News
News
X

Suryalanka Beach : బాపట్ల సూర్యలంక బీచ్ లో విషాదం, ఏడుగురు యువకులు గల్లంతు!

Suryalanka Beach : బాపట్ల సూర్యలంక తీరంలో విషాదం చోటుచేసుకుంది. బీచ్ కు విహారయాత్రకు వచ్చిన ఏడుగురు యువకులు గల్లంతయ్యారు.

FOLLOW US: 
Share:

Suryalanka Beach : బాపట్ల జిల్లా  సూర్యలంక సముద్రతీరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. విజయవాడ సింగ్ నగర్ కు చెందిన ఏడుగురు యువకులు విహారయాత్రకు బాపట్ల సూర్యలంక  బీచ్ కు వచ్చారు. సముద్రంలో స్నానం చేస్తుండగా అలల ఉద్ధృతికి యువకులు కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, గజఈతగాళ్లను రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిలో ఇద్దదిని గజ ఈతగాళ్లు రక్షించారు. మూడు మృతదేహాలను వెలికితీశారు.  మరో ఇద్దరి కోసం గజఈతగాళ్లు గాలిస్తున్నారు.  మృతులు విజయవాడకు చెందిన సిద్ధు, అభి, సాయి మధుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

చిలకలూరిపేటలో విషాదం 

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో విషాదం చోటుచేసుకుంది. పట్టణ పరిధిలోని ఓగేరు వాగులో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.  చిలకలూరిపేట పట్టణంలోని బొబ్బాల సత్యనారాయణ వీధికి చెందిన రమేష్ , స్రవంతిల కుమారుడు నూతలపాటి కార్తీక్ (14),  దాసరి బజారుకు చెందిన బాజిబాబు కుమారుడు పి. మోహనసాయి అనీష్(13)లు స్నేహితులు. నూతలపాటి కార్తీక్ స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. మోహన సాయి అనీష్(13)  మరో ప్రైవేటు పాఠశాలలో ఏడో తరగతి  చదువుతున్నారు. వీరు సోమవారం క్రికెట్ ఆడుకోడానికి బయటకువెళ్లారు. అనంతరం అక్కడకు సమీపంలోని ఓగేరువాగులో ఈతకు దిగారు. పట్టుతప్పి వాగులో కొట్టుకుపోతుండగా విద్యార్థుల కేకలు విన్న స్థానికులు అక్కడకు చేరుకొని వాగులో నుంచి వారిని బయటకు తీసుకువచ్చారు. వారిద్దరనీ పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు అప్పటికే వారు మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం వారిని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. 

 కోతులు వెంటబడడంతో 

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మామిడి పల్లిలో నలుగురు చిన్నారుల విషాదం తీవ్రoగా కలిచివేసింది. గ్రామంలో పండగ పూట విషాద ఛాయలు అలుముకున్నాయి. సరదాగా ఆడుకుంటుండగా కోతులు రావటంతో చిన్నారులు భయపడ్డారు.  కోతుల భయంతో నలుగురు పరుగులు తీశారు. ఊరు చివరన ఉన్న చెరువులో నలుగురు చిన్నారులు దుకేశారు. నలుగురిలో ఇద్దరు చిన్నారులు చనిపోయారు. గమనించిన గ్రామస్తులు ఇద్దరిని కాపాడారు. మరో ఇద్దరిని కాపాడే సమయానికి అప్పటికే వారు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మృతుల కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది.

Also Read : Nizamabad News: తమకిష్టంలేని పెళ్లి చేసుకుందని గర్భిణీని బలవంతంగా లాక్కెళ్లిన కుటుంబ సభ్యులు

Also Read : Karnataka Road Accident: బాబు చికిత్స కోసం రూ.1 కోటి సమకూరినా, ట్రీట్‌మెంట్‌కు వెళ్తుంటే తీవ్ర విషాదం

Published at : 04 Oct 2022 02:35 PM (IST) Tags: AP News Bapatla News Surya lanka beach seven youth drowned

సంబంధిత కథనాలు

Jangareddygudem Knife Attack : ఏలూరు జిల్లాలో దారుణం, పొలంలో భర్త ఇంట్లో భార్య, కుమారుడు రక్తపు మడుగులో

Jangareddygudem Knife Attack : ఏలూరు జిల్లాలో దారుణం, పొలంలో భర్త ఇంట్లో భార్య, కుమారుడు రక్తపు మడుగులో

Tirupati: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సజీవ దహనం, కారుతోసహా తగలబెట్టిన దుండగులు

Tirupati: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సజీవ దహనం, కారుతోసహా తగలబెట్టిన దుండగులు

TSPSC పేపర్ లీకేజీ కేసులో రేణుకకు షాక్ - ఆమె రిక్వెస్ట్ ను తోసిపుచ్చిన నాంపల్లి కోర్టు

TSPSC పేపర్ లీకేజీ కేసులో రేణుకకు షాక్ - ఆమె రిక్వెస్ట్ ను తోసిపుచ్చిన నాంపల్లి కోర్టు

Tirupati Crime : విద్యార్థినికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్న లెక్చరర్, నిందితుడికి అంతకు ముందే పెళ్లి!

Tirupati Crime :  విద్యార్థినికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్న లెక్చరర్, నిందితుడికి అంతకు ముందే పెళ్లి!

Data Theft Case : వినయ్ భరద్వాజ ల్యాప్ టాప్ లో 66.9 కోట్ల మంది డేటా- 24 రాష్ట్రాలు, 8 మెట్రోపాలిటిన్ సిటీల్లో డేటా చోరీ

Data Theft Case : వినయ్ భరద్వాజ ల్యాప్ టాప్ లో 66.9 కోట్ల మంది డేటా- 24 రాష్ట్రాలు, 8 మెట్రోపాలిటిన్ సిటీల్లో డేటా చోరీ

టాప్ స్టోరీస్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

SRH Vs RR: టాస్ రైజర్స్‌దే - బౌలింగ్‌కు మొగ్గు చూపిన భువీ!

SRH Vs RR: టాస్ రైజర్స్‌దే - బౌలింగ్‌కు మొగ్గు చూపిన భువీ!

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం