అన్వేషించండి

First Euthanasia: ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే

సుదీర్ఘకాలంగా అపస్మారక స్థితిలో ఉన్న హరీష్ రాణా కేసులో పాసివ్ ఇచ్చామరణానికి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ఈ తీర్పు తర్వాత ఆ కుటుంబం తమ కుమారుడికి బాధ నుంచి విముక్తి కలిగించనుంది.

భారత్‌లో ఇచ్చామరణం (Mercy Killing) గురించి మరోసారి చర్చ ఊపందుకుంది. సుదీర్ఘకాలంగా అపస్మారక స్థితిలో ఉన్న ఒక యువకుడికి సుప్రీంకోర్టు పాసివ్ కారుణ్య మరణం (Passive Euthanasia) కల్పించడానికి అనుమతినిచ్చింది. ఈ తీర్పుతో ఏళ్ల తరబడి తమ కుమారుడిని ఈ స్థితిలో చూస్తున్న ఆ కుటుంబానికి ఓ మార్గం దొరికింది. దేశంలో కారుణ్య మరణాల రకాలపై, ఇవి ఎందుకోసం అవసరం అవుతుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. 

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన హరీష్ రాణా గత 13 ఏళ్లుగా మంచంపై అపస్మారక స్థితిలో ఉన్నాడు. ఇన్నేళ్లలో కుమారుడి పరిస్థితిలో ఎలాంటి మెరుగుదల లేదని, డాక్టర్లు కూడా కోలుకునే అవకాశం లేదని చెప్పారని, తమకు 'పాసివ్ ఇచ్చామరణం' కోసం అనుమతించాలని అతడి తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ జె.బి. పార్దీవాలా, జస్టిస్ కె.వి. విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం, ఈ కేసులో పాసివ్ ఇచ్చామరణానికి అనుమతినిస్తూ తీర్పునిచ్చింది. అసలు ఏ దేశంలో మొదట కారుణ్య మరణం అమలులోకి వచ్చింది? ఆ వ్యక్తి మరణాన్ని ఎందుకు ఎంచుకున్నారు? లేక కుటుంబసభ్యులు కోరారా వంటి వివరాలు ఇక్కడ అందిస్తున్నాం. 

13 ఏళ్ల క్రితం జరిగిన ప్రమాదం 

ఘజియాబాద్‌కు చెందిన హరీష్ రాణా 2013లో పంజాబ్ లోని చండీగఢ్‌లో చదువుకుంటున్న సమయంలో తన హాస్టల్ నాలుగో అంతస్తు నుండి కింద పడిపోయాడు. తలకు తీవ్ర గాయమై మెదడు దెబ్బతింది. అప్పటి నుండి ఆయన అపస్మారక స్థితిలోనే ఉండి మంచానికే పరిమితమయ్యాడు. సుదీర్ఘకాలం పాటు ఇదే స్థితిలో ఉండటం వల్ల ఆయన శరీరపై గాయాలు (bed sores) కూడా ఏర్పడ్డాయి. డాక్టర్ల నివేదిక ప్రకారం, ఇన్నేళ్లలో అతడి పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు 'ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్' (AIIMS) నుంచి హరీష్ మెడికల్ రిపోర్టును కోరింది. అతడు కోలుకునే అవకాశం లేదని నివేదిక పేర్కొనడంతో, ఆ ప్రాతిపదికన కోర్టు పాసివ్ ఇచ్చామరణానికి (కారుణ్య మరణానికి) అనుమతించింది.

ఏ దేశంలో తొలి కారుణ్య మరణం

ప్రపంచంలో ఇచ్చామరణానికి (Euthanasia) చట్టబద్ధమైన గుర్తింపునిచ్చిన తొలి దేశం నెదర్లాండ్స్. ఏప్రిల్ 1, 2002న దీనికి చట్టబద్ధత కల్పించారు. ఈ చట్టం ప్రకారం అత్యంత కఠినమైన నిబంధనలతో రోగి తన ఇష్టపూర్వకముగా జీవితాన్ని ముగించడానికి అనుమతిస్తారు. ఆ తర్వాత బెల్జియం, లక్సెంబర్గ్, కొలంబియా వంటి దేశాల్లో కూడా పలు నిబంధనల ఆధారంగా ఇచ్చామరణానికి (Mercy Killing) చట్టబద్ధత లభించింది.

స్విట్జర్లాండ్‌లో అసిస్టెడ్ సూసైడ్ (Assisted Suicide) వ్యవస్థ అమల్లో ఉంది. ఇందులో డాక్టర్ సహాయంతో ఒక వ్యక్తి తన జీవితాన్ని ముగించుకోవాలని నిర్ణయించుకోవచ్చు. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో, కెనడాలో కూడా కఠినమైన నిబంధనలతో మెర్సి కిల్లింగ్‌కు అనుమతిస్తారు. అనేక దేశాల్లో ఇది ఇప్పటికీ చట్టవిరుద్ధం లేదా పరిమితంగా అమలు చేస్తున్నారు. 

 ఇచ్చామరణానికి చట్టబద్ధత కల్పించిన నెదర్లాండ్స్‌లో అనేక సంవత్సరాల పాటు సామాజిక, చట్టపరమైన చర్చలు జరిగాయి. దీని ప్రారంభం 1973 నాటి ప్రసిద్ధ పోస్ట్‌మా (Postma) కేసుతో జరిగిందని చెబుతారు. తీవ్రమైన అనారోగ్యంతో, భరించలేని బాధను అనుభవిస్తున్న తన తల్లి పదేపదే కోరడంతో ఒక డాక్టర్ ఆమె చనిపోవడంలో సహాయం చేశారు. ఈ కేసులో కోర్టు ఆ డాక్టర్‌ను దోషిగా తేల్చినప్పటికీ, చాలా తక్కువ శిక్ష విధించింది. అలాగే ఒక షేషెంట్‌ను వారి ఇష్టానికి వ్యతిరేకంగా నిరంతరం బాధలో బతికించడం అవసరం లేదని కోర్టు పేర్కొంది. ఈ ఘటన తర్వాత నెదర్లాండ్స్‌లో ఇచ్చామరణంపై చర్చలు ఊపందుకుని 2002లో దీనికి చట్టబద్ధత లభించింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Embed widget