అన్వేషించండి

First Euthanasia: ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే

సుదీర్ఘకాలంగా అపస్మారక స్థితిలో ఉన్న హరీష్ రాణా కేసులో పాసివ్ ఇచ్చామరణానికి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ఈ తీర్పు తర్వాత ఆ కుటుంబం తమ కుమారుడికి బాధ నుంచి విముక్తి కలిగించనుంది.

భారత్‌లో ఇచ్చామరణం (Mercy Killing) గురించి మరోసారి చర్చ ఊపందుకుంది. సుదీర్ఘకాలంగా అపస్మారక స్థితిలో ఉన్న ఒక యువకుడికి సుప్రీంకోర్టు పాసివ్ కారుణ్య మరణం (Passive Euthanasia) కల్పించడానికి అనుమతినిచ్చింది. ఈ తీర్పుతో ఏళ్ల తరబడి తమ కుమారుడిని ఈ స్థితిలో చూస్తున్న ఆ కుటుంబానికి ఓ మార్గం దొరికింది. దేశంలో కారుణ్య మరణాల రకాలపై, ఇవి ఎందుకోసం అవసరం అవుతుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. 

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన హరీష్ రాణా గత 13 ఏళ్లుగా మంచంపై అపస్మారక స్థితిలో ఉన్నాడు. ఇన్నేళ్లలో కుమారుడి పరిస్థితిలో ఎలాంటి మెరుగుదల లేదని, డాక్టర్లు కూడా కోలుకునే అవకాశం లేదని చెప్పారని, తమకు 'పాసివ్ ఇచ్చామరణం' కోసం అనుమతించాలని అతడి తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ జె.బి. పార్దీవాలా, జస్టిస్ కె.వి. విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం, ఈ కేసులో పాసివ్ ఇచ్చామరణానికి అనుమతినిస్తూ తీర్పునిచ్చింది. అసలు ఏ దేశంలో మొదట కారుణ్య మరణం అమలులోకి వచ్చింది? ఆ వ్యక్తి మరణాన్ని ఎందుకు ఎంచుకున్నారు? లేక కుటుంబసభ్యులు కోరారా వంటి వివరాలు ఇక్కడ అందిస్తున్నాం. 

13 ఏళ్ల క్రితం జరిగిన ప్రమాదం 

ఘజియాబాద్‌కు చెందిన హరీష్ రాణా 2013లో పంజాబ్ లోని చండీగఢ్‌లో చదువుకుంటున్న సమయంలో తన హాస్టల్ నాలుగో అంతస్తు నుండి కింద పడిపోయాడు. తలకు తీవ్ర గాయమై మెదడు దెబ్బతింది. అప్పటి నుండి ఆయన అపస్మారక స్థితిలోనే ఉండి మంచానికే పరిమితమయ్యాడు. సుదీర్ఘకాలం పాటు ఇదే స్థితిలో ఉండటం వల్ల ఆయన శరీరపై గాయాలు (bed sores) కూడా ఏర్పడ్డాయి. డాక్టర్ల నివేదిక ప్రకారం, ఇన్నేళ్లలో అతడి పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు 'ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్' (AIIMS) నుంచి హరీష్ మెడికల్ రిపోర్టును కోరింది. అతడు కోలుకునే అవకాశం లేదని నివేదిక పేర్కొనడంతో, ఆ ప్రాతిపదికన కోర్టు పాసివ్ ఇచ్చామరణానికి (కారుణ్య మరణానికి) అనుమతించింది.

ఏ దేశంలో తొలి కారుణ్య మరణం

ప్రపంచంలో ఇచ్చామరణానికి (Euthanasia) చట్టబద్ధమైన గుర్తింపునిచ్చిన తొలి దేశం నెదర్లాండ్స్. ఏప్రిల్ 1, 2002న దీనికి చట్టబద్ధత కల్పించారు. ఈ చట్టం ప్రకారం అత్యంత కఠినమైన నిబంధనలతో రోగి తన ఇష్టపూర్వకముగా జీవితాన్ని ముగించడానికి అనుమతిస్తారు. ఆ తర్వాత బెల్జియం, లక్సెంబర్గ్, కొలంబియా వంటి దేశాల్లో కూడా పలు నిబంధనల ఆధారంగా ఇచ్చామరణానికి (Mercy Killing) చట్టబద్ధత లభించింది.

స్విట్జర్లాండ్‌లో అసిస్టెడ్ సూసైడ్ (Assisted Suicide) వ్యవస్థ అమల్లో ఉంది. ఇందులో డాక్టర్ సహాయంతో ఒక వ్యక్తి తన జీవితాన్ని ముగించుకోవాలని నిర్ణయించుకోవచ్చు. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో, కెనడాలో కూడా కఠినమైన నిబంధనలతో మెర్సి కిల్లింగ్‌కు అనుమతిస్తారు. అనేక దేశాల్లో ఇది ఇప్పటికీ చట్టవిరుద్ధం లేదా పరిమితంగా అమలు చేస్తున్నారు. 

 ఇచ్చామరణానికి చట్టబద్ధత కల్పించిన నెదర్లాండ్స్‌లో అనేక సంవత్సరాల పాటు సామాజిక, చట్టపరమైన చర్చలు జరిగాయి. దీని ప్రారంభం 1973 నాటి ప్రసిద్ధ పోస్ట్‌మా (Postma) కేసుతో జరిగిందని చెబుతారు. తీవ్రమైన అనారోగ్యంతో, భరించలేని బాధను అనుభవిస్తున్న తన తల్లి పదేపదే కోరడంతో ఒక డాక్టర్ ఆమె చనిపోవడంలో సహాయం చేశారు. ఈ కేసులో కోర్టు ఆ డాక్టర్‌ను దోషిగా తేల్చినప్పటికీ, చాలా తక్కువ శిక్ష విధించింది. అలాగే ఒక షేషెంట్‌ను వారి ఇష్టానికి వ్యతిరేకంగా నిరంతరం బాధలో బతికించడం అవసరం లేదని కోర్టు పేర్కొంది. ఈ ఘటన తర్వాత నెదర్లాండ్స్‌లో ఇచ్చామరణంపై చర్చలు ఊపందుకుని 2002లో దీనికి చట్టబద్ధత లభించింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

First Euthanasia: ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
First Passive Euthanasia: హరీష్ రాణా కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు అనుమతి.. తీర్పు వెల్లడిస్తూ జడ్జి కన్నీళ్లు.. భారత్‌లో తొలి కేసు
హరీష్ రాణా కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు పర్మిషన్.. తీర్పు వెల్లడిస్తూ జడ్జి కన్నీళ్లు.. భారత్‌లో తొలి కేసు
Everest Masala : ఎవరెస్ట్ మసాలాల్లో నాణ్యత సమస్యలు? పురుగుల మందులు, ఎంటెరోబాక్టీరియా నిజంగానే ఉన్నాయా?
ఎవరెస్ట్ మసాలాల్లో నాణ్యత సమస్యలు? పురుగుల మందులు, ఎంటెరోబాక్టీరియా నిజంగానే ఉన్నాయా?
Bitter Gourd Juice : 10 రోజులు ఖాళీ కడుపుతో కాకరకాయ రసం తాగితే.. షుగర్ నుంచి బరువు వరకు అన్నీ లాభాలే
10 రోజులు ఖాళీ కడుపుతో కాకరకాయ రసం తాగితే.. షుగర్ నుంచి బరువు వరకు అన్నీ లాభాలే
Advertisement

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Good news for AP farmers: ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Kerala Assembly Elections 2026: కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
Telangana Politics: బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
Rajendra Prasad : మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్ - స్టేజ్‌పై అలా మాట్లాడతారా అంటూ...
మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్ - స్టేజ్‌పై అలా మాట్లాడతారా అంటూ...
Andhra Pradesh alliance Politics: ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
Embed widget