అన్వేషించండి

వలసపాక కేంద్రీయ విద్యాలయంలో కలకలం- స్పృహ తప్పి పడిపోయిన 30 మంది విద్యార్థులు

కాకినాడ వలసపాక కేంద్రీయ విద్యాలయంలో 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఊపిరాడక పోవడం వల్లే ఇలా జరిగిందని ఉపాధ్యాయులు, విద్యార్థులు చెబుతున్నారు.

కాకినాడ రూరల్ జిల్లా వలసపాక కేంద్రీయ విద్యాలయంలో 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గుర్యయారు. 5, 6వ తరగతి చదువుతున్న వీరు ఉన్నట్టుండి ఒక్కసారిగా పడిపోయారు. విషయం గుర్తించిన పాఠశాల సిబ్బంది వెంటనే వీరందరినీ వలసపాకలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అసలు వీళ్లంతా ఎందుకు అస్వస్థతకు గురయ్యారనే విషయం మాత్రం ఇంకా తెలియలేదు. పాఠశాల సిబ్బంది సమాచారంతో పిల్లల తల్లిదండ్రులు, పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏమైందో తెలుసుకునే పనిలో పోలీసులు పడగా... తమ పిల్లలకు ఏమైందో తెలియక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థులను జీజీహెచ్ ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే విద్యార్థుల అస్వస్థతకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియలేదని... రక్త నమూనాలను వైద్యులు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. 

ఘటనపై ఆరా తీసిన మంత్రి బొత్స..

కాకినాడ వలసపాకలోని కేంద్రీయ విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆస్పత్రికి ఫోన్ చేశారు. అసలేమైందో కనుక్కోవాలని.. పిల్లలందరికీ మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. తల్లిదండ్రులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని.. త్వరలోనే ఘటనకు గల కారణాలను తెలుసుకుంటామన్నారు. అనంతర కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాకు ఫోన్ చేసి మాట్లాడారు. సంఘటనా స్థలానికి ఉన్నతాధికారులను పంపించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను ఆదేశించారు.

కర్నూలులో 22 మంది విద్యార్థులకు అస్వస్థత..

కర్నూలు జిల్లా పత్తికొండ మండలం చక్కరాళ్ల  గ్రామంలోని ప్రభుత్వం పాఠశాలలో నెల రోజుల క్రితం ఫుడ్ పాయిజన్ అయింది. మధ్యాహ్న భోజనంలో పెట్టిన గుడ్లు తిని 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఉడికీ ఉడకని బియ్యం, కుళ్లిన కోడిగుడ్లు..

రాష్ట్ర ప్రభుత్వం జగనన్న గోరుముద్ద పేరుతో విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటోందని కానీ కర్నూలు జిల్లాలో చాలా పాఠశాలలో విద్యార్థులకు పౌష్టికాహారం పెట్టకుండా ఉడికీ ఉడకని బియ్యం, కుళ్లిన కోడిగుడ్లు పెడుతున్నారని ఎస్ఎఫ్ఐ నేతలు ఆరోపించారు. పత్తికొండ మండలంలో చక్కరాళ్ల  గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చెడిపోయిన గుడ్లు పెట్టడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ఆరోపించారు. వారం రోజుల క్రితం కోడుమూరులో ఇలాంటి ఘటనే జరిగిందన్నారు. అయినా అధికారులు మాత్రం పట్టి పట్టినట్టు వ్యవహరిస్తున్నారన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యత లేకుండా పోతుందని విమర్శించారు. ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఫుడ్ ఇన్స్పెక్టర్లు, డీఈఓలు పాఠశాలలను తరచూ పరిశీలించాలని కోరుతున్నారు. కుళ్లిపోయిన గుడ్లు, ఉడికీ ఉడకని బియ్యం, పురుగులతో ఉన్న కూరగాయలు ఇలాంటివి పెట్టకుండా జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

చిక్కీలో పురుగులు..

పత్తికొండ బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జగనన్న గోరుముద్ద కింద పంపిణీ చేసిన చిక్కీలలో పురుగులు ఉన్నట్లు విద్యార్థులు గుర్తించారు. చిక్కీలో పురుగులు చూసి విద్యార్థులు ఉపాధ్యాయులకు తెలియజేశారు. దీనిపై పాఠశాల హెడ్ మాస్టర్ స్పందించారు. కొన్ని చిక్కీలలో పురుగులు ఉన్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆ చిక్కీలను బదులుగా వేరే చిక్కీలను విద్యార్థులకు ఇచ్చామన్నారు. అయితే డేట్ ఎక్స్‌పైర్ అయిన చిక్కీలు ఇస్తున్నారని, మధ్యాహ్నం భోజనంలో కూడా పురుగులు వస్తున్నాయని విద్యార్థులు అంటున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Visakhapatnam Crime News: డీప్ ఫ్రిజ్‌లో డెడ్‌బాడీ.. భార్య లేని సమయంలో ప్రియురాలిని పిలిచి ముక్కలుగా నరికిన నేవీ ఉద్యోగి
విశాఖలో డీప్ ఫ్రిజ్‌లో డెడ్‌బాడీ.. భార్య లేని సమయంలో ప్రియురాలిని పిలిచి ముక్కలుగా నరికిన నేవీ ఉద్యోగి
Female cop kills father: పేరుకే పోలీసు - కానీ తండ్రినే చంపిన హంతకురాలు - ఈమెకు ఏ శిక్ష కరెక్ట్ ?
పేరుకే పోలీసు - కానీ తండ్రినే చంపిన హంతకురాలు - ఈమెకు ఏ శిక్ష కరెక్ట్ ?
GST scam busted: ఫేక్ కంపెనీలతో రూ.217 కోట్ల జీఎస్టీ స్కాం - ముఠా పట్టివేత - తెర వెనుక బడా వ్యక్తులు?
ఫేక్ కంపెనీలతో రూ.217 కోట్ల జీఎస్టీ స్కాం - ముఠా పట్టివేత - తెర వెనుక బడా వ్యక్తులు?
Allahabad High Court: వివాహితుడు మరో మహిళతో సహజీవనం చేయడం నేరంకాదు! అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు!
వివాహితుడు మరో మహిళతో సహజీవనం చేయడం నేరంకాదు! అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు!

వీడియోలు

Rohit Sharma Fastest Half Century IPL 2026 | ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన రోహిత్ | ABP Desam
Rohit Dance in Front of Injured Rahane | రహానే కింద పడిపోతే.. రోహిత్ డాన్స్ | ABP Desam
Rahane Innings KKR vs MI IPL 2026 | వాంఖడేలో కేకేఆర్ పరుగుల విధ్వంసం | ABP Desam
IPL 2026 Mumbai Indians Vs KKR IPL 2026 | ఐపీఎల్ 2026లో ముంబై రికార్డు ఛేజింగ్ | ABP Desam
Heinrich Klaasen Controversial Out vs RCB | థర్డ్ అంపైర్‌పై సునీల్ గవాస్కర్ ఫైర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: అమెరికా అధ్యక్షుడికి షాకిచ్చిన నెతన్యాహు.. ఇరాన్‌‌లో గ్రౌండ్ ఆపరేషన్‌తో సంబంధం లేదన్న ఇజ్రాయెల్
అమెరికా అధ్యక్షుడికి షాకిచ్చిన నెతన్యాహు.. ఇరాన్‌‌లో గ్రౌండ్ ఆపరేషన్‌తో సంబంధం లేదన్న ఇజ్రాయెల్
Inner Ring Road Case: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
AP Coaching Institutions Rules 2026: ఏపీలో కోచింగ్ సెంటర్ల ఆగడాలకు చెక్ … ఇష్టారాజ్యం కుదరదు.. ఏపీ ప్రభుత్వం కొత్త రూల్స్
ఏపీలో కోచింగ్ సెంటర్ల ఆగడాలకు చెక్ … ఇష్టారాజ్యం కుదరదు.. ఏపీ ప్రభుత్వం కొత్త రూల్స్
JEE Mains 2026 Admit Cards: జేఈఈ మెయిన్స్ సెషన్ 2 అడ్మిట్ కార్డ్స్ విడుదల.. ఈ విధంగా డౌన్‌లోడ్ చేసుకోండి
జేఈఈ మెయిన్స్ సెషన్ 2 అడ్మిట్ కార్డ్స్ విడుదల.. ఈ విధంగా డౌన్‌లోడ్ చేసుకోండి
Hardik Pandya Luxury Car: హార్దిక్ పాండ్యా లగ్జరీ కార్ల కలెక్షన్ , ఇండియాలోనే ఫస్ట్ ఓనర్‌గా రికార్డు!
హార్దిక్ పాండ్యా లగ్జరీ కార్ల కలెక్షన్ , ఇండియాలోనే ఫస్ట్ ఓనర్‌గా రికార్డు!
CSK vs RR: చెన్నై కష్టాలను పెంచగల రాజస్థాన్ ఆటగాళ్లు వీరే.. లిస్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు
చెన్నై కష్టాలను పెంచగల రాజస్థాన్ ఆటగాళ్లు వీరే.. లిస్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు
Rahul Banerjee : షూటింగ్ టైంలో యాక్సిడెంట్ - నీట మునిగి సీరియల్ నటుడు మృతి... అసలేం జరిగిందంటే?
షూటింగ్ టైంలో యాక్సిడెంట్ - నీట మునిగి సీరియల్ నటుడు మృతి... అసలేం జరిగిందంటే?
Maoist Surrender: మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు నారాయణ రావు లొంగుబాటు.. మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఏపీ
మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు నారాయణ రావు లొంగుబాటు.. మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఏపీ
Embed widget