అన్వేషించండి

Aarogyasri Telangana: తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా ట్రీట్‌మెంట్

ఇక నుంచి ‘ఆరోగ్యశ్రీ + ఆయుష్మాన్‌ భారత్‌’ పేరుతో ఈ పథకం అమలు కానున్నట్లుగా వైద్య వర్గాలు వెల్లడించాయి. అయితే, తొలుత ప్రభుత్వ ఆసుపత్రులకే ఈ పథకాన్ని ప్రభుత్వం పరిమితం చేసింది.

కరోనా చికిత్స విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ వైద్యాన్ని ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చింది. కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో కరోనాకు చికిత్స అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేస్తుండటంతో ఇది సాధ్యమైందని వైద్యశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇక నుంచి ‘ఆరోగ్యశ్రీ + ఆయుష్మాన్‌ భారత్‌’ పేరుతో ఈ పథకం అమలు కానున్నట్లుగా వెల్లడించారు. అయితే, ప్రస్తుతానికి ప్రభుత్వ ఆసుపత్రులకే ఈ పథకాన్ని ప్రభుత్వం పరిమితం చేసింది. ఆ తర్వాత దశలవారీగా ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా కరోనా చికిత్సను ఈ పథకం కింద అందించనున్నారు.

అయితే, ఈ పథకం కింద కరోనాకు అందించే చికిత్సలను మొత్తం 17 రకాలుగా విభజించారు. ఇందులో అక్యూట్‌ ఫెబ్రైల్‌ ఇల్‌నెస్‌, పైరెక్సియా ఆఫ్‌ అన్‌నోన్‌ ఆరిజిన్‌, నిమోనియా వంటివి ఉన్నాయి. వీటితోపాటు మిగిలిన 14 రకాలకు ప్రభుత్వాసుపత్రులలోనే చికిత్స అందించనున్నారు. తెలంగాణలో ఆయుష్మాన్‌ భారత్‌ అమలుతో ప్రజలకు ఉచితంగా అందుబాటులోకి వచ్చిన చికిత్సల సంఖ్య మొత్తం 1,668కి పెరిగింది. అయితే వీటిలో 642 చికిత్సలను ప్రస్తుతానికి ప్రభుత్వ వైద్యంలోనే కొనసాగించాలని నిర్ణయించారు. 

Also Read: Suryapet: మహిళ బట్టలిప్పేసి కళ్లలో కారం కొట్టి.. కర్రలతో కొడుతూ నగ్నంగా ఊరేగింపు

ఇప్పటివరకూ ఆరోగ్యశ్రీ పరిధిలో కేవలం 50 పడకలున్న ఆసుపత్రులకు అనుమతి లభిస్తుంది. ఆయుష్మాన్‌ భారత్‌ చేరికతో ఇకనుంచి ఆరు బెడ్స్ ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీ), 30 పడకలున్న సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఈ సేవలు అందుబాటులోకి వచ్చేశాయి. 6 పడకలున్న ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఆరోగ్యశ్రీ + ఆయుష్మాన్‌ భారత్‌‌ను అమలు చేయడానికి అవసరమైన మార్గదర్శకాలను రూపొందించిన అనంతరం దీనిపై నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న చరిత్ర అలాంటిది.. మాజీ ఉద్యోగుల సంచలన ఆరోపణలు

తెలంగాణలో అమలవుతున్న ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రస్తుతం 1,026 చికిత్సలు ఫ్రీగా చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్‌ భారత్‌ రెండింటిలో కామన్‌గా ఉన్న చికిత్సలు 810 వరకూ ఉన్నాయి. మరో 216 ఆరోగ్యశ్రీ చికిత్సలు ఆయుష్మాన్‌ భారత్‌లో లేవు. ఈ చికిత్సలను గతంలో మాదిరిగానే ఇప్పుడూ కొనసాగించనున్నారు. ఆరోగ్యశ్రీ వల్ల తెలంగాణలో 77.10 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతుండగా.. ఆయుష్మాన్ భారత్ పథకం కింద కేవలం 24 లక్షల కుటుంబాలకు మాత్రమే ఉపయోగం ఉంటుంది. ఆయుష్మాన్ భారత్ అమలు చేయడం ద్వారా చికిత్సలకయ్యే ఖర్చులో 60 శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. మిగిలిన ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. తద్వారా రాష్ట్రానికి కేంద్రం నుంచి సుమారు రూ.250 కోట్ల వరకూ నిధులు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యశ్రీలో ఒక కుటుంబానికి ఏడాదికి గరిష్ఠంగా రూ.2 లక్షల వరకూ చికిత్సకయ్యే ఖర్చు పరిమితి ఉంటుంది. ఆయుష్మాన్‌ భారత్‌లో రూ.5 లక్షల వరకూ గరిష్ఠ పరిమితి ఉంటుంది.

Also Read: Petrol-Diesel Price, 30 August: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ నగరంలో బాగా తగ్గుదల, తాజా రేట్లు ఇవే..

Also Read: India Wins Gold: పారాలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం.. చరిత్ర సృష్టించిన అవని లేఖరా

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala: తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు! టోకెన్లు ఎలా తీసుకోవాలి? పూర్తి వివరాలు ఇవిగో!
తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు! టోకెన్లు ఎలా తీసుకోవాలి? పూర్తి వివరాలు ఇవిగో!
Telangana Future City: రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం -  కాని మాస్టర్ ప్లానేది?
రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం - కాని మాస్టర్ ప్లానేది?
Ayodhya Ram Mandir : అంతా రామమయం! అయోధ్య రామమందిరం శిఖరంపై ధర్మధ్వజం ఎగురవేసిన తర్వాత మోదీ ఏమన్నారంటే!
అంతా రామమయం! అయోధ్య రామమందిరం శిఖరంపై ధర్మధ్వజం ఎగురవేసిన తర్వాత మోదీ ఏమన్నారంటే!
Andhra Pradesh News: మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం
మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం
Advertisement

వీడియోలు

Tamilnadu Deputy CM Udhayanidhi Stalin Full Speech | ABP Southern Rising Summit 2025 లో ఉదయనిధి స్టాలిన్ పూర్తి ప్రసంగం | ABP Desam
Tamil Nadu Deputy CM Udhayanidhi Stalin Dravidian Algorithm ABP Southern Rising Summit 2025 | ద్రవిడయన్ ఆల్గారిథంపై మాట్లాడిన డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్
Tamil Nadu Deputy CM Udhayanidhi Stalin Speech | ABP Southern Rising Summit 2025 లో తమిళనాడు గవర్నర్ పై డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఫైర్  | ABP Desam
ABP Director Dhruba Mukherjee Speech | ABP Southern Rising Summit 2025 లో ప్రారంభోపన్యాసం చేసిన ఏబీపీ న్యూస్ డైరెక్టర్ ధ్రుబ ముఖర్జీ | ABP Desam
ABP Southern Rising Summit 2025 Begins | ప్రారంభమైన ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ 2025 | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala: తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు! టోకెన్లు ఎలా తీసుకోవాలి? పూర్తి వివరాలు ఇవిగో!
తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు! టోకెన్లు ఎలా తీసుకోవాలి? పూర్తి వివరాలు ఇవిగో!
Telangana Future City: రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం -  కాని మాస్టర్ ప్లానేది?
రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం - కాని మాస్టర్ ప్లానేది?
Ayodhya Ram Mandir : అంతా రామమయం! అయోధ్య రామమందిరం శిఖరంపై ధర్మధ్వజం ఎగురవేసిన తర్వాత మోదీ ఏమన్నారంటే!
అంతా రామమయం! అయోధ్య రామమందిరం శిఖరంపై ధర్మధ్వజం ఎగురవేసిన తర్వాత మోదీ ఏమన్నారంటే!
Andhra Pradesh News: మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం
మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం
నెలకు 1000 km డ్రైవ్‌ చేసే సీనియర్‌ సిటిజన్లకు రూ.15 లక్షల్లో పర్‌ఫెక్ట్‌ ఆటోమేటిక్‌ కార్‌ - దీనిని మిస్‌ అవ్వొద్దు!
సీనియర్‌ సిటిజన్లు ఈజీగా హ్యాండిల్‌ చేయగల సేఫ్‌, ఆటోమేటిక్‌ కార్‌ - రూ.15 లక్షల బడ్జెట్‌లో
Secunderabad- Tirupati Vande Bharat Express: తిరుపతి వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రేపటి నుండి కొత్త మార్పు
తిరుపతి వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రేపటి నుండి కొత్త మార్పు
Snack for Weight Loss : ప్రతిరోజూ బెల్లం-శనగలు తింటే కలిగే లాభాలివే.. బరువు తగ్గడంతో పాటు ఎన్నో ప్రయోజనాలు
ప్రతిరోజూ బెల్లం-శనగలు తింటే కలిగే లాభాలివే.. బరువు తగ్గడంతో పాటు ఎన్నో ప్రయోజనాలు
ABP Southern Rising Summit 2025: దక్షిణ భారత్ నుంచి లభించిన ప్రేమ ఎంతో స్ఫూర్తిదాయకం - ఏబీపీ న్యూస్ డైరెక్టర్ ధ్రుబ ముఖర్జీ
దక్షిణ భారత్ నుంచి లభించిన ప్రేమ ఎంతో స్ఫూర్తిదాయకం - ఏబీపీ న్యూస్ డైరెక్టర్ ధ్రుబ ముఖర్జీ
Embed widget