అన్వేషించండి

Krishna Water Dispute: కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ.. ఏపీ నీటి వాడకంపై ఫిర్యాదు

ఏపీ తన పరిమితికి మించి కృష్ణా నీటిని తీసుకుంటోందని తెలంగాణ లేఖ ద్వారా ఫిర్యాదు చేసింది. ఆ రాష్ట్రం ఇప్పటికే 25 టీఎంసీలు తరలించిందని గుర్తు చేసింది.

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఈ మేరకు ఆ ఛైర్మన్‌కు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రప్రదేశ్ నీరు తరలించకుండా ఆపాలని తెలంగాణ కేఆర్ఎంబీని లేఖలో కోరింది. నాగార్జున సాగర్ నీటి అవసరాల కోసం తరలింపు ఆపాలని ప్రభుత్వం సూచించింది. ఏపీ తన పరిమితికి మించి కృష్ణా నీటిని తీసుకుంటోందని తెలంగాణ లేఖ ద్వారా ఫిర్యాదు చేసింది. ఆ రాష్ట్రం ఇప్పటికే 25 టీఎంసీలు తరలించిందని గుర్తు చేసింది. నిబంధనల ప్రకారం 10.48 టీఎంసీలనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోవాలని సూచించింది. ఈ లేఖ మరో ప్రతిని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖకు కూడా పంపింది.

నీటిపారుదలపై సమీక్ష
మరోవైపు, తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన శనివారం ప్రగతి భవన్‌లో నీటిపారుదల శాఖపై సమీక్ష జరిగింది. నీటి పారుదల ఇంజినీర్లు అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష జరిపారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త సచివాలయ నిర్మాణ పనులను కూడా పర్యవేక్షించనున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో పనుల పరిశీలనకు సీఎం కేసీఆర్ వెళ్లారు. 
Also Read: KRMB GRMB Meet: 9న కృష్ణా, గోదావరి బోర్డుల ఉమ్మడి సమావేశం... రాలేమని తెలంగాణ లేఖ

గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలైన తరుణంలో రెండు బోర్డులు ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ ఆగస్టు 9న బోర్డుల ఉమ్మడి సమావేశం నిర్వహించాలని నిర్ణయించాయి. ఈ మేరకు ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు కేఆర్‌ఎంబీ సమాచారమిచ్చింది. హైదరాబాద్‌లోని జలసౌధలో ఈ సమావేశం జరగనుంది. గెజిట్‌లోని అంశాలు అమలు, కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. జులై 15న కేంద్ర జల్‌‌శక్తి శాఖ గెజిట్‌ జారీచేయడం తెలిసిందే. ఈ గెజిట్ ను ఏపీ ప్రభుత్వం స్వాగతించగా, తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం తెలిపింది. 

ఏపీ నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించే బృందంలో సీడబ్ల్యూసీ సభ్యుడు దేవేందర్‌రావు ఉండటంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. దీనిపై స్పందించిన తెలంగాణ గతంలో సీడబ్ల్యూసీ సభ్యులపై తాము అభ్యంతరం చెప్పలేదని గుర్తుచేయడంతో వివాదం కొత్త మలుపు తిరిగేలా కనిపించింది. తెలంగాణ ఈఎన్‌సీ తన మురళీధర్‌ లేఖ లేఖ ద్వారా నిరసన వ్యక్తం చేశారు.   . ఈ నెల 9న బోర్డు భేటీకి హాజరుకావట్లేదని గోదావరి బోర్డు ఛైర్మన్‌కు లేఖలో తేల్చిచెప్పారు. అంతలోనే తెలంగాణ సర్కారు మనను మార్చుకుని వివరాలు, నివేదికలు సిద్ధం చేయడానికి చర్యలు చేపట్టింది. 
Also Read: కృష్ణాబోర్డు సీమ టూర్ చివరి క్షణంలో వాయిదా..! ఏపీ అభ్యంతరమే కారణం..!

టాప్ హెడ్ లైన్స్

Breaking News: రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
Asifabad News: ఆసిఫాబాద్ జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హామీ
ఆసిఫాబాద్ జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హామీ
Hyderabad Food Adulteration: లొట్టలేసుకుంటూ తింటున్నారా.. హైదరాబాద్‌లో 100 రోజుల్లో 121 టన్నుల కల్తీ ఆహార పదార్థాలు సీజ్
లొట్టలేసుకుంటూ తింటున్నారా.. హైదరాబాద్‌లో 100 రోజుల్లో 121 టన్నుల కల్తీ ఆహార పదార్థాలు సీజ్
IIIT Student Commits Suicide: ఆరో అంతస్తు నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య.. గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో విషాదం
ఆరో అంతస్తు నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య.. గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో విషాదం

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
Embed widget