అన్వేషించండి

Pawan Kalyan: కాళ్ల బేరానికి వచ్చిన మూడు గంటల్లోనే పాకిస్థాన్ తోక జాడించింది: పవన్ కళ్యాణ్

Pakistan violates ceasefire | పాకిస్థాన్ కాల్పుల విరమణ నాటకాలను ఎవరూ నమ్మవద్దు, పాక్ దుశ్చర్యలకు ఎక్కడో ఒక చోట ముగింపు పలకాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.

Jawan Murali Naik | గోరంట్ల: ‘మన దేశం ఎప్పుడూ యుద్ధం కావాలని కోరుకోలేదు. పొరుగు దేశాల మీద యుద్ధాలు చేసిందీ లేదు. మనల్ని మనం సంరక్షించుకోవడానికి ఇప్పుడు యుద్ధం చేయక తప్పని పరిస్థితి. పాకిస్థానే ఈ పరిస్థితికి కారణమ’ని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కాళ్ల బేరానికి వచ్చి కాల్పుల విరమణ ప్రకటించిన మూడు గంటల్లోనే పాకిస్థాన్ ఒప్పందాన్ని ఉల్లంఘించి తోక జాడించిందన్నారు. కాల్పుల విరమణను మనం ఎవరూ నమ్మవద్దన్నారు. పాకిస్థాన్ అరాచకాలు మన దేశానికి ఇబ్బందిగా మారాయని చెప్పారు. ఈ దుశ్చర్యలకు ఎక్కడో ఒక చోట ముగింపు పలికేలా పాకిస్థాన్ కు గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుణపాఠం చెప్పాలని ప్రజలు కోరుకుంటున్నట్టు తెలిపారు.

మురళీ నాయక్ తల్లిదండ్రులను ఓదార్చిన మంత్రులు

ఆపరేషన్ సిందూర్ లో వీర మరణం పొందిన అమర జవాను మురళీ నాయక్ భౌతికకాయానికి ఆదివారం ఉదయం శ్రీ సత్యసాయి జిల్లా, గోరంట్ల మండలం, కళ్లితండాలో నివాళులు అర్పించారు. మురళీ నాయక్ తల్లిదండ్రులు జ్యోతి బాయి, శ్రీరాం నాయక్ ను ఓదార్చారు. చిన్న వయసులో మురళీ నాయక్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. 

రైల్వే ఉద్యోగం వచ్చినా కాదనుకుని..

ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ “ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి నేపథ్యంలోనే పాకిస్థాన్ కి అండగా ఉన్న టెర్రరిస్ట్ క్యాంపుల మీద భారత ఆర్మీ దాడి చేసి ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేసింది. అందుకు ప్రతిగా సరిహద్దుల్లో పాకిస్థాన్ కూడా కాల్పులు ప్రారంభించడంతో దేశంలోని ఐదు సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఉద్రిక్తతల్లో అగ్నివీర్ గా 2022లో విధుల్లో చేరిన ఆంధ్రప్రదేశ్ కి చెందిన మురళీ నాయక్ అమరులయ్యారు. రైల్వే ఉద్యోగం వచ్చినా కాదనుకుని దేశం కోసం పని చేయాలనుకున్న యువకుడు మురళీ నాయక్. అవసరం అయితే దేశం కోసం ప్రాణాలు ఇస్తానని చెప్పి సైన్యంలో చేరిన 23 ఏళ్ల మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవాల్సి రావడం బాధాకరం. సరిహద్దుల్లో ఉగ్రదాడులు, యుద్ధాలు జరిగితే దాని ప్రభావం దేశం మొత్తం కనబడుతుంది అనడానికి ఇది మరో ఉదాహరణ. చిన్న వయసులోనే ఈ అగ్నివీరుడు మృతి చెందడం తీవ్రంగా కలచివేసింది.

పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంతో దేశానికి ముప్పు
ఉగ్రదాడికి వారం రోజుల ముందు పాకిస్థాన్ ఆర్మీ జనరల్ ఉగ్రవాదులను ప్రేరేపించి దాడికి ఉసిగొల్పారు. అనేక మంది అమాయకుల ప్రాణాలు అన్యాయంగా బలిగొన్నారు. 1947లో దేశం నుంచి విడిపోయారు. నాలుగుసార్లు యుద్ధాలు చేశారు. ఇప్పటికీ అమాయకులను పొట్టన పెట్టుకుంటున్నారు. అయినా పాకిస్థాన్ దాహం తీరలేదు. నిన్నటికి నిన్న కాల్పుల విరమణ అని ఒప్పుకొని దాన్ని ఉల్లంఘించిన ప్రభుత్వం అది. పాకిస్థాన్ కి ఒక విధానం అంటూ లేదు. వాళ్లు చేసే అరాచకాలు, పాక్ ప్రేరేపిత ఉగ్రవాద కార్యకలాపాలు భారత దేశానికి ఇబ్బందిగా మారాయి. ఢిల్లీ, ముంబై దాడులు కావచ్చు. కశ్మీర్ లో కావచ్చు, కోయంబత్తూర్, జమా మసీద్ పేలుళ్లు, గోకుల్ చాట్, లుంబినీ పార్క్ పేలుళ్లు కావచ్చు. వీటన్నింటికీ ఎక్కడో ఒక చోట ముగింపు పలకాలి. ప్రధాని మోదీ ప్రభుత్వం సరైన గుణపాఠం చెప్పాలని కోరుకుంటున్నారు. 

మురళీ నాయక్ కుటుంబానికి రూ. 25 లక్షల వ్యక్తిగత సాయం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరఫున, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరఫున మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 50 లక్షలు ఆర్ధిక సాయం చేయాలని నిర్ణయించాం. ఆ కుటుంబానికి ఐదు ఎకరాల స్థలం, 300 గజాల ఇంటి స్థలంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తాం. మురళీ నాయక్ స్మారక చిహ్నం ఏర్పాటు చేస్తాం. ఆ కుటుంబానికి ఇంకా ఎలాంటి సాయం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. వీర జవాను కుటుంబానికి నా వ్యక్తిగతంగా రూ. 25 లక్షల సాయం చేస్తాం. భవిష్యత్తులో ఇలాంటి దురదృష్టకర పరిస్థితులు రాకూడదని కోరుకుంటున్నాను. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశ ప్రధాన మంత్రి మోదీకి, నాయకులకు, సైన్యానికి దేశ ప్రజలంతా అండగా ఉండాలి. ప్రతి ఒక్కరు అప్రమత్తతతో ఉండాలి. తీవ్రవాదులు దేశం మీద రకరకాల దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కాల్పుల విరమణను ఎవరూ నమ్మవద్దు. కాల్పుల విరమణ శాంతికి ఒప్పందం కాదు. ప్రత్యేక పరిస్థితుల్లో పాకిస్థాన్ కాళ్ల బేరానికి వచ్చింది. కాళ్ల బేరానికి వచ్చిన మూడు గంటల్లోనే ఉల్లంఘనకు పాల్పడ్డారు. 

మురళీ నాయక్ నా అభిమాని కూడా అని తెలిసి చాలా బాధ కలిగింది. ఈ పరిస్థితుల్లో ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు రావడం బాధాకరం. మురళీ నాయక్ అందరికంటే దేశాన్ని ప్రేమించే వ్యక్తి. అలాంటి వ్యక్తిని కోల్పోవడం బాధ కలిగించింది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది” అన్నారు. జోహార్ మురళీ నాయక్ అంటూ నినదించారు. కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, సవిత, పార్లమెంటు సభ్యులు పార్థసారధి, శాసన సభ్యులు అరవ శ్రీధర్, దగ్గుబాటి ప్రసాద్, పల్లె సింధూరరెడ్డి, ఎం.ఎస్. రాజు, హౌడా ఛైర్మన్, తదితరులు పాల్గొన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Rains Alert: ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Devansh Birthday:శ్రీవారి సన్నిధిలో చంద్రబాబు ఫ్యామిలీ! దేవాన్ష్ పుట్టిన రోజున తిరుమలలో అన్నదాన కార్యక్రమం! స్వయంగా వడ్డించిన సీఎం!
శ్రీవారి సన్నిధిలో చంద్రబాబు ఫ్యామిలీ! దేవాన్ష్ పుట్టిన రోజున తిరుమలలో అన్నదాన కార్యక్రమం! స్వయంగా వడ్డించిన సీఎం!
Andhra Pradesh Weather: ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన! రెండు రోజులు బీభత్సం! పిడుగులతో జనం బెంబేలు!
ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన! రెండు రోజులు బీభత్సం! పిడుగులతో జనం బెంబేలు!

వీడియోలు

Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Assembly Elections 2026: పురుషులకూ ఉచిత బస్సు, ఇంటికో ఫ్రిడ్జ్, దశలవారీ మద్యనిషేధం - అన్నాడీఎంకే మేనిఫెస్టోలో అన్నీ వింతలే
పురుషులకూ ఉచిత బస్సు, ఇంటికో ఫ్రిడ్జ్, దశలవారీ మద్యనిషేధం - అన్నాడీఎంకే మేనిఫెస్టోలో అన్నీ వింతలే
Fuel Crisis in Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
Konaseema Crime News: సామూహిక అత్యాచారం కేసులో సంచ‌ల‌న తీర్పు.. ముగ్గురికి జీవిత‌ఖైదు.. రూ.5.80 ల‌క్ష‌ల జ‌రిమానా..
సామూహిక అత్యాచారం కేసులో సంచ‌ల‌న తీర్పు.. ముగ్గురికి జీవిత‌ఖైదు.. రూ.5.80 ల‌క్ష‌ల జ‌రిమానా!
Bomb Threat: ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
RCB vs SRH Tickets Live: నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. ఆర్సీబీ, సన్‌రైజర్స్ మ్యాచ్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి
నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. RCB vs SRH Tickets ఎక్కడ తీసుకోవాలి
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
Professor Without a PhD : PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
Stock Market on 24 March: యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
Embed widget