అన్వేషించండి

Krishna Water Dispute: కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ.. ఏపీ నీటి వాడకంపై ఫిర్యాదు

ఏపీ తన పరిమితికి మించి కృష్ణా నీటిని తీసుకుంటోందని తెలంగాణ లేఖ ద్వారా ఫిర్యాదు చేసింది. ఆ రాష్ట్రం ఇప్పటికే 25 టీఎంసీలు తరలించిందని గుర్తు చేసింది.

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఈ మేరకు ఆ ఛైర్మన్‌కు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రప్రదేశ్ నీరు తరలించకుండా ఆపాలని తెలంగాణ కేఆర్ఎంబీని లేఖలో కోరింది. నాగార్జున సాగర్ నీటి అవసరాల కోసం తరలింపు ఆపాలని ప్రభుత్వం సూచించింది. ఏపీ తన పరిమితికి మించి కృష్ణా నీటిని తీసుకుంటోందని తెలంగాణ లేఖ ద్వారా ఫిర్యాదు చేసింది. ఆ రాష్ట్రం ఇప్పటికే 25 టీఎంసీలు తరలించిందని గుర్తు చేసింది. నిబంధనల ప్రకారం 10.48 టీఎంసీలనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోవాలని సూచించింది. ఈ లేఖ మరో ప్రతిని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖకు కూడా పంపింది.

నీటిపారుదలపై సమీక్ష
మరోవైపు, తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన శనివారం ప్రగతి భవన్‌లో నీటిపారుదల శాఖపై సమీక్ష జరిగింది. నీటి పారుదల ఇంజినీర్లు అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష జరిపారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త సచివాలయ నిర్మాణ పనులను కూడా పర్యవేక్షించనున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో పనుల పరిశీలనకు సీఎం కేసీఆర్ వెళ్లారు. 
Also Read: KRMB GRMB Meet: 9న కృష్ణా, గోదావరి బోర్డుల ఉమ్మడి సమావేశం... రాలేమని తెలంగాణ లేఖ

గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలైన తరుణంలో రెండు బోర్డులు ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ ఆగస్టు 9న బోర్డుల ఉమ్మడి సమావేశం నిర్వహించాలని నిర్ణయించాయి. ఈ మేరకు ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు కేఆర్‌ఎంబీ సమాచారమిచ్చింది. హైదరాబాద్‌లోని జలసౌధలో ఈ సమావేశం జరగనుంది. గెజిట్‌లోని అంశాలు అమలు, కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. జులై 15న కేంద్ర జల్‌‌శక్తి శాఖ గెజిట్‌ జారీచేయడం తెలిసిందే. ఈ గెజిట్ ను ఏపీ ప్రభుత్వం స్వాగతించగా, తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం తెలిపింది. 

ఏపీ నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించే బృందంలో సీడబ్ల్యూసీ సభ్యుడు దేవేందర్‌రావు ఉండటంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. దీనిపై స్పందించిన తెలంగాణ గతంలో సీడబ్ల్యూసీ సభ్యులపై తాము అభ్యంతరం చెప్పలేదని గుర్తుచేయడంతో వివాదం కొత్త మలుపు తిరిగేలా కనిపించింది. తెలంగాణ ఈఎన్‌సీ తన మురళీధర్‌ లేఖ లేఖ ద్వారా నిరసన వ్యక్తం చేశారు.   . ఈ నెల 9న బోర్డు భేటీకి హాజరుకావట్లేదని గోదావరి బోర్డు ఛైర్మన్‌కు లేఖలో తేల్చిచెప్పారు. అంతలోనే తెలంగాణ సర్కారు మనను మార్చుకుని వివరాలు, నివేదికలు సిద్ధం చేయడానికి చర్యలు చేపట్టింది. 
Also Read: కృష్ణాబోర్డు సీమ టూర్ చివరి క్షణంలో వాయిదా..! ఏపీ అభ్యంతరమే కారణం..!

టాప్ హెడ్ లైన్స్

Railway Board Rejects Free MMTS: ఉచిత ఎంఎంటీఎస్‌కు రైల్వేబోర్డు నో - తెలంగాణ ప్రభుత్వానికి షాక్
ఉచిత ఎంఎంటీఎస్‌కు రైల్వేబోర్డు నో - తెలంగాణ ప్రభుత్వానికి షాక్
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Bolla Brahma Naidu Arrest: గండిపేట భూకబ్జా కేసు - వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కాంచీపురంలో అరెస్ట్!
గండిపేట భూకబ్జా కేసు - వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కాంచీపురంలో అరెస్ట్!
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka Congress Crisis: డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Nandus World Scam: నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
K. Annamalai:
"అందుకే బీజేపీలో చేరా, ఏడాదిన్నర నుంచి విభేదాలు"అన్నామలై సంచలన వ్యాఖ్యలు! కొత్త రాజకీయ వేదిక ప్రకటన!
Breaking News:
"ఒక్కో ఉద్యోగం 40 లక్షలు" టీటీడీ ఇంజినీరింగ్ పోస్టుల భర్తీపై భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు 
Hyderabad Metro Fact Check:
"అమీర్‌పేట అగ్ని ప్రమాదంలో మెట్రో పిల్లర్‌కు నష్టం జరగలే, పగుళ్లు ప్రచారం ఫేక్" హైదరాబాద్‌ మెట్రో ఎండీ ప్రకటన
Andhra Pradesh Rajya Sabha Elections:అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
Karnataka Minister Ramalinga Reddy : కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
Embed widget