అన్వేషించండి

వలసపాక కేంద్రీయ విద్యాలయంలో కలకలం- స్పృహ తప్పి పడిపోయిన 30 మంది విద్యార్థులు

కాకినాడ వలసపాక కేంద్రీయ విద్యాలయంలో 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఊపిరాడక పోవడం వల్లే ఇలా జరిగిందని ఉపాధ్యాయులు, విద్యార్థులు చెబుతున్నారు.

కాకినాడ రూరల్ జిల్లా వలసపాక కేంద్రీయ విద్యాలయంలో 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గుర్యయారు. 5, 6వ తరగతి చదువుతున్న వీరు ఉన్నట్టుండి ఒక్కసారిగా పడిపోయారు. విషయం గుర్తించిన పాఠశాల సిబ్బంది వెంటనే వీరందరినీ వలసపాకలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అసలు వీళ్లంతా ఎందుకు అస్వస్థతకు గురయ్యారనే విషయం మాత్రం ఇంకా తెలియలేదు. పాఠశాల సిబ్బంది సమాచారంతో పిల్లల తల్లిదండ్రులు, పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏమైందో తెలుసుకునే పనిలో పోలీసులు పడగా... తమ పిల్లలకు ఏమైందో తెలియక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థులను జీజీహెచ్ ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే విద్యార్థుల అస్వస్థతకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియలేదని... రక్త నమూనాలను వైద్యులు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. 

ఘటనపై ఆరా తీసిన మంత్రి బొత్స..

కాకినాడ వలసపాకలోని కేంద్రీయ విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆస్పత్రికి ఫోన్ చేశారు. అసలేమైందో కనుక్కోవాలని.. పిల్లలందరికీ మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. తల్లిదండ్రులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని.. త్వరలోనే ఘటనకు గల కారణాలను తెలుసుకుంటామన్నారు. అనంతర కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాకు ఫోన్ చేసి మాట్లాడారు. సంఘటనా స్థలానికి ఉన్నతాధికారులను పంపించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను ఆదేశించారు.

కర్నూలులో 22 మంది విద్యార్థులకు అస్వస్థత..

కర్నూలు జిల్లా పత్తికొండ మండలం చక్కరాళ్ల  గ్రామంలోని ప్రభుత్వం పాఠశాలలో నెల రోజుల క్రితం ఫుడ్ పాయిజన్ అయింది. మధ్యాహ్న భోజనంలో పెట్టిన గుడ్లు తిని 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఉడికీ ఉడకని బియ్యం, కుళ్లిన కోడిగుడ్లు..

రాష్ట్ర ప్రభుత్వం జగనన్న గోరుముద్ద పేరుతో విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటోందని కానీ కర్నూలు జిల్లాలో చాలా పాఠశాలలో విద్యార్థులకు పౌష్టికాహారం పెట్టకుండా ఉడికీ ఉడకని బియ్యం, కుళ్లిన కోడిగుడ్లు పెడుతున్నారని ఎస్ఎఫ్ఐ నేతలు ఆరోపించారు. పత్తికొండ మండలంలో చక్కరాళ్ల  గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చెడిపోయిన గుడ్లు పెట్టడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ఆరోపించారు. వారం రోజుల క్రితం కోడుమూరులో ఇలాంటి ఘటనే జరిగిందన్నారు. అయినా అధికారులు మాత్రం పట్టి పట్టినట్టు వ్యవహరిస్తున్నారన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యత లేకుండా పోతుందని విమర్శించారు. ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఫుడ్ ఇన్స్పెక్టర్లు, డీఈఓలు పాఠశాలలను తరచూ పరిశీలించాలని కోరుతున్నారు. కుళ్లిపోయిన గుడ్లు, ఉడికీ ఉడకని బియ్యం, పురుగులతో ఉన్న కూరగాయలు ఇలాంటివి పెట్టకుండా జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

చిక్కీలో పురుగులు..

పత్తికొండ బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జగనన్న గోరుముద్ద కింద పంపిణీ చేసిన చిక్కీలలో పురుగులు ఉన్నట్లు విద్యార్థులు గుర్తించారు. చిక్కీలో పురుగులు చూసి విద్యార్థులు ఉపాధ్యాయులకు తెలియజేశారు. దీనిపై పాఠశాల హెడ్ మాస్టర్ స్పందించారు. కొన్ని చిక్కీలలో పురుగులు ఉన్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆ చిక్కీలను బదులుగా వేరే చిక్కీలను విద్యార్థులకు ఇచ్చామన్నారు. అయితే డేట్ ఎక్స్‌పైర్ అయిన చిక్కీలు ఇస్తున్నారని, మధ్యాహ్నం భోజనంలో కూడా పురుగులు వస్తున్నాయని విద్యార్థులు అంటున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

HILTP Land Scam: హిల్ట్‌ భూములపై బీఆర్ఎస్ పోరాటం.. 2 రోజులపాటు క్షేత్రస్థాయి పరిశీలనకు నేతలు
హిల్ట్‌ భూములపై బీఆర్ఎస్ పోరాటం.. 2 రోజులపాటు క్షేత్రస్థాయి పరిశీలనకు నేతలు
8th Pay Commission: 8వ పే కమిషన్‌ అమలుకు ముందే DA, DR విలీనంపై కేంద్ర కీలక ప్రకటన..
8వ పే కమిషన్‌ అమలుకు ముందే DA, DR విలీనంపై కేంద్ర కీలక ప్రకటన..
Quantum Valley Building Designs: అమరావతిలో క్వాంటం వ్యాలీ బిల్డింగ్ డిజైన్స్ ఇవే.. రాజధానిలో 50 ఎకరాలు కేటాయింపు
అమరావతిలో క్వాంటం వ్యాలీ బిల్డింగ్ డిజైన్స్ ఇవే.. రాజధానిలో 50 ఎకరాలు కేటాయింపు
IPL 2026 Auction: ఐపీఎల్ 2026 మినీ వేలం కోసం 1355 మంది ప్లేయర్లు.. వారి కోసం హోరాహోరీ తప్పదా!
ఐపీఎల్ 2026 మినీ వేలం కోసం 1355 మంది ప్లేయర్లు.. వారి కోసం హోరాహోరీ తప్పదా!
Advertisement

వీడియోలు

Virendra Sehwag Comments on Virat Kohli | వైరల్ అవుతున్న సెహ్వాగ్ కామెంట్స్
Hardik Pandya in Ind vs SA T20 | టీ20 సిరీస్‌ లో హార్దిక్ పాండ్య ?
Gambhir vs Seniors in Team India | టీమ్‌ఇండియాలో ఏం జరుగుతోంది?
Ashwin Comments on Team India Selection | మేనేజ్‌మెంట్ పై అశ్విన్ ఫైర్
India vs South Africa First ODI in Ranchi | సౌతాఫ్రికా సూపర్ ఫైట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HILTP Land Scam: హిల్ట్‌ భూములపై బీఆర్ఎస్ పోరాటం.. 2 రోజులపాటు క్షేత్రస్థాయి పరిశీలనకు నేతలు
హిల్ట్‌ భూములపై బీఆర్ఎస్ పోరాటం.. 2 రోజులపాటు క్షేత్రస్థాయి పరిశీలనకు నేతలు
8th Pay Commission: 8వ పే కమిషన్‌ అమలుకు ముందే DA, DR విలీనంపై కేంద్ర కీలక ప్రకటన..
8వ పే కమిషన్‌ అమలుకు ముందే DA, DR విలీనంపై కేంద్ర కీలక ప్రకటన..
Quantum Valley Building Designs: అమరావతిలో క్వాంటం వ్యాలీ బిల్డింగ్ డిజైన్స్ ఇవే.. రాజధానిలో 50 ఎకరాలు కేటాయింపు
అమరావతిలో క్వాంటం వ్యాలీ బిల్డింగ్ డిజైన్స్ ఇవే.. రాజధానిలో 50 ఎకరాలు కేటాయింపు
IPL 2026 Auction: ఐపీఎల్ 2026 మినీ వేలం కోసం 1355 మంది ప్లేయర్లు.. వారి కోసం హోరాహోరీ తప్పదా!
ఐపీఎల్ 2026 మినీ వేలం కోసం 1355 మంది ప్లేయర్లు.. వారి కోసం హోరాహోరీ తప్పదా!
Psych Siddhartha Trailer : 'సైక్ సిద్దార్థ్' ట్రైలర్ వచ్చేసింది - టీజర్‌తో కంపేర్ చేస్తే...
'సైక్ సిద్దార్థ్' ట్రైలర్ వచ్చేసింది - టీజర్‌తో కంపేర్ చేస్తే...
Honda Amaze Vs Maruti Dzire: రెండు కార్లకూ 5 స్టార్ రేటింగ్! కానీ స్కోర్లు, సేఫ్టీ ఫీచర్లలో ఏ కార్ బెస్ట్?
Honda Amaze Vs Maruti Dzire: ఏది ఎక్కువ సేఫ్‌, భారత్ NCAP రేటింగ్‌లో ఏది ముందుంది?
ఇన్‌స్టాలో పరిచయం, కులాంతర ప్రేమ వివాహం.. కొన్ని నెలల్లోనే ఐఏఎస్ కుమార్తె ఆత్మహత్య
ఇన్‌స్టాలో పరిచయం, కులాంతర ప్రేమ వివాహం.. కొన్ని నెలల్లోనే ఐఏఎస్ కుమార్తె ఆత్మహత్య
Mowgli Trailer : యాంకర్ సుమ కొడుకు రోషన్ న్యూ మూవీ 'మోగ్లీ' - ఫారెస్ట్‌లో హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ ట్రైలర్
యాంకర్ సుమ కొడుకు రోషన్ న్యూ మూవీ 'మోగ్లీ' - ఫారెస్ట్‌లో హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ ట్రైలర్
Embed widget