అన్వేషించండి

Vijaya Dairy Issue: విజయ బ్రాండ్ నెయ్యి ఇష్యూపై లోకేష్ వర్సెస్ గుత్తా అమిత్ రెడ్డి - చివరికి ఏం తేలిందంటే ?

Vijaya Dairy: తెలంగాణలో విజయ బ్రాండ్ తరపున నకిలీ నెయ్యి అమ్ముతున్నారని గుత్తా అమిత్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ర్యాండమ్‌గా టెస్టులు చేయిస్తామని హామీ ఇచ్చారు.

Lokesh responded to the AP Vijaya Dairy issue: ఆంధ్రప్రదేశ్ డెయిరీ ఫెడరేషన్,  విజయ' డెయిరీ బ్రాండ్ కు సంబంధించి సోషల్ మీడియా వేదికగా జరిగిన చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారింది. విజయ డెయిరీ బ్రాండ్ పేరుతో జరుగుతున్న నెయ్యి విక్రయాల్లో కల్తీ జరుగుతోందంటూ తెలంగాణ తెలంగాణ డెయిరీ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్‌ గుత్తా అమిత్ రెడ్డి చేసిన ఫిర్యాదుపై   నారా లోకేష్ తక్షణమే స్పందించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

గుత్తా అమిత్ రెడ్డి లేవనెత్తిన ప్రధాన అభ్యంతరాలు: 

గుత్తా అమిత్ రెడ్డి  విజయ బ్రాండ్ నెయ్యి నాణ్యతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ డెయిరీ ఫెడరేషన్ ఒక ప్రైవేట్ సంస్థ మేఘనా ఫుడ్స్ ఫ్రాంచైజీ ఇవ్వగా, వారు గుజరాత్‌లోని ఒక డెయిరీ నుంచి నెయ్యిని సేకరిస్తున్నారని పేర్కొన్నారు. NDDBకి చెందిన CALF ల్యాబ్‌లో జరిపిన పరీక్షల్లో ఈ నెయ్యిలో వనస్పతి ఫ్యాట్ ఆనవాళ్లు (β-sitosterol) ఉన్నట్లు తేలిందని, ఇది వినియోగదారుల ఆరోగ్యానికి ముప్పు అని ఆరోపించారు. అంతేకాకుండా, స్థానిక రైతులకు ఎటువంటి సంబంధం లేని ఈ ప్రైవేట్ ఫ్రాంచైజీ నమూనా వల్ల రైతులకు ఒరిగేదేమీ లేదని, కేవలం బ్రాండ్ పేరును అమ్ముకుంటున్నారని ఆయన విమర్శించారు.

నారా లోకేష్   స్పందన - విచారణకు ఆదేశం 

ఈ అంశంపై మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందిస్తూ, అమిత్ రెడ్డి వ్యక్తం చేసిన ఆందోళనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందని తెలిపారు. ఏపీ డెయిరీ ఫెడరేషన్ ఇప్పటికే ఎప్పటికప్పుడు నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తోందని, అయినప్పటికీ ఈ ఫిర్యాదు  కారణంగా మార్కెట్ నుంచి ర్యాండమ్ శాంపిల్స్ సేకరించి పరీక్షించాలని ఆదేశించినట్లు వెల్లడించారు. తెలంగాణ డెయిరీ ఫెడరేషన్ వద్ద ఉన్న ల్యాబ్ రిపోర్టులను కూడా సేకరించి, వాటిని పరిశీలించిన తర్వాత తదుపరి కఠిన చర్యలు తీసుకుంటామని లోకేష్ స్పష్టం చేశారు.

వన్ నేషన్ - వన్ మార్కెట్' దృక్పథం 

జిల్లా యూనియన్లు ,  రాష్ట్ర ఫెడరేషన్లు తమ సరిహద్దులు దాటి మార్కెటింగ్ చేయడంపై అమిత్ రెడ్డి చేసిన అభ్యంతరాన్ని లోకేష్ సున్నితంగా తిరస్కరించారు. ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత అయిన  వన్ నేషన్ - వన్ మార్కెట్ సూత్రం ప్రకారం ఏ రాష్ట్ర ఉత్పత్తులైనా ఎక్కడైనా అమ్ముకోవచ్చని ఆయన గుర్తు చేశారు. అయితే, వ్యాపారం ఎక్కడ చేసినా వినియోగదారుల ఆరోగ్యం  , ఉత్పత్తుల నాణ్యత విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడదని ఆయన స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు.  


  

టాప్ హెడ్ లైన్స్

NEET Paper Leak Talks: NEET వివాదంపై కేంద్రంతో సీజేపీ చర్చలు - రెండు డిమాండ్లకు ఓకే.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపైనే చిక్కుముడి !
NEET వివాదంపై కేంద్రంతో సీజేపీ చర్చలు - రెండు డిమాండ్లకు ఓకే.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపైనే చిక్కుముడి !
Breaking News: వచ్చే ఏడాదికి గిరిజన ప్రాంత స్కూల్స్ అన్నింటికీ సొంత భవనాలు: మంత్రి నారా లోకేష్
వచ్చే ఏడాదికి గిరిజన ప్రాంత స్కూల్స్ అన్నింటికీ సొంత భవనాలు: మంత్రి నారా లోకేష్
Gambhir - Dravid System Comparison: గంభీర్ కోచింగ్ స్టైల్ పై  అశ్విన్ విమర్శలు.. ద్రవిడ్ వ్యూహాలతో పోలుస్తూ కీలక వ్యాఖ్యలు!
గంభీర్ కోచింగ్ స్టైల్ పై  అశ్విన్ విమర్శలు.. ద్రవిడ్ వ్యూహాలతో పోలుస్తూ కీలక వ్యాఖ్యలు!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget