అన్వేషించండి

Kolkata: ఆందోళనలను విరమించిన వైద్యులు, సుప్రీంకోర్టు సూచనలతో కీలక నిర్ణయం

Kolkata Case: కోల్‌కతా హత్యాచార ఘటనను నిరసిస్తూ దాదాపు 11 రోజులుగా ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు నిరసనలు చేపడుతున్నారు. సుప్రీంకోర్టు సూచనలతో ఈ ఆందోళనలను విరమిస్తున్నట్టు ప్రకటించారు.

Kolkata Doctor Death Case: కోల్‌కతా ఘటనను నిరసిస్తూ దాదాపు 11 రోజులుగా దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ కారణంగా పలు చోట్ల వైద్య సేవలు అంతరాయం కలుగుతోంది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పింది. వెంటనే విధుల్లో చేరాలని సూచించింది. ఈ మేరకు ఢిల్లీలోని AIIMS హాస్పిటల్‌ కీలక ప్రకటన చేసింది. నిరసనలు విరమించి విధుల్లో చేరనున్నట్టు వెల్లడించింది. సుప్రీంకోర్టు సూచనలు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. ఆర్‌జీ కర్ హాస్పిటల్‌ ఘటనలో న్యాయస్థానం తీసుకుంటున్న చొరవ చాలా సంతృప్తికరంగా ఉందని, వైద్య సిబ్బంది భద్రత గురించి కోర్టు ప్రస్తావించడం ఊరటనిచ్చిందని వెల్లడించింది. 

"సుప్రీంకోర్టు సూచనల మేరకు 11 రోజుల మా నిరసనలను ఇకపై నిలిపివేయాలని నిర్ణయించుకున్నాం. సర్వోన్నత న్యాయస్థానం ఈ కేసులో ప్రత్యేక చొరవ తీసుకుంటుండడం నిజంగా అభినందనీయం. వైద్య సిబ్బంది భద్రత గురించీ ప్రస్తావించడం ఎంతో ఊరటనిచ్చింది. అందుకే ఆందోళనలు రద్దు చేస్తున్నాం"

- రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్, ఢిల్లీ ఎయిమ్స్ 

ఈ కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ధర్మాసనం వైద్యులకు భరోసా ఇచ్చింది. "దయచేసి మాపై భరోసా ఉంచండి. విధుల్లోకి వెళ్లండి" అని సూచించింది. కోర్టుపై తమకు నమ్మకం ఉందని, అందుకే ఆందోళనలు విరమిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. నిరసనల్లో పాల్గొన్న వైద్యులపై ఎలాంటి చర్యలు ఉండవని రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఆందోళనలు విరమించినా వైద్యుల భద్రతకు తమ పోరాటం ఎప్పటికీ కొనసాగుతుందని వెల్లడించింది. (Also Read: Kolkata: పాపం నా బిడ్డ ఎంత విలవిలాడిపోయిందో, నన్ను తలుచుకుని ఏడ్చిందేమో - బాధితురాలి తల్లి ఆవేదన)

"దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులందరికీ మాదో సూచన. మీ భద్రతకు భరోసా మాది. అందుకే మేమున్నాం. మాపైన నమ్మకం ఉంచండి. అందుకే మేం ఈ కేసుని కోల్‌కత్తా హైకోర్టుకి మాత్రమే అప్పగించి ఊరుకోలేదు. మళ్లీ విధుల్లో చేరండి"

- సుప్రీంకోర్టు

ఆగస్టు 9వ తేదీన ఆర్‌జీ కర్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం జరిగింది. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇటీవలే 24 గంటల పాటు వైద్య సేవల బంద్ పాటించింది. ఆ తరవాత కూడా పలు చోట్ల వైద్యులు నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ కారణంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారని, తానూ ఓ సారి హాస్పిటల్‌లో వైద్యం కోసం ఎదురు చూడాల్సి వచ్చిందని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. 

Also Read: Kolkata: కోల్‌కతా హాస్పిటల్ పేరు తప్పుగా పలికిన చీఫ్ జస్టిస్‌, వెంటనే తప్పు సరిదిద్దుకుని క్షమాపణలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: మళ్లీ చెప్తున్నా! రాజీవ్ విగ్రహాన్ని సకల మర్యాదలతో తరలించి తీరతాం - కేటీఆర్
మళ్లీ చెప్తున్నా! రాజీవ్ విగ్రహాన్ని సకల మర్యాదలతో తరలించి తీరతాం - కేటీఆర్
Amara Raja Groups Donation: ఏపీ, తెలంగాణలో వరద బాధితులకు అమర రాజా సంస్థ భారీ విరాళం, సీఎంలకు చెక్కులు అందజేత
ఏపీ, తెలంగాణలో వరద బాధితులకు అమర రాజా సంస్థ భారీ విరాళం, సీఎంలకు చెక్కులు అందజేత
Bigg Boss 8 Telugu Episode 17 Day 16: మళ్లీ బయటపడ్డ సోనియా రంగు, ముద్దులతో ముంచెత్తిన పృథ్వీ
మళ్లీ బయటపడ్డ సోనియా రంగు, ముద్దులతో ముంచెత్తిన పృథ్వీ
Lebanon Pagers Blast: లెబనాన్‌లో ఒక్కసారిగా పేలిన పేజర్లతో విధ్వంసం- 8 మంది మృతి, వేలాది మందికి గాయాలు
లెబనాన్‌లో ఒక్కసారిగా పేలిన పేజర్లతో విధ్వంసం- 8 మంది మృతి, వేలాది మందికి గాయాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pawan Kalyan World Record | ఏపీ పంచాయతీరాజ్ శాఖ ప్రపంచ రికార్డు | ABP DesamOperation Polo గురించి 76 ఏళ్ల క్రితం newspapers ఏం రాశాయి | Telangana Liberation Day | ABP Desamనిజాం రాజ్యం ఇండియాలో విలీనమయ్యాక ఖాసిం రజ్వీ ఏమయ్యాడు?Operation Kagar Maoists Death Toll | ప్రాణాలు కోల్పోతున్న అడవిలో అన్నలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: మళ్లీ చెప్తున్నా! రాజీవ్ విగ్రహాన్ని సకల మర్యాదలతో తరలించి తీరతాం - కేటీఆర్
మళ్లీ చెప్తున్నా! రాజీవ్ విగ్రహాన్ని సకల మర్యాదలతో తరలించి తీరతాం - కేటీఆర్
Amara Raja Groups Donation: ఏపీ, తెలంగాణలో వరద బాధితులకు అమర రాజా సంస్థ భారీ విరాళం, సీఎంలకు చెక్కులు అందజేత
ఏపీ, తెలంగాణలో వరద బాధితులకు అమర రాజా సంస్థ భారీ విరాళం, సీఎంలకు చెక్కులు అందజేత
Bigg Boss 8 Telugu Episode 17 Day 16: మళ్లీ బయటపడ్డ సోనియా రంగు, ముద్దులతో ముంచెత్తిన పృథ్వీ
మళ్లీ బయటపడ్డ సోనియా రంగు, ముద్దులతో ముంచెత్తిన పృథ్వీ
Lebanon Pagers Blast: లెబనాన్‌లో ఒక్కసారిగా పేలిన పేజర్లతో విధ్వంసం- 8 మంది మృతి, వేలాది మందికి గాయాలు
లెబనాన్‌లో ఒక్కసారిగా పేలిన పేజర్లతో విధ్వంసం- 8 మంది మృతి, వేలాది మందికి గాయాలు
Tirumala Tickets Online: భక్తులకు గుడ్‌న్యూస్ - డిసెంబర్ నెల శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల విడుదల తేదీలు ప్రకటించిన టీటీడీ
భక్తులకు గుడ్‌న్యూస్ - డిసెంబర్ నెల శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల విడుదల తేదీలు ప్రకటించిన టీటీడీ
AP New Liquor Policy: ఏపీలో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ - అక్టోబర్ నుంచి కొత్త పాలసీ: మంత్రులు
ఏపీలో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ - అక్టోబర్ నుంచి కొత్త పాలసీ: మంత్రులు
Adilabad: ఆదిలాబాద్‌లో బావి మీద 52 అడుగుల గణేష్ నిమజ్జనం - ఉన్నచోటే భలే టెక్నిక్!
ఆదిలాబాద్‌లో బావి మీద 52 అడుగుల గణేష్ నిమజ్జనం - ఉన్నచోటే భలే టెక్నిక్!
CTET 2024: సీటెట్‌ డిసెంబరు-2024 నోటిఫికేషన్‌ విడుదల-దరఖాస్తు ప్రారంభం, పరీక్ష ఎప్పుడంటే?
సీటెట్‌ డిసెంబరు-2024 నోటిఫికేషన్‌ విడుదల-దరఖాస్తు ప్రారంభం, పరీక్ష ఎప్పుడంటే?
Embed widget