అన్వేషించండి

KRMB GRMB Meet: 9న కృష్ణా, గోదావరి బోర్డుల ఉమ్మడి సమావేశం... రాలేమని తెలంగాణ లేఖ

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై కేంద్రం విడుదల చేసిన గెజిట్‌ కార్యాచరణపై 2 బోర్డులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ నెల 9న సమావేశం ఏర్పాటుచేయాలని నిర్ణయించాయి. కానీ ఈ భేటీకి రాలేమని తెలంగాణ తెలిపింది.

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలైన తరుణంలో రెండు బోర్డులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ నెల 9న బోర్డుల ఉమ్మడి సమావేశం నిర్వహించాలని నిర్ణయించాయి. ఈ మేరకు ఏపీ, తెలంగాణలకు కేఆర్‌ఎంబీ సమాచారమిచ్చింది. హైదరాబాద్‌లోని జలసౌధలో ఈ సమావేశం జరగనుంది. గెజిట్‌లోని అంశాలు అమలు, కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. 

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని నిర్ణయించిన కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ, జులై 15న గెజిట్‌ జారీచేసింది. ఈ గెజిట్ ను ఏపీ ప్రభుత్వం స్వాగతించగా, తెలంగాణ అభ్యంతరం వ్యక్తం తెలిపింది. ఈ విషయంపై గత నెల 28న కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి రెండు బోర్డుల ఛైర్మన్లకు లేఖ రాశారు. గెజిట్‌ నోటిఫికేషన్‌లోని అంశాలు నిర్ణయించిన గడువులోగా అమలు అయ్యేలా కార్యాచరణ రూపొందించి పంపాలని సూచించారు. ఈ వ్యవహారంపై 11 మందితో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు, మంగళవారం సమావేశం ఏర్పాటు చేసింది. కమిటీలో ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లు, పరిపాలనా విభాగం ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లు, ట్రాన్స్‌కో, జెన్‌కో అధికారులు ఉన్నారు. 

గెజిట్, ఇతర అంశాలపై అభ్యంతరాలను తెలంగాణ, గోదావరి బోర్డు అధికారుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి. ఈ దశలోనే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు 12 మందితో సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తూ సోమవారం నిర్ణయం తీసుకుని, మంగళవారం సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఇరు రాష్ట్రాలకు లేఖలు కూడా రాసింది. మొదట పూర్తిస్థాయి బోర్డు సమావేశాన్ని నిర్వహించాలని కోరుతూ తెలంగాణ లేఖరాసింది. అలా అయితే బోర్డు సమావేశానికి హాజరవ్వగలమని చెప్తూ సమన్వయ కమిటీ సమావేశానికి హాజరు కాలేదు. మరోవైపు ఏపీ కూడా గెజిట్‌లో కొన్ని సవరణలు చేయాలని చెప్తూ, అవి జరిగితేనే ముందుకు వెళ్తామని చెప్పింది. ఈ సమయంలో బోర్డు ఉమ్మడి సమావేశం నిర్వహించాలని నిర్ణయించడంపై ప్రాధాన్యత ఏర్పడింది. 

కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ లేఖ రాశారు. ఏపీ నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించే బృందంలో సీడబ్ల్యూసీ సభ్యుడు దేవేందర్‌రావు ఉండటంపై ఏపీ అభ్యంతరం తెలిపింది. దీనిపై స్పందించిన తెలంగాణ గతంలో సీడబ్ల్యూసీ సభ్యులపై తాము అభ్యంతరం చెప్పలేదని చెప్పింది. తెలంగాణ ఈఎన్‌సీ తన లేఖ ద్వారా నిరసన వ్యక్తం చేసింది. 

మరో తేదీ ఖరారు చేయండి : తెలంగాణ

గోదావరి బోర్డు ఛైర్మన్‌కు తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ లేఖ రాశారు. ఈ నెల 9న బోర్డు భేటీకి హాజరుకావట్లేదని లేఖలో తేల్చిచెప్పారు. సుప్రీంకోర్టు, ఎన్జీటీలో విచారణ ఉన్నందున భేటీకి రాలేమని స్పష్టంచేశారు. బోర్డు భేటీకి మరో తేదీ ఖరారు చేయాలని లేఖలో కోరారు. వీలైనంత త్వరగా బోర్డును సమావేశం ఏర్పాటుచేయాలని కోరింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ideas of India Nara Lokesh: ప్రత్యేక హోదా ఎందుకు అడగడం లేదంటే.. ABP IDEAS OF INDIA లో వెల్లడించిన నారా లోకేష్
ప్రత్యేకహోదా ఎందుకు అడగడం లేదంటే.. ABP IDEAS OF INDIA లో వెల్లడించిన నారా లోకేష్
Common Man Legal Rights: నిర్దోషిగా బయటపడ్డారు కానీ పోగొట్టుకున్న కాలం, గౌరవం మాటేమిటి?
నిర్దోషిగా బయటపడ్డారు కానీ పోగొట్టుకున్న కాలం, గౌరవం మాటేమిటి?
BRS Politics: ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీర్పు - అన్నాచెల్లెళ్ల మధ్య ముదిరిన రాజకీయ చిచ్చు!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీర్పు - అన్నాచెల్లెళ్ల మధ్య ముదిరిన రాజకీయ చిచ్చు!
Kavitha: లిక్కర్‌ స్కామ్‌ కేసులో కవితకు క్లీన్ చిట్! తదుపరి అడుగులెటు !
లిక్కర్‌ స్కామ్‌ కేసులో కవితకు క్లీన్ చిట్! తదుపరి అడుగులెటు !

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ideas of India Nara Lokesh: ప్రత్యేక హోదా ఎందుకు అడగడం లేదంటే.. ABP IDEAS OF INDIA లో వెల్లడించిన నారా లోకేష్
ప్రత్యేకహోదా ఎందుకు అడగడం లేదంటే.. ABP IDEAS OF INDIA లో వెల్లడించిన నారా లోకేష్
Common Man Legal Rights: నిర్దోషిగా బయటపడ్డారు కానీ పోగొట్టుకున్న కాలం, గౌరవం మాటేమిటి?
నిర్దోషిగా బయటపడ్డారు కానీ పోగొట్టుకున్న కాలం, గౌరవం మాటేమిటి?
BRS Politics: ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీర్పు - అన్నాచెల్లెళ్ల మధ్య ముదిరిన రాజకీయ చిచ్చు!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీర్పు - అన్నాచెల్లెళ్ల మధ్య ముదిరిన రాజకీయ చిచ్చు!
Vijay Sangeetha Divorce: విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన దళపతి విజయ్ భార్య... తమిళనాడులో సెన్సేషనల్ బ్రేకింగ్ న్యూస్
విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన దళపతి విజయ్ భార్య... తమిళనాడులో సెన్సేషనల్ బ్రేకింగ్ న్యూస్
Kavitha: లిక్కర్‌ స్కామ్‌ కేసులో కవితకు క్లీన్ చిట్! తదుపరి అడుగులెటు !
లిక్కర్‌ స్కామ్‌ కేసులో కవితకు క్లీన్ చిట్! తదుపరి అడుగులెటు !
KTR On Delhi Liquor Scam: కవితకు, కేజ్రీవాల్‌కు న్యాయం జరిగింది.. బీఆర్ఎస్ పై జరిగిందంతా దుష్ప్రచారమే: కేటీఆర్
కవితకు, కేజ్రీవాల్‌కు న్యాయం జరిగింది.. బీఆర్ఎస్ పై జరిగిందంతా దుష్ప్రచారమే: కేటీఆర్
Friday Stock Markets: మరోసారి వెయ్యి పాయింట్లకుపైగా కోల్పోయిన సెన్సెక్స్ - ఐదున్నర లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి
మరోసారి వెయ్యి పాయింట్లకుపైగా కోల్పోయిన సెన్సెక్స్ - ఐదున్నర లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి
Holi Health Tips : హోలీ రోజున ఈ టిప్స్ పాటిస్తే మీ స్కిన్ సేఫ్‌! 
హోలీ రోజున ఈ టిప్స్ పాటిస్తే మీ స్కిన్ సేఫ్‌! 
Embed widget