By: ABP Desam | Updated at : 04 Jan 2022 07:22 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
మంత్రి సత్యవతి రాథోడ్
రాష్ట్రంలో ఒమిక్రాన్, కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 8 నుంచి 16 వరకూ సెలవులు ప్రకటించింది. సూళ్లలో కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలోని విద్యార్థుల ఆరోగ్యంపై ఉపాధ్యాయులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. విద్యార్థులు ఎవరైనా అస్వస్థతకు గురైతే వెంటనే వారిని వైద్య సదుపాయం అందించాలని, తగిన పరీక్షలు చేయించాలని చెప్పారు. మహబూబాబాద్, కురవిలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో కరోనా సోకిన ముగ్గురు విద్యార్థులకు వైద్యం అందించాలని, ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు.
Also Read: ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. థర్డ్ వేవ్ వైపు పయనిస్తున్నామా?
ప్రతి విద్యార్థికి టీకా వేయించుకోవాలి
ఈ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అన్ని విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించిందని మంత్రి రాథోడ్ తెలిపారు. 8వ తేదీలోపు 15 నుంచి 18 ఏళ్ల లోపు విద్యార్థులకు వ్యాక్సిన్ వేయించాలని ఆమె సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాలను, వసతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయా గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల ఉన్నతాధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది బాధ్యత తీసుకుని ప్రతి విద్యార్థి టీకా వేయించుకునేలా చూడాలన్నారు. రోజువారి లక్ష్యాలు పెట్టుకుని విద్యార్థులకు టీకాలు వేయించే కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఒమిక్రాన్, కోవిడ్ బారిన పడకుండా పరిరక్షించాలన్నారు.
8 నుంచి 16 వరకు సెలవులు
తెలంగాణలో అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 8 నుంచి 16 వరకు సెలవులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. వైద్యారోగ్యశాఖపై సోమవారం సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు, ఉన్నతాధికారులతో కేసీఆర్ సమావేశమై.. కరోనా పరిస్థితులపై చర్చించారు. కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ వ్యాప్తి తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో లాక్ డౌన్ గురించి అధికారులు సీఎం కేసీఆర్ కు వివరించారు. లాక్ డౌన్ అక్కర్లేదని అధికారులు చెప్పారని సీఎం అన్నారు. కరోనా దృష్ట్యా ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక వసతులపై దృష్టి పెట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆస్పత్రుల్లో పడకలు, పరీక్ష కిట్లు, మందులు సమకూర్చుకోవాలని చెప్పారు. బస్తీ దవాఖానాలపై ఏర్పాటుపైనా.. పరిశీలించాలని కేసీఆర్ ఆదేశించారు. కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చూడాలని.. మాస్కులు తప్పకుండా ధరించాలని సీఎం అన్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా సీఎం కేసీఆర్ కు అధికారులు నివేదిక ఇచ్చారు. గుంపులుగా ఉండరాదని నివేదికలో పేర్కొన్నారు. బహిరంగ సభలు, ర్యాలీలు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
Also Read: విజయనగరం జిల్లాలో కరోనా కలకలం... కొత్తవలస పాఠశాలలో 19 మంది విద్యార్థులు, ఒక టీచర్ కు పాజిటివ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
Nalgonda Accident : నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం, రథానికి విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు మృతి
Rgv Complaint : నా సంతకం ఫోర్జరీ చేశారు, నట్టి ఎంటర్టైన్మెంట్ పై ఆర్జీవీ పోలీస్ కేసు
Breaking News Live Updates: నల్గొండలో రథోత్సవంలో అపశ్రుతి, విద్యుత్ తీగలు తాకడంతో ముగ్గురు మృతి
Hyderabad Fire Accident: రాయదుర్గంలోని హోటల్లో భారీ అగ్ని ప్రమాదం, భవనంలో చిక్కుకున్న 20 మంది - రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్
IAS Keerti Jalli : అస్సాంలో ఐఏఎస్ కీర్తి జల్లి సాహసం - అంతా ఫిదా ! ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ?
Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?
RRR in Netflix: రామ్, భీమ్ ఫుట్బాల్ - ఏందయ్య ఇది మేమెక్కడా సూడలే!
NTR Centenary Celebrations : ఎన్టీఆర్ అప్పట్లోనే చేసి చూపించారు - అవినీతికి పాల్పడితే మంత్రినీ వదల్లేదు !
Minister Sabitha Indrareddy అనుచరుల వీరంగం.. అధికారుల అంతు చూస్తామని బెదిరింపులు | ABP Desam