అన్వేషించండి

Aarogyasri Telangana: తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా ట్రీట్‌మెంట్

ఇక నుంచి ‘ఆరోగ్యశ్రీ + ఆయుష్మాన్‌ భారత్‌’ పేరుతో ఈ పథకం అమలు కానున్నట్లుగా వైద్య వర్గాలు వెల్లడించాయి. అయితే, తొలుత ప్రభుత్వ ఆసుపత్రులకే ఈ పథకాన్ని ప్రభుత్వం పరిమితం చేసింది.

కరోనా చికిత్స విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ వైద్యాన్ని ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చింది. కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో కరోనాకు చికిత్స అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేస్తుండటంతో ఇది సాధ్యమైందని వైద్యశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇక నుంచి ‘ఆరోగ్యశ్రీ + ఆయుష్మాన్‌ భారత్‌’ పేరుతో ఈ పథకం అమలు కానున్నట్లుగా వెల్లడించారు. అయితే, ప్రస్తుతానికి ప్రభుత్వ ఆసుపత్రులకే ఈ పథకాన్ని ప్రభుత్వం పరిమితం చేసింది. ఆ తర్వాత దశలవారీగా ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా కరోనా చికిత్సను ఈ పథకం కింద అందించనున్నారు.

అయితే, ఈ పథకం కింద కరోనాకు అందించే చికిత్సలను మొత్తం 17 రకాలుగా విభజించారు. ఇందులో అక్యూట్‌ ఫెబ్రైల్‌ ఇల్‌నెస్‌, పైరెక్సియా ఆఫ్‌ అన్‌నోన్‌ ఆరిజిన్‌, నిమోనియా వంటివి ఉన్నాయి. వీటితోపాటు మిగిలిన 14 రకాలకు ప్రభుత్వాసుపత్రులలోనే చికిత్స అందించనున్నారు. తెలంగాణలో ఆయుష్మాన్‌ భారత్‌ అమలుతో ప్రజలకు ఉచితంగా అందుబాటులోకి వచ్చిన చికిత్సల సంఖ్య మొత్తం 1,668కి పెరిగింది. అయితే వీటిలో 642 చికిత్సలను ప్రస్తుతానికి ప్రభుత్వ వైద్యంలోనే కొనసాగించాలని నిర్ణయించారు. 

Also Read: Suryapet: మహిళ బట్టలిప్పేసి కళ్లలో కారం కొట్టి.. కర్రలతో కొడుతూ నగ్నంగా ఊరేగింపు

ఇప్పటివరకూ ఆరోగ్యశ్రీ పరిధిలో కేవలం 50 పడకలున్న ఆసుపత్రులకు అనుమతి లభిస్తుంది. ఆయుష్మాన్‌ భారత్‌ చేరికతో ఇకనుంచి ఆరు బెడ్స్ ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీ), 30 పడకలున్న సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఈ సేవలు అందుబాటులోకి వచ్చేశాయి. 6 పడకలున్న ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఆరోగ్యశ్రీ + ఆయుష్మాన్‌ భారత్‌‌ను అమలు చేయడానికి అవసరమైన మార్గదర్శకాలను రూపొందించిన అనంతరం దీనిపై నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న చరిత్ర అలాంటిది.. మాజీ ఉద్యోగుల సంచలన ఆరోపణలు

తెలంగాణలో అమలవుతున్న ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రస్తుతం 1,026 చికిత్సలు ఫ్రీగా చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్‌ భారత్‌ రెండింటిలో కామన్‌గా ఉన్న చికిత్సలు 810 వరకూ ఉన్నాయి. మరో 216 ఆరోగ్యశ్రీ చికిత్సలు ఆయుష్మాన్‌ భారత్‌లో లేవు. ఈ చికిత్సలను గతంలో మాదిరిగానే ఇప్పుడూ కొనసాగించనున్నారు. ఆరోగ్యశ్రీ వల్ల తెలంగాణలో 77.10 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతుండగా.. ఆయుష్మాన్ భారత్ పథకం కింద కేవలం 24 లక్షల కుటుంబాలకు మాత్రమే ఉపయోగం ఉంటుంది. ఆయుష్మాన్ భారత్ అమలు చేయడం ద్వారా చికిత్సలకయ్యే ఖర్చులో 60 శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. మిగిలిన ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. తద్వారా రాష్ట్రానికి కేంద్రం నుంచి సుమారు రూ.250 కోట్ల వరకూ నిధులు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యశ్రీలో ఒక కుటుంబానికి ఏడాదికి గరిష్ఠంగా రూ.2 లక్షల వరకూ చికిత్సకయ్యే ఖర్చు పరిమితి ఉంటుంది. ఆయుష్మాన్‌ భారత్‌లో రూ.5 లక్షల వరకూ గరిష్ఠ పరిమితి ఉంటుంది.

Also Read: Petrol-Diesel Price, 30 August: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ నగరంలో బాగా తగ్గుదల, తాజా రేట్లు ఇవే..

Also Read: India Wins Gold: పారాలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం.. చరిత్ర సృష్టించిన అవని లేఖరా

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ

వీడియోలు

Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
1 Crore to Pak U-19 Players | పాక్ ఆటగాళ్లకి ఒక్కొక్కరికీ కోటి రూపాయలు | ABP Desam
Shubman Gill vs Yashasvi Jaiswal | t20 వరల్డ్ కప్ 2026 ఇండియన్ స్క్వాడ్ లో జైస్వాల్ కి చోటు దక్కల్సింది | ABP Desam
Virat Kohli Under Pant Captaincy | పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతున్న విరాట్ కోహ్లీ | ABP Desam
Vaibhav Suryavanshi Shoe Controversy | పాక్ పేసర్‌కు వైభవ్ సూర్యవంశీ షూ చూపించిన ఘటనపై క్లారిటీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
Indian Railways: అస్సాంలో ఏనుగుల మృతితో రైల్వేశాఖ కీలక నిర్ణయం.. AI టెక్నాలజీతో ప్రమాదాలకు చెక్
అస్సాంలో ఏనుగుల మృతితో రైల్వేశాఖ కీలక నిర్ణయం.. AI టెక్నాలజీతో ప్రమాదాలకు చెక్
Top Selling Hatchback: నవంబర్ 2025లో నంబర్ 1 హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్.. హ్యుందాయ్, టాటాల పొజిషన్ ఇదే
నవంబర్ 2025లో నంబర్ 1 హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్.. హ్యుందాయ్, టాటాల పొజిషన్ ఇదే
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
Embed widget