అన్వేషించండి

Kolkata: ఆందోళనలను విరమించిన వైద్యులు, సుప్రీంకోర్టు సూచనలతో కీలక నిర్ణయం

Kolkata Case: కోల్‌కతా హత్యాచార ఘటనను నిరసిస్తూ దాదాపు 11 రోజులుగా ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు నిరసనలు చేపడుతున్నారు. సుప్రీంకోర్టు సూచనలతో ఈ ఆందోళనలను విరమిస్తున్నట్టు ప్రకటించారు.

Kolkata Doctor Death Case: కోల్‌కతా ఘటనను నిరసిస్తూ దాదాపు 11 రోజులుగా దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ కారణంగా పలు చోట్ల వైద్య సేవలు అంతరాయం కలుగుతోంది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పింది. వెంటనే విధుల్లో చేరాలని సూచించింది. ఈ మేరకు ఢిల్లీలోని AIIMS హాస్పిటల్‌ కీలక ప్రకటన చేసింది. నిరసనలు విరమించి విధుల్లో చేరనున్నట్టు వెల్లడించింది. సుప్రీంకోర్టు సూచనలు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. ఆర్‌జీ కర్ హాస్పిటల్‌ ఘటనలో న్యాయస్థానం తీసుకుంటున్న చొరవ చాలా సంతృప్తికరంగా ఉందని, వైద్య సిబ్బంది భద్రత గురించి కోర్టు ప్రస్తావించడం ఊరటనిచ్చిందని వెల్లడించింది. 

"సుప్రీంకోర్టు సూచనల మేరకు 11 రోజుల మా నిరసనలను ఇకపై నిలిపివేయాలని నిర్ణయించుకున్నాం. సర్వోన్నత న్యాయస్థానం ఈ కేసులో ప్రత్యేక చొరవ తీసుకుంటుండడం నిజంగా అభినందనీయం. వైద్య సిబ్బంది భద్రత గురించీ ప్రస్తావించడం ఎంతో ఊరటనిచ్చింది. అందుకే ఆందోళనలు రద్దు చేస్తున్నాం"

- రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్, ఢిల్లీ ఎయిమ్స్ 

ఈ కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ధర్మాసనం వైద్యులకు భరోసా ఇచ్చింది. "దయచేసి మాపై భరోసా ఉంచండి. విధుల్లోకి వెళ్లండి" అని సూచించింది. కోర్టుపై తమకు నమ్మకం ఉందని, అందుకే ఆందోళనలు విరమిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. నిరసనల్లో పాల్గొన్న వైద్యులపై ఎలాంటి చర్యలు ఉండవని రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఆందోళనలు విరమించినా వైద్యుల భద్రతకు తమ పోరాటం ఎప్పటికీ కొనసాగుతుందని వెల్లడించింది. (Also Read: Kolkata: పాపం నా బిడ్డ ఎంత విలవిలాడిపోయిందో, నన్ను తలుచుకుని ఏడ్చిందేమో - బాధితురాలి తల్లి ఆవేదన)

"దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులందరికీ మాదో సూచన. మీ భద్రతకు భరోసా మాది. అందుకే మేమున్నాం. మాపైన నమ్మకం ఉంచండి. అందుకే మేం ఈ కేసుని కోల్‌కత్తా హైకోర్టుకి మాత్రమే అప్పగించి ఊరుకోలేదు. మళ్లీ విధుల్లో చేరండి"

- సుప్రీంకోర్టు

ఆగస్టు 9వ తేదీన ఆర్‌జీ కర్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం జరిగింది. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇటీవలే 24 గంటల పాటు వైద్య సేవల బంద్ పాటించింది. ఆ తరవాత కూడా పలు చోట్ల వైద్యులు నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ కారణంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారని, తానూ ఓ సారి హాస్పిటల్‌లో వైద్యం కోసం ఎదురు చూడాల్సి వచ్చిందని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. 

Also Read: Kolkata: కోల్‌కతా హాస్పిటల్ పేరు తప్పుగా పలికిన చీఫ్ జస్టిస్‌, వెంటనే తప్పు సరిదిద్దుకుని క్షమాపణలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

PM Modi In Lok Sabha: వందేమాతరం నినాదంతో ఎందరో ప్రాణత్యాగం చేశారు.. పార్లమెంటులో చర్చలో ప్రధాని మోదీ
వందేమాతరం నినాదంతో ఎందరో ప్రాణత్యాగం చేశారు.. పార్లమెంటులో చర్చలో ప్రధాని మోదీ
Vijayawada Crime News: సత్యవర్థన్‌ కిడ్నాప్ కేసు- లొంగిపోయిన కీలక నిందితుడు కొమ్మా కొట్లు
సత్యవర్థన్‌ కిడ్నాప్ కేసు- లొంగిపోయిన కీలక నిందితుడు కొమ్మా కొట్లు
Allu Cinemas Dolby Screen : హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ - దేశంలోనే అతి పెద్ద డాల్బీ స్క్రీన్... ప్రత్యేకతలేంటో తెలుసా?
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ - దేశంలోనే అతి పెద్ద డాల్బీ స్క్రీన్... ప్రత్యేకతలేంటో తెలుసా?
Actor Dileep : హీరోయిన్‌కు వేధింపులు - మలయాళ నటుడు దిలీప్‌కు క్లీన్ చిట్... 8 ఏళ్ల నాటి కేసులో కోర్టు తీర్పు
హీరోయిన్‌కు వేధింపులు - మలయాళ నటుడు దిలీప్‌కు క్లీన్ చిట్... 8 ఏళ్ల నాటి కేసులో కోర్టు తీర్పు

వీడియోలు

Gambhir Warning to DC Owner | ఐపీఎల్ ఓనర్ కు గంభీర్ వార్నింగ్
DK Shivakumar Chinnaswamy Stadium IPL 2026 | ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ పై శివకుమార్ ట్వీట్
Ravi Shastri Comments on Team India | టీమిండియాపై రవిశాస్త్రి ఫైర్
Coach Gautam Gambhir About Ro - Ko |  రో - కో జోడీపై గంభీర్ షాకింగ్ కామెంట్స్
మాపై ఎందుకు పగబట్టారు..? మేం ఎలా బ్రతకాలో చెప్పండి..!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi In Lok Sabha: వందేమాతరం నినాదంతో ఎందరో ప్రాణత్యాగం చేశారు.. పార్లమెంటులో చర్చలో ప్రధాని మోదీ
వందేమాతరం నినాదంతో ఎందరో ప్రాణత్యాగం చేశారు.. పార్లమెంటులో చర్చలో ప్రధాని మోదీ
Vijayawada Crime News: సత్యవర్థన్‌ కిడ్నాప్ కేసు- లొంగిపోయిన కీలక నిందితుడు కొమ్మా కొట్లు
సత్యవర్థన్‌ కిడ్నాప్ కేసు- లొంగిపోయిన కీలక నిందితుడు కొమ్మా కొట్లు
Allu Cinemas Dolby Screen : హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ - దేశంలోనే అతి పెద్ద డాల్బీ స్క్రీన్... ప్రత్యేకతలేంటో తెలుసా?
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ - దేశంలోనే అతి పెద్ద డాల్బీ స్క్రీన్... ప్రత్యేకతలేంటో తెలుసా?
Actor Dileep : హీరోయిన్‌కు వేధింపులు - మలయాళ నటుడు దిలీప్‌కు క్లీన్ చిట్... 8 ఏళ్ల నాటి కేసులో కోర్టు తీర్పు
హీరోయిన్‌కు వేధింపులు - మలయాళ నటుడు దిలీప్‌కు క్లీన్ చిట్... 8 ఏళ్ల నాటి కేసులో కోర్టు తీర్పు
Telangana Global Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. ఏ హాల్ లో ఏ అంశంపై , ఏ టైంలో చర్చించనున్నారంటే
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. ఏ హాల్ లో ఏ అంశంపై , ఏ టైంలో చర్చించనున్నారంటే
Dhurandhar Collections : 100 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ 'ధురంధర్' - కేవలం 3 రోజుల్లోనే రికార్డు కలెక్షన్స్
100 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ 'ధురంధర్' - కేవలం 3 రోజుల్లోనే రికార్డు కలెక్షన్స్
Hyderabad Crime News: నరికి, తుపాకీతో కాల్చి.. హైదరాబాద్ లో రియల్టర్ దారుణహత్య.. పట్టపగలే నడిరోడ్డుపై ఘాతుకం
నరికి, తుపాకీతో కాల్చి.. హైదరాబాద్ లో రియల్టర్ దారుణహత్య.. పట్టపగలే నడిరోడ్డుపై ఘాతుకం
Upcoming Telugu Movies : ఒకే వారంలో 8 మూవీస్ - ఓటీటీ మూవీస్, వెబ్ సిరీస్‌ల ఫుల్ లిస్ట్ ఇదే!
ఒకే వారంలో 8 మూవీస్ - ఓటీటీ మూవీస్, వెబ్ సిరీస్‌ల ఫుల్ లిస్ట్ ఇదే!
Embed widget