక్రవారం నిందితుడు శశీకృష్ణ కోర్టుకు తీసుకువచ్చారు. నిందితుడు శశికృష్ణ నేరం రుజువు అయిందని న్యాయస్థానం తెలిపింది. విచారణలో నిందితుడిని కోర్టు ఏమైనా చెబుతావా అని అడిగింది. అప్పుడు మా తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని నిందితుడు తెలిపాడు. తల్లిదండ్రులు ఆరోగ్యం బాగా లేదని, తాను చూసుకోవాలని నిందితుడు కోర్టుకు తెలిపాడు. నిందితుడు నడి రోడ్డుపై హత్య చేశారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాడోపవాదనలు విన్న కోర్టు తుది తీర్పు ఇచ్చింది. 

ఆగస్టు 15న ఘోరం 

ఏపీలో గత ఏడాది ఆగస్టు 15న బీటెక్‌ విద్యార్థిని రమ్య దారుణ హత్యకు గురైంది. గుంటూరులోని పెదకాకాని రోడ్డులోని పరమాయికుంటలో టిఫిన్ తీసుకెళ్లేందుకు వచ్చిన రమ్యను ఓ యువకుడు కత్తితో పొడిచాడు. రక్తపు మడుగులో ఉన్న రమ్యను ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. రమ్యపై దాడి చేస్తున్న సమయంలో కొందరు స్థానికులు యువకుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కానీ నిందితుడు స్థానికులను బెదిరించి బైక్‌పై పరారయ్యాడు. దీనికి సంబంధించిన ఫుటేజ్ అక్కడి సీసీ టీవీ కెమెరాలలో రికార్డు అయ్యింది. రమ్య ఇంజినీరింగ్ ఫైనలియర్ చదువుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. రమ్యకు పరిచయం ఉన్న యువకుడే ఈ దారుణానికి పాల్పడ్డాడు. ప్రేమ పేరుతో వేధించి ఒప్పుకోలేదని చివరకు ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. నిందితుడు శశికృష్ణను అతని స్వగ్రామం వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారించింది. 9 నెలల్లోనే విచారణ పూర్తి చేసి నిందితుడికి ఉరిశిక్ష విధించింది. 

రమ్య ఆత్మకు శాంతి : తల్లిదండ్రులు 

తమ కుమార్తే రమ్యకు జరిగిన ఘోరం ఎవ్వరకీ జరగకూడదని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి కలిగిందన్నారు. దిశ చట్టంతోనే న్యాయం జరిగిందన్నారు. ప్రేమోన్మాదులకు ఇలాంటి శిక్షలు పడాలని, అప్పుడే నేరాలు తగ్గుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే నిందితుడు శశికృష్ణ తల్లిదండ్రులు తమకు న్యాయ చేయాలని కోరారు. తినడానికి తిండే లేని తమ కుటుంబానికి కొడుకే ఆధారమని అన్నారు. ఇప్పుడు అతడికి ఉరిశిక్ష వేస్తే తమను ఇంకెవరు చూసుకుంటాని ఆవేదన చెందారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకున్నారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

TDP Sankar | Srikakulam | పదవి ఉంటే ఒకమాట.. లేదంటే మరో మాట... ధర్మాన ఎప్పుడూ అంతేElections 2024 Tirupati Public Talk: తిరుపతి ఓటర్ల మదిలో ఏముంది..? ఎవరికి ఓటేస్తారు..?KTR on Phone Tapping Case | దొంగలవి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు..నీకేం భయం రేవంత్..? అంటూ కేటీఆర్ ప్రశ్నHardik Pandya vs Rohit Sharma: రాజకీయాల్లోనే కాదు ఇప్పుడు ఆటల్లోనూ క్యాంపులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
Telangana BJP :   తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ -  కొన్ని చోట్ల  తప్పదా ?
తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ - కొన్ని చోట్ల తప్పదా ?
Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
Pushpa 3 Title Revealed: సాలీడ్ అప్‌డేట్‌, 'పుష్ప 3' టైటిల్‌ వచ్చేసింది? - సుకుమార్‌ ప్లాన్‌ మామూలుగా లేదుగా..
సాలీడ్ అప్‌డేట్‌, 'పుష్ప 3' టైటిల్‌ వచ్చేసింది? - సుకుమార్‌ ప్లాన్‌ మామూలుగా లేదుగా..
Embed widget