అన్వేషించండి

YS Sharmila: 25 వేల బోడి ప్రోత్సాహకం కోసం మూడో బిడ్డను కనాలనడం ప్రజలను ఎగతాళి చేయడమే - చంద్రబాబుపై షర్మిల విమర్శలు

Andhra Politics: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన ముగ్గురు బిడ్డల జనాభా విధానంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. మూడో బిడ్డను కనాలనడం ప్రజలను ఎగతాళి చేయడమేనన్నారు.

Sharmila criticizes Chandrababu Naidu population formula: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల  చేపట్టిన మన్రేగా  పరిరక్షణ యాత్ర ఏలూరు జిల్లా భీమడోలుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన కొత్త పాపులేషన్ పాలసీ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  

 ముగ్గురు బిడ్డల పాలసీపై షర్మిల ఆగ్రహం 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన ముగ్గురు బిడ్డల జనాభా విధానంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.  రాష్ట్రంలో ఉన్న బిడ్డలకే చదువు, ఉద్యోగాలు కల్పించలేని పరిస్థితి ఉంటే.. ఇప్పుడు కొత్తగా ముగ్గురు బిడ్డలను కనాలనడం హాస్యాస్పదం అని ఆమె విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చే  25,000 బోడి ప్రోత్సాహకం కోసం మూడో బిడ్డను కనాలనడం ప్రజలను ఎగతాళి చేయడమేనని, అసలు రాష్ట్రంలో ఆ బిడ్డలను పెంచే ఆర్థిక స్తోమత ఉందా అని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీలకే దిక్కులేదని, నిరుద్యోగులకు ఉద్యోగాల్లేక రోడ్లపాలవుతుంటే ఇటువంటి వింత పోకడలు అవసరమా అని  ప్రశ్నించారు. 

అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్ 

గత ఐదేళ్ల జగన్ పాలన, ప్రస్తుత చంద్రబాబు పాలన కలిసి రాష్ట్రాన్ని రూ.12 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చేశాయని షర్మిల ఆరోపించారు. సంక్షేమ పథకాలకు నిధులు లేవని, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో ఇవ్వలేని దయనీయ స్థితిలో ఏపీ ఉందన్నారు. ఆరోగ్యశ్రీకి  రూ. 3,000 కోట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.6,000 కోట్ల బకాయిలు పెట్టి, ప్రజలపై రూ.15,000 కోట్ల విద్యుత్ భారాలు మోపుతూ.. జనాభా పెంచమని చెప్పడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. మాఫియాలతో రాష్ట్రాన్ని దోచుకుంటూ ప్రజలకు సుద్దులు చెప్పడం మానుకోవాలని ఆమె హితవు పలికారు.

ఉపాధి హామీ పథకం నిర్వీర్యం 

కాంగ్రెస్ హయాంలో పేదలకు ఆసరాగా నిలిచిన  MGNREGA  పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 'VB G-RAM G' చట్టం పేరుతో పూర్తిగా నీరుగార్చిందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఇది గ్రామ స్వరాజ్యాన్ని వినాశనం చేసే అక్రమ చట్టమని, పనిని కాంట్రాక్టర్ల చేతుల్లో పెట్టి పేదలను బానిసలుగా మారుస్తున్నారని ఆరోపించారు. 100 రోజుల పని కల్పించడమే గగనమైన వేళ, 125 రోజులు ఇస్తామన్నది పచ్చి అబద్ధమని కొట్టిపారేశారు. కొత్త చట్టం వల్ల రాష్ట్రంపై అదనంగా  రూ. 5,000 కోట్ల భారం పడుతుందని, అయినా చంద్రబాబు దీనికి మద్దతు తెలపడం దారుణమన్నారు. 

 వైఎస్ఆర్ పాలన కాంగ్రెస్‌తోనే సాధ్యం 

జగన్ మోదీకి వంగి వంగి దండాలు పెడుతూ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని, చంద్రబాబు సైతం కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించడం లేదని ఆమె విమర్శించారు. రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి పథంలో పయనాలన్నా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ రావాలన్నా అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని షర్మిల స్పష్టం చేశారు. పేదల హక్కుల కోసం, ఉపాధి హామీ పరిరక్షణ కోసం తమ పోరాటం ఆగదని ఆమె ఈ సందర్భంగా ప్రకటించారు.            


 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP local polls plan: లోకల్‌పోల్స్‌లో అసలు టార్గెట్ కూటమి మధ్య చిచ్చే - వైసీపీ పక్కా ప్లాన్‌తో రెడీ అవుతోందా?
లోకల్‌పోల్స్‌లో అసలు టార్గెట్ కూటమి మధ్య చిచ్చే - వైసీపీ పక్కా ప్లాన్‌తో రెడీ అవుతోందా?
Moinabad Drugs Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం.. డ్రగ్స్ వాడటం ఇదే తొలిసారి కాదా? శాంపిల్స్‌లో మరిన్ని అవశేషాలు
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం.. డ్రగ్స్ వాడటం ఇదే తొలిసారి కాదా? శాంపిల్స్‌లో మరిన్ని అవశేషాలు
Dangerous bike smoke: బైక్ ఆన్ చేసి గదిలో ఉంచితే ప్రాణాలు మిగలవు - పుంగనూరు ఘటనలో జరిగింది ఇదే - ఎందుకంటే ?
బైక్ ఆన్ చేసి గదిలో ఉంచితే ప్రాణాలు మిగలవు - పుంగనూరు ఘటనలో జరిగింది ఇదే - ఎందుకంటే ?
East Godavari Crime News: తూర్పుగోదావరి జిల్లాలో వివాహిత‌ మ‌ర్డ‌ర్ అండ్ రేప్ కేసులో రాజ‌మండ్రి కోర్టు సంచ‌ల‌న తీర్పు; మృగాళ్ల‌కు జీవిత ఖైదు,జ‌రిమానా!
తూర్పుగోదావరి జిల్లాలో వివాహిత‌ మ‌ర్డ‌ర్ అండ్ రేప్ కేసులో రాజ‌మండ్రి కోర్టు సంచ‌ల‌న తీర్పు; మృగాళ్ల‌కు జీవిత ఖైదు,జ‌రిమానా!
Advertisement

వీడియోలు

AIMIM MLAs Walkout Vandematarm | తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రుల ఫైర్ | ABP Desam
Jay Shah Smashes T20W C 2026 Controversies | పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు జై షా వార్నింగ్ | ABP Desam
Abhishek Sharma T20WC 2026 Secret Revealed | అభిషేక్ కు గంభీర్ సలహా | ABP Desam
Rishabh Pant Transformation IPL 2026 | యువరాజ్ సింగ్ శిక్షణలో రిషబ్ పంత్ | ABP Desam
Sanju Samson Funny Advice to Abhishek | అభిషేక్ శర్మకు సంజూ పెళ్లి సలహా | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pakistan Airstrike: కాబూల్‌లో పాక్ వైమానిక దాడులు.. 400 మందికి పైగా మృతి- హాస్పిటల్స్, నివాస ప్రాంతాలే టార్గెట్
కాబూల్‌లో పాక్ వైమానిక దాడులు.. 400 మందికి పైగా మృతి- హాస్పిటల్స్, నివాస ప్రాంతాలే టార్గెట్
YSRCP local polls plan: లోకల్‌పోల్స్‌లో అసలు టార్గెట్ కూటమి మధ్య చిచ్చే - వైసీపీ పక్కా ప్లాన్‌తో రెడీ అవుతోందా?
లోకల్‌పోల్స్‌లో అసలు టార్గెట్ కూటమి మధ్య చిచ్చే - వైసీపీ పక్కా ప్లాన్‌తో రెడీ అవుతోందా?
Kerala Assembly Elections 2026: కేరళంలో కాంగ్రెస్‌కు డూ ఆర్ డై ఎన్నికలు - మూడోసారీ ఓడిపోతే బీజేపీదే ఆ స్థానం !
కేరళంలో కాంగ్రెస్‌కు డూ ఆర్ డై ఎన్నికలు - మూడోసారీ ఓడిపోతే బీజేపీదే ఆ స్థానం !
Jeevan Reddy: జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Iran War Updates: నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Embed widget