అన్వేషించండి

Maharashtra: బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు, 14 మంది సజీవదహనం

Maharashtra Bus Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 30 మందితో వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి 14 మంది సజీవ దహనం అయ్యారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.

Maharashtra Bus Accident: మహారాష్ట్రలోని నాసిక్​లో ఘోర ప్రమాదం జరిగింది. 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సులో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. ఈ ఘటలో 14 మంది సజీవ దహనం అయ్యారు. మరికొంత మంది ప్రయాణికులు తీవ్ర గాయాల పాలయ్యారు. విషయం గుర్తించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు.

అసలేం జరిగిందంటే?

శుక్రవారం రాత్రి యవత్మాల్ నుంచి నాసిక్ వైపు 30 మందికి పైగా ప్రయాణికులతో ఓ ప్రైవేటు బస్సు బయలు దేరింది. శనివారం వేకువ జామున 4.20 గటంల సమంలో నాసిక్-ఔరంగాబాద్ రబదారిపై ఈ ప్రమాదం జరిగింది. హోటల్ చిల్లీ చౌక్ వద్ద అదుపుతప్పి ట్రక్కుకను బస్సు ఢీకొట్టింది. దీంతో లారీ డీజిల్ ట్యాంక్ బ్లాస్ట్ అయింది. అయితే బస్సు వెంటనే మరో కారును ఢీకొట్టింది. ఆ తర్వాత బస్సులో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో ప్రయాణికులంతా నిద్ర పోతున్నారు.  విషయం గుర్తించిన స్థానిక ప్రజలు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈటవపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

"ఈ సంఘటన మా ఇంటి దగ్గర జరిగింది. ఇక్కడ భారీ వాహనాలు తిరుగుతుంటాయి. ఈ ఘటన తర్వాత బస్సులో మంటలు చెలరేగి ప్రజలు సజీవ దహనం అయ్యారు. మేము చూస్తూనే ఉండిపోయాం కానీ ఏం చేయలేకపోయాం. అగ్నిమాపక శాఖ, పోలీసులు తర్వాత వచ్చారు," -  ప్రత్యక్ష సాక్షి

నిన్నటికి నిన్న కేరళలో తొమ్మిది మంది మృతి..

నిన్నటికి నిన్న కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్‌ విద్యార్థుల బస్సు.. ఆర్టీసీని ఢీ కొట్టిన ఘటనలో మొత్తం 9 మంది మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నారు.

ట్రిప్ కోసం

పాలక్కాడ్ జిల్లాలోని వడక్కంచెరిలో కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) బస్సును టూరిస్ట్ బస్సు ఢీ కొంది. ఈ ఘటనలో తొమ్మిది మంది మరణించారు. 38 మంది గాయపడ్డారు. టూరిస్ట్ బస్సులో ఎర్నాకులం జిల్లాలోని బసేలియోస్ విద్యానికేతన్ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నారు. టూరిస్ట్ బస్సు ఊటీకి వెళ్తోంది.

ఇలా జరిగింది

టూరిస్టు బస్సు వెనుక నుంచి కేఎస్‌ఆర్‌టీసీ బస్సును ఢీ కొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. బసేలియోస్ విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులతో కూడిన టూరిస్ట్ బస్సు ఎర్నాకులం నుంచి ఊటీకి విహారయాత్ర కోసం వెళుతుంది. KSRTC బస్సు కోయంబత్తూరుకు వెళుతుంది. మృతుల్లో ఐదుగురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు, కేఎస్‌ఆర్‌టీసీ బస్సులోని ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు. మొత్తం 38 మంది ప్రయాణికులను ఆసుపత్రిలో చేర్చారు. 

"ఎర్నాకులం నుంచి ఊటీ వెళ్తోన్న ఓ టూరిస్ట్ బస్సు.. పాలక్కాడ్ వడక్కంచెరిలో హైవేపైన ఉన్న కేఎస్‌ఆర్‌టీసీ బస్సును వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో మొత్తం 9 మంది మృతి చెందారు. ఐదుగురికి తీవ్ర గాయలయ్యాయి. 40 మందికి సాధారణ గాయలయ్యాయి. వీరంతా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నారు." -ఎమ్‌బీ రాజేశ్, కేరళ రవాణా మంత్రి
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Kishan Reddy : ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Sai Pallavi: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP DesamChhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP DesamVicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP DesamMLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Kishan Reddy : ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Sai Pallavi: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
Stampedes in Railway Stations: రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
Jayalalitha Assets: 1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
Yashasvi Jaiswal:  ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా ప్లేయర్ దూరం.. గాయం కారణంగా స్వదేశంలో..
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా ప్లేయర్ దూరం.. గాయం కారణంగా స్వదేశంలో..
New Delhi Railway Station Stampede: ఢిల్లీలో తొక్కిసలాటపై రైల్వే శాఖ కీలక నిర్ణయం, విచారణ కమిటీ ఏర్పాటు
ఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాటపై రైల్వే శాఖ కీలక నిర్ణయం, విచారణ కమిటీ ఏర్పాటు
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.