అన్వేషించండి

Today Top Headlines: శ్రీవారి హుండీలో బంగారం చోరీకి యత్నం - తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM

Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Today Top Headlines In AP And Telangana:

1. శ్రీవారి హుండీలో బంగారం చోరీకి యత్నం

వైకుంఠ ద్వార దర్శనాలకు కలియుగ దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో అపచారం జరగకుండా అడ్డుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి పరకామణి బంగారం చోరీకి యత్నించిన అగ్రిగోస్ ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఉద్యోగి అడ్డంగా బుక్కయ్యాడు. బ్యాంకు ఉద్యోగి పెంచలయ్య దాదాపు వంద గ్రాముల పరకామణి బంగారం బిస్కెట్‌ ఎత్తుకెళ్తున్నాడు. విజిలెన్స్‌ సిబ్బంది తనిఖీలు నిర్వహించగా అతడి వద్ద గోల్డ్ బిస్కెట్ దొరకడం కలకలం రేపుతోంది. ఇంకా చదవండి.

2. రేషన్ బియ్యం మాయం కేసులో కీలక పరిణామం

ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని కుటుంబానికి చెందిన గోదాముల్లో బియ్యం తగ్గుదల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మచిలీపట్నంలోని గోదాముల్లో రేషన్ బియ్యం తగ్గుదల కేసులో మరో నలుగురు కొత్త నిందితుల్ని పోలీసులు గుర్తించారు. ఇప్పటికే అరెస్టైన నిందితుల్ని పోలీసులు విచారిస్తున్నారు. కానీ రెండో రోజు విచారణలో పేర్ని నాని, పేర్ని జయసుధల పీఏ మానస్ తేజ ఏ మాత్రం నోరు విప్పలేదు. బియ్యం మాయం కావడంలో ఎవరి పాత్ర లేదని, మొత్తం తానే చేశానని మాత్రమే చెబుతున్నాడు. ఇంకా చదవండి.

3. పల్లెకు సంక్రాంతి సందడి వచ్చేసింది

ఈ సారి భోగికి ముందు శని, ఆదివారాలు సెలవు కలిసి రావడంతో రెండు రోజులు ముందే సందడి  ఆరంభమైంది. ప్రజలు రాకపోకలు ప్రారంభం కావడంతో సంక్రాంతిపండగ ఓ కలల వేడుకగా పల్లెనిలుస్తోంది. అందులో ప్రధానంగా విద్యార్థులకు సంక్రాంతి పండగ సెలవులివ్వడం, ఉద్యోగులకు రెండు రోజులు ముందుసెలవులు కలిసి రావడంతో మరింత సందడిగా మారింది. పట్టణాల్లో వస్త్ర దుకాణాలు, మార్కెట్ కలకలలాడుతున్నాయి. ఆన్లైన్ వ్యాపారాలు జోరం దుకున్నా వస్త దుకాణాలు కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. ఇంకా చదవండి.

4. తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

కొత్త రేషన్ కార్డుల జారీతో పాటు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుపై తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. గత కొన్ని నెలలుగా కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం గ్రౌండ్ వర్క్ చేసింది. అదే విధంగా అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జనవరి 26 నుంచి తెలంగాణ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయడంతో పాటు అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇంకా చదవండి.

5. దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టు భారీ షాక్

దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత అంశంపై దగ్గుబాటి ఫ్యామిలీకి భారీ షాక్ తగిలింది. దగ్గుబాటి ఫ్యామిలీలో సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. దగ్గుబాటి ఫ్యామిలీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారిని విచారించాలని నాంపల్లి 17వ కోర్టు ఫిలిం నగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దక్కన్ కిచెన్ హోటల్ విషయంపై నందకుమార్, దగ్గుబాటి ఫ్యామిలీకి మధ్య వివాదం నెలకొంంది. తాను లీజుకు తీసుకున్న హోటల్ ను దగ్గుబాటి కుటుంబానికి చెందిన వారు కూల్చివేశారంటూ నందకుమార్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఇంకా చదవండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijaya brand controversy: విజయ బ్రాండ్ పేరుతో కల్తీ నెయ్యి, పాలు - ఏపీ లింక్ - గుత్తా అమిత్ సంచలన వ్యాఖ్యలు
విజయ బ్రాండ్ పేరుతో కల్తీ నెయ్యి, పాలు - ఏపీ లింక్ - గుత్తా అమిత్ సంచలన వ్యాఖ్యలు
Raisina Dialogue Chandrababu: నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
YS Sharmila: 25 వేల బోడి ప్రోత్సాహకం కోసం మూడో బిడ్డను కనాలనడం ప్రజలను ఎగతాళి చేయడమే - చంద్రబాబుపై షర్మిల విమర్శలు
25 వేల బోడి ప్రోత్సాహకం కోసం మూడో బిడ్డను కనాలనడం ప్రజలను ఎగతాళి చేయడమే - చంద్రబాబుపై షర్మిల విమర్శలు
Sri Ramanavami Brahmotsavams: మార్చి 26 నుంచి ఏప్రిల్ 05 వరకు ఒంటిమిట్ట‌ శ్రీ కోదండ‌రామ‌స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు!
మార్చి 26 నుంచి ఏప్రిల్ 05 వరకు ఒంటిమిట్ట‌ శ్రీ కోదండ‌రామ‌స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు!

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs NZ T20I World Cup Final: టీ20ల్లో భారత్, న్యూజిలాండ్ ముఖాముఖీ.. సెంచరీలు బాదడంలో టీమిండియా బ్యాటర్లదే హవా
టీ20ల్లో భారత్, న్యూజిలాండ్ ముఖాముఖీ.. సెంచరీలు బాదడంలో టీమిండియా బ్యాటర్లదే హవా
TVK Vijay Super Six: తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
Iran ship: భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
Secunderabad Railway Stations: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
Vijay Deverakonda: బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
Maoists surrender in Hyderabad: జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
Hyderabad to Kanyakumari Amrit Bharat Express : హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
Rapappa Song: అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
Embed widget