అన్వేషించండి

KRMB Tour : కృష్ణాబోర్డు సీమ టూర్ చివరి క్షణంలో వాయిదా..! ఏపీ అభ్యంతరమే కారణం..!

ఎన్జీటీ ఆదేశాల మేరకు కృష్ణాబోర్డు రాయలసీమ ఎత్తిపోతల పరిశీలనను వాయిదా వేసుకుంది. కమిటీలో తెలంగాణ వ్యక్తి ఉండటంతో ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.


రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ప్రాంతాన్ని పరిశీలించి నిర్మాణ కార్యకలాపాలు జరుగుతున్నాయో లేదో నివేదిక ఇవ్వాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఆదేశాల మేరకు గురువారం కేఆర్ఎంబీ కమిటీ అక్కడ పర్యటించాలనుకుంది. తమ బృందంతో కర్నూలు జిల్లా సంగమేశ్వరంకు వస్తున్నట్లుగా ఏపీ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. అయితే.. ఇక పర్యటన ప్రారంభమవుతుందనుకున్న కొద్ది గంటల ముందు పర్యటన వాయిదా పడింది. ఏపీ ప్రభుత్వం అభ్యంతరాల మేరకే వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. సీమ ఎత్తిపోతలను పరిశీలించాలనుకున్న కేఆర్ఎంబీ బృందంలో దేవేందర్ రావు తెలంగాణకు చెందిన వ్యక్తి ఉన్నారని దీనిపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని ఏపీ ప్రభుత్వం ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఎన్జీటీ తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఎవరూ లేకుండా కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ కారణంగానే చివరి క్షణంలో కేఆర్ఎంబీ కమిటీ టూర్ వాయిదా పడిందని చెబుతున్నారు. 

కృష్ణాబోర్డు పర్యటన వాయిదా పడటం ఇదే మొదటి సారి కాదు. చాలా రోజులుగా కర్నూలు జిల్లా సంగమేశ్వరం వద్ద ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టు నిర్మాణాన్ని పరిశీలించాలని కృష్ణాబోర్డు భావిస్తోంది. ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఏపీ ప్రభుత్వం సహకరించకపోవడంతో ఇప్పటి వరకూ పరిశీలన సాధ్యం కాలేదు. మధ్యలో తెలంగాణ సర్కార్ కూడా కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తామని కేంద్రానికి సమాచారం ఇచ్చింది. హెలికాఫ్టర్ సమకూరుస్తామని కేంద్రభద్రతా బలగాలతో  రక్షణ తీసుకుని పర్యటించాలని కోరింది. అయితే కేఆర్ఎంబీ నుంచి పెద్దగా స్పందన రాలేదు. చివరికి ఎన్జీటీ ఆదేశాల మేరకే మరోసారి "సీమ" ప్రాజెక్ట్ వద్ద పర్యటించేందుకు కృష్ణాబోర్డు సిద్ధమయింది. కానీ ఈ సారి కూడా ఏపీ భిన్నమైన అభ్యంతరాన్ని వ్యక్తం చేసి... పర్యటనను నిలిపివేయించగలిగింది. 

రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను పరిశీలించే విషయంలో ఏపీ ప్రభుత్వానికి చాలా అభ్యంతరాలు ఉన్నాయి. ముందుగా తెలంగాణలోని అక్రమ ప్రాజెక్టులను పరిశీలించాలని ఆ తర్వాతే ఏపీకి రావాలని వాదిస్తోంది.  ప్రధానంగా రాయలసీమ ఎత్తిపోతలపైనే ఎన్జీటీలో పిటిషన్లు వేయడం అలాగే పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ఆ ప్రాజెక్టుపైనే కేఆర్ఎంబీ దృష్టి పెట్టింది. ఇదే అంశం తీవ్ర వివాదంగా మారడంతో విషయం సుప్రీంకోర్టుకు కూడా చేరింది. కానీ ఎడతెగని సీరియల్‌గా సాగుతూనే ఉంది. 

కృష్ణాబోర్డును రాయలసీమ ఎత్తిపోతల ప్రాంతంలో పర్యటించేలా ఏపీ సర్కార్ చేస్తేనే వివాదం సద్దుమణుగుతుంది. లేకపోతే ఆ వివాదం అలా కొనసాగుతూనే ఉంటుందని జలవనరుల నిపుణులు చెబుతున్నారు. అక్కడ నిర్మాణ పనులేమీ జరగడం లేదన్న ఏపీ ప్రభుత్వం ఎందుకో కానీ పర్యటనకు మాత్రం అనుమతించడం లేదు.  ఈ కారణంగా జల వివాదం మరింత పీటముడి పడుతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందని అధికారులతో అయినా కమిటీ పర్యటనకు వస్తే ఏపీ సర్కార్ సహకరిస్తే ఈ వివాదం ఇంతటితో సద్దుమణిగే అవకాశం ఉంటుందని అంటున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
ITR 2024: అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

SRH vs RCB Match Preview IPL 2024 | సన్ రైజర్స్ బ్యాటర్లను ఆర్సీబీ బౌలర్లు వణికిస్తారేమో.! | ABPAxar Patel All round Show vs GT | గుజరాత్ మీద మ్యాచ్ లో ఎటు చూసినా అక్షర్ పటేలే |DC vs GT | IPL 2024Rishabh Pant vs Mohit Sharma 31 Runs| ఆ ఒక్క ఓవరే విజయానికి ఓటమికి తేడా | DC vs GT | IPL 2024Rishabh Pant 88 Runs vs GT | పంత్ పోరాటంతోనే భారీ స్కోరు చేసిన ఢిల్లీ | DC vs GT | IPL 2024

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
ITR 2024: అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
JioCinema: గుడ్ న్యూస్ చెప్పిన జియో సినిమా.. సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా తగ్గింపు, మరి ఐపీఎల్?
గుడ్ న్యూస్ చెప్పిన జియో సినిమా.. సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా తగ్గింపు, మరి ఐపీఎల్?
Tamannaah: తమన్నాకు సైబర్ సెల్ నుంచి నోటీసులు - ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రమ్మంటూ...
తమన్నాకు సైబర్ సెల్ నుంచి నోటీసులు - ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రమ్మంటూ...
Pithapuram News: పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్‌- పవన్ పేరుతో కూడా తిప్పలే!
పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్‌- పవన్ పేరుతో కూడా తిప్పలే!
Karimnagar News: గడీల వారసులు కావాలా? గరీబోళ్ల బిడ్డ కావాలా? నేను పక్కా లోకల్ అంటున్న బండి సంజయ్‌
గడీల వారసులు కావాలా? గరీబోళ్ల బిడ్డ కావాలా? నేను పక్కా లోకల్ అంటున్న బండి సంజయ్‌
Embed widget