అన్వేషించండి

Tirupatiలో భారీగా గంజాయి స్వాధీనం, 08 మందిపై పీడీ యాక్ట్ - అవసరమైతే జిల్లా బహిష్కరణ: ఎస్పీ

తిరుపతి జిల్లాలో రూ.9 లక్షల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు 20 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ పరమేశ్వర రెడ్డి తెలిపారు.

శ్రీకాళహస్తి- బుచ్చినాయుడు కండ్రిగ రోడ్ కి ఆనుకొని ఉన్న రామచంద్ర మిషన్ వద్ద భారీగా సుమారు రూ. 9,00,000 విలువ గల గంజాయిని స్వాధీనం చేసుకుని 20 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పి పి. పరమేశ్వర రెడ్డి వెల్లడించారు.

తిరుపతి జిల్లా ఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం... తిరుపతి జిల్లాలో మాదకద్రవ్యాల నివారణ, రవాణా, అమ్మకం అరికట్టడం కోసం జిల్లా పరిధిలో ఎప్పటికప్పుడు మాధక ద్రవ్యాల రవాణా, అమ్మకం సేవించడంపైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. తిరుపతి జిల్లా పోలీసులకు అందిన సమాచారం మేరకు సోమవారం ఉదయం 11 గంటల శ్రీకాళహస్తి - బుచ్చినాయుడు కండ్రిగ రోడ్ కి ఆనుకొని ఉన్న రామచంద్ర మిషన్ కి పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో, కొంతమంది వ్యక్తులు గంజాయి కలిగి ఉండగా, తొట్టంబేడు మండల రెవిన్యూ, శ్రీకాళహస్తి సబ్-డివిజన్ పోలీసు అధికారులు, సిబ్బంది సహాయంతో తిరుపతి జిల్లాలో వేర్వేరు ప్రాంతాలకు చెందిన 17 మంది పురుషులు, ముగ్గురు స్త్రీలను అదుపులోకి తీసుకుని  విచారణ చేపట్టారు. 

వారిలో ప్రధానంగా, నెల్లూరు జిల్లా రాపూరు మండలంకి చెందిన నాగేంద్ర అనే వ్యక్తి, తిరుపతిలో సుమారు 8 సంవత్సరాలుగా జీప్ డ్రైవర్ గా ఉంటూ, చాలా మందితో పరిచయం కలిగి ఉండి, గతంలో ఒక సారి తొట్టంబేడు పోలీస్ స్టేషన్ లో ఎర్రచందనం కేసులో అరెస్ట్ అయ్యాడు. అతనికి ఉన్న పరిచయాలతో శ్రీకాళహస్తి, వెంకటగిరి, రేణిగుంట, చిత్తూరు, తిరుపతి టౌన్, చెన్నైతో పాటు కర్నాటక లోని కోలార్ తదితర ప్రదేశాల్లో చాలా మందికి గంజాయి సరఫరా చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అతను విశాఖపట్నం, ఇతర ప్రదేశాల నుండి పెద్ద ఎత్తున గంజాయిని తీసుకొని ఎవ్వరికీ అనుమానం రాకుండా బస్సు లో ప్రయాణం చేసి, మరికొందరు వ్యక్తులతో పాటు, ఇంకా కొంత మందికి గంజాయి రవాణా చేసి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించే వాడని తేలింది.  

ఎప్పటిలాగే విశాఖపట్నం నుంచి బస్సులో గంజాయి తీసుకొని వచ్చి శ్రీకాళహస్తిలో కొందరు వ్యక్తులకు అమ్ముతుండగా వారిని పట్టుకొని వారి వద్ద నుండి మొత్తం 23 పాకెట్ల లోని సుమారు 22 కేజీల గంజాయి, నగదు మొత్తం 13,300/- స్వాధీనం చేసుకోని శ్రీకాళహస్తి టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఇనస్పెక్టర్ మల్లికార్జున కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ కేసులో గంజాయి సరఫరా చేసిన ప్రధాన ముద్దాయిలను పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన కల్లపల్లి నాగేంద్ర, శ్రీకాళహస్తికి చెందిన పైపూరి వేణుగోపాల్, మంగయ్య, చిచ్చు కార్తీక్, కోబాక బాలచంగమ్మ, చిత్తూరుకు చెందిన భాస్కర్, తిరుపతికి చెందిన ఇమామి, ఆవల హరి, యశ్వంత్, సాయి ప్రతాప్ రెడ్డి, జగదీష్, పందిటి రాజమ్మ, షేక్ బాబు, చిన్నస్వామి సుమన్, రోషి రెడ్డి, మేడూరి గౌతమ్, పెట్టే గిరి, దిలీప్ కుమార్, ముత్తుకూరు యువరాజు, తమిళనాడుకు చెందిన తిరుపతి వినయ్ కుమార్, గుణ శరవణలను అరెస్టు చేసినట్లు ఎస్పీ పరమేశ్వర రెడ్డి తెలిపారు. 
8 మందిపై పీడీ యాక్ట్..
ఈ కేసులో అక్రమ రవాణాకు పాల్పడిన 08 మంది పైన పీడీ యాక్ట్ ఓపెన్ చేయడం జరిగింది. ఇదివరకే పలు కేసులలో నిందితులుగా ఉన్నారు. అవసరమైతే వీరిని జిల్లా బహిష్కరణ కూడా చేస్తామన్నారు. ఎవరైనా ఈ గంజాయిని అక్రమ రవాణా చేసిన, కొన్న, వాడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తిరుపతి ఒక ఆధ్యాత్మిక నగరం ఇక్కడ ఎక్కడ కూడా గంజా అన్నది ఉండకూడదు 100% అరికట్టాలనే ఉద్దేశంతో పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు‌ చెప్పారు.

తిరుపతి జిల్లాకు గంజాయి‌ ఎక్కడి‌ నుండి వస్తుందంటే...???
తిరుపతి జిల్లాలో అక్కడక్కడ గంజాయి సరఫరా జరుగుతుందని, ముఖ్యంగా నార్త్ ఇండియా నుంచి వచ్చిన కూలీలు అక్కడక్కడ వాడుతున్నట్లు గుర్తించామన్నారు. వీరికి ఎక్కడ నుంచి వస్తోంది, ఎలా వస్తోంది అనే విషయాలపై తెలుసుకొని వాటిని అరికట్టడానికి SEB అడిషనల్ యస్.పి రాజేంద్ర, L&O అడిషనల్ యస్.పి కులశేఖర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి జిల్లాలోకి ఎక్కడ నుండి వస్తోంది, ఎవరెవరు సరఫరా చేస్తున్నారు అనే విషయాలపై పూర్తిగా నిర్ధారణ చేసుకున్న తరువాత జిల్లా వ్యాప్తంగా విసృతంగా వాహన తనికీలు చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీకాళహస్తికి చెందిన నాగేంద్ర అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇతను అరకు నుంచి గంజాయి తెప్పించుకొని పరిసర ప్రాంతాలలో సరఫరా చేస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఇతర రాష్ట్రాలు తమిళనాడు, కేరళకు సైతం గంజాయి అక్రమ రవాణా చేస్తున్నాడు. 

ఇంకా చాలా మంది ఉన్నారని, విచారణ జరుగుతుందని, వీరి వద్ద నుంచి 22 కేజీల గంజాయితో పాటు 20 మందిని అరెస్టు చేశామని, ఇందులో పాత నేరస్తులు కూడా ఉన్నారని, వీరి పైన పి.డి యాక్ట్ ఓపెన్ చేస్తామన్నారు. ముఖ్యంగా తిరుపతి జిల్లాలో గంజాయి అన్నది నిర్మూలించాలనే ఉద్దేశంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. రవాణా కానీ, అమ్మడం కానీ, వాడడం కానీ ఈ మూడిటిని నివారించడానికి పకడ్బంది చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా యువత, విద్యార్థులు ఈ యొక్క గంజాయి, మాదకద్రవ్యాలు వాడడం ద్వారా కలిగే దుష్ప్రభావాల గురించి కౌన్సెలింగ్ ఇస్తున్నాం. అలాగే విద్యా సంస్థల సమీపంలో మాదకద్రవ్యాల విక్రయాలు, వాడకం అసలు జరగకుండా ఉండటానికి కమిటీలను ఏర్పాటు చేసి తద్వారా కౌన్సిలింగ్ ఇస్తున్నామని ఎస్పీ పరమేశ్వర రెడ్డి వివరించారు. ఇలా చేయడం ద్వారా కొంత మేర గంజాయిని అరికట్టవచ్చు. కాలేజీ యాజమాన్యం మరియు తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి అది వారి బాధ్యతన్నారు.

ఎవరైనా గంజాయి సేవిస్తుంటే ఈ‌నెంబర్ కి ఫోన్ చేయండి...
ఎవరైనా గంజాయి అక్రమ రవాణా గురించి, విక్రయిస్తున్న వాళ్ల గురించి సమాచారం ఇవ్వాలనుకుంటే వారు 14500 నెంబర్ కు లేదా డయల్ 100 కు సమాచారం ఇవ్వవచ్చు, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Bengaluru Daycare Child Abuse: బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Nalgonda Road Accident: హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
Ongole Crime News: టూర్‌కు వెళ్లిన ఫ్యామిలీ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
ఒంగోలులో ఓ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
Instagram Reel: రీల్స్ పిచ్చి కొంపముంచింది! వజ్రాల నెక్లెస్ దొంగిలించి ఇన్‌స్టాగ్రామ్‌ రీల్ చేసిన పనిమనిషి.. ఏడాది తర్వాత సీన్ రివర్స్!
రీల్స్ పిచ్చి కొంపముంచింది! వజ్రాల నెక్లెస్ దొంగిలించి ఇన్‌స్టాగ్రామ్‌ రీల్ చేసిన పనిమనిషి.. ఏడాది తర్వాత సీన్ రివర్స్!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Tata Tiago EV on Discount: దేశంలో అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
Chicken Leg Roast : నోరూరించే చికెన్ లెగ్ రోస్ట్ రెసిపీ, ఈ మసాలాతో టేస్ట్ డబుల్.. అన్నం, రోటీతో అదిరిపోతుందంతే
నోరూరించే చికెన్ లెగ్ రోస్ట్ రెసిపీ, ఈ మసాలాతో టేస్ట్ డబుల్.. అన్నం, రోటీతో అదిరిపోతుందంతే
Embed widget