అన్వేషించండి

YS Sharmila: 25 వేల బోడి ప్రోత్సాహకం కోసం మూడో బిడ్డను కనాలనడం ప్రజలను ఎగతాళి చేయడమే - చంద్రబాబుపై షర్మిల విమర్శలు

Andhra Politics: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన ముగ్గురు బిడ్డల జనాభా విధానంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. మూడో బిడ్డను కనాలనడం ప్రజలను ఎగతాళి చేయడమేనన్నారు.

Sharmila criticizes Chandrababu Naidu population formula: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల  చేపట్టిన మన్రేగా  పరిరక్షణ యాత్ర ఏలూరు జిల్లా భీమడోలుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన కొత్త పాపులేషన్ పాలసీ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  

 ముగ్గురు బిడ్డల పాలసీపై షర్మిల ఆగ్రహం 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన ముగ్గురు బిడ్డల జనాభా విధానంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.  రాష్ట్రంలో ఉన్న బిడ్డలకే చదువు, ఉద్యోగాలు కల్పించలేని పరిస్థితి ఉంటే.. ఇప్పుడు కొత్తగా ముగ్గురు బిడ్డలను కనాలనడం హాస్యాస్పదం అని ఆమె విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చే  25,000 బోడి ప్రోత్సాహకం కోసం మూడో బిడ్డను కనాలనడం ప్రజలను ఎగతాళి చేయడమేనని, అసలు రాష్ట్రంలో ఆ బిడ్డలను పెంచే ఆర్థిక స్తోమత ఉందా అని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీలకే దిక్కులేదని, నిరుద్యోగులకు ఉద్యోగాల్లేక రోడ్లపాలవుతుంటే ఇటువంటి వింత పోకడలు అవసరమా అని  ప్రశ్నించారు. 

అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్ 

గత ఐదేళ్ల జగన్ పాలన, ప్రస్తుత చంద్రబాబు పాలన కలిసి రాష్ట్రాన్ని రూ.12 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చేశాయని షర్మిల ఆరోపించారు. సంక్షేమ పథకాలకు నిధులు లేవని, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో ఇవ్వలేని దయనీయ స్థితిలో ఏపీ ఉందన్నారు. ఆరోగ్యశ్రీకి  రూ. 3,000 కోట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.6,000 కోట్ల బకాయిలు పెట్టి, ప్రజలపై రూ.15,000 కోట్ల విద్యుత్ భారాలు మోపుతూ.. జనాభా పెంచమని చెప్పడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. మాఫియాలతో రాష్ట్రాన్ని దోచుకుంటూ ప్రజలకు సుద్దులు చెప్పడం మానుకోవాలని ఆమె హితవు పలికారు.

ఉపాధి హామీ పథకం నిర్వీర్యం 

కాంగ్రెస్ హయాంలో పేదలకు ఆసరాగా నిలిచిన  MGNREGA  పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 'VB G-RAM G' చట్టం పేరుతో పూర్తిగా నీరుగార్చిందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఇది గ్రామ స్వరాజ్యాన్ని వినాశనం చేసే అక్రమ చట్టమని, పనిని కాంట్రాక్టర్ల చేతుల్లో పెట్టి పేదలను బానిసలుగా మారుస్తున్నారని ఆరోపించారు. 100 రోజుల పని కల్పించడమే గగనమైన వేళ, 125 రోజులు ఇస్తామన్నది పచ్చి అబద్ధమని కొట్టిపారేశారు. కొత్త చట్టం వల్ల రాష్ట్రంపై అదనంగా  రూ. 5,000 కోట్ల భారం పడుతుందని, అయినా చంద్రబాబు దీనికి మద్దతు తెలపడం దారుణమన్నారు. 

 వైఎస్ఆర్ పాలన కాంగ్రెస్‌తోనే సాధ్యం 

జగన్ మోదీకి వంగి వంగి దండాలు పెడుతూ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని, చంద్రబాబు సైతం కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించడం లేదని ఆమె విమర్శించారు. రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి పథంలో పయనాలన్నా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ రావాలన్నా అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని షర్మిల స్పష్టం చేశారు. పేదల హక్కుల కోసం, ఉపాధి హామీ పరిరక్షణ కోసం తమ పోరాటం ఆగదని ఆమె ఈ సందర్భంగా ప్రకటించారు.            


 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
AP Rains: ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
Viral News: యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
Advertisement

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
CM Revanth Reddy: తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
Which Car Is Best: పెట్రోల్ కారును CNGగా మార్చడానికి ఎంత ఖర్చవుతుంది? ఈ విషయాలు తెలుసుకోండి
పెట్రోల్ కారును CNGగా మార్చడానికి ఎంత ఖర్చవుతుంది? ఈ విషయాలు తెలుసుకోండి
Embed widget